Sakshi News home page

పరిటాల సునీత, జేసీలతో విభేదాల్లేవు

Published Sat, Jul 23 2016 6:58 PM

పరిటాల సునీత, జేసీలతో విభేదాల్లేవు - Sakshi

అనంతపురం: మంత్రి పరిటాల సునీత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పారు. తాను ముందు నుంచి ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని, అనంతపురంలో రౌడీయిజాన్ని సహించేదిలేదని అన్నారు.

పరిటాల వర్గీయుల జంట హత్యలతో తనకు సంబంధంలేదని ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

ఇదిలావుండగా పరిటాల వర్గీయుల జంట హత్యల కేసులో అనంతపురం ఫోర్త్ టౌన్ సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ హేమంత్లను సస్పెండ్ చేశారు. జంట హత్యలకు సీఐ, ఎస్ఐ సహకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement