కొబ్బరితోటలో వింత | Sakshi
Sakshi News home page

కొబ్బరితోటలో వింత

Published Mon, Jul 3 2017 3:53 PM

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం డేరశాం గ్రామంలో వింత సంఘటన వెలుగుచూసింది. గ్రామంలోని ఓ కొబ్బరితోటలో వింత పుట్టగొడుగు స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కోబ్బరి తోటలో మనిషి చేయిన పోలిన పుట్టుగొడుగు గుర్తించిన రైతు ఎవరో గుర్తుతెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని తన తోటలో పాతిపెట్టారని హడలిపోయాడు. అనంతరం విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఇది పుట్టగొడుగు అని స్పష్టం చేశారు. వింత పుట్టగొడుగు విషయం ధావానంలా పాకడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇది చూడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు.