బాలికపై ఎమ్మార్వో అత్యాచారయత్నం! | Sakshi
Sakshi News home page

బాలికపై ఎమ్మార్వో అత్యాచారయత్నం!

Published Tue, May 26 2015 9:30 AM

సురేష్ ఖమ్మం జిల్లా గుండాల ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తూ విచక్షణ మరిచాడు. మామిళ్లగూడెం సమీపంలో బాలికపై సోమవారం అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించింది. దాంతో అతడు పరారైయ్యాడు. ఆ విషయాన్ని సదరు బాలిక తల్లిదండ్రులకు వెల్లడించింది. దాంతో బాలిక తల్లిదండ్రులతోపాటు స్థానికులు సురేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిన్న రాత్రి సురేష్ ఇంటికి రావడంతో వారంత అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. గతంలోను ఎమ్మార్వో సురేష్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో టూటౌన్లో కేసు నమోదు అయిందని పోలీసులు తెలిపారు. సురేష్పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలంబరిది వెల్లడించారు.