Sakshi News home page

వైద్య విద్యార్థిని ఆత్మహత్య

Published Wed, Aug 16 2017 9:40 AM

నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండల కేంద్రానికి చెందిన వైద్య విద్యార్థిని దప్కల్‌ సవిత(26) మంగళవారం మత్తు ఇంజక్షన్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ముథోల్‌ ముథోల్‌ మండల కేంద్రంలోని మహాలక్ష్మి గల్లీకి చెందిన సవిత హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అనస్తీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువు తోంది. ఇటీవల వరుస సెలవులు రావడంతో మూడు రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చిం ది. గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సవితను కుటుంబ సభ్యులు పలకరించడానికి వెళ్లగా.. అప్పటికి అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెం దినట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement