Pakistan Army
-
బోర్డర్లో టెన్షన్.. బీఎస్ఎఫ్ అదుపులో పాక్ సైనికుడు
న్యూఢిల్లీ: రాజస్తాన్లో భారత్–పాకిస్తాన్ సరిహద్దుల వద్ద పాక్ ఆర్మీ అధికారి ఒకరు బీఎస్ఎఫ్ జవాన్లకు పట్టుబడ్డారు. అతడిని వెంటనే కస్టడీలోకి తీసుకున్నామని బీఎస్ఎఫ్ తెలిపింది. పదిహేను రోజుల క్రితం, ఏప్రిల్ 23న బీఎస్ఎఫ్ జవాను పూర్ణం కుమార్ పాక్ భూభాగంలోకి పొరపాటున ప్రవేశించి అక్కడి జవాన్లకు దొరికిపోవడం తెల్సిందే. భారత బలగాలు తీవ్ర నిరసన తెలిపినప్పటికీ ఆయన్ను తిరిగి అప్పగించేందుకు పాక్ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. భారత్, పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పదో రోజు కూడా దాయాది ఆర్మీ కాల్పులు జరిపింది. వాస్తవాధీన రేఖ వద్ద కుప్వారా, ఫూంచ్ర, అక్నూర్ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపులకు దిగింది. దీంతో, భారత సైన్యం పాకిస్తాన్ కాల్పులను తిప్పికొట్టింది. ధీటుగా బదులిచ్చింది. రెచ్చగొట్టేలా పాక్ క్షిపణి పరీక్షలు..మరోవైపు.. పహల్గాం ఉగ్ర దాడితో అసలే దెబ్బ తిన్న పులిలా ఉన్న భారత్ను మరింత రెచ్చగొట్టేలా పాక్ వ్యవహరిస్తోంది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ క్షిపణి పరీక్షలకు దిగింది. 450 కి.మీ. రేంజ్తో కూడిన అబ్దాలీ సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్టు పాక్ సైన్యం శనివారం ప్రకటించుకుంది. పైగా, ఇది ‘సింధూ విన్యాసా’ల్లో భాగమంటూ గొప్పలకు పోయింది. ఇది అద్భుతమంటూ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్ షరీఫ్ సైన్యాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఉదంతంపై భారత్ మండిపడింది. దీన్ని కచ్చితంగా రెచ్చగొట్టే చర్యగానే పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. -
పాక్ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పులు
జమ్మూ : భారత్ ఓ వైపు సైనిక చర్యకు సిద్ధమైందని, ఆ పని చేయొద్దంటూ ఐక్య రాజ్య సమితిని పాకిస్తాన్ బతిమలాడుతోంది. అదే సమయంలో భారత్ను రెచ్చగొట్టేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి యధేశ్చగా కాల్పులకు తెగబడుతుంది. తాజాగా, మంగళవారం రాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్, పరగ్వాల్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ సైన్యం భారీ కాల్పులు జరిపింది. పాక్ కాల్పులపై భారత సైన్యం స్పందించింది. జమ్మూ ప్రాంతంలోని మూడు ప్రధాన సెక్టార్లలో కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. వరుసగా ఆరో రోజు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అంతే ధీటుగా భారత సైన్యం బదులిస్తోందని భద్రతా బలగాలు తెలిపాయి. BREAKING news :What kind of Pakistani army is this that is hell-bent on breaking its own country into 5 pieces?Pakistan indulges in ceasefire violation along the International Border (IB) in Jammu’s Akhnoor Sector, Pargwal. This is not LoC but IB making it a serious… pic.twitter.com/Z5VWPu4MVL— श्रवण बिश्नोई (किसान) (@SharwanKumarBi7) April 29, 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదులు 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారు. నాటి నుంచి భారత్-పాక్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సైనిక దుస్తులు ధరించిన అమాయకుల ప్రాణాల్ని తీయడంపై భారత్.. పాక్ను అన్నీ అంశాల్లో దెబ్బకు దెబ్బతీయాలనే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.ఇందులో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 27 నుండి పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలన్నీ రద్దు చేసింది. అటారీ బోర్డర్ను తక్షణమే మూసివేసింది. -
భారత్తో యుద్ధ భయం.. పాక్ సైన్యంలో భారీ రాజీనామాలు
ఇస్లామాబాద్: కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. తమపై భారత్ వైమానిక దాడులకు దిగొచ్చని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే, అత్యవసరంగా తమ దేశ గగనతలాన్ని సైతం మూసివేసింది.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలు, హెచ్చరికల కారణంగా పాకిస్తాన్కు టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ కూడా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి తర్వాత.. కేవలం రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు ‘ది డేలీ గార్డియన్’ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు పాక్ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ లేఖను బయటపెట్టింది.కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్కు బుఖారీ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తమ దేశ సైనికుల ఆత్మస్థైర్యం వేగంగా క్షీణిస్తోందని హెచ్చరించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ఒకవేళ భారత్తో యుద్ధం చేయాల్సి వస్తే.. పాకిస్తాన్ సైన్యం అసమర్థమైన ప్రతిఘటనను ప్రదర్శించవచ్చు. కొంతమంది సైనికులు ఇప్పటికే క్రియాశీల విధులను విడిచిపెట్టినప్పటికీ, మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ సైనిక ర్యాంకుల్లో తీవ్ర సంక్షోభాన్ని సూచిస్తోంది. ఈ పరిణామం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. సామూహిక రాజీనామాలపై పాకిస్తాన్ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత బలమైన భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనే భయమే రాజీనామాలకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయంతో సైనికులు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సైనికులు రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 🚨 Breaking News.4500 Soldiers and 250 Officers of Pakistan Army resigned from service amid arising tension with India after #PahalgamTerroristAttackLt. Gen Umar Ahmad Bukhari, 11 Corp Cdr has written this letter to the Chief of army Staff. This letter is being circulated on… pic.twitter.com/XLE1G84rrY— JK CHANNEL (@jkchanneltv) April 28, 2025మునీర్ ఎక్కడ?మరోవైపు.. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్ వీడారు’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్ బయట ఎక్కడా కన్పించడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’ అని కథనాలు పేర్కొంటున్నాయి -
ముష్కర మూకలకు ముచ్చెమటలు
శ్రీనగర్: పహల్గాంలో ఉగ్రవాదుల రాక్షసకాండ తర్వాత కోపంతో రగిలిపోతున్న భారతసైన్యం ఏక్షణంలోనైనా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేయొచ్చనే భయా నుమానాలు పాక్ సైన్యంలో ఎక్కువయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ తాము పెంచి పోషించిన ఉగ్రవాదులను పాక్ సైన్యం వెంటనే ఆయా ‘లాంచ్ప్యాడ్’ల నుంచి సురక్షితంగా దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముందస్తుగా ఆ ముష్కరులను తమ సైనిక శిబిరాలు, బంకర్లలోకి పంపేస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సరిహద్దు వెంట ఉన్న లాంచ్ప్యాడ్లను ఖాళీచేయిస్తోంది. ఈ లాంచ్ప్యాడ్లు క్రియాశీలకంగా ఉన్న విషయాన్ని భారత సైనిక నిఘా వర్గాలు పసిగట్టడంతో ముందుజాగ్రత్తగా పాక్ సైన్యం అప్రమత్తమై అక్కడి ఉగ్రవాదులను వేరే చోట్లకు పంపేస్తోంది.ఇవన్నీ కీలక స్థావరాలుపాక్ ఆక్రమిత కశ్మీర్లోని కేల్, సర్దీ, దుధ్నియాల్, అథ్ముఖాన్, జురా, లిపా, పచ్ఛిబన్, ఫార్వర్డ్ కహూతా, కోట్లీ, ఖుయిరాట్టా, మంధార్, నిఖాయిల్, ఛమన్కోట్, జాన్కోటేలలో ఈ ఉగ్రస్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలన్నింటి నుంచీ ఉగ్రవాదులు తాత్కాలికంగా వెళ్లిపోతున్నట్లు వార్తలొచ్చాయి. వాస్తవానికి ఇవన్నీ ఉగ్రవాదులకు కీలక స్థావరాలు(లాంచ్ప్యాడ్). వాస్తవాధీన రేఖ గుండా భారత్లోకి చొరబడటానికి ఉగ్రవాదులు ఈ స్థావరాల నుంచే బయల్దేరతారు. ఇక్కడే వీళ్లకు నెలల తరబడి ఉగ్రశిక్షణ ఇస్తారని తెలుస్తోంది. పీఓకేలో క్రియాశీలంకంగా ఉన్న 42 లాంచ్ప్యాడ్లను ఇటీవల భారత భద్రతా బలగాలు గుర్తించాయి. పహల్గాం దాడి ఉదంతం తర్వాత ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న భారతసైన్యం ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చనే ఉద్దేశంతో ఉగ్రవాదులను పాక్ సైన్యం హుటాహుటిన ఇతర ప్రదేశాలకు పంపేస్తోంది. ఇలా తరలిస్తున్న ఉగ్రవాదుల సంఖ్య 150 నుంచి 200దాకా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే హిజ్బుల్ మొజాహిదీన్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన దాదాపు 60 మంది విదేశీ కిరాయి ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడ్డారని జాతీయ మీడియాలో కథనం వెలువడింది. వీరిలో 17 మంది స్థానికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం సరిహద్దు వెంట గాలింపును మరింత ఉధృతంచేసింది. -
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్పై దాడి.. పది మంది సైనికులు మృతి
ఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. బెలుచిస్తాన్లో పాక్ ఆర్మీపై దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army-BLA)దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్కు చెందిన బెలూచిస్థాన్ ప్రావిన్స్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం. ఆర్మీ కాన్వాయ్లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. కాగా, ఇది బెలూచ్ విప్లవకారుల తాజా యుద్ధ ప్రకటనగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ స్వయంగా విడుదల చేసింది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, నాశనమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి.🚨 The Baloch Liberation Army (BLA) has taken responsibility for an improvised explosive device (IED) attack on a Pakistani Army convoy in Margat, near Quetta, on April 25, 2025. According to BLA spokesperson Jeeyand Baloch, the attack was carried out using a remote-controlled… pic.twitter.com/9SmHRfTcyr— The Tradesman (@The_Tradesman1) April 26, 2025ఇక, ఈ దాడితో పాటు బీఎల్ఏ మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదు. మేం మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం.. అంటూ వారు ప్రకటించారు. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటన తర్వాత సైనిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బెలూచిస్థాన్లో భద్రతా వ్యవస్థ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు సమాచారం.Always a big fan of video editing skills of Baloch Liberation Army 😉https://t.co/LFu7OiouoD— Kriti Singh (@kritiitweets) April 25, 2025ఇదిలా ఉండగా.. ఎన్నో దశాబ్దాలుగా స్వతంత్ర బెలూచిస్థాన్ కోసం బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం తమ హక్కులు దూరం చేస్తున్నదని ఆరోపిస్తూ వరుస దాడులకు పాల్పడుతోంది. గత కొన్ని నెలలుగా BLA కార్యకలాపాలు మరింత ఉధృతంగా మారాయి. ఈ దాడి తర్వాత పాక్లో పరిస్థితి అత్యంత అస్థిరంగా మారింది. తాజా దాడి నేపథ్యంలో ప్రజల్లో భయం, భద్రతా వర్గాల్లో ఆందోళన నెలకొంది.10 🐖 s gone! Well done Baloch Liberation Army #Pakistan #PahalgamTerroristAttack #TerrorAttack #Baloch #Kashmir pic.twitter.com/ZavhIoEBjx— Adri chatterjee (@stay_fit_mate) April 26, 2025 -
బోర్డర్లో పాక్ కవ్వింపు చర్యలు.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్!
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పదేపదే కాల్పులు జరుపుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పాక్ ఆర్మీ మరోసారి.. నియంత్రణ రేఖ(LOC) వెంబడి కాల్పుల జరిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత ఆర్మీ.. పాక్ చర్యలను తిప్పికొట్టింది.వివరాల ప్రకారం.. భారత్, పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ(LOC) వద్ద పాక్ ఆర్మీ శుక్రవారం రాత్రి కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత చెక్పోస్టుల వద్ద రెచ్చగొట్టే ధోరణితో కాల్పులకు తెగబడింది. భారత ఆర్మీ చెక్పోస్టులను టార్గెట్ చేసి ఫైరింగ్ చేసింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ ప్రతిదాడులు జరిపింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత ఆర్మీ వెల్లడించింది. ఏప్రిల్ 25-26 అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు శనివారం వెల్లడించారు. అలాగే, ఏప్రిల్ 24-25 అర్ధరాత్రి వేళ కూడా పాక్ ఎల్ఓసీ వద్ద కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.On the night of the 25th-26th of April 2025, unprovoked small firing was carried out by various Pakistan Army posts all across the Line of Control in Kashmir. Indian troops responded appropriately with small arms. No casualties reported: Indian Army pic.twitter.com/B6lO5oldJ2— ANI (@ANI) April 26, 2025మరోవైపు.. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కోయిమాహ్లోని తోకిర్పురాకు చెందిన వారిగా గుర్తించారు. J&K | Two Terrorist associates arrested by security forces in Thokerpora in Qaimoh area of Kulgam district: Police Sources pic.twitter.com/KstcuocVek— ANI (@ANI) April 26, 2025ఇదిలా ఉండగా.. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచివెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది దేశం అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పరిణామాల వేళ సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. -
హద్దు మీరిన పాక్ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు
జమ్మూ: పాకిస్తాన్ సైన్యం మరోసారి హద్దు మీరింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత భూభాగంపై కాల్పులు జరిపింది. అప్రమత్తమైన భారత సైన్యం గట్టిగా బదులివ్వడంతో పాక్ సైన్యం తోకముడిచింది. జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద ఈ ఘటన జరిగినట్లు భారత సైనిక అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ఎల్ఓసీ వద్ద కృష్ణా ఘాటీ సెక్టార్లో తొలుత మందుపాతర పేలుడు సంభవించిందని, ఆ తర్వాత పాక్ భూభాగం నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు మొదలయ్యాయని అన్నారు. అక్కడే విధుల్లో ఉన్న భారత సైన్యం వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపిందని తెలిపారు. భారత సైన్యం నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావడంతో చేసేది లేక పాక్ సైన్యం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్ఓసీ వద్ద పరిస్థితి నియంత్రణలోనే ఉందని స్పష్టంచేశారు. ఎల్ఓసీ వెంట భారత సైన్యం పట్టు కొనసాగుతోందని తెలియజేశారు. అయితే, ఈ కాల్పుల ఘటనలో పాక్ సైన్యానికి ఏమైనా ప్రాణనష్టం వాటిల్లిందా? అనేది బయటపెట్టలేదు. ఐదుగురు పాక్ జవాన్లు గాయపడినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. -
పాక్ సైన్యం కాన్వాయ్ పై బలూచ్ తిరుగుబాటుదారుల దాడి
-
పాకిస్థాన్కు చావుదెబ్బ.. 214 మంది సైనికులు హతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో 214 మంది పాక్ సైనికులను చంపేసినట్టు బలోచ్ తిరుగుబాటుదారులు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. తమ డిమాండ్కు ప్రభుత్వ స్పందించని కారణంగానే తాము వారిని చంపేసినట్టు ప్రకటించారు.బలోచ్స్థాన్లో ప్రధాన వేర్పాటువాద సంస్థగా ఎదిగిన బీఎల్ఏ.. సామాన్య పౌరులు సహా భద్రతా దళాలు, చైనా జాతీయులు, బలోచిస్థాన్లో పనిచేస్తున్న ఇతర ప్రావిన్సుల వారిపై దాడులకు పాల్పడుతోంది. ఆ ప్రావిన్సులో 18 భారీ దాడులు చేసింది. ఇక, తాజాగా జరిగిన రైలు (Jaffar Express) ఘటన సంచలనంగా మారింది. ఈ హైజాక్పై తాజాగా బలోచ్ లబరేషన్ ఆర్మీ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ సందర్బంగా బీఎల్ఏ..‘రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన 48 గంటల గడువు ముగిసింది. ప్రభుత్వం స్పందించని కారణంగా జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది సైనికులను చంపేశాం. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో మా ఆపరేషన్ ముగిసింది. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించిన కారణంగానే మా చేతులకు పని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పుకొచ్చారు. దీంతో, పాకిస్ఠాన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఇదిలా ఉండగా.. పాకిస్థాన్లో 500 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలు హైజాక్ (Train Hijack)కు గురైన ఘటనలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బందీల్లో 80 మందిని సురక్షితంగా విడిపించాయి. వీరిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 33 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.Baloch rebels claim execution of 214 hostages, blame Pakistan's 'stubbornness'The Baloch Liberation Army (BLA) has claimed responsibility for executing 214 hostages, blaming Pakistan’s refusal to negotiate. The group details ‘Operation Darra-e-Bolan,’ accusing Pakistan of…— Elena (@helen44767171) March 14, 2025 -
Pak: సైన్యం విజయం ఉత్తదే
ఇస్లామాబాద్: జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసిన మిలిటెంట్లందరినీ మట్టుబెట్టామంటూ పాకిస్తాన్ సైన్యం చేసిన ప్రకటనను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) గురువారం ఖండించింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని, సైన్యంపై కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. యుద్ధక్షేత్రంలో విజయం సాధించినట్లు సైన్యం చెప్పుకుంటోందని, అందులో ఎంతమాత్రం నిజంలేదని వివరించింది. తమ దాడిలో పాక్ భద్రతా బలగాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు స్పష్టంచేసింది. ఇప్పటికే పాక్ సైనికులు చాలామంది మరణించారని పేర్కొంది. శత్రువుపై యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు బీఎల్ఏ ఒక ప్రకటన జారీ చేసింది. చాలామంది ప్రయాణికులు తమ అధీనంలోనే ఉన్నారని ప్రకటించింది. మంగళవారం 440 మంది ప్రయాణిలకులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. 33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని, మిగిలిన ప్రయాణికులను క్షేమంగా విడిపించామని పాక్ సైన్యం బుధవారం వెల్లడించింది. అయితే, పాక్ సైన్యం తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని బీఎల్ఏ ఆరోపించింది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని.. రైలులో ఉన్న కొందరు సైనికులను తామే వదిలేశామని వెల్లడించింది. సైన్యం తమపై పోరాటం చేయలేక సామాన్య బలూచ్ పౌరులను వేధిస్తోందని విమర్శించింది. జైళ్లలో ఉన్న తమ మిలిటెంట్లను వదిలిపెడితే రైలులో మిగిలి∙ఉన్న సైనికులు, ప్రయాణికుల విడుదల చేస్తామని బీఎల్ఏ ప్రతిపాదించింది. తమ మాట వినకపోతే జరగబోయే పరిణామాలకు పాక్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. బలూచిస్తాన్లో యుద్ధవాతావరణం నెలకొన్న ప్రాంతాలను సందర్శించేందుకు జర్నలిస్టులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ఇక్కడి పరిస్థితులు ఏమిటో బాహ్య ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని బీఎల్ఏ స్పష్టం చేసింది. -
అఫ్గాన్ సరిహద్దుల్లో పాక్ ఆపరేషన్.. 30మంది ఉగ్రవాదులు హతం
పెషావర్: పాకిస్తాన్ సైన్యం పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వాయువ్య పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఈ సైనిక చర్య జరిగింది. నిఘావర్గాలు అందించిన సమాచారం మేరకు భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టి, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. దీనికి సంబంధించిన వివరాలను పాక్ సైన్యం మీడియాకు తెలిపింది.ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందిన నేపధ్యంలో దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ఈ సైనిక చర్య విజయవంతమైన నేపధ్యంలో పాకిస్తాన్ సాయుధ దళాలను ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రశంసించారు.దీనికి ముందు పాకిస్తాన్లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వారు జరిపిన కాల్పుల్లో నలుగురు పాకిస్తాన్ సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. 2025 జనవరి నుంచి పాకిస్తాన్లో ఉగ్ర దాడులు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2024 డిసెంబర్ కంటే 42 శాతం ఎక్కువ. జనవరిలో ఉగ్రవాద నిరోధక చర్యలలో భాగంగా భద్రతా దళాలు 185 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఒక నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: రిస్క్లో కుంభమేళా మోనాలిసా? -
Kargil War: ఎట్టకేలకు అంగీకరించిన పాక్
కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నట్లు ఎట్టకేలకు దాయాది దేశం పాక్ అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ సైన్యాధిపతి బహిరంగ ప్రకటన చేశారు. దీంతో.. పాతికేళ్ల తర్వాత పాక్ సైన్యం తమ పాత్రను అంగీకరించినట్లయ్యింది.శుక్రవారం రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో పాక్ డిఫెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ప్రసంగిస్తూ.. ‘‘భారత్, పాకిస్థాన్ మధ్య 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణల్లో వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది’’ అని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.Pakistan Acknowledges Role in 1999 Kargil War for the First Time#DY365 #Pakistan #KargilWar pic.twitter.com/pW6JcCNqQO— DY365 (@DY365) September 7, 20241999 మే-జులై మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ముజాహిదీన్ల ముసుగులో నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన శత్రుసేనలు.. కార్గిల్లో ఖాళీగా ఉన్న భారత కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి. కౌంటర్గా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ విజయ్’ పెట్టింది. ఈ ఎదురుదాడితో బెంబేలెత్తిపోయిన పాక్.. తోకముడుచుకుని పారిపోయింది. జులై 26న పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించగా.. అప్పటి నుంచి ఆ తేదీన కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించుకుంటున్నాం.అయితే.. ఈ యుద్ధంతో తమ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని పాక్ చెబుతూ స్న్నేతోంది. ముజాహిదీన్ ఫైటర్లు ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము పాట్రోలింగ్ మాత్రమే చేశామని చెప్పింది. గతంలో పాక్ ఆర్మీ మాజీ అధికారి ఒకరు కూడా కార్గిల్లో తమ దేశ బలగాల పాత్ర నిజమేనని చెప్పారు. ఆ ఆపరేషన్ను ‘ఫోర్ మ్యాన్ షో’ అని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) షాహిద్ అజీజ్ అభివర్ణించారు. అయితే పాక్ ఆయన వ్యాఖ్యలపై స్పందించలేదు. తాజా ప్రకటనతో.. పాక్ ఓటమి గుట్టు బట్టబయలైంది.సంబంధిత వార్త: గెలవలేని యుద్ధం చేసిన పాక్ -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఊరట
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఊరట లభించింది. గత ఏడాది మే నెలలో సైనిక స్థావరాలపై దాడులకు సంబంధించిన 12 కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ సహా పాక్ మాజీ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీలకు ఉగ్రవాద నిరోధక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ వర్గీయులైన స్వతంత్ర అభ్యర్థులు ఎక్కవ మంది గెలిచిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇమ్రాన్ఖాన్ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఇస్లామాబాద్లో అప్పట్లో నిరసనలు చెలరేగాయి. ఆ హింసాత్మక ఘటనల్లో రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంతో సహా 20కి పైగా సైనిక స్థావరాలు, రాష్ట్ర భవనాలు దెబ్బతిన్నాయి. ఈ నిరసనలకు సంబంధించిన కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)కి చెందిన పలువురు నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో ఇమ్రాన్ఖాన్కు కోర్టు పదేళ్ల జేలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్తో పాటు పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీకి కూడా కోర్టు పదేళ్ల జైలు శిక్షవిధించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 8న పాక్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ వర్గీయులకు ఊహించని ప్రజా మద్దతు లభించింది. మెజారిటీ మార్కు 133 కాగా పీటీఐ 97 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టిగా నిలిచింది. ఇమ్రాన్ జైలుపాలై పోటీకే దూరమైనా, ఎన్నికల గుర్తు రద్దై అభ్యర్థులంతా స్వతంత్రులుగా నానారకాల గుర్తులపై పోటీ చేయాల్సి వచ్చినా దేశవ్యాప్తంగా వారి జోరు కొనసాగడం విశేషం. నవాజ్ పార్టికి 66, బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టికి 51 స్థానాలు దక్కాయి. మిగతా పార్టిలకు 24 సీట్లొచ్చాయి. ఇదీ చదవండి: Pakistan Elections 2024: ‘పాక్’ ఫలితాల మధ్య ఇమ్రాన్ ‘విక్టరీ స్పీచ్’ -
పాక్ కౌంటింగ్ వేళ.. ట్విస్టులు, ఝలక్లు!!
పాకిస్థాన్లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ.. అయోమయం, గందరగోళం నెలకొంది. అక్కడ హింస చెలరేగినట్లు సోషల్ మీడియాలో ఉవ్వెత్తున్న ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (PTI) పార్టీని పోటీ చేయకుండా.. కనీసం గుర్తు క్రికెట్ బ్యాట్ను వినియోగించకుండా అక్కడి ఎన్నికల సంఘం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఖాన్ మద్దతుదారులు.. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటున్నట్లు సమాచారం. ఫలితాల ప్రకటనలో జాప్యం.. ఫలితాల తారుమారు చేసేందుకేనంటూ పీటీఐ ఆందోళనకు దిగగా.. ఆందోళనకారులపై ఆర్మీ, అక్కడి పోలీసు బలగాలు దాడులకు తెగబడినట్లు ప్రచారం నడుస్తోంది. కాల్పుల్లో పలువురు మరణించినట్లు.. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు ఫొటోలు, వీడియోల్ని వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఆర్మీ రిగ్గింగ్కు దిగిందంటూ కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. పాకిస్థాన్ ఎన్నికల సంఘం మాత్రం ఎవరు ఆధిక్యంలో ఉన్నారో అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొందరు మాత్రం నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ వెనుకంజలో ఉందని(షరీఫ్ మాత్రం గెలిచారు).. ఖాన్ మద్దతుదారులు విజయ దుందుభి మోగిస్తున్నట్లు పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే పీఎంఎల్-ఎన్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. షరీఫ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమంటూ ఆయన వర్గీయులు ప్రచారానికి దిగగా.. ఇమ్రాన్ ఖాన్ పేరిట ఎన్నికల్లో నెగ్గుతున్న అభ్యర్థులు సైతం తమకే మద్దతు ఇస్తారంటూ పీఎంఎల్-ఎన్ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. Social media is flooded with hundreds of such rigging videos. What other evidence could there be than a present on-duty police officer involved in rigging? #ElectionResultspic.twitter.com/eps8QWQ9WX — Usama Butt 🇵🇰 🇬🇧 (@OsamaAhmedButt) February 9, 2024 పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇప్పటికే సగానికిపైగా సీట్లు సాధించినట్లు పోస్టులు కనిపిస్తున్నాయి. I have never seen visuals like these in Bahawalpur in my whole life - not even on 9th May.#ElectionResults pic.twitter.com/yU0fumVsEM — نورالہدی 🇵🇰 (@raqsyjunoon) February 9, 2024 ఇదిలా ఉంటే.. పాకిస్థాన్లో గురువారం సాయంత్రం ఎన్నికలు ముగియగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని (Pak Poll Results) ప్రకటించారు. పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమియుల్లా ఖాన్ గెలుపొందినట్లు ఈసీపీ ప్రత్యేక కార్యదర్శి జాఫర్ ఇక్బాల్ మీడియాకు వెల్లడించారు. అయితే.. ఆ తర్వాత ఏం ఫలితాల వెల్లడిని నిలిపివేశారు. یہ توقع نہیں تھی کہ ہماری فوجی جوان اس ناکارہ عمل کا کھلم کھلا حصہ بنے گے pic.twitter.com/sp8yWUuyfC — Sabir Shakir ARY 𝓯𝓪𝓷𝓼 (@ARYSabiirShakir) February 9, 2024 కొన్ని గంటల తర్వాత తిరిగి ప్రకటించడం ప్రారంభించారు. అయితే.. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ECP)’ కావాలనే ఫలితాలను ఆలస్యం చేస్తోందని పీటీఐ ఆరోపించింది. మరోవైపు జాప్యంపై పాక్ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని తెలిపింది. ఓటింగ్ ప్రారంభానికి ముందు గురువారం ఉదయం 8 గంటల నుంచి పాక్ కేర్టేకర్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెల్ఫోన్, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. వాటిని ఇంకా పునరుద్ధరించకపోగా.. కొందరు మాత్రం పాక్లో ఇదీ పరిస్థితి అంటూ నెట్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. -
సైన్యం పడగ నీడన... పాక్లో ఎన్నికలకు వేళాయె
అది 2018. పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమయం. సైన్యం ఆగ్రహానికి గురై అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో నవాజ్ షరీఫ్ అప్పటికి ఏడాది క్రితమే ప్రధాని పదవి పోగొట్టుకున్నారు. జైల్లో మగ్గుతున్నందున ఎన్నికల్లో పోటీకీ దూరమయ్యారు. క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ఖాన్ సైన్యం ఆశీస్సులతో ఎన్నికల్లో నెగ్గి ఏకంగా ప్రధాని పీఠమెక్కారు. ఆరేళ్లు గడిచి పాక్ మళ్లీ సాధారణ ఎన్నికల ముంగిట నిలిచేనాటికి ఈ ఇద్దరు మాజీ ప్రధానుల విషయంలో ఓడలు బళ్లు, బళ్లు ఓడలూ అయ్యాయి. సైన్యం కన్నెర్రతో ఇమ్రాన్ పదవి పోగొట్టుకోవడమే గాక అవినీతి కేసుల్లో జైలుపాలయ్యారు. శిక్షల మీద శిక్షలు అనుభవిస్తూ ఎన్నికలకు దూరమయ్యారు. పార్టీకి కనీసం ఎన్నికల గుర్తు కూడా దక్కని దుస్థితి నెలకొంది! చికిత్స పేరుతో ఆరేళ్ల కింద లండన్ చేరి బతుకు జీవుడా అంటూ ప్రవాసంలో కాలం వెళ్లదీసిన నవాజ్ మళ్లీ సైన్యం దన్నుతో దర్జాగా స్వదేశాగమనం చేశారు. సైన్యం స్క్రిప్టులో భాగంగా అవినీతి కేసులన్నీ కొట్టుకుపోయి నాలుగోసారి ప్రధాని అయ్యేందుకు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇలా దశాబ్దాలుగా పాక్లో నేతల భాగ్యరేఖలను ఇష్టానికి నిర్దేశిస్తూ వస్తున్న సైన్యం కనుసన్నల్లో ఎప్పట్లాగే మరో ఎన్నికల తంతుకు సర్వం సిద్ధమవుతోంది... ఏ పౌర ప్రభుత్వమూ పూర్తి పదవీకాలం మనుగడ సాగించని చరిత్ర పాక్ సొంతం. చాలాకాలం పాటు ప్రత్యక్షంగా, మిగతా సమయంలో పరోక్షంగా సైనిక నియంతృత్వపు పడగ నీడలోనే ఆ దేశంలో పాలన సాగుతూ వస్తోంది. అలాంటి దేశంలో సైనిక పాలన ఊసు లేకుండా వరుసగా మూడోసారి సాధారణ ఎన్నికలు జరగబోతుండటం విశేషం! ఇలా జరగడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్కు సర్వం సిద్ధమవుతోంది. ఎప్పటి మాదిరే ఈసారి కూడా ఏయే పార్టీలు పోటీ చేయాలో, వాటి తరఫున ఎక్కణ్నుంచి ఎవరు బరిలో ఉండాలో కూడా సైన్యమే నిర్దేశిస్తూ వస్తోంది. దేశ ఆర్థికంగా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ ఆకాశాన్నంటుతూ ప్రజల బతుకే దుర్భరంగా మారిన వేళ జరుగుతున్న ఎన్నికలివి. అక్కడ ఏ ఎన్నికలూ వివాదరహితంగా జరగలేదు. కానీ ఈసారి మాత్రం అవి పరాకాష్టకు చేరాయి. నిజానికి గత నవంబర్లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సింది. జనగణనను కారణంగా చూపి ఫిబ్రవరి దాకా వాయిదా వేశారు. నవాజ్ స్వీయ ప్రవాసం నుంచి తిరిగొచ్చి కాలూచేయీ కూడదీసుకుని బరిలో దిగేందుకు వీలుగానే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏదెలా ఉన్నా కనీసం ఈసారన్న కాస్త సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నది సగటు పాక్ పౌరుల ఆశ. అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సాయం రాబట్టి అవ్యవస్థను చక్కదిద్దడంతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారత్తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలన్నది వారి ఆకాంక్ష. కానీ సర్వం సైన్యం కనుసన్నల్లో సాగుతున్న తీరును బట్టి చూస్తే ఈసారీ అది అత్యాశే అయ్యేలా కనిపిస్తోంది. నవాజ్ షరీఫ్ పాక్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు 74 ఏళ్ల నవాజ్ సొంతం. భారత్తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే నేతగానూ పేరుంది. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడని కూడా చెబుతారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) సారథిగా మూడోసారి ప్రధానిగా ఉండగా 2017లో పనామా పేపర్స్, లండన్ అపార్ట్మెంట్స్ వంటి నానారకాల కేసుల్లో ఇరుక్కున్నారు. పదవి పోగొట్టుకుని జైలుపాలై ప్రాణ భయంతో లండన్ పారిపోయారు. అనంతరం పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్కూ నాలుగేళ్లలోపే అదే గతి పట్టింది. 2022లో నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవడంతో నవాజ్కు మంచి రోజులు తిరిగొచ్చాయి. గత అక్టోబర్లో ఆయన తిరిగొచ్చి పీఎంఎల్ (ఎన్) పగ్గాలు చేపట్టడం, సైన్యంతో పాటు న్యాయ వ్యవస్థ దన్నూ తోడై ఆయనపై అవినీతి కేసులు, శిక్షలూ ఒక్కొక్కటిగా రద్దవడం చకచకా జరిగిపోయాయి. అడ్డంకులన్నీ తొలిగి ఎన్నికల బరిలో నిలిచిన నవాజ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమేనంటున్నారు. ఇమ్రాన్ఖాన్ అనితరసాధ్యమైన క్రికెట్ నైపుణ్యంతో పాక్ ప్రజలను ఉర్రూతలూగించి నేషనల్ హీరోగా వెలుగు వెలిగిన 71 ఇమ్రాన్ రాజకీయ పిచ్పై మాత్రం నిలదొక్కుకోలేక చతికిలపడ్డారు. అవినీతిని రూపుమాపి, కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టి సర్వం చక్కదిద్దుతానంటూ మార్పు నినాదంతో 2018లో ప్రధాని అయ్యారాయన. కానీ ఇమ్రాన్ హయాంలో ఆర్థికంగానే గాక అన్ని రంగాల్లోనూ దేశం కుప్పకూలింది. హింసతో, అశాంతితో పాక్ అట్టుడికిపోయింది. ఆయనకు ఆదరణా అడుగంటింది. నిజానికి సైన్యం చేతిలో పావుగానే ఇమ్రాన్ రాజకీయ ప్రవేశం జరిగిందంటారు. అలాంటి సైన్యానికే ఎదురు తిరగడంతో ఇమ్రాన్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఎంత ప్రయతి్నంచినా పదవిని కాపాడుకోలేకపోయారు. పైగా జైలు శిక్ష వల్ల తాను పోటీ చేసే అవకాశం లేదు. ఆయన పార్టీ తరఫున కొందరు ధైర్యం చేసి ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతున్నా చాలామంది జైలుపాలయ్యారు. పలువురు ఫిరాయించగా మిగిలిన వారు అజ్ఞతంలోకి వెళ్లిపోయారు. ఈ సమస్యలు చాలవన్నట్టు పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్పైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. దాంతో లక్షలాది మంది నిరక్షరాస్య ఓటర్లు బ్యాలెట్ పత్రాలపై ఇమ్రాన్ పార్టీని గుర్తించను కూడా లేరంటున్నారు. బిలావల్ భుట్టో 35 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్. దారుణ హత్యకు గురైన మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. షహబాజ్ షరీఫ్ సర్కారులో విదేశాంగ మంత్రిగా తన పనితీరుతో స్వదేశంలో విమర్శలపాలు, భారత్లో నవ్వులపాలయ్యారు. గత ఎన్నికల్లో పీపీపీ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి అన్నీ కలిసొస్తే బహుశా కింగ్మేకర్ అవ్వొచ్చంటున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుంటారు. 266 మందిని నేరుగా ఉన్నుకుంటారు. 70 సీట్లను మహిళలు, మతపరమైన మైనారిటీలకు; ఆరింటిని గిరిజన ప్రాంతాల వారికి రిజర్వు చేశారు. ఈ స్థానాలను పార్టీలకు గెలుచుకున్న స్థానాలను బట్టి నైష్పత్తిక ప్రాతిపదికన కేటాయిస్తారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్ ఆర్మీ పోస్ట్పై ఆత్మాహుతి దాడి
పెషావర్: పాకిస్తాన్లో తాలిబన్ ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ఆర్మీ పోస్టుపై వెంటవెంటనే జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 23 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘటన ఖైబర్ పంక్తున్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం దారాబన్ ఏరియాలోని ఆర్మీ కార్యాలయంలోకి కొందరు ఉగ్రవాదులు చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆర్మీ వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. కొద్దిసేపటి తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో వేగంగా వచ్చి గేటును ఢీకొట్టారు. అనంతరం మరోసారి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. రెండు దాడుల్లో ఆర్మీ కార్యాలయ భవనం కుప్పకూలింది. అనంతరం ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది సైనికులు చనిపోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని భావిస్తున్నట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ఈ ఆత్మాహుతి దాడులకు తమదే బాధ్యతంటూ తెహ్రీక్–ఇ– తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)అనుబంధంగా కొత్తగా ఏర్పడ్డ తెహ్రీక్–ఇ–జిహాద్ పాకిస్తాన్(టీజేపీ)ప్రకటించుకుంది. ఇలా ఉండగా, ఇదే జిల్లాలోని దారాజిందా, కులాచి ప్రాంతాల్లో సైన్యం జరిపిన దాడుల్లో 21 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ తెలిపింది. ఇద్దరు సైనికులు కూడా చనిపోయినట్లు పేర్కొంది. -
పాక్ కాల్పులతో పెళ్లిళ్లకు చిక్కులు
శ్రీనగర్: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం జరుపుతున్న విచక్షణారహిత కాల్పులతో జమ్మూలోని పలు గ్రామాల్లో పెళ్లిళ్లకు చిక్కులొచ్చి పడ్డాయి. దాంతో చివరి నిమిషంలో పలు పెళ్లిళ్లకు వేదికను మార్చుకోవాల్సి రావడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. భారీ కాల్పుల దెబ్బకు అతిథులు పెళ్లి విందు మధ్య నుంచే అర్ధంతరంగా నిష్క్రమిస్తున్న ఉదంతాలూ చోటుచేసుకుంటున్నాయి. పాక్ రేంజర్లు ఇలా కాల్పులకు తెగబడటం 2021 కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇదే తొలిసారి. గురువారం రాత్రి నుంచీ అరి్నయా తదితర ప్రాంతాలపై కాల్పులు ఏడు గంటలకు పైగా కొనసాగాయి. మరోవైపు వరి కోతల వేళ కాల్పులకు భయపడి కూలీలెవరూ పొలాలకు కూడా వెళ్లడం లేదు. బంకర్లోనే పాఠాలు! కాల్పుల భయంతో జమ్మూ జిల్లాలో పలు స్థానిక స్కూళ్లు మూతబడ్డాయి. అయితే సరిహద్దుకు సమీపంలోని షోగ్పూర్లో ఉన్న సర్కారీ పాఠశాల మాత్రం శుక్రవారం భూగర్భ బంకర్లలో నడిచింది! తమ ఇంట్లోవాళ్లు భయపడ్డా తాను మాత్రం స్కూలుకు హాజరయ్యానని సునీతా కుమారి అనే విద్యారి్థని చెప్పింది. ఆమెతో పాటు దాదాపు 20 మంది విద్యార్థులు స్కూల్లోని బంకర్లో పాఠాలు విన్నారు. -
ఎల్ఓసీ వెంట చైనా దుశ్చర్య
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట పాకిస్తాన్ సైన్యం రక్షణపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఈ పనులకు పొరుగున ఉన్న దాని మిత్రదేశం చైనా సహకరిస్తోందని భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, కమ్యూనికేషన్ టవర్లను పాకిస్తాన్కు చైనా అందజేస్తోందని చెప్పారు. భూగర్భæ కేబుళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పీఓకేలో చైనా స్థావరాలు పెరుగుతున్నాయని, వాటి రక్షణ కోసం పాక్ సైన్యానికి సాయం అందిస్తోందని అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 155 ఎంఎం ఎస్హెచ్–15 శతఘ్నులను ఎల్ఓసీ వద్ద పాక్ మోహరించిందని పేర్కొన్నారు. పాక్ సైనిక పోస్టుల వద్ద చైనా సైనికాధికారులు తరచుగా కనిపిస్తున్నారని తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై భారత సైన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తన ప్రయోజనాల కోసం చైనా చేస్తోందని నిపుణులంటున్నారు. -
విపత్తు దిశగా పాక్.. పిరికిపందల్లా పారిపోను: ఇమ్రాన్ ఖాన్
లాహోర్: పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని పీటీఐ(తెహ్రీక్ ఎ ఇన్సాఫ్) అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. గతంలో మాదిరి మిగతా రాజకీయ నేతల్లా తాను దేశం విడిచి వెళ్లనని, చివరిశ్వాస వరకు ఇదే గడ్డ మీద ఉంటానని గురువారం తన సందేశంలో పేర్కొన్నారు. పాకిస్థాన్ విపత్తు దిశగా వెళ్తోందన్న ఇమ్రాన్ ఖాన్.. తూర్పు పాకిస్తాన్ మాదిరి దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తన పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ వాతావరణం తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. తాను ఆర్మీని విమర్శించానంటే తన పిల్లలను మందలించినట్లుగా భావించాలన్నారు. పాక్లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లేది లేదని, చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటానన్నారు. ఇక్కడి నుండి పరారై లండన్ లో ఉన్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు ఈ దేశ రాజ్యాంగం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశంలో వ్యవస్థలు, పాక్ ఆర్మీకి వస్తోన్న చెడ్డపేరు గురించి వారికి ఆలోచన ఉందా? అని నిలదీశారు. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ నివాసాన్ని చుట్టుముట్టిన పారామిలిటరీ దళాలు, పోలీస్ బలగాలు.. ఏ క్షణంలోనైనా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ సుప్రీం కోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టులు ఇమ్రాన్ ఖాన్కు ఇచ్చిన ఊరట ఆదేశాలను సైతం పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోపక్క పాక్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. పీటీఐ కార్యకర్తల ఆగడాలను భరించేది లేదని ఆర్మీ ఛీప్ ప్రకటించారు కూడా. -
కారు అద్దాలు బద్దలు కొట్టి, కాలర్ పట్టుకొని లాక్కెళ్లి.. ఇమ్రాన్ అరెస్టు
ఇస్లామాబాద్/లాహోర్: అధికారంలో ఉన్నప్పుడు భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్(70)ను పారామిలటరీ రేంజర్లు మంగళవారం అరెస్టు చేశారు. ఇదే కేసులో ఇస్లామాబాద్ హైకోర్టులో విచారణకు హాజరైన ఆయనను న్యాయస్థానం ఎదుటే అదుపులోకి తీసుకున్నారు. తనను హత్య చేసేందుకు పాకిస్తాన్ సైన్యం కుట్ర పన్నుతోందంటూ ఆరోపించిన మరుసటి రోజే ఇమ్రాన్ను అరెస్టు చేయడం గమనార్హం. కోర్టుకు హాజరయ్యేందుకు ఆయన లాహోర్ నుంచి ఇస్లామాబాద్కు చేరుకున్నారు. కోర్టులో ప్రవేశించేందుకు తన వాహనంలో కూర్చొని బయోమెట్రిక్ ప్రక్రియ నిర్వహిస్తుండగా పారామిలటరీ రేంజర్లు రంగప్రవేశం చేశారు. వాహనం గ్లాస్ డోర్ను పగులగొట్టి, ఇమ్రాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ భద్రతా సిబ్బందిని, లాయర్లను రేంజర్లు దారుణంగా కొట్టారని పీటీఐ సీనియర్ నేత షిరీన్ మజారీ ఆరోపించారు. ఇమ్రాన్ పట్ల రేంజర్లు అనుచితంగా ప్రవర్తించినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వా రా వెల్లడయ్యింది. కాలర్ పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లి, జైలు వ్యాన్లోకి విసిరేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 1న అరెస్టు వారెంట్ ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీకి చెందిన అల్–ఖదీర్ ట్రస్టుకు బాహ్రియా పట్టణంలో రూ.53 కోట్ల విలువైన భూమిని బదిలీ చేసిన కేసులో ఇమ్రాన్ను అరెస్టు చేసినట్లు ఇస్లామాబాద్ పోలీసులు ప్రకటించారు. మంగళవారం ఉదయమే అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆయనను నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్ఏబీ)కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ అరెస్టు వారెంట్ను ఈ నెల 1న జారీ చేసినట్లు దానిపై ఉన్న తేదీని బట్టి తెలుస్తోంది. అవినీతి వ్యవహారాల్లో ఆయన నిందితుడని అందులో పేర్కొన్నారు. అరెస్టు తర్వాత ఇమ్రాన్ను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా ట్విట్టర్లో వెల్లడించారు. ఇమ్రాన్ను హింసించారంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాలేదని, అందుకే ఎన్ఏబీ ఆ యనను అదుపులోకి తీసుకుందని తెలియజేశారు. ఇమ్రాన్ వాహనం అద్దాలు పగులగొట్టి ఆయనను అదుపులోకి తీసుకుంటున్న పారామిలటరీ రేంజర్లు. అనంతరం బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కిస్తున్న దృశ్యం Imran Khan’s lawyer badly injured inside the premises of IHC. Black day for our democracy and country. pic.twitter.com/iQ8xWsXln7 — PTI (@PTIofficial) May 9, 2023 140కి పైగా కేసులు ఇమ్రాన్ అరెస్టు పట్ల పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రాంగణంలోనే లాయర్లపై రేంజర్లు దాడి చేశారని, దేశంలో అరాచకం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. కస్టడీలో ఉన్న ఇమ్రాన్ను దారుణంగా హింసిస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది ఏప్రిల్లో ఇమ్రాన్ పదవి కోల్పోయారు. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అవినీతి, ఉగ్రవాదం, దైవదూషణ, హత్య, హింసకు ప్రేరేపించడం వంటి ఆరోపణల కింద ఇమ్రాన్పై 140కిపైగా కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ అరెస్టు నేపథ్యంలో ఇస్లామాబాద్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లడానికి సిద్ధం: ఇమ్రాన్ ఇమ్రాన్ అరెస్టయిన తర్వాత.. ముందుగా రికార్డు చేసిన ఓ వీడియోను పీటీఐ విడుదల చేసింది. ‘‘నా మాటలు మీకు చేరుకునేలోపు ఎలాంటి ఆధారాల్లేని కేసులో నన్ను అరెస్టు చేస్తారు. పాకిస్తాన్లో ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యానికి సమాధి కట్టినట్లు దీనిద్వారా తేటతెల్లమవుతుంది. అవినీతికి పాల్పడినట్లు నేను అంగీకరించాలని వారు(పాక్ పాలకులు) కోరుకుంటున్నారు. దిగుమతి అయిన ప్రభుత్వాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దారు. వారెంట్ ఉంటే నన్ను అరెస్టు చేసుకోండి. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా’’ అని ఆ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్ అనుచరుల విధ్వంసం పాకిస్తాన్లో అవాంఛనీయ దృశ్యాలు కనిపించాయి. ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన అనుచరులు వీధుల్లోకి వచ్చారు. విధ్వంసానికి పాల్పడ్డారు. రావల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన గేటును ధ్వంసం చేశారు. సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ప్రధాన గేటును ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి. లాహోర్లో సైనిక కమాండర్ నివాసాన్ని సైతం నిరసనకారులు దిగ్బంధించారు. సైనిక కంటోన్మెంట్లో గుమికూడి నినాదాలు చేశారు. రహదారులపై బైఠాయించడంతో లాహోర్ నుంచి చాలాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇమ్రాన్ అరెస్టు వార్తా ఉదయమే దావానలంగా వ్యాపించింది. వెంటనే ఆయన అనుచరులు వివిధ నగరాలు, పట్టణాల్లో ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇమ్రాన్ను పారామిలటరీ రేంజర్లు శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని నినదించారు. నిరసనలు హింసాత్మకంగా మారాయి. పెషావర్, కరాచీ, హైదరాబాద్, క్వెట్టా తదితర ప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పింది. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి, ఇమ్రాన్ మద్దతుదారులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చదవండి: 150 కిలోల పేలుడు పదార్థాలు.. క్షణాల్లో నేలమట్టమైన బ్రిడ్జి.. వీడియో వైరల్ LIVE: Former Pakistan Prime Minister Imran Khan Arrested Live Updates Read @ANI | https://t.co/KTWAOqwf83#ImranKhan #ImranKhanArrested #Pakistan pic.twitter.com/R8Y8PZC3kk— ANI Digital (@ani_digital) May 9, 2023 -
భారత ఆర్మీతో పోలికా! అంత సీన్ లేదు.. కుండ బద్దలు కొట్టిన పాక్ ఆర్మీ మాజీ చీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావెద్ బద్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత సైన్యం సత్తాపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. భారత్ సైన్యంతో పారాడే శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తి పాకిస్తాన్ ఆర్మీకి లేదని కుండబద్దలు కొట్టారు. బ్రిటన్లోని పాకిస్తాన్ మీడియా జర్నలిస్టులు హమీద్ మీర్, నజీం జెహ్రాలకు ఇచ్చిన ఇంటర్వూలో జావెద్ ఈ వాఖ్యలు చేశారు. 'భారత ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ సరితూగలేదు. భారత్తో పాక్ యుద్ధం చేసే పరిస్థితి లేదు. ట్యాంకులు కూడా పనిచేయడం లేదు. ఫిరంగులను తరలించడానికి డీజిల్ కూడా లేదు' అని బజ్వా తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఆ దేశ సైనిక సామర్థ్యాలపై ప్రశ్నలు లేవెనత్తేలా, సైన్యం నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయి. ఏదేమైనా ఆయన చెప్పిన దాంట్లో మాత్రం వాస్తవం ఉంది. భారత సైన్యం వీరపరక్రమాల ముందు పాక్ సైన్యం సరితూగదని జగమెరిగిన సత్యం. పాకిస్తాన్ కమాండర్స్ సదస్సులోనే బజ్వా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారత్తో పాకిస్తాన్ శుత్రుత్వం పెంచుకోకుండా స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరుచుకుంటేనే మంచిదని ఆయన అన్నారు. భారత్తో సుదీర్ఘ విరోధం పాకిస్తాన్ను హరించివేస్తుందని పేర్కొన్నారు. భారత్తో పోరాడేందుకు అవసరమైన ఆయుద సంపద, ఆర్థిక బలం పాకిస్తాన్కు లేవని, అందుకే కశ్మీర్ సమస్యపై ఇరుదేశాలు శాశ్వత పరిష్కారానికి వచ్చే విషయంపై ఆలోచిస్తున్నట్లు కూడా బజ్వా పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ సంక్షోభంతో ప్రజల జీవితాలు దుర్బరంగా మారాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి, ఉద్యోగాలు పోయి అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. చదవండి: సూడాన్ ఆర్మీ-పారామిలిటరీ బలగాల పోరు.. 72 గంటలపాటు కాల్పుల విరమణ! -
ఇండియన్ ఆర్మీపై దాడులకు పాక్ ఆర్మీ స్కెచ్
శ్రీనగర్: భారత గడ్డపై దాడులకు పాక్ సైన్యం కుటిల యత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో.. భారత్లో దాడులకు సుపారీ తీసుకున్న ఓ ఉగ్రవాదిని భారత సైన్యం నిలువరించగలిగింది. జమ్ము కశ్మీర్ రాజౌరి వద్ద గత రెండురోజులుగా భారత్లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీవోకే సమీపంలోని అటవీ ప్రాంతంలో భారత సైన్యం అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. ఆగస్టు 21న నౌషేరా ప్రాంతంలోని ఝంగర్ సెక్టార్ నుంచి భారత్లోకి ఆయుధాలతో అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని గాయపరిచి అదుపులోకి తీసుకుంది భారత సైన్యం. సరిహద్దు ప్రాంతంలోని ఫెన్సింగ్ను కట్ చేసి చొరబడేందుకు ప్రయత్నించారు. గమనించిన భారత సైనికులు కాల్పులు జరిపి.. అతన్ని గాయపరిచి పట్టుకున్నారు. గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడడమే కాకుండా.. అతని నుంచి కీలక సమాచారం సేకరించింది భారత సైన్యం. అతన్ని పీవోకే కొట్లి జిల్లా సబ్జ్కోట్కు చెందిన తబరాక్ హుస్సేన్గా గుర్తించింది. పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి చెందిన కల్నల్ యూనస్ చౌద్రీ తనను పంపించాడని, భారత ఆర్మీపై దాడులకు పాల్పడాలంటూ తనకు రూ.30వేల పాక్ రూపాయలను ఇచ్చాడని వెల్లడించాడు. ఆయుధాలతో పాటు పాక్ కరెన్సీని భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. విశేషం ఏంటంటే.. 2016లో తబరాక్ నియంత్రణ రేఖ వెంబడి తన సోదరుడితో సహా చొరబడేందుక యత్నించగా.. ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అయితే మానవతా ధృక్పదంతో ఏడాది జైలుశిక్ష తర్వాత అతన్ని మళ్లీ వెనక్కి పంపించేసింది. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా ఈసారి ఏకంగా దాడులకే సిద్ధపడడం గమనార్హం. #WATCH | Tabarak Hussain, a fidayeen suicide attacker from PoK, captured by the Indian Army on 21 August at LOC in Jhangar sector of Naushera, Rajouri, says he was tasked by Pakistan Army's Col. Yunus to attack the Indian Army for around Rs 30,000 pic.twitter.com/UWsz5tdh2L — ANI (@ANI) August 24, 2022 ఇదీ చదవండి: మరో జలియన్ వాలాబాగ్.. 80 ఏళ్లు పూర్తి.. అయినా గుండెలపై మానని గాయం -
చైనా వక్రబుద్ధి.. పాకిస్థాన్ ఆర్మీ కోసం పీఓకేలో నిర్మాణాలు
న్యూఢిల్లీ: భారత్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా చైనా తన వక్రబుద్ధిని మానుకోవటం లేదు. సరిహద్దుల్లో ఏదోరకంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్ ఆర్మీ కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), బలోచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లోకి ప్రవేశించింది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఆసీ) నిర్మాణంలో మాత్రమే కాకుండా చైనా ఇంజనీర్లు పీఓకేలోనూ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన 10-12 మంది వ్యక్తులు పీఓకేలోని శార్దా ప్రాంతంలో కనిపించారు. వారు పాకిస్థాన్ ఆర్మీ కోసం భూగర్భ బంకర్లు నిర్మించటంలో నిమగ్నమయ్యారు. పాక్ సైన్యం ఆ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తోంది. నియంత్రణ రేఖకు సమీపంలోని నీలం లోయలో 10-15 మంది చైనా ఇంజనీర్లు బంకర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఫుల్లవాయ్గా పిలుస్తారు. కశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మరోవైపు.. సింధ్, బలోచిస్థాన్ ప్రాంతాల్లోనూ చైనా సైనికులు నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే రానికోట్, నవాబ్షా, ఖుజ్దార్ ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే.. పాకిస్థాన్ ఆర్మీకి కావాల్సిన మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా సైన్యం ఎందుకు పాల్గొంటుందన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. సీపెక్ ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవటం వల్లే పాకిస్థాన్ సైన్యానికి చైనా ఆర్మీ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీపెక్ ద్వారా సింకియాంగ్ను గ్వాదర్ పోర్ట్తో అనుసంధానించాలని భావించారు, అయితే అది అక్కడికి చేరుకోవడానికి చాలా దూరంలో ఉంది. ఇదీ చదవండి: చైనా, పాక్ తీరుని తిట్టిపోసిన భారత్! ఊరుకునేది లేదని వార్నింగ్ -
సాక్షి కార్టూన్ 07-07-2022
ఇందులో ఏ ‘రాజకీయం’ లేదుగా..! -
మా చేతులు కట్టేసినట్లు ఉండేది.. ప్రతి చోట బెదిరింపులే: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ ఆర్మీ వ్యవస్థపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతి ఒక్కరూ బ్లాక్మెయిల్ చేశారని, తన చేతుల్లో అధికారం ఉండేది కాదని, ఎవరి ఆధీనంలో ఉండేదో అందరికీ తెలుసని పరోక్షంగా ఆర్మీని ఉద్ధేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ఏప్రిల్లో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణంలో నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన విషయం తెలిసిందే. అయితే అమెరికా తనను లక్ష్యంగా చేసుకొని పన్నిన కుట్రల కారణంగానే తాము అధికారం కోల్పోయామని మండిపడ్డారు. రష్యా, చైనా, అప్ఘనిస్తాన్ విషయంలో స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్లే అమెరికా ఆ పనిచేసిందన్నారు. బుధవారం ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ... పాక్ ఆర్మీపై మండిపడ్డారు. ‘మా ప్రభుత్వం చాలా బలహీన సర్కారు. మా చేతులు కట్టేసినట్లుగా పరిస్థితి ఉండేది. ఎన్నికల్లో గెలిచిన సమయంలో పలు పార్టీల సాయం తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రతిచోట నుంచి మాకు బెదిరింపులు వచ్చాయి. నేను ప్రధానిగా ఉన్న సమయంలో అధికారం నా చేతిలో లేదు. అది ఎవరి చేతుల్లో ఉందో ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. చదవండి: Russia Ukraine War: ఉక్రెయిన్ చేతికి అమెరికా రాకెట్లు! ‘శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున తమ దేశానికి బలమైన సైన్యాన్ని కలిగి ఉండటం తప్పనిసరి. అయితే బలమైన సైన్యం, బలమైన ప్రభుత్వానికి మధ్య "సమతుల్యత" పాటించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే మా హయాంలో అది మాత్రం సాధ్యపడలేదు. మేము అన్ని వేళలా వారి (ఆర్మీ)పైనే ఆధారపడ్డాము. వాళ్లు చాలా మంచి పనులు కూడా చేశారు. కానీ చేయాల్సిన అనేక పనులు చేయలేదు. జాతీయ జవాబుదారీ సంస్థ (ఎన్ఏబీ)లు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. అందుకే అధికారం మొత్తం వారి చేతుల్లోనే ఉంటుంది’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కాగా 2018లో మిలటరీ అండతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంలో పదవీచ్యుతుడైన ఏకైక పాక్ ప్రధాని. ఆయన స్థానంలో పీఎంఎల్-ఎన్కు చెందిన షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా ఎంపికయ్యారు. అలాగే 75 ఏళ్ల స్వతంత్ర్య పాకిస్థాన్ చరిత్రలో దాదాపు సగానికి పైగా ఆర్మీనే ఆ దేశాన్ని పాలించింది. ఇప్పటికీ దేశ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించి సైన్యమే కీలక నిర్ణయం తీసుకుంటుంది. -
ఇమ్రాన్ ఖాన్పై మరియం షరీఫ్ సంచలన ఆరోపణలు.. చివరి క్షణం వరకూ..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై అధికార పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నించారని ధ్వజమెత్తారు. తను పదవిలో ఉన్న చివరి నిమిషం వరకు పాకిస్థాన్ ఆర్మీని వేడుకున్నాడని అన్నారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తనను గట్టెక్కించాలని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఉపాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని కూడా బతిమాలారని మరియం విమర్శించారు. అవిశ్వాసంపై ఓటింగ్ను వాయిదా వేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడని, అందుకే తాము అర్ధరాత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించామని మరియమ్ అన్నారు. లాహోర్లో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్కు కష్టాలు వచ్చే రోజులు మొదలయ్యాయని మరియం ఆరోపించారు. ఒకవేళ నవాజ్ షరీఫ్ తిరిగి వస్తే ఇమ్రాన్ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకోవాలన్నారు. రాజకీయాలంటే కప్పు టీ తాగినంత సులువు కాదని ఇమ్రాన్ క్రికెట్ ఆడటమే మంచిదని ఎద్దేవా చేశారు. ఇమ్రాన్ అవినీతిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని, త్వరలోనే ఇమ్రాన్తోపాటు అతని మంత్రివర్గ సభ్యులు తిరుగులేని అవినీతి ఆరోపణలపై కటకటాల పాలవుతారని మండిపడ్డారు. చదవండి👉 పాకిస్తాన్లో మహిళా సూసైడ్ బాంబర్.. షాకింగ్ విషయాలు వెల్లడి కాగా మూడుసార్లు పాకిస్థాన్కు ప్రధానిగా పనిచేసిన నవాజ్షరీఫ్ కూతురే మరియం షరీఫ్. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్న సమయంలో నవాజ్పై అనేక అవినీతి కేసులు పెట్టించాడు. అయితే లాహోర్ హై కోర్టు అనుమతితో 2019 నవంబర్లో చికిత్స కోసం లండన్ వెళ్లారు. ప్రస్తుతం పాక్లో అధికారంలోకి వచ్చిన పీఎమ్ఎల్ ప్రభుత్వం నవాజ్కు కొత్త పాస్పోర్టు అందించి అతన్ని దేశానికి తీసుకొచ్చేందుకు మార్గం సుగుమం చేసింది. కాగా 75 ఏళ్ల స్వతంత్ర్య పాకిస్థాన్ చరిత్రలో దాదాపు సగానికి పైగా ఆర్మీనే ఆ దేశాన్ని పాలించింది. ఇప్పటికీ దేశ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించి సైన్యమే కీలక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇటీవల ఇమ్రాన్ ఖాన్కు షెబాష్ షరీఫ్కు మధ్య రాజకీయ వివాదాలు తలెత్తడంతో ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సైన్యం నిరాకరించింది. ఇమ్రాన్ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మాణం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్ 10న పదవి కోల్పోయారు. దీంతో పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాసం ఎదర్కొని పదవీచ్యుతుడైన తొలి ప్రధానికిగా నిలిచారు. చదవండి👉 ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెప్పపాటులో బిడ్డను వెనక్కి లాగడంతో.. -
భారత్ భేష్.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాకు తాను వెనకాడబోనని చెప్పిన పాక్ పీఎం.. విపక్షాల ఒత్తిళ్లకు తలొగ్గేదిలేదంటూ వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా పాక్ ఆర్మీని విమర్శిస్తూ.. భారత్పై ప్రశంసలు గుప్పించాడు. ఖైబర్ ఫక్తూన్వాలో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాడు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవిశ్వాసం తేబోతున్న ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ.. తన ప్రభుత్వ పని తీరును సమర్థించుకున్నాడు. పనిలో పనిగా.. భారత ఆర్మీ భేషుగ్గా పని చేస్తుందని మెచ్చుకున్నాడు. భారత ఆర్మీ.. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అలాగే భారత విదేశాంగ విధానం అద్భుతంగా ఉంటుందని, పౌరుల కోసం ఎంతకైనా తెగిస్తుందంటూ ఆకాశానికి ఎత్తాడు. ఇక భారత్.. ఏ ఒత్తిళ్లకూ తలొగ్గని దేశమని, విధానాలు సక్రమంగా ఉండడం వల్లే తటస్థ వైఖరి అవలంభిస్తుందంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు భారత్ విధానాలు ఆ దేశానికి ఎంతో మేలు చేస్తున్నాయని వ్యాఖ్యానించాడు ఇమ్రాన్ ఖాన్. ఇక పదవీ గండంపై స్పందిస్తూ.. రాజీనామాకు తాను ఎప్పటికైనా సిద్ధమని పేర్కొన్నాడు. అలాగని విపక్షాల ఒత్తిళ్లకు తాను తలొగ్గనని, ఆర్మీకి డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని, పదవిని నిలబెట్టుకోలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా.. ఆర్మీ చీఫ్ జనరల్ ఖనార్ జావెద్ బజ్వా ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇది ఇస్లామిక్ కో ఆపరేషన్’ తర్వాత ఇమ్రాన్ ఖాన్ను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని కోరిన సంగతి తెలిసిందే. చదవండి: ఖాన్ సాబ్.. మీరు దిగి పోవడమే మంచిది! -
పాకిస్తాన్లో భారీ పేలుడు.. భయాందోళనలో ప్రజలు.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఇటీవలే క్షిపణి ప్రయోగం చేసి.. అది విఫలమవడంతో సోషల్ మీడియాలో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఘటనతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆదివారం పాక్ సైనిక స్థావరంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం ధాటికి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం.. నార్త్ పాకిస్తాన్లో ఉన్న సియాల్కోట్లోని సైనిక స్థావరంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల మేర సౌండ్ వినిపించడంతో ఏం జరిగిందోనని స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, పంజాబ్ ప్రావిన్స్లోని కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలో పేలుడు శబ్ధం వినిపించినట్లు సమాచారం. కాసేపటి తర్వాత ఈ పేలుడుపై పాక్ ఆర్మీ మీడియా విభాగం ఓ ప్రకటనలో ప్రమాదవశాత్తు మిలటరీ బేస్లో అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంభవించి మంటలు చెలరేగాయని తెలిపింది. Something is Happening in #Sialkot Cant #Sialkot pic.twitter.com/UsZ97NhW7M— MariA RazAa (@RazaaMaria) March 20, 2022 కాగా, ఈ ఘటనలో మందుగుండు సామగ్రి షెడ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాడంతో వేగంగా స్పందించి భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. భారీ పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
హ్యాండ్ ఇచ్చిన ఆర్మీ.. ఇమ్రాన్ ఖాన్ ఆశలు గల్లంతు
Pakistan Political Turmoil: నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హడావిడిగా శనివారం అంతా పాక్ కీలక విభాగాలతో భేటీ అయ్యాడు. ఇందులో భాగంగా.. ఆర్మీ చీఫ్ జనరల్ ఖనార్ జావెద్ బజ్వా జరిగిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి వస్తే.. సాయం చేయాలని ఇమ్రాన్ ఖాన్ కోరగా, అందుకు పాక్ ఆర్మీ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ భేటీలో ఆర్మీ చీఫ్, ఇమ్రాన్ ఖాన్కు రాజీనామా సలహానే ఇచ్చినట్లు తెలుస్తోంది. అవిశ్వాసంలో గనుక ఓడితే.. ఈ నెలాఖరులో జరిగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇది ఇస్లామిక్ కో ఆపరేషన్ (OIC) తర్వాత పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్తో.. ఆర్మీ ఛీప్ ఖనార్ జావెద్ బజ్వా చెప్పినట్లు సమాచారం. ఈ భేటీలో బజ్వాతో పాటు ముగ్గురు సీనియర్ లెఫ్టినెంట్ జనరల్స్, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) డీజీ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అంతేకాదు బజ్వాతో పాటు మిగిలిన మిలిటరీ అధికారులు కూడా ఇమ్రాన్ ఖాన్తో గద్దె దిగిపోమనే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఖాన్కు దారులన్నీ మూసుకుపోయాయి. ప్రభుత్వం గనుక కూలిపోయే పరిస్థితి వస్తే సైన్యం సాయం తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ భావించాడు. అంతకు ముందు ఆర్మీ మాజీ ఛీఫ్ రహీల్ షరీఫ్.. బజ్వాతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఇమ్రాన్ ఖాన్ తరపున రాయబారం నడిపే ప్రయత్నం చేశాడు. కానీ, రహీల్ దౌత్యాన్ని సైతం పాక్ ఆర్మీ ఛీ కొట్టిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం దగ్గరపడిందనే సంకేతాలు అందాయి. అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కించాలంటూ ప్రధాని వారిని కోరినా తామేమీ చేయలేమంటూ వారు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో అవిశ్వాస తీర్మానంతో పాటు ఓఐసీ సమ్మిట్, బెలూచిస్థాన్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఇక ఈ భేటీపై పీటీఐ నేతలు గంపెడు ఆశలు పెట్టుకోగా.. ఫలితం ఇలా రివర్స్ రావడంతో అసంతృప్తిలో కూరుకుపోయారని క్యాపిట్ టీవీ కథనం ప్రసారం చేసింది. మొదటి నుంచి పాక్ ప్రభుత్వాన్ని నియంత్రించే పనిలో ఆర్మీ ఉంటోంది. ప్రతిపక్ష నేతలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆర్మీ ఛీఫ్ బజ్వా మొదటి నుంచి పీటీఐ నేతలకు చెబుతున్నా.. స్వయంగా ఇమ్రాన్ ఖానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడం విశేషం. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో సతమతమవుతున్న దేశం.. ఇప్పుడీ రాజకీయ సంక్షోభంతో మరింత దిగజారుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆర్మీ. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా, యూరోపియన్ యూనియన్ పై అనవసర వ్యాఖ్యలు చేశారంటూ ఇమ్రాన్ పై ఆర్మీ గుర్రుగా ఉంది. ఇప్పటికే సొంత పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ కే చెందిన 24 మంది నేతలు.. ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ దిగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. చదవండి: సొంత పార్టీలోనే తిరుగుబాటు.. ఎందుకు? -
పాకిస్తాన్లో అంతర్యుద్ధం?
కరాచీ: ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రతిపక్ష నేతల అరెస్ట్లతో అట్టుడుకుతున్న పాకిస్తాన్ క్రమంగా అంతర్యుద్ధం దిశగా పయనించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనాతో దేశం అతలాకుతలం అవుతుండగా మరోపక్క ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పోరు తారస్థాయికి చేరుతోంది. ఆర్మీకి, పాక్ పోలీసులకు మధ్య గొడవలు పెరిగి కాల్పులకు దారితీశాయి. ఇంటర్నేషనల్ హెరాల్డ్ తన తాజా ట్వీట్లో పాక్లో సివిల్ వార్ ఆరంభమైందని వ్యాఖ్యానించింది. కరాచీలో సింధ్ పోలీసులకు, పాక్ ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో దాదాపు పది మంది పోలీసులు మరణించినట్లు ఇంటర్నేషనల్ హెరాల్డ్ నివేదించింది. సింధ్కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ముష్టాఖ్ అహ్మద్ మహర్ను ఆర్మీ నిర్బంధించడంతో గొడవ మొదలైందని సమాచారం. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు మహ్మద్ సఫ్దార్ను అరెస్టు వ్యవహారంలో మహర్ను నిర్బంధించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఘటనలపై పాక్ ప్రధాని, ప్రభుత్వం స్పందించలేదు. సఫ్దార్ అరెస్ట్ కోసం.. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇటీవల ఏర్పాటు చేసిన పీడీఎం వేదికపై నవాజ్ షరీఫ్ కూతురు మరియం, ఆమె భర్త సఫ్దార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్మీకి నచ్చని ‘ఓటుకు విలువ ఇవ్వండి’ అని సఫ్దార్ నినాదాలు చేశారని, దీంతో కేసు నమోదైందని తెలిసింది. ఈ కేసులోనే సఫ్దార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తక్షణమే సఫ్దార్ను అరెస్ట్చేసేలా పోలీసులకు ఉత్వర్వులు ఇవ్వాలని సింధ్ పోలీస్ ఐజీపీ మహర్పై సైన్యం ఒత్తిడి చేసిందని, అందుకోసం ఆయనను సైన్యం నిర్బంధించిందని సింధ్ మాజీ గవర్నర్ మహ్మద్ జుబేర్ ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారి అయిన మహర్ నిర్బంధం విషయం తెల్సి ఆర్మీపై పోలీసులు తిరగబడ్డారని సమాచారం. ఈ సందర్భంగా సైన్యం, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగాయని, పది మంది పోలీసులు మరణించారని తెలుస్తోంది. సైన్యం కాల్పులకు నిరసనగా ఏఐజీ ఇమ్రాన్సహా సీనియర్ పోలీసు అధికారులు విధులను బహిష్కరించి సెలవు తీసుకున్నారు. అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో మహర్ తన సెలవును వాయిదా వేసుకున్నారు. 10 రోజులదాకా సెలవు కోసం దరఖాస్తు చేసుకోరాదని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ గొడవకు కారణమైన అంశాలపై విచారణ జరపాలని ఆర్మీ చీఫ్ జనరల్ కమార్జావెద్ బజ్వా ఆదేశించారు. నిరసనల్లో భారత జెండా ఇటీవల పాక్లో జరిగిన భారీ నిరసనల్లో భారత జాతీయజెండాలు చేతబూనారని బుధవారం ట్విట్టర్లో కొంతమంది పోస్ట్లు పెట్టారు. వేలాది మంది జనం గుమికూడిన ఈ ఫొటోల్లో కొందరి చేతిలో మువ్వన్నెల జెండాలున్నాయి. పాక్కు చెందిన పాకిస్తాన్ అవామీ తెహ్రీక్ పార్టీ జెండాలో అవే రంగులుంటాయని, అవి ఆ జెండాలని కొందరు స్పందించారు. పాక్లో ప్రభుత్వ అసమర్థత కారణంగా ఆహార కొరత వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో సామాన్యుల జీవనం అస్తవ్యస్థంగా మారింది. నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్రాన్ గద్దె దిగాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆందోళనలను అణిచివేస్తోంది. -
వాళ్లకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐతో సంబంధాలు!
న్యూఢిల్లీ: యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ ‘పెద్దల’పై బంధుప్రీతి, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ బైజయంత్ జై పాండా మరో బాంబు పేల్చారు. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ, పాక్ సైన్యంతో పలువురు బీ-టౌన్ ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో హింసను ప్రేరేపిస్తున్న పాకిస్తానీలు, ఎన్ఆర్ఐలతో వీరు వ్యక్తిగత, వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారని.. తద్వారా పరోక్షంగా పాక్ ఆర్మీకి సహాయపడుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి దేశభక్తి గల బాలీవుడ్ నటులు ఇలాంటి వాళ్లతో కలిసి పనిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. అయితే ఇందులో ఆయన ఎవరి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.(హర్ట్ అయ్యుంటే సారీ చెప్తాను: అనురాగ్) కాగా ఒడిశాకు చెందిన జై పాండా ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇక జై పాండా వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇలాంటి ద్రోహులను ఏరివేయాలంటే దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని కొంతమంది డిమాండ్ చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఈ ఆరోపణలు నిజమే అయితే ఇన్నాళ్లు నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడిన నాటి నుంచి బాలీవుడ్లో నెపోటిజంపై విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శక నిర్మాత కరణ్ జోహార్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ తదితరులపై సుశాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అదే విధంగా అవుట్సైడర్ల తరఫున గళమెత్తిన కంగనా రనౌత్కు మద్దతుగా నిలుస్తున్నారు. Came across shocking threads documenting personal & business links of some Bollywood personalities with certain Pakistanis & NRIs with undeniable track record encouraging violence in J&K, who have verifiable links to ISI & Pak army. I urge patriotic Bollywoodies to renounce them. — Baijayant Jay Panda (@PandaJay) July 22, 2020 -
పాక్ ఆర్మీలో తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ నిగార్ జోహర్ అరుదైన ఘనత సాధించారు. పాక్ సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ హోదా దక్కించుకున్న తొలి మహిళగా చరిత్రకెక్కారు. అదే విధంగా ఆర్మీ సర్జన్ జనరల్గా విధులు నిర్వర్తించనున్న మొదటి మహిళగా నిలిచారు. ఈ విషయాన్ని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్ మాజ్ జెన్ బాబర్ ఇఫ్తిఖర్ మంగళవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘లెఫ్టినెంట్ జనరల్గా పదోన్నతి పొందిన తొలి మహిళ ఈమె. పాక్ ఆర్మీ తొలి మహిళా సర్జన్గా నియమితులయ్యారు’’ అని పేర్కొన్నారు.(మళ్లీ సైన్యం చేతుల్లోకి పాక్ పెత్తనం?) కాగా రావల్సిండిలోని ఆర్మీ మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జోహర్.. 1985లో పాక్ ఆర్మీ మెడికల్ కార్స్ప్లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2017లో మేజర్ జనరల్ స్థాయికి చేరుకున్నారు. ఆమె కంటే ముందు షహీదా బాద్షా, షహీదా మాలిక్ అనే ఇద్దరు మహిళలు మాత్రమే ఈ హోదా దక్కించుకున్నారు. ఇక జోహర్ తండ్రి, భర్త కూడా పాక్ ఆర్మీలో సేవలు అందించిన వారే కావడం గమనార్హం. -
ఇమ్రాన్ ముందు అనేక సవాళ్లు
కరాచీ: పొరుగు దేశం పాకిస్తాన్ ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరం లక్ష్యాల్లో ఏ ఒక్కటీ సాధించలేకపోయింది. ఐఎమ్ఎఫ్, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా చేపట్టిన సర్వేలో పాక్ జీడీపీలో అప్పు 88 శాతానికి ఎగబాకనుండగా ఆర్థిక వ్యవస్థ 68 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు డా. అబ్ధుల్ హఫీజ్ షేఖ్ పాక్ ఆర్థిక సర్వే ఫలితాలను విడుదల చేశారు. ఇలాంటి దీనావస్థలో ఉన్న పాక్ భారత్కు నగదు బదిలీ సాయం చేస్తానంటూ ముందుకు రాగా.. భారత్ తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే కరోనా కారణంగా 10 మిలియన్ల మంది పాక్ ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయారు. (మీరా మాకు సాయం చేసేది) కశ్మీర్ను రాజకీయం చేయని పాక్ ఈ నేపథ్యంలో తిండిగింజకు ఇబ్బందులు పడే అవకాశమున్నందున ఇమ్రాన్ ఖాన్ తమ దేశంలో లాక్డౌన్ విధించబోనంటూ మార్చిలో ఓ ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ ఆర్మీ లాక్డౌన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ప్రభుత్వం, ఆర్మీకి మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అయితే దేశంలోని తిరుగుబాట్లు, రాజకీయ వివాదాలు, ఆర్థిక లోటుపై ప్రజల దృష్టి మరల్చేందుకు పాక్ ఏళ్ల తరబడి కశ్మీర్ అంశాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ వస్తోంది. కానీ ఏడాది కాలంగా అది కశ్మీర్ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశాన్ని పక్కన పెట్టేశాడు. ప్రభుత్వంపై పట్టు కోల్పోతున్న ఇమ్రాన్ ఖాన్ మరోవైపు ఆర్మీ అధికారులే కీలక పదవులు దక్కించుకుంటూ పాక్ ప్రభుత్వంపై పెత్తనం కొనసాగిస్తున్నారు. కరోనా సమీక్షలోనూ సైన్యాధికారులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. బ్లూమ్బర్గ్ నివేదిక సైతం పాక్ ప్రభుత్వంపై సైన్యం తన పట్టును బిగిస్తోందని వెల్లడించింది. కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఈ సవాళ్లే ప్రధాని ఇమ్రాన్ మౌనానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రెండేళ్లుగా ఆయన పాపులారిటీ కూడా తగ్గిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. (మళ్లీ సైన్యం చేతుల్లోకి పాక్ పెత్తనం) -
ఇద్దరు తప్ప అందరూ..
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 97 మంది మరణించగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానం శుక్రవారం కరాచీ విమానాశ్రయం దగ్గర్లోని ప్రజానివాస ప్రాంతంలో కుప్పకూలింది. శనివారం ఉదయానికి ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి సంఖ్య బయటకు వచ్చింది. విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 97 మంది మరణించగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న వారిలో 51 మంది పురుషులు, 31 మంది మహిళలు, 9 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం ఆస్పత్రులకు తరలించారు. 19 మృతదేహాలు ఎవరివనేది గుర్తించినట్లు తెలిపారు. విమానం కూలిన ప్రాంతంలో 25 ఇళ్లు ధ్వంసం కాగా, 11 మంది నివాసితులు గాయపడ్డారు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరిపించాలని పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ అసోíసియేషన్ డిమాండ్ చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం ఇప్పటికే నలుగురు సభ్యులతో కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. సాంకేతిక సమస్యల వల్ల విమానం కూలి ఉండవచ్చని, దర్యాప్తులో వివరాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. -
‘కర్తార్పూర్’పై పాక్ వేర్వేరు ప్రకటనలు
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్లోని పంజాబ్లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాతో పాకిస్తాన్లోని పంజాబ్లోని కర్తార్పూర్లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే కర్తార్పూర్ కాడిడార్ ప్రారంభోత్సవానికి సంబంధించి పాక్ భిన్నమైన సమాచారమిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. కర్తార్పూర్ కారిడార్ సందర్శనకు వచ్చే భారతీయ యాత్రీకులు పాస్పోర్ట్ను వెంట తీసుకురావాల్సిన అవసరం లేదని, ఏదైనా చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రం తెచ్చుకుంటే చాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ గతంలో పేర్కొన్నారు. తాజాగా, భద్రతా కారణాల రీత్యా భారతీయ యాత్రీకులు తమ వెంట పాస్పోర్ట్ తెచ్చుకోవాల్సిందేనని పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. పాక్ తీరుపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక ఒప్పందం అంశాలను పాక్ అమలు చేయాలని కోరింది. కాగా, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దూకు శనివారం జరిగే కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో పాకిస్తాన్ తరఫున పాల్గొనడానికి ప్రభుత్వం గురువారం రాజకీయ అనుమతి ఇచ్చింది. -
తెల్ల జెండాలతో వచ్చి శవాలను తీసుకెళ్లారు
న్యూఢిల్లీ: భారత సైన్యాన్ని కాల్పులతో ఎదుర్కోలేక పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండాతో హాజిపిర్ సెక్టార్లోని నియంత్రణ రేఖలోకి ప్రవేశించింది. భారత్–పాక్ సైన్యాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాక్ ఆర్మీ ఈ పద్ధతిని ఎంచుకుంది. దీనికి ముందు పాక్ ఎల్ఓసీలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించి కాల్పులు జరిపింది. దీంతో భారత ఆర్మీ కూడా తిరిగి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఈ నెల 10న పాక్ సైనికుడు గులాం రసూల్ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాక్ తిరిగి కాల్పులు జరుపుతూ చొరబడాలని ప్రయత్నించింది. భారత సైన్యం తిరిగి కాల్పులు జరపడంతో మరో సైనికుడు మృతిచెందాడు. దీంతో రెండు రోజుల తర్వాత పాక్ సైన్యం తెల్ల జెండాతో ముందుకొచ్చింది. తెల్ల జెండా పట్టుకొని ఉంటే కాల్పులు జరపబోమని సంకేతం. ఈ జెండాతో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. మరణించిన ఇద్దరినీ పంజాబ్కు చెందిన ముస్లింలుగా భావిస్తున్నారు. జూలై 30–31న కీరన్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో దాదాపు ఏడు మంది పాక్ సైనికులు మరణించినప్పటికీ, పాక్ వారి మృతదేహాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. బహుశా వారు కశ్మీర్ నేపథ్యం ఉన్నవారుగానీ, పాకిస్తాన్లోని ఉత్తర లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన వారు అయి ఉండవచ్చని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కేవలం పంజాబీ పాకిస్తానీలు మరణిస్తేనే పాక్ ముందుకు వస్తుందని విమర్శించారు. -
తెల్ల జెండాలతో వచ్చి.. శవాలను తీసుకెళ్లారు
-
తెల్ల జెండాలతో వచ్చి.. శవాలను తీసుకెళ్లారు
శ్రీనగర్: సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడటం పాక్కు కొత్తేమి కాదు. జమ్మూకశ్మీర్ విభజన తర్వాత పాక్ మరింత చెలరేగిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చాలా సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. అందుకు తగ్గట్టుగానే భారీ మూల్యం చెల్లించుకుంటున్నప్పటికి తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 9,10 తేదీల్లో పీఓకేలోని హాజీపూర్ సెక్టార్ వద్ద పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. అయితే ఈ దాడులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారు. వీరి శవాలను తీసుకెళ్లేందుకు పాక్ సైన్యం ప్రయత్నించినప్పటికి కుదరలేదు. దాంతో చేసేదేంలేక ఈ నెల 13న కాల్పులకు స్వస్థి పలికి.. తెల్ల జెండాలు చూపుతూ వచ్చి తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. తెల్ల జెండాలతో రావడంతో మృతదేహాలను తీసుకెళ్లడానికి భారత సైన్యం అంగీకరించింది. -
కశ్మీర్లో హింసకు రహస్య కోడ్
న్యూఢిల్లీ: కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు పాక్ సైన్యం, ఉగ్రసంస్థల అధినేతలు తమ అనుచరులకు కోడ్ భాషలో రహస్య సందేశాలను పంపుతున్నట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఇందుకోసం పలు ఎఫ్ఎం ట్రాన్స్మిషన్ స్టేషన్లను ఎల్వోసీ సమీపానికి పాకిస్తాన్ తరలించించినట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కశ్మీర్లో దాడులు చేయాలంటూ ఈ కేంద్రాల ద్వారా స్థానిక ఉగ్రవాదులకు సందేశాలు పంపిస్తున్నారని వెల్లడించారు. సంప్రదింపుల కోసం ఉగ్రసంస్థలు జైషే మొహమ్మద్(68/69), లష్కరే తోయిబా(ఏ3), అల్ బద్ర్(డీ9) సంకేతాలను వాడుతున్నాయని చెప్పారు. సైన్యం, ఉగ్రసంస్థలు పాకిస్తాన్ జాతీయ గీతమైన ‘క్వామీ తరానా’ ద్వారా సందేశాలు పంపుతున్నాయని నిఘావర్గాలు గుర్తించాయి. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని గత నెల 5న రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజుల్లోనే ఎల్వోసీ వెంట ఈ తరహా సందేశాలు పెరిగిపోయాయి. ఇందుకోసం దాయాది దేశం ఎల్వోసీతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో వెరీ హైఫ్రీక్వెన్సీ రేడియో స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు నిఘా సంస్థలు తెలిపాయి. -
పీఓకేలో పాక్ శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం
న్యూఢిల్లీ : సరిహద్దుల్లో కవ్వింపు చర్యలతో పాటు భారత్లో ఉగ్రదాడులకు ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ కుయుక్తులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్లను, పాక్ శిబిరాలను సోమవారం భారత సైన్యం ధ్వంసం చేసింది. పాక్ సైనిక శిబిరాలకు చేరువగా ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ను నిర్వీర్యం చేసింది. లీపావ్యాలీలోని ఉగ్ర శిబిరాలను భారత సేనలు ధ్వంసం చేశాయి.పాకిస్తాన్ సేనలు భారత్లోకి ఉగ్రవాదులను చొప్పించేందుకు ఈ శిబిరాలను వాడుతున్నాయి. పాక్ సేనల సహకారంతో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజహిదిన్, లష్కరీ తోయిబా వంటి పలు ఉగ్రవాద సంస్ధలు ఈ ప్రాంతంలో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశాయి. ఈ శిబిరాల్లో ఉగ్రవాదులకు భారత్లో ఉగ్ర దాడులతో పాటు భారత సైన్యం కన్నుగప్పి చొరబాట్లకు ఎలా పాల్పడవచ్చనే అంశాలపై తర్ఫీదు ఇస్తారు. -
గత15 రోజుల్లో 10 మంది పాకిస్తాన్ కమాండోలు హతం
జమ్మూకశ్మీర్ : జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు తర్వాత పాకిస్తాన్ సైన్యానికి భారత సైన్యం గట్టి సమాధానం ఇచ్చింది. ఏదో ఒక చోట కవ్వింపులకు పాల్పడుతూ భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 10 మంది పాకిస్తాన్ ఆర్మీ కమాండోలను హతమార్చింది. ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైన్యం సహకారంతో భారత్కి చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య పలు సార్లు కాల్పులు జరిగాయి. ఈనేపథ్యంలోనే ఆగస్టు 5 నుండి నేటి వరకు పదిమంది పాకిస్తాన్ కమాండోలను హతం చేసినట్టు భారత భద్రతా దళాలు వెల్లడించాయి. గత మూడు వారాలుగా పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోకి చోరబడటానికి ప్రయత్నిస్తోందని, పాకిస్తాన్ ఉగ్రవాదులను వెనక్కి పంపే ప్రయత్నంలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పులలో పది మందికి పైగా ఎస్ఎస్జీ కమాండోలు మరణించినట్లు భద్రతా దళ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ఘటనను పాకిస్తాన్ ఆర్మీ అంతర్జాతీయం చేయాలని చుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే గత 15 రోజులుగా పాకిస్తాన్ ఆర్మీ వందమందికి పైగా కమాండోలను నియంత్రణ రేఖ వద్ద కాపలా ఉంచి భారత దళాలపై బ్యాట్ చర్యకు ప్రతిపాదించినట్లు తెలిపారు. పాకిస్తాన్ సైన్యాన్ని, ఉగ్రవాదులు చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి నియంత్రరేఖ వద్ద భారత ఆర్మీ దళాలు హై అలర్ట్ను ప్రకటించాయి. -
సరిహద్దుల్లో బరితెగించిన పాక్
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేని పాకిస్తాన్ కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తోంది. వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తన వక్రబుద్ధిని నిరూపించుకుంది. సరిహద్దు వెంబడి మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్ము కశ్మీర్లోని రాజౌరీ జిల్లా సుందర్బానీ ప్రాంతంలో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో కాల్పుల విరమణ ఉల్లంఘానికి తూట్లు పొడుస్తూ పాక్ సైన్యాలు భారీ షెల్స్ను ప్రయోగిస్తూ కాల్పులు జరిపాయి. దీన్ని భారత సైన్యం భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో కాల్పులను ఆపివేశారు. ఈ దాడిలో భారత జవానుకు బుల్లెట్ తగిలి గాయాలపాలయ్యాడు. -
కశ్మీర్పై ఐసీజేకి వెళ్తాం: పాక్
ఇస్లామాబాద్/జమ్మూ/శ్రీశ్రీనగర్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పాక్ తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విదేశాంగ మంత్రి ఖురేషి తెలిపారు. కశ్మీర్ అంశాన్ని అన్ని అంతర్జాతీయ వేదికలపైనా ప్రస్తావించడంతో పాటు, ఐసీజేలోనూ పిటిషన్ వేస్తామని ఆగస్టు 6వ తేదీన జరిగిన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని ఇమ్రాన్ ఇటీవల చెప్పారు. పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ బలగాలు మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. పూంచ్ జిల్లాలో జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను మరణించగా, నలుగురు పౌరులు గాయపడ్డారు. భారత బలగాలు జరిపిన కాల్పుల్లో పాక్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. సరిహద్దు వెంబడి కృష్ణా ఘటి, మెందర్ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పాకిస్తాన్ బలగాలు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో బిహార్కు చెందిన రవిరంజన్ సింగ్ (36) మరణించగా నలుగురు పౌరులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కాగా, బాలాకోట్ దాడుల సమయంలో పాక్ విమానాలను మిగ్–21తో ఎంతో ధైర్యంగా తరుముకుంటూ వెళ్లిన ఐఏఎఫ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను చిత్రహింసలు పెట్టిన పాక్ కమాండో అహ్మద్ ఖాన్.. భారత సైన్యం కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. ఆగస్టు 17వ తేదీన భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుం డగా నక్యాల్ సెక్టార్లో సైన్యం జరిపిన కాల్పుల్లో అహ్మద్ ఖాన్ మరణించినట్లు సమాచారం. మిగ్ 21 జెట్ విమానాన్ని కూల్చేయడంతో తప్పించుకున్న అభినందన్ను పాక్ సైన్యం పట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, జమ్మూ కశ్మీర్లో క్రమంగా ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. దాదాపు 15 రోజుల తర్వాత మంగళవారం శ్రీనగర్లో వాణిజ్య కేంద్రం లాల్ చౌక్ వద్ద బారికేడ్లను పోలీసులు తొలగించారు. పలు ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు. శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపు కొనసాగుతోంది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. కశ్మీర్లోకి ప్రవేశించేందుకు యత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ను జమ్మూ ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకుని తిరిగి ఢిల్లీకి పంపేశారు. -
పాక్కు భారత ఆర్మీ సూచన..
న్యూఢిల్లీ : భారత్లో చొరబాటుకు యత్నించిన పాక్ సైన్యం ప్రయతాల్ని భారత ఆర్మీ సమర్దవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. నియంత్రణ రేఖ వెంబడి జరిగిన కాల్పుల్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీమ్(బీఏటీ) సభ్యులతో పాటు ఉగ్రవాదులు కూడా మృతిచెందారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్న వారి మృతదేహాలు అక్కడే పడివున్నాయి. పాక్ నుంచి చొరబాటు యత్నాలు ఎక్కువ కావడంతో భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి గస్తీని భారీగా పెంచింది. పాక్ సైన్యం నియంత్రణ రేఖ వైపు నిత్యం షెల్స్ ప్రయోగించడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. నియంత్రణ రేఖ వద్ద చనిపోయినవారి మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా పాక్ను కోరింది. ఇందుకోసం ఎటువంటి హింసకు పాల్పడకుండా తెల్లజెండాలు చూపించి భారత భూభాగం వైపు రావాలని సూచించింది. అయితే భారత సూచనపై ఇప్పటివరకు పాక్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాగా, జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. వీరిలో నలుగురు పాక్ సైనికులతో పాటు, ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు కశ్మీర్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అమర్నాథ యాత్రికులను, సందర్శకులను తమ స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చదవండి : పాక్ ‘బ్యాట్’ సైనికుల హతం -
పాక్ ‘బ్యాట్’ సైనికుల హతం
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి భారత్ సైనిక పోస్టులపైకి దాడికి దిగి, చొరబడేందుకు పాక్ సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ)లోని ఐదు నుంచి ఏడుగురు మృతి చెందారని సైన్యం తెలిపింది. జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని సైన్యం అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. వీరిలో పాక్ కమాండోలతోపాటు ఉగ్రవాదులు కూడా ఉన్నారన్నారు. ఈ ఘటన అనంతరం పాక్ భారీగా సైన్యాన్ని మోహరించిందన్నారు. కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణాన్ని, అమర్నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు పాక్ బలగాలు గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేశాయని, అప్రమత్తమైన సైన్యం దీటుగా బదులిచ్చిందని కల్నల్ కాలియా చెప్పారు. అదేవిధంగా, శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో జైషే మొహమ్మద్కు చెందిన నలుగురు కరుడు గట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు. వారి నుంచి పాక్లో తయారైన స్నైపర్ రైఫిల్, ఐఈడీ మందుపాతరను స్వాధీనం చేసుకున్నామన్నా రు. బీఏటీలో సాధారణంగా పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్తోపాటు ఉగ్రవాదులు ఉంటారని ఆయన వివరించారు. నలుగురు జైషే ఉగ్రవాదుల హతం జమ్మూకశ్మీర్లోని బారాముల్లా, షోపియాన్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు జైషే మొహమ్మద్ (జేఎం) ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత 36 గంటల్లో ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమవ్వగా, మరో ఇద్దరు దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఆపరేషన్లో హతమైనట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. బారాముల్లా జిల్లా సోపోర్లోని వార్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా లభించిన సమాచారం మేరకు భద్రతా దళాలు శనివారం ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. వారిలో ఒకరు బండిపోరాకు చెందిన ఉమర్ షాబాజ్గా గుర్తించారు. మరొకరి గుర్తింపు లభించలేదు. ఘటనా స్థలంనుంచి మందుగుండు సామగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, షోపియాన్లోని పండూషన్ ప్రాంతంలో శుక్రవారం ప్రారంభమైన మరో ఆపరేషన్లో జైషే ఉగ్రవాదులు మంజూర్ భట్, జీనత్ ఇస్లాం నైకూలు హతమయ్యారని ఆ అధికారి తెలిపారు. నైకూ పాకిస్తాన్ జాతీయుడని, జైషే మహమ్మద్ జిల్లా కమాండర్గా వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు. -
జనావాసాల్లో కూలిన విమానం.. 17 మంది మృతి
రావల్పిండి : పాకిస్తాన్ ఆర్మీకి చెందిన విమానం కూప్పకూలిన ఘటనలో 17 మంది మృతిచెందారు. మంగళవారం తెల్లవారు జామున రావల్పిండిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా పాక్ అధికారులు తెలిపారు. మృతుల్లో 5 గురు విమాన సిబ్బంది కాగా, 12 మంది పౌరులు ఉన్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 12 మందిని దగ్గర్లోని అధికారులు ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ఈ విమానాన్ని పాక్ ఆర్మీ ట్రైనింగ్ కోసం వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. విమానం కుప్పకూలడంతో ఆ చుట్టపక్కల పలు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ప్రమాదం జరిగిన చోటుకి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. -
బడ్జెట్కు పాక్ ఆర్మీ స్వచ్ఛంద కోత
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు మద్దతిస్తూ పాక్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్కు కేటాయించే నిధులను స్వచ్ఛందంగా తగ్గిస్తున్నట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) డీజీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చెప్పారు. ‘దేశ భద్రత, రక్షణ విషయాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోం. అన్ని ప్రమాదాల నుంచి దేశాన్ని రక్షించాలి. ముప్పులను దీటుగా ఎదుర్కొగలిగేలా సామర్థ్యాన్ని కొనసాగించాలి. బడ్జెట్లో కోత వల్ల కలిగే ఇబ్బందులను త్రివిధ దళాలు తగిన అంతర్గత చర్యల ద్వారా సర్దుబాటు చేసుకుంటాయి. దేశంలోని గిరిజన ప్రాంతాలు, బలూచిస్థాన్ అభివృద్ధిలో పాలుపంచుకోవడమే మాకు ముఖ్యం’ అని ఆసిఫ్ అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ నిర్ణయాన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. పలు భద్రతా సవాళ్లు ఉన్నప్పటికీ దేశం కోసం వారు ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. -
బడ్జెట్పై పాక్ ఆర్మీ అనుహ్య నిర్ణయం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఆర్మీ అనుహ్య నిర్ణయం తీసుకుంది. తమకు కేటాయించే రక్షణ బడ్జెట్ను తగ్గించుకుంటున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించింది. దేశంలోని ఆర్థిక సంక్షోభాన్ని ఎదురుకోవడానికి పాక్ ప్రభుత్వం చేపట్టిన పొదుపు చర్యల్లో పాలుపంచుకోవడం కోసమే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మంగళవారం ట్విటర్లో ఒక సందేశాన్ని ఉంచారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను డిఫెన్స్ బడ్జెట్ తగించుకుంటున్నట్టు తెలిపారు. అయితే దేశ రక్షణ, భద్రత అంశాల్లో రాజీ పడే సమస్యే లేదన్నారు. బడ్జెట్లో కోత వల్ల కలిగే ఇబ్బందులను అంతర్గంతంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. గిరిజన ప్రాంతాలు, బెలూచిస్తాన్ అభివృద్ధిలో భాగం కావడం చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. మరోవైపు పాక్ మిలటరీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మిలటరీ స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. భద్రత పరంగా పాక్ అనేక సవాళ్లను ఎదురుకుంటున్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయని అన్నారు. ఈ నిధులను గిరిజన ప్రాంతాలు, బెలూచిస్తాన్ అభివృద్ధి కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు. గతేడాది పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్.. పొదుపు మంత్రం జపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని అధికారిక నివాసాన్ని కాదనుకొని త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. -
‘పాక్ సైన్యానికి.. స్థానికులకు హానీ జరగలేదు’
న్యూఢిల్లీ : బాలాకోట్ దాడి వల్ల పాక్ సైన్యానికి.. స్థానికులకు ఎలాంటి హాని జరగలేదని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దాడి వల్ల మాకు చిన్న గాయం కూడా కాలేదని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ మహిళా కార్యకర్తలతో సమావేశమైన సుష్మా స్వరాజ్ ఈ సందర్భంగా బాలాకోట్ దాడిలో పాకిస్తాన్ సైన్యానికి గానీ, స్థానికులకు గానీ ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. ‘భద్రతా బలగాలను కేవలం జైషే ఉగ్ర స్థావరాల మీద దాడి చేయడానికి మాత్రమే అనుమతించారు. ఎందుకంటే పుల్వామా దాడికి పాల్పడింది జైషే ఉగ్రవాదులు కాబట్టి.. వారి స్థావరాలను నాశనం చేయాలని ఆదేశించారు. దాని ప్రకారమే మన బలగాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వెనుతిరిగాయ’ని ఆమె పేర్కొన్నారు. అంతేకాక మనపై శత్రువులు దాడి చేస్తే మనం కూడా ప్రతి దాడి చేసి ఆత్మరక్షణ చేసుకోగలమని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ దాడులకు పాల్పడ్డాం అని వివరించారు. ఈ దాడులను ప్రపంచ దేశాలు కూడా సమర్థించాయని పేర్కొన్నారు. -
పాక్ పాటను కాపీ కొట్టిన బేజీపీ ఎమ్మెల్యే రాజా సింగ్
-
పాక్ పాటను కాపీ కొట్టిన ఎమ్మెల్యే
సాక్షి, న్యూఢిల్లీ : భారత సైన్యానికి నివాళిగా శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీన ఓ పాటను విడుదల చేస్తున్నానని తెలంగాణ బేజీపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్విట్టర్ సాక్షిగా శుక్రవారం నాడు గొప్పగా ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన స్వయంగా పాడిన పాటను రిలీజ్ చేశారు. అయితే ఆశించినట్లుగా ప్రశంసల జల్లు కురవకుండా, ముఖ్యంగా సోషల్ మీడియాలో విమర్శల జడివానా మొదలయింది. ఆ తిట్ల పరంపర ఒక్క భారతీయుల నుంచే కాకుండా సరిహద్దుకు ఆవల ఉన్న పాకిస్థాన్ ప్రజల నుంచి కూడా హోరెత్తుతోంది. అందుకు కారణం పాకిస్థాన్ మిలటరీ మీడియా (ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) పాకిస్థాన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 23వ తేదీన విడుదల చేసిన వీడియో సాంగ్న మక్కీకి మక్కీ కాపీ కొట్టడమే కారణం. కాకపోతే ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని ఉన్న చోటల్లా ‘హిందుస్థాన్ జిందాబాద్’ అని మార్చారు. పాకిస్థాన్ పాటను సాహిర్ అలీ బగ్గా చాలా హద్యంగా పాడగా, మన చౌకీదార్ రాజాసింగ్ తన శక్తిమేరకు పాడారు. రాజాసింగ్ పాట్పై పాకిస్థాన్ మిలటరీ మీడియా డైరెక్టర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘పాటను కాపీ కొట్టావ్, బాగుంది! అలాగే నిజం మాట్లాడడాన్ని కూడా కాపీ కొడితే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. గత ఫిబ్రవరి నెలలో పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశామని భారత్ చెబుతుండగా, అది అబద్ధమని భారత్ విమానాన్ని తాము కూల్చడం వల్లనే భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తమకు చిక్కారని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అభినందన్ చిక్కడం ఎంత నిజమో, ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చడం అంతే నిజమని భారత్ వాదిస్తోంది. యుద్ధ విమానాన్ని కూల్చడం అబద్ధమని పాక్ ఇప్పటికీ ఖండిస్తోంది. ఇదే విషయమై నిజం చెప్పడం కాపీ కొట్టండంటూ గఫూర్ వ్యాఖ్యానించారు. రాజాసింగ్, పాక్ పాటను కాపీ కొట్టలేదని, దొంగిలించారని, ఆయనప్పటికీ ఆయన పాటలో వచనం అంత బాగా లేదని పాకిస్థాన్ జర్నలిస్ట్ హమీద్ మీర్ చమత్కరించారు. ఇది భారత సైన్యానికి నివాళి అర్పించడం కాదని, అవమానించడమని పలువురు సోషల్ నెటిజెన్లు విమర్శిస్తున్నారు. -
రాజాసింగ్ మా సాంగ్ కాపీ కొట్టారు : పాక్ ఆర్మీ
సాక్షి, హైదరాబాద్ : ‘హిందుస్తాన్ జిందాబాద్.. దిల్కీ అవాజ్.. హర్ దిల్కీ అవాజ్..’ పాటను గోషామహల్ ఎమ్మెల్యే, శ్రీరామ్ యువసేన భాగ్యనగర్ అధ్యక్షుడు టి.రాజాసింగ్ లోథా విడుదల చేసిన విషయం తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా ఈ పాటను తన అధికారిక ట్విటర్లో రాజాసింగ్ షేర్ చేశారు. ఈ పాటను భారత సైనికులకు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ పాటను రాజాసింగ్ కాపీ కొట్టారని పాక్ ఆర్మీ ఆరోపించింది. మార్చి 23 పాకిస్తాన్ డే సందర్భంగా తాము రూపొందించిన ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాటకు కాపీనని పేర్కొంది. ఈ పాటను సహిర్ అలీ బగ్గా రాసారని తెలిపింది. ఈ పాటను కాపీ చేసినందుకు సంతోషంగా ఉందని, కానీ కాపీకి సంబంధించిన నిజాలు కూడా వెల్లడించాలి కదా! అని పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు రాజాసింగ్ పాడిన సాంగ్ను కూడా జతచేశారు. రాజా సింగ్.. ‘పాకిస్తాన్ జిందాబాద్ ’ పాటను ‘హిందూస్తాన్ జిందాబాద్ ’ గా మార్చి భారత సైన్యానికి అంకితమిచ్చారని పాక్ స్థానిక మీడియా పేర్కొంది. Glad that you copied. But copy to speak the truth as well. #PakistanZindabad https://t.co/lVPgRbcynQ — Asif Ghafoor (@peaceforchange) 14 April 2019 -
యుద్ధం కాదు పరిష్కారం
ప్రతి చర్యకూ ప్రతిచర్య (రియాక్షన్) ఉంటుందని పాకిస్తాన్కూ, ఆ దేశాన్ని స్థావరంగా ఉపయోగించుకొని, ఆ దేశ సైనిక వ్యవస్థ ప్రోత్సాహంతో కశ్మీర్లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాద మూకలకూ స్పష్టం చేయడంలో భారత ప్రభుత్వం సఫలమయింది. 2016లో ఉడీ సైనిక స్థావరంపైన ఉగ్రవాదుల దాడికి ప్రతిగా భారత సైన్యం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేసింది. పక్షం రోజుల కిందట పుల్వామాలో అదిల్ అహ్మద్ దార్ అనే ఇరవై సంవత్సరాల కశ్మీరీ యువకుడు మానవబాంబుగా మారి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్) ప్రయాణిస్తున్న ట్రక్కుల శ్రేణిపై దాడి చేసి తాను పేలిపోయి 40 మంది జవాన్ల మరణానికి కారకుడైనాడు. ఈ దాడి తమ సంస్థ పనేనంటూ జైషే హంతకముఠా నాయకుడు మసూద్ అజహర్ ప్రకటించాడు. ఇందుకు ప్రతీకా రంగా భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు సరి హద్దు దాటి పాక్ భూభాగంలో ప్రవేశించి జైషే ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసి సుమారు 300 మంది ఉగ్రవాదులనూ, వారి శిక్షకులనూ, కమాండర్లనూ మట్టుబెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇందుకు సమాధానంగా పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాలతో భారత సైనిక స్థావరాలపైన దాడులు చేయడానికి రాగా వాటిని భారత్ మిగ్ యుద్ధవిమానాలతో ఎదుర్కొని వెనక్కు పంపింది. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన ఒక ఎఫ్–16 విమానాన్ని మన యుద్ధవిమానాలు కూల్చివేయగా, మన మిగ్ విమానాన్ని పాకిస్తాన్ యుద్ధవిమానాలు పడగొ ట్టాయి.భారత యోధుడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కూలుతున్న మిగ్ విమానం నుంచి పారాచ్యూట్ సాయంతో కిందికి దిగి పాక్ సైనికులకు బందీగా చిక్కాడు. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను యుద్ధఖైదీగా పరి గణించి గౌరవంగా చూడాలనీ, భారత్కు అప్పగించా లనీ నరేంద్రమోదీ ప్రభు త్వం డిమాండ్ చేసింది. శాంతికోసం అభినందన్ను భారత్కు అప్పగిస్తానంటూ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటులో ప్రకటన చేశారు. శుక్రవారం రాత్రి అభినందన్ భారత్ గడ్డపైన భద్రంగా అడు గుపెట్టాడు. ఇంతవరకూ జరిగిన పరిణామాలు క్లుప్తంగా ఇవి. యుద్ధమేఘాలు సరిహద్దుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పరస్పరం కాల్పులు జరుపు కుంటూనే ఉన్నారు. కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగలేదు. అందుకు భారత్, పాకిస్తాన్ ప్రజలే కాకుండా దక్షిణాసియా ప్రజలూ, అంతర్జాతీయ సమాజం కూడా సంతోషించాలి. పక్షం రోజులుగా భారత్, పాకిస్తాన్ల మధ్య సంభవి స్తున్న పరిణామాలు అసాధారణమైనవి. ప్రమాదకరమైనవి. ఆందోళనకరమై నవి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ప్రత్యక్షంగా యుద్ధవిమాన దాడులు జరగడం ఇదే ప్రథమం. 1971 తర్వాత భారత్, పాక్ యుద్ధవిమానాలు తలబడి పూర్తి స్థాయి సంప్రదాయ యుద్ధ ప్రమాదాన్ని భారతీయుల, పాకిస్తానీల గడప వరకూ తీసుకురావడం కూడా ఇదే మొదటిసారి. 1999లో కార్గిల్లో తిష్టవేసిన పాకిస్తాన్ సైనికులను వెనక్కు పంపేందుకు భారత యుద్ధం చేయవలసి వచ్చింది. అది పరిమితమైన లక్ష్యంకోసం జరిగిన పోరాటం. 2008లో ముంబైపై ఉగ్రవాదులు దాడి చేసినా, అంతకు ముందు 2001లో మన పార్లమెంటు భవనంపైన ఉగ్ర పంజా విసిరినా హెచ్చరికలకూ, దౌత్య చర్యలకే భారత ప్రతిస్పందన పరి మితమైనది కానీ ప్రతీకార దాడులు చేయలేదు. 1999లో సరిహద్దు పొడవునా సైన్యాన్ని మోహరించారు కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగలేదు. ‘మా జోలికి వస్తే ఊరుకోం. ప్రతీకారం తీర్చుకుంటాం,’ అని భారత్ కార్యాచరణ రూపంలో స్పష్టం చేసింది మోదీ హయాంలోనే. దీని ఫలితం ఆశించినట్టు ఉన్నదా? ఉగ్రవాదులు వెనుకంజ వేశారా? పాకిస్తాన్ జంకుతున్న లక్షణాలు కనిపి స్తున్నాయా? ఉగ్రవాదులను అరికట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నిం చిన దాఖలాలు ఉన్నాయా? నాలుగు ప్రశ్నలకూ లేదనే జవాబు. నెహ్రూ నుంచి మన్మోహన్సింగ్ దాకా ప్రధానులందరూ కశ్మీర్ అంతర్గత వ్యవహారమనీ, పాకిస్తాన్తో భారత్ ముఖాముఖి చర్చించి పరిష్కరించుకుం టుందనీ, మూడో పక్షం జోక్యాన్ని ఆమో దించబోమనీ కరాఖండిగా చెబుతూ వచ్చారు. సిమ్లాలో ఇందిరాగాంధీ, భుట్టోల మధ్య కుదిరిన ఒప్పందం కూడా అదే. మెరుపుదాడుల వల్లా, యుద్ధవిమానాల ప్రయోగం వల్లా ఏమి జరిగింది? ప్రపంచంలోని అన్ని దేశాలూ శాంతి, శాంతి అంటున్నాయి. నిగ్రహం పాటించాలని కోరుతున్నాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం జరిగే వాతావరణం కనిపిస్తే స్పందించవ లసిన అగత్యం, హక్కు అన్ని దేశాలకూ ఉంటుంది. ఇప్పుడు కశ్మీర్ అంతర్జా తీయ సమస్యగా మారింది. పాకిస్తాన్కు దౌత్యపరమైన మద్దతు తగ్గింది. ఉగ్ర వాదానికి పాకిస్తాన్ బలమైన స్థావరంగా మారిందనే అభిప్రాయం చైనాతో సహా అన్ని ప్రపంచ దేశాలలో బలంగా నాటుకున్నది. ఈ ఉగ్రవాదంతో నష్టపోతున్నది భారత్ ఒక్కటే కాదు. ఇరాన్పైనా తాలిబాన్ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అఫ్ఘానిస్తాన్ సంగతి సరేసరి. ఆ దేశం మూడు దశాబ్దాలుగా తాలిబన్ దాడులతో, అగ్రరాజ్యాల సైనిక జోక్యంతో, ఆక్రమణలతో, పాకిస్తాన్ ప్రమేయంతో సత మతం అవుతోంది. దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం వల్ల భారత్కు ప్రయో జనం ఏమిటి? చైనా అండదండలు ఉన్నంత వరకూ పాకిస్తాన్ దారికి వస్తుందా? అభినందన్ను భారత్కు పంపుతానని ప్రకటించడం ద్వారా ఇమ్రాన్ఖాన్ హుందాగా ప్రవర్తిం చినట్టు కనిపించారు. సైన్యాధికారుల ఆమోదంతోనే... సైన్యం ఆమోదం లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే భుట్టో, నవాజ్షరీఫ్లకు పట్టినే గతే తనకూ పడుతుందని ఇమ్రాన్కు తెలుసు. సైన్యా ధికారులు సైతం జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని నిర్ణయించి ఉంటారు. చిన్న పొరబాటు జరిగితే ఎంతటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయో ఊహిం చుకోవాలని నరేంద్రమోదీకి ఇమ్రాన్ చేసిన సూచన కొట్టిపారవేయదగినది కాదు. పరిమిత దాడులైతే నష్టం కూడా పరిమితమే. సంప్రదాయరీతిలో యుద్ధా నికి రెండు దేశాలూ సిద్ధంగా లేవు. యుద్ధమంటూ జరిగితే మారణహోమం అనివార్యం. అది అణ్వస్త్రయుద్ధానికి దారితీస్తే ప్రళయమే. అందుకే అంతర్జాతీయ సమాజం దీన్ని రెండు దేశాల మధ్య వివాదంగా పరిగణించి చేతులు కట్టుకొని కూర్చోజాలదు. రెండు దేశాల అధినేతలకూ ప్రపంచ దేశాధినేతలు సుద్దులు చెబుతారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోమంటారు. ఒక్క అభినందన్ పాకిస్తాన్ సైనికుల చేత చిక్కితేనే దేశం యావత్తూ ఊపిరి బిగపట్టి అతని విడుదల కోసం నిరీక్షించింది. చైనాతో, పాకిస్తాన్తో జరిగిన యుద్ధాలలో అనేక మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా నాలుగు వందల టీవీ చానళ్ళు ఇటువంటి వివరాలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తే అధికార పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. పరిమిత చర్యలే అయినప్పటికీ ఎన్నికల సమయంలో వచ్చిన అవకాశాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్ని స్తున్నాయి. దేశంలో ఇప్పుడున్న వాతావరణం అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి అనుకూలం. ఉద్రిక్తలను సొమ్ము చేసుకునే ప్రయత్నం ఎన్డీఏ నిస్సంకోచంగా చేస్తున్నది. ఇందులో నరేంద్రమోదీ సిద్ధ హస్తుడు. అధి కారపార్టీకి ఆ ప్రయోజనం దక్కకుండా ఎట్లా నివారించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తదితరులు ఆలోచిస్తున్నారు. బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకోసం దేశాన్ని బలహీన పరచవద్దనీ, సైనికులను అవమానించవద్దనీ ప్రతిపక్షాలకు మోదీ విజ్ఞప్తి చేశారు. జైట్లీ సమరోత్సాహం అమెరికా అధ్యక్షుడుగా ఒబామా ఉండగా అమెరికా కమాండోలు పాకిస్తాన్లో రహస్యంగా జీవిస్తున్న అల్ కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ను హత మార్చినట్టు మన సేనలు కూడా పాకిస్తాన్లో నివసిస్తున్న మసూర్ అజహర్ని అంతం చేయాలని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అన్నారు. ఇది ‘పైలట్ ప్రాజెక్టు’ మాత్రమేనని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మెరుపు దాడులైనా, పరిమి తమైన యుద్ధవిమానాల ప్రయోగమైనా దేశ ప్రజల ఆవేశాలను తగ్గించడానికీ, ప్రభుత్వం పట్ల, సైన్యం పట్ల విశ్వాసం నిలుపుకోవడానికీ పనికివస్తాయి కానీ అసలు సమస్య పరిష్కారం కాదు. శాశ్వత శాంతి నెలకొనదు. అసలు సమస్య ఏమిటి? కశ్మీర్లోయలో అశాంతి. ఎన్ని వేల కోట్ల రూపాయలు లోయలో కుమ్మరించినా, ఎన్ని లక్షలమంది సైనికులను మోహరిం చినా, ఎంతమంది ఉగ్రవాదులూ, సాధారణ పౌరులూ, సాయుధబలగాలూ ప్రాణాలు కోల్పోయినా సమస్య క్రమంగా జటిలం అవుతున్నదే కానీ సమసి పోవడం లేదు. కశ్మీర్ సమస్య స్వభావం అటువంటిది. 1990 నుంచి ఇప్పటి వరకూ కశ్మీర్లో 70 వేలమంది పౌరులూ, పోలీసు ఉద్యోగులూ, ఉగ్రవాదులూ మరణించి ఉంటారు. పెల్లెట్ గన్ గాయాలతో అంధులైనవారూ, కాల్పులలో వికలాంగులైనవారూ వేలమంది ఉంటారు. కశ్మీర్ ప్రజల మనోభావాలు ఏమిటో పాకిస్తాన్కు పట్టించుకోదు. భారత్కూడా కశ్మీర్ను కాపాడుకోవాలనే ఆరాటంలో కశ్మీరీల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేయవలసినంత చేయడం లేదు. సాయుధ బలగాలతో కశ్మీర్ సమస్య పరిష్కారం కాదని అందరికీ తెలుసు. ఎట్లా పరిష్కరించాలో తెలియక ఆ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. కశ్మీర్ ప్రజల దృష్టికోణం నుంచి చూసి వారి సమస్యను గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ ఆ సాహసం ఎవరు చేయగలరు? కశ్మీర్ లోయలో అత్యధికులు కోరుకుంటున్న ఆజాదీ వారికి అందని ద్రాక్ష. వారి అభీష్ఠాన్ని మన్నించే వాతావరణం దేశంలో లేదు. వీలైనంత మేరకు స్వతంత్ర నిర్ణయాధికారాలు కల్పించడం ఆచరణ సాధ్యౖ మెన విధానం. అందుకే రాజ్యాంగంలో 370వ అధికరణను చేర్చింది. కశ్మీరీలు ప్రశాంతంగా భారతపౌరులుగా జీవించాలంటే వేర్పాటువాదానికి స్వస్తి చెప్పాలి. అది జరగాలంటే భారత ప్రజలు కశ్మీరీల హృదయాలు గెలుచుకోవాలి. అందుకు రాజకీయ పార్టీలకూ, ప్రభుత్వాలకీ అతీతంగా సమగ్రమైన కార్యక్రమం నిరంత రాయంగా అమలు జరగాలి. వాజపేయి చెప్పినట్టు జమ్రూ హియత్ (ప్రజాస్వా మ్యం), కశ్మీరియత్(కశ్మీర్ సంస్కృతి), ఇన్సానియత్(మానవత్వం) అనే మూడు మూల సూత్రాలు ప్రాతిపదికగా నూతన కశ్మీర్ విధాన రూపకల్పన జరగాలి. కశ్మీర్వైపు తేరిపార చూడకుండా పాకిస్తాన్ను శాసించే స్థితికి భారత్ చేరుకోవాలి. బంగ్లాదేశ్ ఆవిర్భవించి తూర్పు పాకిస్తాన్ అంతర్థానం కావడంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన పాకిస్తాన్ పాలకవర్గం భారత్ నుంచి కశ్మీర్ను వేరు చే సేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. సంప్రదాయ యుద్ధంలో భారత్ను ఓడిం చడం అసాధ్యం కనుక పరోక్షంగా జిహాదీ శక్తులకు అండదండలు సమకూర్చి కశ్మీర్ని రావణకాష్టం చేయాలన్నది జనరల్ జియా–ఉల్–హక్ సంకల్పం. అం తకు ముందు జుల్ఫికర్ అలీభుట్టో సైతం భారత్పైన వేయి సంవత్సరాల యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. భారతదేశానికి వేయి గాయాలు చేసి రక్తం పారించాలని ప్రతిన పూనారు. పాకిస్తాన్ ప్రజలకు భారత్పట్ల ద్వేషాన్ని నూరిపోశారు. ఉగ్రవాదులలో మంచి ఉగ్రవాదులూ, చెడు ఉగ్రవా దులూ అంటూ జనరల్ ముషార్రఫ్ విభజించారు. కశ్మీర్లో రక్తపాతం సృష్టించే జిహాదీలను మంచి ఉగ్రవాదులుగా పరిగణించి వారికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వాలూ, సైన్యం అందిస్తున్నాయి. పాకిస్తాన్ బుద్ధి మారదు. ప్రజలు ఎన్నుకున్న ప్రధానులు భారత్తో శాంతికోసం ప్రయత్నించినా పాకిస్తాన్ సైన్యాధిపతులు సహకరించరు. ఎన్నికైనవారిని గద్దె దింపి తామే పగ్గాలు చేపడతారు. భారత్తో వైరంలో వారి ప్రయోజనాలు ఉన్నాయి. కశ్మీర్లో చిచ్చు ఆరకుండా రగిలించాలనే దుర్మార్గపు విధానం వల్ల పాకిస్తాన్ బావుకున్నది ఏమీ లేదు. ఉగ్రవాదుల దాడులలో పాకిస్తాన్లోనూ సుమారు 70 వేలమంది పౌరులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. మొన్న అమె రికా, నిన్న చైనా, ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆదుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితి. పాకిస్తాన్ ఉగ్రవాదులను కశ్మీర్పైన ప్రయోగించ కుండా ఉండాలంటే ఆర్థికంగా, సైనికంగా భారత్ ఇంకా ఎదగాలి. అందుకోసం శాంతిసుస్థిరతలు కావాలి. యుద్ధం వద్దు. ఇదే భారత ప్రజల అభిమతం. -కె. రామచంద్రమూర్తి -
ఆ వీడియోలే కాపాడాయి
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విషయంలో నక్కజిత్తుల మారి అయిన పాకిస్తాన్ అంత ఔదార్యంగా ఎందుకు వ్యవహరించిందన్న ప్రశ్నలు అందరి మనసులను తొలుస్తున్నాయి. అభినందన్ నడుపుతున్న మిగ్ విమానం కూలిపోయిన ప్రాంతంలో స్థానికులు ఆయనను తీవ్రంగా కొట్టడమే కాకుండా వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడమే ఆయన ప్రాణాలు కాపాడాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. సోషల్ మీడియా విస్తృతి పెరగడమే అభినందన్ను రక్షించిందని 1971 పాకిస్తాన్ యుద్ధం సమయంలో పాక్ ఆర్మీకి చిక్కి దాదాపు ఏడాది పాటు బందీగా ఉన్న ఎయిర్ కమాండర్ జేఎల్ భార్గవ అభిప్రాయపడుతున్నారు. ‘అభినందన్పై ఆ అల్లరి మూక దాడి చేసి, వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టకపోతే ఏం జరిగేదో మనం ఊహించలేం. అభినందన్ ప్రాణాలతో ఉన్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలుండేవి కావు. అభినందన్ తమ దగ్గరే లేడని పచ్చి అబద్ధాలు చెప్పే పాకిస్తాన్ బుకాయించి ఉండేది. ఇక మిగిలిన జీవితం అంతా ఆయన పాక్లోనే ఊచలు లెక్కించాల్సి వచ్చేది. అభినందన్ అదృష్టవంతుడు కాబట్టి ఆయన వీడియోలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. దెబ్బకు పాక్ దారికి వచ్చి అభినందన్ను భారత్కు అప్పగించింది’అని 77 ఏళ్ల భార్గవ పేర్కొన్నారు. 1971 పాక్ యుద్ధం సమయంలో ఆ దేశానికి పట్టుబడ్డ 12 మంది భారత పైలట్లలో భార్గవ ఒకరు. హరియాణాలోని పంచ్కులలో ఆయన విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఒకప్పుడు తనకు ఎదురైన అనుభవాల్ని ఆయన పంచుకున్నారు. అల్లరి మూకలతో ఎప్పుడూ ప్రమాదమే పాకిస్తాన్లో పనీపాట లేకుండా భారత్పై ద్వేషభావంతో రగిలిపోయే అల్లరిమూకలతో ఎప్పుడూ ప్రమాదమే. అభినందన్ వారి బారిన పడినా ప్రాణాలతో బయటపడటానికి అక్కడి ఆర్మీయే కారణం. ఆర్మీ అప్పుడు రాకపోయింటే అభినందన్ పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది. 1965 యుద్ధం సమయంలో కూడా లెఫ్టినెంట్ హుస్సేన్ ఇలాగే పాక్లో అల్లరి మూకలకు చిక్కారు. వాళ్లు కొట్టిన దెబ్బలకి అతడు చనిపోయేవాడే. తన పేరు చెప్పడంతో ముస్లిం కాబట్టి కొట్టిన వారే ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్తం ఇచ్చి బతికించారు. పాక్ ఆర్మీ ప్రశ్నలతో చంపేస్తుంది 1971 డిసెంబర్ 5న పాక్తో యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో బర్మార్ నుంచి పైలట్ భార్గవ హిందూస్తాన్ ఫైటర్ 24 విమానాన్ని నడుపుతుండగా పాక్ ఆర్మీ దాన్ని కూల్చేసి ఆయన్ను నిర్బంధించింది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తీవ్రమైన ఒత్తిడికి లోను చేసింది. నిద్ర కూడా పోనివ్వకుండా అధికారులు వచ్చి అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతుంటారు. ఎంతటి శిక్షణ పొందిన సైనికుడికైనా ఆ ఒత్తిడి భరించడం కష్టం. ఒకసారి ఏం చెబితే మళ్లీ అదే చెప్పాలి. లేదంటే దొరికిపోతాం. ‘‘భారత వాయుసేన గురించి వాళ్లు నన్ను ఎన్నో ప్రశ్నలు వేశారు. తోటి పైలట్ల వివరాలు అడిగారు. మీ బ్యాచ్లో అత్యుత్తమ పైలట్ ఎవరు అని వారు అడిగితే, ‘అతను మీ ముందే కూర్చున్నాడు’అని బదులిచ్చాను’’అని భార్గవ చెప్పారు. ఇది జరిగిన ఏడాది తర్వాత కానీ భార్గవ పాక్కు బందీగా చిక్కారన్న విషయం ప్రపంచానికి తెలియలేదు. మొత్తానికి భారత్ ప్రయత్నాలు ఫలించి ఆయన క్షేమంగా వెనక్కి వచ్చారు. అప్పటి పంజాబ్ సీఎం జ్ఞానీ జైల్సింగ్ వాఘా సరిహద్దుల దగ్గర తనకు స్వాగతం పలికారని ఆ నాటి అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. -
కార్గిల్ వార్లో పాక్కి చిక్కిన పైలట్.. తర్వాత?
పాకిస్తాన్కు చిక్కిన పైలట్ విక్రమ్ అభినందన్ పరిస్థితి ఏంటి ? ఇప్పుడు ప్రతీ భారతీయుడు మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇలాంటి సంఘటనే సరిగ్గా 20 ఏళ్ల కిందట ఎదురైంది.1999లో కార్గిల్ యుద్ధ సమయంలో సరిహద్దు గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మిగ్ 27 యుద్ధ విమానం గస్తీ కాసింది. ఆ యుద్ధ విమానంకు పైలట్గా వ్యవహరించారు లెఫ్టినెంట్ కే నచికేత. కానీ, కొన్ని సాంకేతిక లోపాలతో ఆ యుద్ధ విమానం పాక్ సరిహద్దుల్లో కూలిపోయింది. ప్యారచూట్తో దిగిన నచికేతను పాక్ ఆర్మీ యుద్ధ ఖైదీగా పట్టుకుంది. ఆ తర్వాత భారత ఆర్మీ రహస్యాలు చెప్పమని పాక్ సైనికులు నచికేతను చిత్ర హింసలకు గురిచేశారు. పాక్ ఉన్నతాధికారి ఒకరు చిత్రహింసలను ఆపివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే సైన్యం నచికేతపై దాడులు ఆపింది. అసలు మరుసటి రోజు చూస్తానో లేదో అన్నట్లుగా వారు హింసించారని నచికేత చెప్పారు. అయితే పాక్ ఉన్నతాధికారి యుద్ధ ఖైదీని విచారణ చేసే పద్ధతి ఇదికాదని చెప్పడంతో వారంతా వెనక్కు తగ్గారని వెల్లడించారు. నాడు భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం నుంచి పాక్ పై త్రీవ ఒత్తిడి రావడంతో ఎనిమిది రోజుల తర్వాత నచికేతను పాక్ వదిలిపెట్టింది. నాడు యుద్దం జరుగుతున్న సమయంలో తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించడం, ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా భారత రహస్యాలు చెప్పకపోవడంతో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్, ప్రధాని వాజ్పేయిలు అతన్ని హీరోగా కొనియాడారు. నాటి ప్రభుత్వం ఆయన్ను వాయుసేన పథకంతో గౌరవించింది. నచికేతను విడిపించేందుకు ఇస్లామాబాద్లో భారత హై కమిషనర్గా ఉన్న పార్థసారథి ఎంతగానో కృషి చేశారు. ఆ సమయంలో విదేశీవ్యవహారాల కార్యాలయంలో నచికేతన్ను ఉంచుతామని, తీసుకెళ్లాల్సిందిగా తనకు ఓ ఫోన్కాల్ వచ్చిందని పార్థసారథి చెప్పారు. నచికేతను దయ తలచి వదిలేస్తున్నామంటూ పాక్ చెప్పడాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని అందుకే తాను అక్కడికి రానని తేల్చి చెప్పినట్లు పార్థసారథి వివరించారు. జెనీవా కన్వెషన్ ప్రకారం పాకిస్తాన్ భారత అధికారులకు అప్పగించాల్సి ఉందని చెప్పారు. యుద్ధ సమయంలో దేశాలు ఎలా వ్యవహరించాలో అంతర్జాతీయ న్యాయసూత్రాలు జెనీవా కన్వెన్షన్లో పొందుపర్చారు. ఇక నచికేతను అదే రోజు సాయంత్రం జెనీవా కన్వెన్షన్ ప్రకారం పాక్ అధికారులు తనకు అప్పగించారని గుర్తుచేసుకున్నారు. అక్కడి నుంచి తాము వాఘా సరిహద్దు గుండా భారత్కు చేరుకున్నట్లు వెల్లడించారు. అయితే భారత యుద్ధ విమానం మిగ్-21 తమ భూభాగంలో కూలినప్పుడు ప్యారచూట్ సహాయంతో కిందకు దూకిన అభినందన్ను అదుపులోకి తీసుకున్నట్టు పాక్ వెల్లడించింది. అభినందన్ గల్లంతైన విషయాన్ని భారత విదేశాంగ ధ్రువీకరించింది. అయితే ఆయన పేరును వెల్లడించలేదు. ప్రస్తుతం తమ కస్టడీలోనే ఉన్నట్లు చెబుతున్న పాక్, జెనీవా కన్వెన్షన్ ప్రకారం అభినవ్ను వదిలేస్తుందా? భారత్ ఎలాంటి వ్యూహంతో అదృశ్యమైన పైలట్ను తిరిగి తీసుకొస్తుందో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచిచూడాల్సిందే. -
పైలట్ను హింసించడం అమానుషం : భారత్
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్కు పట్టుబడ్డ భారత పైలట్ అభినందన్ను సురక్షితంగా అప్పగించాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. తమ పైలట్కు ఎలాంటి హాని తలపెట్టకుండా అప్పగించే బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. పైలట్ అభినందన్ను హింసించడం అమానుషమని పేర్కొంది. తీవ్రంగా గాయపడ్డ పైలట్ను చూపడం జెనీవా ఒప్పందానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్త చేసింది. ఇప్పటికే పలుమార్లు ఉగ్ర క్యాంపుల గురించి పాకిస్తాన్కు సమాచారమిచ్చామని, పాక్ చర్యలు తీసుకోనందునే దాడి చేశామని పేర్కొంది. తాము ఉగ్రవాదులపై దాడి చేశామే తప్ప పాక్ ప్రజలపై కాదని స్పష్టం చేసింది. (భారత పైలట్కు పాక్ చిత్రహింసలు!) బుధవారం ఉదయం పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. వాటిని తిప్పి కొట్టే క్రమంలో భారత పైలట్ అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ పాక్ ఓ విడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో స్థానికులు అభినందన్పై దాడి చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. భారత పైలట్ పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరును భారత ప్రభుత్వం తప్పుపట్టింది. యుద్దంలో చిక్కిన సైనికునిపై దాడి చేసి పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లఘించిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా బుధవారం సాయంత్రం అభినందన్కు సంబంధించి మరో వీడియోను పాక్ విడుదల చేసింది. వీడియోలో అభినందన్ కాఫీ తాగుతూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ జవాన్ల ట్రీట్మెంట్ బాగుందని అభినందన్ తెలిపారు. తనపై స్థానికులు దాడి చేస్తే పాకిస్తాన్ సైన్యమే కాపాడిందని చేప్పారు. (ఎవరీ విక్రమ్ అభినందన్?) ఇది చదవండి : భారత పైలెట్ అభినందన్ క్షేమం! -
బీఎస్ఎఫ్ జవాన్ గొంతు కోసిన పాక్ సైనికులు
-
భారత జవాన్ గొంతు కోసిన పాక్ సైన్యం
జమ్మూ/న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తానీ సైనికులు దారుణానికి తెగబడ్డారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)కు చెందిన ఓ జవానును తుపాకీతో కాల్చి, గొంతుకోసి చంపేశారు. జమ్మూ ప్రాంతంలోని రామ్గఢ్ సెక్టార్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బీఎస్ఎఫ్ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం.. రామ్గఢ్ సెక్టార్లోని సరిహద్దు కంచె వద్ద ఎత్తుగా పెరిగిన ఏనుగుల గడ్డిని కోసేందుకు బీఎస్ఎఫ్ జవాన్లు వెళ్లారు. సరిహద్దులు స్పష్టంగా కనిపించడం కోసం ఇలాంటి అడ్డుగా ఉన్న గడ్డిని జవాన్లు కోయడం సాధారణమే. జవాన్లు గడ్డి కోస్తుండగా పాక్ సైన్యం కాల్పులు జరిపింది. వెంటనే బీఎస్ఎఫ్ జవాన్లు కూడా ప్రతికాల్పులు జరిపి చాకచక్యంగా తప్పించుకుని వచ్చారు. అయితే హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర సింగ్ కనిపించడం లేదన్న విషయాన్ని వారు ఆలస్యంగా గుర్తించారు. దీంతో ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు ముందుగా గడ్డినంతటినీ కోసేసి తప్పిపోయిన నరేంద్ర సింగ్ కోసం వెతకడం ప్రారంభించారు. తమ జవాన్ను గుర్తించేందుకు సాయం చేయాల్సిందిగా పాకిస్తానీ సైనికులను కూడా భారత సైన్యం ఫోన్లో కోరింది. కొద్ది దూరం వరకే వచ్చి జవాన్ను వెతికిన పాక్ సైనికులు, ఆ తర్వాత నీళ్లు ఉన్నాయంటూ ఆగిపోయారని బీఎస్ఎఫ్ వెల్లడించింది. 9 గంటల గాలింపు తర్వాత బుల్లెట్ గాయాలతో పడిఉన్న నరేంద్ర సింగ్ మృతదేహం కనిపించిందనీ, అతని గొంతు కూడా కోసి ఉందని తెలిపింది. ‘జవాను శరీరంలో 3 బుల్లెట్లు ఉన్నాయి. అతని గొంతు కోశారు. ఇలాంటి ఆటవిక ఘటన అంతర్జాతీయ సరిహద్దులో ఎప్పుడూ చోటుచేసుకోలేదు. దీని వెనుక పాక్ సైనికులున్నారు. దీనికి బీఎస్ఎఫ్, ఇతర దళాలు తగిన సమాధానం చెబుతాయి’ అని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. -
ఇమ్రాన్ ఖాన్పై మాజీ భార్య తీవ్ర ఆరోపణలు
ఇస్లామాబాద్: తాజా పాకిస్థాన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్పై ఆయన మాజీ భార్య రెహం ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగడం వల్లే ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో గెలిచారని ఆమె ఆరోపించారు. పాక్ సైన్యం నుంచి ఇమ్రాన్ లబ్ధి పొందాడని, ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశాక విదేశాంగ శాఖ సైన్యం చేతిలోకి వెళ్లిపోతుందని ఆమె పేర్కొన్నారు. తాజాగా పాకిస్థాన్లోని 270 స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ 115 స్థానాలు గెలుపొందినట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్ సమాయత్తమవుతున్నారు. త్వరలోనే పాక్ ప్రధానిగా ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సీఎన్ఎన్-న్యూస్ 18తో రెహాం ఖాన్ మాట్లాడారు. ‘పాక్ ఎన్నికలు ఆశ్చర్యపరచలేదు. ఫలితాలు ఊహించినవే. చాలామంది ఇమ్రాన్ను ప్రోత్సహించారు. ఆయనపై ఎంతో పెట్టుబడి పెట్టారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. ఆర్మీ ఇప్పుడు పాక్ విదేశాంగ శాఖను నిర్వహించబోతోంది’ అని రెహం ఖాన్ అన్నారు. -
పాక్లో ఊహించని పరిణామాలు
రావల్పిండి : పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాక్లో ప్రధాన రాజకీయ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్)కు చెందిన నేతలకు పలు కేసుల్లో శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పులు వెలువడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే స్వదేశంలో అడుగుపెట్టిన ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను, ఆయన కూతురు మరియమ్ను పాక్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు హనీఫ్ అబ్బాసీకి జీవిత ఖైదు విధిస్తూ సీఎన్ఎస్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్క్వార్టర్స్ ముందర ఆందోళనకు దిగారు. పాక్ ఆర్మీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ(ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జూలై 25న జరిగే ఎన్నికల్లో తాము అనుకున్న వారిని గెలిపించుకోవడానికి ఐఎస్ఐ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. తీవ్రవాదం వెనుక పాక్ ఆర్మీ హస్తం ఉందని విమర్శించారు. యూఎస్ కూడా పాక్ ఎన్నికల్లో ఉగ్రవాదులు పోటీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి షౌకత్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ఐఎస్ఐ మీడియాను, న్యాయవ్యవస్థను కంట్రోల్ చేస్తుందని అన్నారు. రావల్పిండి బార్ అసోసియేషన్ కూడా ఐఎస్ఐపై తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా వచ్చేలా న్యాయమూర్తులపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. షరీఫ్, మరియమ్ కేసుల్లో కూడా అలానే జరిగిందని అన్నారు. కాగా పాక్ మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ను అధికారంలోకి తీసుకురావడానికి పాక్ ఆర్మీ ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ సమాఖ్య భావిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది రెహమాన్ ఖలీల్ కూడా పీటీఐ పార్టీకి మద్దతుగా ప్రకటన చేయడం ఆందోళన కలిగించే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మీ ఇష్టం ఇక చెలరేగిపోండి
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దులో పాకిస్థాన్ కవ్వింపు చర్యలపై భారత సైన్యం కీలక ప్రకటన చేసింది. ఇకపై సహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులను ధీటుగా స్పందించాలని.. ఇందుకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు సైన్యాధికారులకు(కమాండర్) ఆదేశాలు జారీ చేసింది. ‘గత కొన్ని వారాలుగా సరిహద్దు వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రాను రాను ఈ ఘటనలు పెరిగిపోతున్నాయి. దానికి భారత్ కూడా గట్టి సమాధానమే ఇస్తోంది. ఇకపై దూకుడు మరింత పెంచండి. పాక్ సైన్యం కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించినా, ఉగ్రవాదులకు దాడులకు-చొరబాటులకు యత్నించినా మీరూ ధాటిగానే సమాధానం ఇవ్వండి. వారికి అడ్డుకట్ట వేసేందుకు ఎంతటికైనా తెగించండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. చర్యలకు దిగినా... సైన్యం మీకు పూర్తి సహకారం అందిస్తుంది’ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, తాజాగా సరిహద్దులో దాడులు తీవ్ర తరం కావటం చూస్తున్నాం. జమ్ము లోని రాజౌరీ ఉగ్రదాడిలో నలుగురు సైనికులు, సుంజువాన్ మిలిటరీ స్టేషన్ పై ఉగ్రదాడిలో ఓ పౌరుడు సహా ఆరుగురు సైనికులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో ఇకపై ఉపేక్షించాల్సిన అవసరం లేదని భారత సైన్యం నిర్ణయించుకున్నట్లు స్పష్టమౌతోంది. భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ‘పాక్ ఇందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించటం తెలిసిందే. -
దుమారం.. ఆమె ట్విటర్ ఖాతా మాయం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యంపై ఆ దేశానికి రాజకీయ మహిళా నేత కుమార్తె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సైన్యం వ్యవహారశైలిని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియో పాకిస్తాన్లో పెద్ద దుమారమే రేపింది. నాటకీయ పరిణామాల తర్వాత ఆమె ట్విటర్ ఖాతా మాయమయిందని పాక్ మీడియా వెల్లడించింది. తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) నాయకుడు షిరీన్ మజారీ కుమార్తె ఇమాన్ మజారీ ఈ వీడియో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఫైజాబాద్లో సైన్యం వ్యవహరించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్మీ చాలా అవమానకరంగా ప్రవర్తించిందని దుయ్యబట్టారని పాకిస్తాన్ టుడే పత్రిక తెలిపింది. ఈ వీడియోను ట్విటర్ నుంచి తొలగించడానికంటే ముందు పాకిస్తాన్లో చాలా మంది వీక్షించారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ వీడియో వైరల్గా మారడంతో తన కుమార్తె వ్యాఖ్యలను ఖండిస్తూ ఇమాన్ తల్లి షిరీన్ మజారీ ట్వీట్ చేశారు. సైన్యానికి వ్యతిరేకంగా ఆమె వాడిన బాషను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇమాన్ అంటే తనకు ప్రేమ ఉందని, సైన్యంపై ఆమె చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. సొంత అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు తన కూతురికి ఉన్నట్టే, ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకించే హక్కు తనకూ ఉందన్నారు. నవంబర్ 25న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు మరణించగా, 150 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్కు వచ్చే ప్రధాన రహదారుల్ని దిగ్బంధించిన వేలాది మందిని చెదరగొట్టేందుకు పోలీసులు, పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగడంతో ఈ హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో సైన్యం తీరును తప్పుబడుతూ ఇమాన్ మజారీ తన ఆవేదనను వీడియో రూపంలో వ్యక్తపరిచారు. ఇమాన్ మజారీ ట్విటర్ నుంచి తనంత తానుగా వైదొలగారా, లేక బలవంతంగా ఆమె ఖాతాను తొలగించారా అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. -
ఆమె ట్విటర్ ఖాతా మాయం
-
పాక్ సైన్యం దళారీ పాత్ర
మూడు వారాలుగా పాకిస్తాన్లోని ప్రధాన నగరాలను దిగ్బంధించి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఛాందసవాద బృందాలదే చివరకు పైచేయి అయింది. ‘దైవదూషణ’ ఆరోపణలొచ్చిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి జహీద్ హమీద్ పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. ఆందోళనకారుల ఇతర డిమాండ్లకు సైతం ప్రభుత్వం తలొగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రజా ప్రాతినిధ్య చట్టంలో వాడిన ఒక పదం ఇంత చేటు ఆందోళనకూ, హింసకూ కారణమైందంటే నమ్మ బుద్ధికాదు. కానీ పాకిస్తాన్ రాజకీయాల తీరే అంత. అక్కడ ప్రజలెన్నుకున్న పార్లమెంటు కంటే... దేశాన్నేలే ప్రభుత్వం కంటే ఈ ఛాందసవాద బృందాల ఆధిపత్యమే అధికంగా కనిపిస్తుంది. వాటికి పాకిస్తాన్ సైన్యం అండదండలీయడం కూడా రివాజే. నిజానికి ఈ ధోరణులే కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ సమాజాన్ని దిగజారుస్తున్నాయి. క్రమేపీ దాన్ని ఉగ్రవాద ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఈసారి కూడా అలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. ఈ మూడువారాలూ పాక్ నగరాలు తీవ్ర హింసను చవిచూశాయి. ఇస్లామాబాద్–రావల్పిండి నగరాల మధ్య నున్న ముఖ్యమైన ఫ్లైఓవర్ను ఆక్రమించుకున్న 2,000మంది ఆందోళనకారులు నిత్యావసరాలు మొదలుకొని వేటినీ కదలనీయలేదు. ప్రభుత్వం అక్షరాలా స్తంభిం చిపోయింది. అంతర్జాతీయంగా పరువుపోతున్నదని అర్ధమయ్యాక సైన్యాన్ని పిలిపించడానికి ప్రయత్నిస్తే అది బేఖాతరు చేసింది. ఆందోళనకారులతో మాట్లాడి ఒక ఒప్పందానికి రావాలని సలహా ఇచ్చింది. నిజానికి ఇరు పక్షాలూ ఒక అవ గాహన కొస్తే కుదిరేదాన్ని ఒప్పందం అంటారు. ఇది ఆ బాపతు కాదు. ఆందో ళనకారులు రాసిచ్చిన డిమాండ్ల కాగితంపై ఒప్పుకుంటున్నట్టు ప్రభుత్వం చేత పాక్ సైన్యం సంతకం పెట్టించింది. పరువు నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై చివరకు ఛాందసవాద బృందాల ముందు పాలకులు సాగిలపడవలసి వచ్చింది. పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ కుటుంబం విదేశాల్లో వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిందని పనామా పత్రాల్లో వెల్లడయ్యాక ఆయనను పాకిస్తాన్ సుప్రీంకోర్టు అనర్హుడిగా తేల్చడంతో నవాజ్ పదవినుంచి దిగపోయారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న దేశం ఆ తర్వాత మరింత అనిశ్చితిలోకి జారుకుంది. ఆయన స్థానంలో వచ్చిన షహీద్ ఖాకాన్ అబ్బాసీ పరిస్థితి అయోమయంగా ఉంది. చాన్నాళ్లనుంచి రాజకీయాల్లో ఉంటున్నా, మంత్రి పదవులు చేసినా ఆయనేమీ సమర్ధుడన్న పేరు తెచ్చుకోలేదు. నిజానికి అలాంటి వ్యక్తి ఆ పదవిలో ఉంటేనే తన మాట చెల్లుబాటవుతుందని, వెనకుండి నడిపించవచ్చని షరీఫ్ భావించినట్టు న్నారు. ఆయన ముందస్తు జాగ్రత్తల మాటెలా ఉన్నా పాకిస్తాన్ ప్రజలు మాత్రం నానా అగచాట్లూ పడుతున్నారు. పాలన ఏమైపోయిందో తెలియక గందరగోళ పడుతున్నారు. ఈలోగా బరేల్వీ సున్నీ ఛాందసవాదులు మహమ్మద్ ప్రవక్తకు అపచారం జరిగిందంటూ రోడ్డెక్కారు. ఇంతకూ ఏమిటా అవమానం? పాక్ సైనిక దళాల చీఫ్గా పనిచేసి ఆ తర్వాత దేశాధ్యక్షుడైన పర్వేజ్ ముషార్రఫ్ తన ఏలు బడిలో ప్రజా ప్రాతినిధ్య చట్టం తీసుకొచ్చారు. అబ్బాసీ సర్కారు దాని బదులు ఎన్నికల చట్టం పేరిట కొత్త చట్టాన్ని తెచ్చింది. ప్రజాప్రతినిధులుగా పోటీచేసేవారు ఇవ్వాల్సిన డిక్లరేషన్లోని ఒక పదాన్ని ఆ చట్టం మార్చింది. మహమ్మద్ ప్రవక్త పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి సంబంధించిన డిక్లరేషన్లో ‘ప్రగాఢ విశ్వాసంతో ప్రమాణం చేస్తున్నాను...’ అనడానికి బదులు ‘ఇందుమూలంగా ప్రక టిస్తున్నాను...’ అని ఉంది. ఇది ప్రవక్తను కించపరచడం కిందికొస్తుందని, దేశంలో ముస్లిమేతరులుగా ముద్రబడ్డ అహ్మదీయాలకు లబ్ధి చేకూర్చడమే దీని ఉద్దేశమని ఛాందసవాదుల ఆరోపణ. అహ్మదీయాలు 1889లో తమ తెగకు ఆద్యుడైన మీర్జా గులాం అహ్మద్ను కూడా ప్రవక్తగానే భావిస్తారు. జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం 1974లో రాజ్యాంగ సవరణ చేసి అహ్మదీయాలను ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేసింది. వారు ఓటర్లయినా, ఓటు హక్కున్నా పోటీ చేయడం కుదరదని ఆ సవరణ చెబుతోంది. అలాగే ముస్లింల కోసం, ముస్లిమేతరుల కోసం రెండు వేర్వేరు ఓటర్ల జాబితాలు రూపొందించాలని నిర్దేశించారు. 2002లో ముషార్రఫ్ తెచ్చిన ప్రజా ప్రాతినిధ్య చట్టం ఒకే ఓటర్ల జాబితాకు పరిమితమవ్వాలని చెప్పినా ఆచరణలో అహ్మదీయాలపై ఉన్న వివక్షను తొలగించలేదు. ఆ చట్టం కూడా అహ్మదీయాలను పోటీకి అనర్హులుగానే పేర్కొంది. అబ్బాసీ ప్రభుత్వం పదాలను మార్చడం మినహా ఇందులో మౌలికంగా చేసిన మార్పేమీ లేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం పర్యవసానంగా ఛాందసవాద సంస్థలన్నీ రెచ్చిపోయాయి. చట్టం తెచ్చిన న్యాయ మంత్రి తప్పుకోవాలని, ఆయనపై దైవదూషణ కేసు పెట్టాలని డిమాండ్ చేశాయి. వారి కోసమని ప్రభుత్వం దిగొచ్చి పాత పదజాలాన్ని , పాత సెక్షన్లను యధాతథంగా ఉంచుతూ సవరణ చట్టాలు తెచ్చింది. అయినా వారు శాంతించ లేదు. చివరకు సైన్యం దళారీగా మారి వారి కోర్కెలను ప్రభుత్వం ఆమోదించేలా చేసింది. చట్టసభలను భ్రష్టు పట్టించడం, వాటికి విలువ లేకుండా చేయడం... తమ విశ్వాసాలే పవిత్రమని, అవి మాత్రమే అధికార భావజాలంగా ఉండాలని కోరుకోవడం పాకిస్తాన్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అలాగని వేరే దేశాల్లో అంతా సవ్యంగా ఉందని చెప్పలేం. గతంలో శ్రీలంక, ఇప్పుడు మయన్మార్ కూడా ఈ ధోరణులకు ప్రతీకలు. ఇలాంటి పోకడలు మన దేశంలో కూడా బయ ల్దేరుతున్నాయని ఇటీవలకాలంలో ప్రజాస్వామికవాదులు ఆందోళనపడుతున్నారు. ప్రజల సమస్యలు చర్చించడానికి, పరిష్కార మార్గాలు అన్వేషించడానికి చట్టసభలున్నప్పుడు వాటిని బేఖాతరు చేయడం, మూకలదే పైచేయి కావడం అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. అరాచకాన్ని తీసు కొస్తుంది. అందువల్లే ప్రైవేటు వ్యక్తుల, బృందాల తీరు పట్ల ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలి. వారికి సాష్టాంగపడే పాలకుల విషయంలో జాగురూకతతో మెలగాలి. -
పాకిస్తాన్ ఆర్మీ.. పనామా ఆయుధం
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆ దేశ ఆర్మీ ప్రయత్నిస్తోందని పాకిస్తానీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం పచ్చగా ఉండటం ఇష్టం లేని ఆర్మీనే పనామా పేపర్ల కుంభకోణంలో షరీఫ్ కుటుంబాన్ని ఇరికిస్తోందని సగటు పాకిస్తాన్ పౌరుడు సోషల్మీడియా వేదికగా ఆరోపిస్తున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. పాకిస్తాన్ ప్రజలు ఆర్మీపై ఇంతలా ఆరోపణలు చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఇప్పటివరకూ మూడు మార్లు పాకిస్తాన్ ఆర్మీ దేశంపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నించి చతికిలపడింది. వాస్తవానికి పాకిస్తాన్లో ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం నడుస్తున్నా.. ఆ దేశ ఆర్మీనే పాలసీల నిర్ణయాల్లో కీలకపాత్ర వహిస్తుందన్న విషయం బహిరంగ రహస్యం. తాజాగా ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆర్మీ చేస్తున్న కుట్ర అనే విషయాన్ని బలపర్చడానికి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్(జిట్) కూర్పే ఆధారంగా నిలుస్తోంది. జిట్లో ఉన్న సభ్యుల్లో పాకిస్తాన్ ఇంటిలిజెన్స్, ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్(ఐఎస్ఐ), మిలటరీ ఇంటిలిజెన్స్(ఎమ్ఐ)ల నుంచి ఒక్కో వ్యక్తి ఉన్నారు. దీంతో సగటు పాకిస్తానీ పౌరుడికి ఆర్మీ కుట్ర చేస్తుందన్న భయం పట్టుకుంది. ఆర్మీపై ప్రజలు చేస్తున్న ఆరోపణల గురించి అధికారులను ప్రశ్నించగా.. ఎప్పటిలానే అలాంటిదేం లేదంటూ అధికార వర్గాలు కొట్టిపారేశాయి. ప్రతి ఒక్కరికి అభిప్రాయాన్ని ధైర్యంగ బయటకు చెప్పగలిగే స్వతంత్రం ఉందంటూ ఆర్మీ పీఆర్ఓ పేర్కొన్నారు. జిట్లో ఉన్న ఆర్మీ సభ్యులు సుప్రీం కోర్టుకు జవాబుదారులుగా ఉన్నారని చెప్పారు. సభ్యులు వారి విధులను నిజాయితీగా నిర్వర్తించారని తెలిపారు. -
షరీఫ్ దిగిపోతే.. భారత్కు గండమే!
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: కూతురు మర్యమ్ షరీఫ్ డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో ఘోరమైన తప్పిదం చేసి దొరికిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు పదవి గండం ఏర్పడింది. ఒకవేళ షరీఫ్ గనుక ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తే భారత్ పరిస్ధితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్ధల వరుస దాడులతో భారత్ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వం పడిపోతే.. పాకిస్తాన్ ఆర్మీ దేశ పాలనను చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం గద్దెనెక్కినా తెర వెనుక రాజకీయం నడిపించేది పాకిస్తాన్ ఆర్మీయే అనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు బాగా సన్నగిల్లాయి. ఈ పరిస్ధితుల్లో పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే.. భారత్కు భద్రతా పరమైన ముప్పు మరింత పెరుగుతుంది. కాగా, డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసును విచారిస్తున్న జిట్ బృందం ఆ దేశ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే.. షరీఫ్ పదవి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి లేదా షరీఫ్ కీలుబొమ్మగా మారే అవకాశం కూడా ఉంది. వచ్చే వారం జిట్ రిపోర్టుపై పాకిస్తాన్ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. -
భారత్ను దెప్పిపొడిచిన పాక్ ఆర్మీ!
న్యూఢిల్లీ: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ గెలువడంతో దాయాది ఆర్మీ భారత్ను దెప్పిపొడిచింది. భారత్పై పాక్ గెలువడంతో కల్లోలిత బెలూచిస్థాన్లో సంబరాలు జరిగాయి. ఈ సంబరాల ఫొటోలను పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. అంతేకాదు, పాక్ విజయంపై శ్రీనగర్లో సంబరాలు చేసుకున్న వీడియోను సైతం అసిఫ్ గఫూర్ ట్విట్టర్లో పెట్టారు. కల్లోలిత బెలూచిస్థాన్లో పాక్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ను ఎద్దేవా చేసేలా.. ‘ఇది మా బెలూచిస్థాన్.. ఎవరికైనా ఆందోళనలు ఉంటే మానుకోండి’ అంటూ బెలూచిస్థాన్లో సంబరాల ఫొటోలను గఫూర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఇదీ శ్రీనగర్ అంటూ అక్కడి సంబరాల వీడియోను షేర్ చేశారు. ‘పాక్ వీరోచిత సైనికులు పాకిస్థాన్ జట్టుకు, జాతికి అభినందనలు తెలిపారు. మనమంతా ఐక్యంగా శత్రువుల కుట్ర నుంచి, ముప్పు నుంచి పాకిస్థాన్ను కాపాడుకుందాం’ అంటూ అతను మరో ట్వీట్ చేశాడు. -
‘భారత బంకర్లు పేల్చాం.. ఇదిగో వీడియో’
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరో వీడియో విడుదల చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత మిలిటరీ స్థావరాలను తాము ధ్వంసం చేశామని పేర్కొంటూ పాక్ ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ ఘఫూర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. 27 సెకన్లపాటు ఉన్న ఆ వీడియోలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఉంది. గతంలో కూడా పాక్ ఇలాంటి ఓ వీడియోనే విడుదల చేయగా అది ఫేక్ వీడియో అని భారత్ కొట్టి పారేసిన విషయం తెలిసిందే. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తట్టపాని సెక్టార్లో తాము ఐదుగురు భారత సైనికులను చంపేశామంటూ ప్రకటించిన మరుసటి రోజే పాక్ ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం. పాక్ అంతర్గత సేవల విభాగం(ఐఎస్పీఆర్) శనివారం ఓ ప్రకటన విడుదల చేస్తూ తాము నియంత్రణ రేఖ వద్ద భారత్ సైనికులపై దాడులు చేశామని, అందులో ఐదుగురు సైనికులు చనిపోయారని, ఇండియన్ బంకర్లను ధ్వంసం చేశామంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై భారత్ వైపు నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అయినప్పటికీ అదే జరిగినట్లుగా పాక్ వీడియో విడుదల చేయడం ఆశ్చర్యాన్నిస్తోంది. Ref PR285/17 Video clip showing destruction of Indian posts on LOC by Pak Army in response to unprovoked Indian firing on innocent citizens. pic.twitter.com/ceErT8KzlC — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) 3 June 2017 -
పిచ్చికుక్కలా పాక్; మమ్మల్ని కాల్చిచంపండి
-
పిచ్చికుక్కలా పాక్; మమ్మల్ని కాల్చిచంపండి..
(పాక్ వైపు నుంచి భీకర కాల్పులు.. ప్రాణాలు కాపాడుకునేందుకు గ్రామస్తుల యాతన) రాజౌరీ: దాయాది పాకిస్థాన్ పిచ్చిపట్టిన కుక్కలా పేట్రేగిపోతున్నది. జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నది. పాక్ ఆర్మీ శుక్రవారం మొదలుపెట్టిన కాల్పుల పర్వం ఆదివారం ఉదయం దాకా ఎడతెరిపిలేకుండా సాగుతూనేఉంది. వేగంగా దూసుకొస్తున్న షెల్స్, తూటాలు.. గ్రామస్తులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. అప్రమత్తమైన భారత సన్యం పాక్ రేంజర్లకు గట్టి సమాధానం ఇస్తూనే, జాగ్రత్త చర్యల్లో భాగంగా సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించింది. ‘ఆదివారం తెల్లవారుజామున రాజౌరీ సెక్టార్లో ఎల్వోసీని ఆనుకొని చీటి బక్రి గ్రామంపైకి పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. వెంటనే అప్రమత్తమై వాళ్లకు(పాక్కు) ధీటుగా జవాబిచ్చాం. అక్కడి ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాం’ అని ఆర్మీ అధికారులు మీడియాకు చెప్పారు. ఇదే సెక్టార్లోని ఏడు గ్రామాలపై శనివారం పాక్ జరిపిన కాల్పుల్లో మైనర్ బాలిక సహా ఇద్దరు మరణించారు. 35 పౌరులు, కొందరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెనక్కి వెళ్లం.. కాల్చిచంపండి.. పాకిస్థాన్ బరితెగింపు దృష్ట్యా నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలను ఆర్మీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సుమారు 200 కుటుంబాలకు చెందిన 1000 మందిని రాజౌరీలో ఏర్పాటుచేసిన సహాయక శిబిరాలకు తరలించారు. సొంత ఊళ్లను వదిలేసి క్యాంపుల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్న గ్రామస్తులు తమను కలిసిన మీడియాతో గోడువెళ్లబోసుకున్నారు. ‘ఆ కాల్పుల వర్షాన్ని మేం తట్టుకోలేం. అలాగని సొంత ఊరిని వదిలేసిరాలేం. మాకు వేరే దారిలేదు. మమ్మల్ని ఇక్కడే కాల్చి చంపేయండి..’ అని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్రిక్తతల నేపథ్యంలో రాజౌరీ, నౌవ్షీరా, మాంజకోటే, డూంగి జోన్లలోని 87 పాఠశాలలను మూసివేశారు. -
పాక్లో దేశవ్యాప్త ఉగ్రవ్యతిరేక కార్యక్రమం
ఇస్లామాబాద్: దేశమంతటా విస్తరించిన ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు పాకిస్తాన్ సైన్యం బుధవారం కొత్తగా రధ్–అల్–ఫసాద్(అపశృతికి అంతం) పేరిట ఉగ్రవ్యతిరేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల సింధ్ ప్రావిన్సులోని ప్రఖ్యాత లాల్ షాబాజ్ ఖలందర్ ప్రార్థన స్థలంపై దాడిచేసి ఉగ్రవాదులు 88 మంది ప్రాణాలు తీసుకున్న నేపథ్యంలో పాక్ ఈ భారీ కసరత్తుకు సన్నద్ధమైంది. ఉగ్రవాదులను మట్టుబెట్టడంతోపాటు పాక్ సరిహద్దు భద్రతే తమ లక్ష్యాలని పాక్ సైన్యం మీడియా విభాగమైన ‘ఇంటర్–సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్’ సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరులో దేశ వైమానిక, నావిక, పౌర సాయుధబలగాలు.. సైన్యానికి బాసటగా నిలుస్తాయని ప్రకటన పేర్కొంది. లాహోర్లో ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ భజ్వా నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి భద్రతా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
భారత డ్రోన్ను కూల్చాం: పాక్
-
భారత డ్రోన్ను కూల్చాం: పాక్
ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ దాటి తమ భూభాగంలోకి చొరబడిన భారత డ్రోన్ను నేలకూల్చామని పాకిస్థాన్ సైన్యం శనివారం ప్రకటించింది. ‘పాక్ భూభాగంలోకి ప్రవేశించిన భారత క్వాడ్కాప్టర్ను పాక్ దళాలు శనివారం సాయంత్రం కుప్పకూల్చాయి. దాని శకలాలు రాక్చక్రి సెక్టార్లోని అగాయ్ పోస్టు సమీపంలో పడ్డాయి’ అని పాక్ ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. సర్జికల్ దాడుల తరువాత ఇరు దేశాల సరిహద్దుల్లో పాక్ 286 సార్లు షెల్లింగ్, మోర్టార్లతో కాల్పులకు పాల్పడటంతో 14 మంది భద్రతా సిబ్బంది సహా 26 మంది ప్రజలు చనిపోయారు. భారత్కే ఎక్కువ నష్టం జరిగింది: పాక్ అత్యున్నత కమాండర్ గత కొద్దిరోజులుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భారత సైనికులే ఎక్కువ మంది చనిపోయారని పాక్ 10 కారప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మాలిక్ జఫార్ ఇక్బాల్ అన్నారు. పాక్ సైనికులు 20 మంది చనిపోగా భారత్ వైపు కనీసం 40 మంది మరణించారని తెలిపారు. ప్రజాగ్రహానికి భయపడే భారత్ ఈ సంఖ్యను తగ్గించి చూపుతోందని ఆరోపించారు. -
‘అంతలేదు.. పాక్ చెప్పేదంతా బూటకం’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్మీ చెప్తుందంతా అబద్ధం అని భారత ఆర్మీ స్పష్టం చేసింది. భారత సైనికులెవరు కూడా పాక్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోలేదని తెలిపింది. ఈ మేరకు భారత ఆర్మీ ఉత్తర కమాండో గురువారం ట్విట్టర్ లో తెలిపింది. ‘14, 15, 16 తేదీల్లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నవంబర్ 14న 11మంది భారత సైనికులు చనిపోయారంటూ పాక్ ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటన అంతా బూటకం’ అని ఉత్తర కమాండో పేర్కొంది. ఈ నెల 14 నుంచి సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాక్, భారత్ సేనలకు మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో పాక్ కు చెందిన ఏడుగురు సైనికులు చనిపోయారు. ఈ విషయాన్ని పాక్ కూడా ధృవీకరించింది. అయితే, మరుసటి రోజు తాము జరిపిన కాల్పుల్లో భారత్ కు చెందిన 11 మంది సైనికులు చనిపోయారంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ షరీఫ్ బుధవారం ప్రకటన చేశారు. దీన్నే భారత ఆర్మీ కొట్టి పారేసింది. -
భారత్ మా సైనికుల్ని చంపేసింది: పాక్ ఆర్మీ
-
భారత్ మా సైనికుల్ని చంపేసింది: పాక్ ఆర్మీ
ఇస్లామాబాద్: భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాకిస్థాన్ సైనికులు చనిపోయారని ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. ఆదివారం రాత్రి భారత దళాలు నియంత్రణ రేఖ వద్ద బీంబర్ సెక్టార్లోని తమ స్థావరాలపై దాడి చేసినట్టు పాక్ ఆర్మీ వెల్లడించింది. భారత సైనికుల కాల్పులకు ప్రతిగా తమ దళాలు ఎదురు కాల్పులు జరిపాయని తెలిపింది. భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు పేర్కొంది. భారత సైనికులు చేస్తున్న దాడుల్లో ఎక్కువగా తమ పౌరులు చనిపోతున్నారని పాక్ ఆర్మీ, విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. జమ్ము కశ్మీర్లో ఉడీఉగ్ర దాడి అనంతరం భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైనికులు సర్జికల్ దాడులు చేశారు. కాగా పాక్ వీటిని తోసిపుచ్చింది. ఆ తర్వాత పాక్ 100 సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు భారత దళాలు పేర్కొన్నాయి. పాక్ దాడులకు భారత సైనికులు దీటుగా బదులిస్తున్నారు. -
భారత్పై పాక్ నకిలీ సర్జికల్ స్ట్రైక్స్..!
శ్రీనగర్: భారత సైన్యం సర్జికల్ దాడులతో ఒక్కసారిగా బెంబేలెత్తిన పాకిస్థాన్.. నిదానంగానైనా క్రూరత్వాన్ని బయటపెట్టుకుంటోంది. సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి కాల్పుల నియంత్రణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత సరిహద్దు భద్రతా దళాలపై వరుసగా కాల్పులు జరుపుతున్నది. అదే సమయంలో సరిహద్దు గ్రామాలపైనా పాశవిక దాడులకు తెగబడుతున్నది. జమ్ముకశ్మీర్ లోని మెంధార్ సెక్టార్ లో సోమవారం ఉదయం పాక్ రేంజర్లు 120 ఎంఎం, 82 ఎంఎం మోర్టార్లతో భీకర కాల్పులకు తెగబడ్డారు. సర్జికల్ దాడులు జరిగిన సెప్టెంబర్ 29 నుంచి సోమవారం(నవంబర్ 7)నాటికి పాకిస్థాన్ 101 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానిన్ని ఉల్లంఘించింది. మొంధార్ ఘటన 101వది కావడం గమనార్హం. ఇప్పటివరకు పాక్ జరిపిన దాడుల్లో 20 మందికిపైగా పౌరులు, జవాన్లు మరణించారు. మరోదిక్కు పాక్ సైన్యం సహకారంతో కశ్మీర్ లోకి చొరబడుతున్న ఉగ్రవాదులు కూడా భారత జవాన్లే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. వీటిని అణిచివేయడంలో చాలా చోట్ల భారత బలగాలు పైచేయి సాధించినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చేదు అనుభవాలు తప్పడంలేదు. పాక్ నకిలీ సర్జికల్ దాడులు! ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడికి సమాధానంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ల(దాడులకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులు తలదాచుకునే చోటు)పై సెప్టెంబర్ 29న భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్(లక్షిత దాడుల) చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్ దూకుడును ప్రపంచదేశాలన్నీ సమర్థించాయి కూడా. అయితే ఏడు దశాబ్ధాలుగా దాయాదిని గమనిస్తోన్న భారత్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లోని గ్రామాలను ఖాళీచేయించింది. సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలోని గ్రామాలు అన్నింటినీ దాదాపు ఖాళీచేయించిన భారత సైన్యం.. కశ్మీర్ లో మాత్రం ఆపని చేయలేదు. దీంతో పాక్ రేంజర్లు, ఉగ్రవాదులకు ఆ గ్రామాలు టార్గెట్ అయ్యాయి. శత్రుమూకలను ఛిద్రం చేయడంలో సైనిక పాటవానికి సంబంధించి గొప్పగా చెప్పుకునే సర్జికల్ స్ట్రైక్స్ అసలు ఉద్దేశాన్ని పక్కనపెట్టి పాకిస్థాన్.. భారత్ లోని సాధారణ ప్రజానీకంపై సర్జికల్ స్ట్రైక్స్(లక్షిత దాడులు) చేస్తుండటం గర్హనీయం. ఇటీవల ప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో పాకిస్థాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆమేరకు ఇంకా ఆదేశాలు వెలువడనప్పటికీ కశ్మీర్ లోని సరిహద్దు గ్రామస్తుల తరలింపుపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
పాక్తో యుద్ధానికి భారత్ రెడీగా ఉండాలి
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ సైన్యం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి పాలనను తమ చేతుల్లోకి తీసుకుంటుందని అన్నారు. పాకిస్థాన్ సైన్యం నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, దీన్నిబట్టి పాక్ తో మనకు యుద్ధం జరగవచ్చని సంకేతాలుగా భావించాలని చెప్పారు. పాక్తో యుద్ధానికి మనం సన్నద్ధంగా ఉండాలని స్వామి పేర్కొన్నారు. యుడీ ఉగ్రదాడి అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసిన తర్వాత పాకిస్థాన్ 100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నిత్యం కాల్పులు జరుపుతున్న పాక్కు భారత సైన్యం దీటైన జవాబిస్తోంది. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరు వైపులా ప్రాణ నష్టం జరుగుతోంది. -
బలూచిస్థాన్..పాక్లో బలవంతపు విలీనం
-
భారత సైన్యం పుణ్యమాని..
భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్.. పాకిస్థాన్కు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇన్నాళ్లూ భుజాలు భుజాలు రాసుకు పూసుకుని తిరిగిన ఉగ్రవాదులు, పాక్ సైన్యం మధ్య సంబందాలు ఇప్పుడు చెడిపోయాయి. ప్రధానంగా లష్కరే తాయిబా ఉగ్రవాదులకు, పాక్ ఆర్మీలోని వాళ్ల హ్యాండ్లర్లకు మధ్య ఇప్పుడు ఏమాత్రం సత్సంబంధాలు లేవట. సర్జికల్ స్ట్రైక్స్లో చనిపోయిన తమ సహచరుల మృతదేహాలను తాము తీసుకెళ్లడానికి పాక్ ఆర్మీ అంగీకరించలేదని లష్కరే ఉగ్రవాదులు మండిపడుతున్నారు. ముందుగా చనిపోయిన, గాయపడిన పాక్ సైనికులనే తరలించారు. చీకటి పడిన తర్వాత మాత్రమే ఉగ్రవాదుల మృతదేహాలను తీసేందుకు అంగీకరించారు. అలాగే గాయపడిన లష్కరే ఉగ్రవాదులకు చికిత్స కూడా అంతంతమాత్రంగానే అందిందట. భారతదేశం వైపు నుంచి మరిన్ని దాడులు ఎదురవుతాయని ఆందోళనలో ఉన్న పాకిస్థాన్.. ఉగ్రవాద నాయకులైన హఫీజ్ సయీద్, సయ్యద్ సలాహుద్దీన్లను లాహోర్లోని ఒక ఆర్మీ క్యాంపునకు తరలించింది. మఫ్టీలో ఉన్న ఆర్మీ కమాండోలు వాళ్లకు భద్రత కల్పించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన వెంటనే నియంత్రణరేఖ వెంబడి ఉన్న టెర్రర్ లాంచ్ప్యాడ్లను పీఓకే లో 7-8 కిలోమీటర్ల దూరానికి పాక్ సైన్యం తరలించింది. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో భారత సైన్యం కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంచ్ ప్యాడ్ల మీదే దాడులు చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రతీకారం తీర్చుకోడానికి భారతదేశంలో మళ్లీ ఉగ్రదాడులు నిర్వహిస్తారన్న కథనాలు వచ్చాయి. కానీ, గతంలో చేసినట్లుగా 26/11 నాటి ముంబై ఉగ్రదాడి తరహాలో మళ్లీ చేస్తే మాత్రం ఈసారి భారత్ కేవలం వాటిని అడ్డుకుని ఊరుకునే పరిస్థితి లేదని, మరింత తీవ్రంగా విరుచుకు పడుతుందని సమాచారం ఉండటంతో ప్రస్తుతానికి ఏమీ చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నారు. ఇక ఉగ్రవాదులు అణు దాడులు చేసే ప్రమాదం ఉందన్న వాదనలను కూడా రక్షణ శాఖ వర్గాలు ఖండిస్తున్నాయి. పొరపాటున ఆ ఆయుధాలు వాళ్ల చేతికి వెళ్లినా.. వాటి కోడ్లు, సాంకేతిక వివరాలు అన్నీ తెలుసుకుని వాటిని ఆపరేట్ చేయడం మాత్రం సాధ్యం కాని పని అని అంటున్నారు. -
సర్జికల్తోలష్కరేకు చావుదెబ్బ
బారాముల్లా/న్యూఢిల్లీ: ఇటీవల భారత సైన్యం సర్జికల్ దాడుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఎక్కువగా నష్టపోయినట్లు పాకిస్తాన్ ఆర్మీ రేడియో తరంగాల విశ్లేషణలో వెల్లడైంది. దాదాపు 20 మంది లష్కరే ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. దాడి తర్వాత పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల సంభాషణల రేడియో తరంగాలపై అనుక్షణం నిఘా ఉంచినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత్లోని కుప్వారా సెక్టార్కు ఎదురుగా ఉన్న పీవోకేలోని కెల్ అండ్ దుడ్నియాల్ వద్ద దాడుల్లో 10 మంది లష్కరే ఉగ్రవాదులు మరణించారు. తర్వాత పాక్ ఆర్మీ వాహనాల్లో ఆ మృతదేహాల్ని తీసుకెళ్లి ఖననం చేశారు. పూంచ్ సెక్టారుకు ఎదురుగా ఉన్న బాల్నోయ్ ప్రాంతంలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్పై సర్జికల్ దాడుల్లో 9 మంది లష్కరే ఉగ్రవాదులు మరణించినట్లు పాకిస్తాన్ ఆర్మీ రేడియో సంభాషణల వల్ల తేలింది. దాడిలో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. -
అవును.. మా సైన్యం చావుదెబ్బ తింది: పాక్ పోలీసు
తమ ఉన్నతాధికారితో మాట్లాడుతున్నానని భావించిన పాకిస్థానీ పోలీసు అధికారి సర్జికల్ స్ట్రైక్స్ గురించిన వాస్తవాన్ని తన నోటితోనే వెల్లడించాడు. పాక్ సైనికుల్లో కూడా ఐదుగురు మరణించారని వెల్లడించాడు. భారత దేశానికి చెందిన ఒక జాతీయ మీడియా చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో ఈ విషయం వెల్లడైంది. ఐజీ ముస్తాక్ పేరుతో గులాం అక్బర్కు పాత్రికేయుడు మనోజ్ గుప్తా ఫోన్ చేశారు. ''సర్.. అది రాత్రి సమయం. సుమారు 3 నుంచి 4 గంటల వరకు పట్టింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జరిగింది. అప్పటివరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి'' అని అక్బర్ ఫోన్లో చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మీర్పూర్ రేంజికి చెందిన స్పెషల్ బ్రాంచి ఎస్పీ అయిన గులాం అక్బర్ ఆ దాడుల గురించి మొత్తం వివరాలన్నీ పూసగుచ్చినట్లు వివరించారు. పాకిస్థానీ సైనికులకు ఏం చేయాలో దిక్కు తోచలేదని.. దాంతో ఐదుగురు సైనికులు మరణించారని కూడా ఆయన వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలను కూడా పాక్ సైన్యం వెంటనే అక్కడినుంచి తొలగించిందని, అయితే ఎంతమంది ఉగ్రవాదులు మరణించారో మాత్రం తెలియదని గులాం అక్బర్ అన్నారు. దాడులు జరిగిన ప్రాంతాల పేర్లు కూడా తెలిపారు. ఫలానా ప్రాంతాల్లో దాడులు జరిగాయంటూ ఎస్పీ అక్బర్ చెప్పిన ప్రాంతాలన్నీ ఇంతకుముందు తాము దాడులు చేసినట్లుగా భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ చెప్పిన ప్రాంతాలేనని కూడా తేలింది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్థానీ సైన్యం ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టిందని చెబుతూ.. ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ సైన్యం సాయం చేస్తోందని కూడా ఆయన వివరించారు. 'ఆర్మీయే వాళ్లను తీసుకొస్తుంది.. అది వాళ్ల చేతుల్లోనే ఉంది' అని అన్నారు. జీహాదీల విషయాలను స్థానిక పోలీసులకు కూడా తెలియనివ్వకుండా పాక్ సైన్యం కాపాడుతుంది కాబట్టి ఎంత మంది ఉగ్రవాదులు మరణించారో మాత్రం తనకు తెలియదని అన్నారు. -
సర్జికల్ స్ట్రైక్స్.. భారత్ డ్రామానా?
దాడులు జరగలేదంటూ పాక్ మీడియా కథనాలు భారత్ సర్జికల్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ విలేకరుల ఎల్వోసీ పర్యటన ఆదివారం ఆ దేశ పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. పాక్ ఆర్మీ ఆధ్వర్యంలో ఎల్వోసీని సందర్శించిన విలేకరులు.. సర్జికల్ దాడులు జరిగినట్టు ఆధారాలు లేవన్న సైన్యం వ్యాఖ్యలనే సమర్థించారు. ఈ పర్యటన నేపథ్యంలో ‘భారత్ నాటకం బట్టబయలైంది’ అంటూ పాక్లో అత్యధిక సర్క్యలేషన్ కలిగిన ఉర్దూ డైలీ ‘జంగ్’ శీర్షిక పెట్టింది. మరో రైట్వింగ్ పత్రిక ‘ఉమ్మాత్’.. ‘భారత్వి అబద్ధాలు.. అసత్యాలు బట్టబయలు’ అంటూ హెడ్లైన్ పెట్టింది. ‘భారత్ అపోహను బద్దలు చేసిన జర్నలిస్టులు’ అంటూ ఇంగ్లిష్ దినపత్రిక ‘ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం రాసింది. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ)లోని పలు ప్రాంతాలను జర్నలిస్టులకు చూపించారు. ఐఎస్ఐ ప్రజాసంబంధాల అధికారి వారికి ఈ ప్రాంతాల గురించి వివరించారు. ఈ సందర్భంగా స్థానికులు, మిలిటరీ అధికారులతో ఇంటర్వ్యూలు నిర్వహించిన జర్నలిస్టులు.. భారత్ చెప్పినట్టు సర్జికల్ స్ట్రైక్స్ (నిర్దేశిత దాడులు) జరగలేదన్న పాక్ సైన్యం వాదనపై సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు పాక్లో కీలకమైన ‘డాన్’ పత్రికకు వ్యాసం రాస్తూ.. మానవ హక్కుల నేత ఐఏ రహమాన్ కశ్మీర్ విషయంలో ప్రధాని నవాజ్ షరీఫ్ తీరును ప్రశంసించారు. కశ్మీర్ ప్రజల దుస్థితిని అంతర్జాతీయ సమాజం ముందుకు తెచ్చేందుకు షరీఫ్ తన శాయశక్తులా కృషి చేశారని, ఐరాస జనరల్ అసెంబ్లీలో ఈ అంశంపై ప్రస్తావించడమే కాకుండా.. ఈ సందర్భంగా న్యూయార్క్లో ప్రపంచాధినేతలను కలిసి కశ్మీర్ గురించి వివరించారని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు. -
సర్జికల్ స్ట్రైక్స్ కాదు!: పాక్
-
సర్జికల్ స్ట్రైక్స్ కాదు!: పాక్
♦ కేవలం పరస్పర కాల్పులు జరిగాయి ♦ భారత్ చెబుతున్నవన్నీ అబద్ధాలే ♦ మా భూభాగంపై దాడులు చేస్తే.. మేమూ దాడి చేస్తాం ♦ ప్రకటనలు చేసిన పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక దళం ♦ దీటుగా ఎదుర్కొనేందుకు మేం సిద్ధం: పాక్ ప్రధాని షరీఫ్ ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమని పాకిస్తాన్ పేర్కొంది. అది పరస్పర కాల్పుల ఘటన మాత్రమేనని.. దానిని భారత్ సర్జికల్ దాడులుగా చెప్పుకొంటూ మీడియా హైప్ను సృష్టిస్తోందని పేర్కొంది. ఈ మేరకు గురువారం పాక్ సైన్యం, వాయుసేన ప్రకటనలు చేశాయి. ‘నియంత్రణ రేఖ దాటి భారత్ సర్జికల్ దాడులేమీ చేయలేదు. ఎప్పట్లాగే భారత్ కాల్పుల విరమణను ఉల్లంఘించి కాల్పులు జరిపింది. దీంతో సహజంగానే పాక్ సైన్యం దీటుగా బదులిచ్చింది. కానీ పాక్ అధీనంలోని భూభాగంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయనే తప్పుడు ఉద్దేశాన్ని కల్పించేందుకే సర్జికల్ దాడులంటూ అవాస్తవ ప్రచారం మొదలుపెట్టింది’ అని పాక్ ఆర్మీ ఆరోపించింది. ఒక వేళ తమ భూభాగంపై భారత్ సర్జికల్ దాడులు చేస్తే.. అందుకు దీటుగా దాడులు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించింది. సర్జికల్ దాడుల పరిస్థితే వస్తే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని వాయుసేన పేర్కొంది. బుధవారం రాత్రి భారత జవాన్లు సాధారణ తుపాకులతో కాల్పులు జరిపారని, తమ సేనలు దీటుగా స్పందించాయని పాక్ రక్షణమంత్రి అసిఫ్ చెప్పారు. నిష్కారణంగా ఉల్లంఘన: షరీఫ్ నియంత్రణ రేఖ వెంబడి భారత్ నిష్కారణంగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని.. విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఇద్దరు సైనికుల మరణానికి కారణమైందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. నియంత్రణ రేఖ వద్ద ప్రస్తుత పరిస్థితి గురించిషరీఫ్, ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్తో చర్చించారు. తమ భూభాగం సమగ్రతను సంరక్షించుకునేందుకు సాయుధ దళాలన్నీ సంసిద్ధంగా ఉన్నాయన్నారు.శాంతి, సామరస్యాల కోసం తాము చూపుతున్న సహనాన్ని తమ బలహీనతగా భావించొద్దని సూచించారు.పాక్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఎలాంటి కుట్రనైనా ఎదుర్కోగల సత్తా తమకు ఉందన్నారు. పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్జికల్ దాడుల ఘటన గురించి షరీఫ్కు నివేదికను సమర్పించారు. శుక్రవారం జరిగే పాక్ కేబినెట్ భేటీలో తొలి అంశంగా కశ్మీర్లో పరిస్థితిని చర్చిస్తారు. ‘ఉడీ’కి రుజువులుగా కాగితం ముక్కే: ఉడీలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటివరకు భారత్ తమకు చిన్న కాగితం ముక్కను మాత్రమే ఆధారంగా సమర్పించిందనీ, రుజువులు లేకుండా తమని నిందిస్తోందని పాక్ ఆరోపించింది. ఉడీ దాడిపై భారత్ దర్యాప్తు కోసం వేచి ఉంటామనీ, సమాచారానికి, ఆధారానికి తేడా ఉంటుందని పాకిస్తాన్ విదే శాంగ శాఖ ప్రతినిధి అన్నారు. ‘భారత్ మాకు కాగితం ముక్క మాత్రమే ఇచ్చింది. ఇంతకు ముందు జరిగిన ఘటనల్లోనూ పాక్పై ఆరోపణలు చేసి కాగితం ముక్కలే ఇచ్చింది. వివరాల కోసం మేం నిరీక్షిస్తున్నాం’ అని విదేశాంగ ప్రతినిధి అన్నారు. -
మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్
శ్రీనగర్ : పాకిస్థాన్ ఆర్మీ తరచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. తాజాగా గురువారం ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలోని నౌగమ్ సెక్టర్పైకి కాల్పులు జరిపాయి. సెక్టర్లోని దనిష్, లక్ష్మీ పోస్టులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి. అయితే వెంటనే స్పందించిన... భారత ఆర్మీ కూడా ఎదురు కాల్పులకు దిగింది. ఇరువైపులా కాల్పులు హోరా హోరీగా సాగుతున్నాయని పోలీసులు తెలిపారు. -
తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం..!
ఇస్లామాబాద్ః ఉరీ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న భారత్ నుంచి ఎప్పుడు ఎటువంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న అనుమానంతో పాకిస్థాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా పాక్ ఆర్మీ... భారత సరిహద్దుల్లో పర్యవేక్షణనును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ నేతృత్వంలో ఓ సమావేశం నిర్వహించారు. ఉరీ దాడిలో తమ ప్రమేయముందన్న భారత్ ఆరోపణలను ఈ సందర్భంలో తిరస్కరించారు. ఉరీ ఘటన అనంతరం భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుపై తీక్షణమైన నిఘా పెట్టామని, భారత్ నుంచి ఎటువంటి స్పందన ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ఆర్మీ వెల్లడించింది. తూర్పు సరిహద్దుల్లోని పరిణామాలను తాము ఎప్పటికప్పుడు దగ్గరగా పరిశీలిస్తున్నట్లు పెషావర్ లోని జరిగిన భద్రతా సమావేశం అనంతరం పాకిస్థాన్ సైనిక ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ సలీమ్ బజ్వా వెల్లడించారు. అలాగే ఆప్ఘనిస్థాన్ సరిహద్దు వద్ద భద్రతపైనా సమావేశంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్లో ఉరీ సైనిక స్థావరంపై సెప్టెంబర్ 18న జరిగిన దాడిలో 18 మంది సైనికులు మరణించినప్పటినుంచీ భారత్, పాకిస్థాన్ దౌత్య సంబంధాలమధ్య చీలిక ఏర్పడింది. ఉరీ ఘటనలో తమ ప్రమేయం ఉందన్న భారత్ ఆరోపణలను ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రతిస్పందనను ఎదుర్కొనేందుకు సరిహద్దు నిర్వహణపై సాయుధ దళాల సమావేశంలో చర్చించినట్లు లెఫ్టినెంట్ జనరల్ బజ్వా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదురయ్యే ప్రతి చర్యనూ ఎదుర్కొనేందుకు సరిహద్దుల్లో పర్యవేక్షణను ముమ్మరం చేసినట్లు తెలిపారు. -
గెలుపెరగని గొప్ప సైన్యం
జాతిహితం భారత్పై 1965 యుద్ధంలో, అఫ్ఘాన్లో సోవియట్ వ్యతిరేక యుద్ధంలో విజయాలు సాధించానని గొప్పలు చెప్పుకునే పాక్ సైన్యం పెద్ద భూభాగాన్ని పోగొట్టుకుంది, ఆర్థిక, మేధోపరమైన పెట్టుబడులను దేశం నుంచి తరిమేసింది. పాక్ పాస్పోర్ట్ గౌరవాన్ని నాశనం చేసేసింది. ప్రపంచ జిహాదీ విశ్వవిద్యాలయం స్థాయికి దేశాన్ని కుదించేసింది. దేశ బడ్జెట్లోనూ, ప్రతిష్టలోనూ చాలా భాగాన్ని వెచ్చించి మరీ అది ఇదంతా సాధించింది. తన దేశాన్ని తానే నాశనం చేసుకుంటున్న ప్రపంచంలోని అత్యుత్తమ సైన్యం అది! పాకిస్తాన్ సైన్యం మీద మీ అభిప్రాయం ఏమిటి? అదో ఉత్తమ సైన్యమా, లేక అధమ సైన్యమా? గొప్ప సైన్యమా, లేక దుష్ట సైన్యమా? అజేయ సైన్యమా లేక ఓటమిపాలు కావడంలో ఆరితేరిన సైన్యమా? అది పాక్ జాతీయ సైన్యమా లేక సైనిక దుస్తుల్లో ఉన్న, అణ్వాయుధ సంపత్తిగలిగిన మరో లష్కరే ఉగ్రవాద సేనా?ఇలా ఎన్నయినా అడగొచ్చు. నేటి అతి జాతీ యవాద చర్చలో మీరు ఏ పక్షాన నిలిచేవారనేదాన్ని బట్టి సమాధానం ఉంటుంది. ఒక భారత పక్షపాతిగా నేను ఆ దుర్గుణాలనన్నిటినీ ప్రయోగిం చవచ్చు. లేదంటే పైన పేర్కొన్న చాలా సుగుణాలను పేర్కొని ఎక్కడో ప్రవాసంలో గడపాల్సి రావచ్చు. లేకపోతే మన టీవీ చానళ్ల ప్రైమ్ టైమ్ యుద్ధ యోధులలాగా పాక్ సైన్యం అంటే.. సరిగ్గా బాలీవుడ్ యుద్ధ చిత్రాల్లో చిత్రీకరించినట్టే, యానిమేటెడ్ కమాండో కామిక్స్ కలిగించే భావనలా మొద్దు రాచిప్పలు, పిరికిపందలనీ, సులువుగా చిత్తుచేయగలిగిన వారనీ, సైనిక లక్ష ణాలే లేనివారుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మన సైన్యం మాత్రం అతి గొప్పది కావాలి, అతి గొప్పది కూడా. పాక్ సైన్యం ఆలోచనా విధానం, ఉద్దేశ్యాలు, గత చరిత్ర, నేడు సాగు తున్న ఆలోచనా క్రమం అనే వాటి విశ్లేషణ, ప్రత్యేకించి జాతి ప్రయోజనా లను దృష్టిలో ఉంచుకుని చేసే విశ్లేషణ అత్యంత కీలకమైన అవసరం. అయితే పాక్ భావజాలానికి కట్టుబడ్డ రాజ్యమా, దాని సైన్యం కూడా అలాంటిదేనా లేక భిన్నమైనదా? మనం సైన్యాన్ని పక్కనబెట్టి ప్రభుత్వంతో (ప్రజలతో) వ్యవహరించగలమా? లేక అందుకు విరుద్ధంగా చేయాలా? ప్రభుత్వం తోనూ, సైన్యంతోనూ కూడా వ్యవహరించాల్సి ఉంటే.. ముందు ఎవరితో వ్యవహరించాలి? అదసలు సాధ్యమేనా? ఈ బహు సందిగ్ధతలను పరిష్క రించడమే పాక్తో వ్యవహరించడంలోకెల్లా అత్యంత సంక్లిష్టమైనది, సవా లుగా నిలిచేది. భ్రమాత్మక విజయాల హోరు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం నేనీ జాతిహితం కాలం రాసేటప్పుడు నా మేధస్సుకు ప్రేరణనిచ్చేది సంక్లిష్టతే. వృత్తి రచయితలమైన మాలో ఎవరికీ ఓ 1,300 పదాలను చిత్రిక పట్టేసి కథనాన్ని అల్లి పడేయడం సమస్యేమీ కాదు. కాకపోతే సంక్లిష్టత, మీ మేధస్సును సవాలు చేసి సమాధానాల కోసం అన్వేషించేలా చేస్తుంది. అలా మాకు లభించే సమాధానాలు తరచుగా కచ్చి తమైనవని చెప్పలేం కూడా. కాబట్టి వాదనాత్మకమైన మా మస్తిష్కాలకు అది మరింత సంతృప్తిని కలిగిస్తుంది. ఉదాహరణకు, పాక్ సైన్యానికి వ్రతికూ లంగా పైన ప్రయోగించిన... అధమ, దుష్ట, ఓడటంలో ప్రసిద్ధిచెందిన, ఇస్లామిక్ లష్కర్ వంటి విశేషణాలన్నిటికీ అవి సరైనవేనని రైటు కొట్టేయ లేను. కానీ అదే నేడు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఫ్యాషన్, కానీ అది అతి సరళమైనది. వృత్తి సైనికులైన మన సొంత సైన్యానికి కూడా తమ బద్ధ శత్రువుల గురించి అలాంటి అభిప్రాయమే ఉండొచ్చు. అందువల్లనే 1947 తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అన్ని యుద్ధాల్లోనూ మనం విజయం సాధించామని చివరికి నిర్ధారించవచ్చు. మీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే, ప్రత్యేకించి బతికి బలుసాకు తినైనా బతకొచ్చనుకుంటే.. ఆ అంశాన్ని గురించి చెప్పడానికి ఎవరైనా సుప్ర సిద్ధ విదేశీ నిపుణుడు ఉంటారేమో వెతకండి. కాబట్టి నేను భారత్- పాకిస్తాన్ల విషయంలో, ప్రత్యేకించి ఇరు దేశాల సేనల విషయంలో ప్రపంచ మంతా గౌరవించే నిపుణులు ప్రొఫెసర్ స్టీఫెన్ పీ. కోహెన్ మాటలను అరువు తెచ్చుకుంటాను. ఆయన తన సుప్రసిద్ధ రచన ‘ద పాకిస్తాన్ ఆర్మీ’ (హిమా లయన్ బుక్స్, 1984)లో పాక్ సైన్యాన్ని ప్రపంచంలోని అత్యంత ఉత్తమమైన సేనలలో ఒకటైనా ఏ ఒక్క యుద్ధంలోనూ గెలవనిదిగా అభివర్ణించారు. 1965 యుద్ధంలో గెలుపొందామని పాక్ భావిస్తుండగా కోహెన్ అది ఎన్నడూ గెలవలేదని ఎలా అంటారు? నేడు పాక్ మరో యుద్ధంలో.. అఫ్గా నిస్తాన్లో సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధానికి కూడా వర్తింపజేస్తోంది. అదే వ్యూహాన్ని అది తన నిజమైన శత్రువైన భారత్ విష యంలోనూ అనుసరిస్తోంది. మాయా భుజకీర్తుల భారం అదే పాక్ సైన్యంతో ఉన్న నిజమైన సమస్య. అది భ్రమలకు గురవుతోంది. ఈ ఆలోచనను అది వ్యవస్థీకృతం చేయడమే కాదు తరాలతరబడి 1965లో గెలుపొందామనే భావిస్తోంది. ఆ స్వీయ వశీకరణను తిరిగి పునరుజ్జీవింప జేస్తూ ఏటా సెప్టెంబర్ 6ను ‘పాకిస్తాన్ రక్షణ దినం’గా పాటిస్తోంది. పాక్లో చాలా సందర్భాల్లో, ప్రత్యేకించి ఈ వేడుకలు జరుగుతుండగా ఎవరూ దాన్ని ప్రశ్నించ సాహసించలేరు. మన అత్యుత్తమ సేనా నాయకులు 1965 యుద్ధ చరిత్రను చక్కగా నమోదు చే శారు. పరస్పర అసమర్థతలతో సాగిన 1965 యుద్ధం మూడు వారాల్లోనే ప్రతిష్టంభనకు దారి తీసిందని అంచనా కట్టారు. వారిని అడ్డుపెట్టుకుని నేనా మాట అనేసి తప్పించుకోగలను. కానీ పాక్లో అలా కాదు. పాక్ సైన్యానికి అనుకూలమైన అంశాలు చాలానే ఉన్నాయి. దానికి బలమెన పోరాట సైన్యం ఉంది. ఆ విషయంలో అది ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్కు దగ్గరగానే ఉంటుంది. ఆధునిక సాంకేతికతను ఇముడ్చుకోగలిగిన, వృత్తి నిపుణులలాగా కమాండర్ల ఆదేశాలను పాటించే బలమైన ఇస్లామిక్ సైన్యం ప్రపంచంలో అదొక్కటే. కాకపోతే దానితో ఉన్న సమస్యేమిటంటే అది ఎప్పుడూ తన పాత్రను మరింత విస్తృతమైనదిగా, గొప్పదిగా, భావ జాలాత్మకమైనదిగా భావిస్తుంది. మరే ఇతర వృత్తి సైనికుల సైన్యం కన్నా తన సైన్యమే అత్యంత నైతికమైనదని, పవిత్రమైనదని భావిస్తుంది. సమస్య తలెత్తేది అక్కడే, అదే మనకు సమస్యలను తెచ్చిపెడుతుంది. పాక్కు సైతం సమస్యలను కల్పిస్తుంది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది అలా తలెత్తిన సమస్యల్లో ఒకటి. పాక్ ప్రస్తుతం దాని రాజకీయ, సైనిక చరిత్ర లోనే ఎన్నడూ ఎరుగని దశలో ఉన్నది. నేడు సైనిక ప్రధాన కార్యాలయం, (జీహెచ్క్యూ) అధికారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు గానీ పూర్తిగా నియంత్రిస్తోంది. గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి జీహెచ్క్యూ పలు విన్యాసాలను సాగించి.. ఆయన ప్రభుత్వ రాజకీయ అధికారాన్నే కాదు నైతిక అధికారాన్ని కూడా ధ్వంసం చేసేసింది. జీహెచ్క్యూ జాతీయ అంతర్గత, బాహ్య భద్రతను, విదే శాంగ విధానాలను పూర్తిగా నియంత్రిస్తోంది. సైన్యం దన్నుతో తహ్రీరుల్ ఖాద్రీ, ఇమ్రాన్ ఖాన్లు ఇస్లామాబాద్ను దిగ్బంధనం చేయడంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వపు ప్రాబల్యం క్షీ ణించిపోవడం ప్రారంభమైంది. అది కాస్తా, పనామా పేపర్స్లో నవాజ్ షరీఫ్ కుటుంబం కనబడటంతో పూర్తయింది. స్వీయ పరాజయాల ఘన సేన ప్రజలలో ఎక్కువ మందికి, ప్రత్యేకించి మేధావి వర్గానికి ‘‘సోమరి పోతు దొంగల’’ ప్రభుత్వం మీద కంటే ఒక సంస్థగా సైన్యంపై ఎక్కువ నమ్మకం ఉంది. సుప్రసిద్ధ పాక్ యుద్ధ వీరుల కుటుంబాల నుంచి వచ్చిన జనరల్ రహీల్ షరీఫ్ నేడు ఆరాధ్యనీయుడైన, నమ్మదగిన పాక్ జనరల్గా మారారు. మనం మన చిక్కు ప్రశ్నను ఇక ఇక్కడ లేవనెత్తవచ్చు. అంతటి ప్రజాభి మానానికి, గౌరవానికి పాక్ సైన్యం అర్హమైనదేనా? సమాధానాల కోసం ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు చేసిందో వాటిని చూద్దాం. కశ్మీర్ను జయించి, సమస్యను పరిష్కరిస్తానని వాగ్దానం చేస్తూ సైన్యం పాక్ అధికార వ్యవస్థలోను, రాజకీయ వ్యవస్థలోనూ తన ప్రబల స్థానానికి సమంజసత్వాన్ని కల్పించుకుంటున్నది. కానీ గత 70 ఏళ్లుగా ప్రయత్ని స్తున్నా-పోరాడుతున్నా అది ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలమైంది. నిజానికి, కార్గిల్, తర్తుక్ మొదలైన ప్రాంతాలలోని సియాచిన్ను కోల్పో వడంతో 1948లో కంటే తక్కువ కశ్మీర్ భూభాగమే నేడు పాక్ చేతుల్లో ఉంది. బంగ్లాదేశ్ అనే మాట వినబడ్డ క్ష ణాన్నే పాక్ భౌగోళిక, భావజాల సరిహద్దు లను కాపాడేది తానేనన్న సైన్యం మాట ఆవిరైపోయింది. దేశ భూభాగంలో చాలా భాగాన్ని, మెజారిటీ జనాభాను కోల్పోయింది. ఉపఖండంలోని ముస్లింలంతా సాంస్కృతిక, భాషాపరమైన, జాతిపరమైన వైవిధ్యాలకు అతీతంగా భావజాల ప్రాతిపదికపై ఒకే దేశంగా ఉండటమనే దాని భావజా లానికి ప్రాతిపదికను అదే కూలదోసేసింది. ఇక అఫ్గాన్లో సోవియట్లను ఓడించానంటున్న అది అక్కడ ఇంకా అఫ్ఘాన్లతోను, స్వదేశంలో వారి జిహాదీ సోదరులతోను పోరాడుతుండటమే అది చెప్పే దాన్ని ఓడిస్తుంది. గొప్పగా చెప్పుకునే పాక్ సైన్యం దశాబ్దాలుగా తన భూభాగాన్ని పోగొ ట్టుకుంది, ఆర్థిక, మేధోపరమైన పెట్టుబడులను దేశం నుంచి వెళ్లగొట్టేసింది. దానికి ఇష్టం ఉన్నా లేకున్నా ఇది పాక్ పాస్పోర్ట్ గౌరవాన్ని నాశనం చేసేసింది. దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జిహాదీ విశ్వ విద్యాలయం స్థాయికి కుదించేసింది. దేశ బడ్జెట్లోనూ, ప్రపంచంలో పాక్కు ఉన్న పలుకుబడిలోనూ చాలా భాగాన్ని వెచ్చించి మరీ సైన్యం ఇదంతా సాధించింది. 1985లో నేను మొదటిసారి పాక్కు వెళ్లేసరికి అది భారత్ కంటే సంపన్న దేశంగా, ఆధునికమైనదిగా ఉండేది. పాక్ తలసరి ఆదాయం భారత్ కంటే 65 శాతం ఎక్కువగా ఉండేది. సరిగ్గా అ సమయంలోనే అది (అఫ్ఘాన్ ప్రేరేపించగా) సీమాంతర ఉగ్రవాదాన్ని భారత వ్యతిరేక ఆయుధంగా ప్రయోగించడం ప్రారంభించింది. భారత్ నెత్తురోడుతూ, క్షీణిస్తుందని, మర ణిస్తుందని ఆశించింది. అందుకు విరుద్ధంగా భారత్ వృద్ధి చెందుతూనే వచ్చింది, పాక్ సరికొత్త లోతులకు పడిపోతూ వచ్చింది. ఒకప్పుడు భారత్ కంటే 65 శాతం కంటే ఎక్కువగా ఉన్న దాని తలసరి ఆదాయం నేడు 20 శాతం తక్కువకు పడిపోయింది. భారత్ తలసరి ఆదాయం ఏటా 5-6 శాతం పెరుగుతోంది. అది భారత్ ఆర్థిక వృద్ధి రేటుకంటే, పాక్ జనాభావృద్ది రేటు కంటే కూడాఎక్కువ. కాబట్టి అప్పుడప్పుడూ కొందరు భారతీయుల మర ణాలకు కారణమైనందుకు పాక్ సైన్యం సంతోషపడ్డా... అది తనకు బందీగా ఉన్న దేశాన్ని, యుద్ధాన్ని కూడా కోల్పోయింది. తన దేశాన్ని తానే నాశనం చేసుకుంటున్న ప్రపంచంలోని అత్యుత్తమ సైన్యం అది! శేఖర్ గుప్తా twitter@shekargupta -
తెగబడితే.. భారీ మూల్యమే!
-
తెగబడితే.. భారీ మూల్యమే!
భారత్పై పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ ప్రేలాపనలు కశ్మీర్ అసంపూర్ణ ఎజెండా అని అభివర్ణణ ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్ను రెచ్చగొట్టడమే పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన ఎజెండాగా మారినట్లు కనిపిస్తోంది. ఓ వైపు సరిహద్దుల వెంట నిరంతర కాల్పులతో.. మరోవైపు, కవ్వింపు వ్యాఖ్యలతో భారత్పై కాలు దువ్వుతోంది. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్, దేశ విభజనలో మిగిలిపోయిన అసంపూర్ణ ఎజెండాగా కశ్మీర్ను అభివర్ణించడంతో పాటు.. ‘శత్రు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే.. వారు భరించలేని స్థాయిలో నష్టం కలిగిస్తామ’ంటూ, భారత్ పేరును ప్రస్తావించకుండా హెచ్చరించారు. సత్వర, స్వల్పకాలిక భవిష్యత్ యుద్ధరీతులను తక్షణమే ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందంటూ భారతీయ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ గతవారం చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. 1965 భారత్ పాక్ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రావల్పిండిలో ఆదివారం ఓ ప్రత్యేక కార్యక్రమంలో రహీల్ పాల్గొన్నారు. ‘ఎలాంటి విదేశీ దాడులనైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధంగా ఉంది. చిన్నదైనా, పెద్దదైనా.. శత్రుదేశం ఏ స్థాయి దుస్సాహసానికి పాల్పడినా.. భరించలేని మూల్యం చెల్లించేలా మన స్పందన ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. అంతర్గతమైనా, బహిర్గతమైనా.. సాంప్రదాయకమైనా, పాక్షిక సాంప్రదాయకమైనా.. కోల్ట్ స్టార్ట్(హఠాత్తుగా పాక్తో యుద్ధం ఆరంభమైతే తక్షణమే స్పందించేలా ఇండియన్ ఆర్మీ రూపొందించిన తాజా విధానం) అయినా, హాట్ స్టార్ట్ అయినా ఏ విధమైన దాడులనైనా ఎదుర్కొనేందుకు పాక్ సైన్యం సర్వసన్నద్ధం. వియ్ ఆర్ రెడీ’ అంటూ సవాలు విసిరారు. కశ్మీర్ ఒక అసంపూర్ణ ఎజెండా అని, కశ్మీర్లో ప్లెబిసైట్(ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న ఐరాస తీర్మానం ప్రకారం నడచుకోవాలని, కశ్మీర్ సమస్యను తాము అప్రాధాన్య అంశంగా పరిగణించబోమని వ్యాఖ్యానించారు. పాక్లో ఉగ్రవాద వ్యవస్థలను తుదముట్టిస్తామని ప్రతినబూనారు. జనరల్ రహీల్ వ్యాఖ్యలను బీజేపీ, కాంగ్రెస్లు పిచ్చి ప్రేలాపనలుగా కొట్టేశాయి. ‘గతంలో భారత్తో జరిగిన యుద్ధాల్లో ఎదుర్కొన్న ఘోర పరాజయాలను మరిచిపోయి, పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఓవైపు, దేశంలో నెలకొన్న అంతర్గత సంక్షోభం, మరోవైపు భారత్లో ఉగ్రదాడుల వెనుక పాక్ హస్తం బహిర్గతమవడం.. వీటితో నిస్పృహకు లోనై ఈ విధమైన అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ విమర్శించారు. కొనసాగుతున్న పాక్ కాల్పులు జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంట పాక్ ఆర్మీ భారీ ఎత్తున కాల్పులకు పాల్పడుతోంది. ఎల్ఓసీకి దగ్గర్లో ఉన్న భారతీయ ఆర్మీ ఔట్ పోస్ట్లపై, సమీపంలోని జనావాసాలపై సోమవారం 120 ఎంఎం మోర్టార్ బాంబులతో విచక్షణారహితంగా దాడులకు తెగబడింది. పాక్ కాల్పుల్లో ఒక గ్రామీణుడు చనిపోగా, నలుగురు గాయాలపాలయ్యారు. భారత్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించడంతో సోమవారం రాత్రి వరకు ఇరుపక్షాల మధ్య కాల్పులు కొనసాగాయి. పాక్ తొలి స్వదేశీ ద్రోన్ తొలిసారి దేశీయంగా తయారు చేసిన, సాయుధ ద్రోన్ బురాఖ్ను సోమవారం పాక్ రంగంలోకి దింపింది. తొలి దాడిలోనే ఆ ద్రోన్ అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లోని షావల్ ప్రాంతంలో ఒక ఉగ్రవాద స్థావరంలో దాక్కుని ఉన్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను హతమార్చింది. పైలట్ రహిత చిన్న విమానం ఆ స్థావరంపై బుర్ఖ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. బురాఖ్ రూపకల్పనతో క్షిపణులను ప్రయోగించగల ద్రోన్లను కలిగి ఉన్న అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, చైనాల సరసన పాకిస్తాన్ కూడా చేరింది. -
వైమానిక దాడులు : 14 మంది తీవ్రవాదుల హతం
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన ఉత్తర వజీరిస్థాన్లోని షావల్లో పాక్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 14 మంది తీవ్రవాదుల మరణించారని సైనిక దళాల ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే మరణించిన తీవ్రవాదులు ఏ దేశానికి చెందిన వారు అనే విషయాన్ని మాత్రం తెలపలేదు. ఉత్తర వజీరిస్థాన్లోని తీవ్రవాదులను మట్టుబెట్టే లక్ష్యంతో 2014 జూన్ నుంచి భద్రత దళాలు దాడులు జరుపుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 3 వేల మందికిపైగా తీవ్రవాదులు మరణించారని చెప్పారు. అలాగే 300 మంది సైనికులు కూడా మృతి చెందారని సైనిక దళాల ఉన్నతాధికారి వివరించారు. -
జమ్ముకాశ్మీర్ లో పాక్ మరోసారి కాల్పులు
జమ్ముకాశ్మీర్ : సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద, జమ్ముకాశ్మీర్ లోని మరికొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. పూంచ్ జిల్లాలో పాక్ సైన్యం కాల్పులు జరిపిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ మెహతా వెల్లడించారు. బాలాకోట్ ప్రాంతంలో కాల్పులు ప్రారంభించగానే మన సైన్యం ఎదురు దాడికి దిగగానే రాత్రి పది గంటల సమయంలో పాక్ కాల్పులు విరమించినట్లు తెలిపారు. కానీ పూంచ్ జిల్లాలో మాత్రం కొద్దిసేపు కాల్పులు ఆపి మళ్లీ రాత్రి 10 గంటల నుంచి 10:30 వరకు కొనసాగించారని మెహతా చెప్పారు. -
కాల్పులు.. సూక్తులు..!
భారత్పై పాక్ తీరు ఇస్లామాబాద్/శ్రీనగర్: ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్.. మరోవైపు తమ దేశంపై నిందలు మోపే అలవాటును మానేయాలంటూ భారత్కు నీతులు చెప్తోంది. గత వారం రోజులుగా స్వల్ప విరామాలతో నియంత్రణ రేఖ వద్ద, అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సరిహద్దు దళాలపై పాక్ ఆర్మీ వరుస కాల్పులకు తెగబడుతోంది. తాజాగా, జమ్మూకశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో ఉన్న హమీర్పూర్ సెక్టార్లోని భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ పోస్టులపై ఆదివారం రాత్రంతా పాక్ సైన్యం ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్ షెల్స్, 120 ఎంఎం మోర్టార్లతో దాడులు చేసింది. దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. గత 9 రోజుల్లో 17 సార్లు పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. కాగా, ఇరు దేశాల మధ్య జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి చర్చలు జరగనున్న నేపథ్యంలో.. పాక్పై నిందలు మోపడం భారత్ ఆపేసి, సానుకూల దృక్పథంతో ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు రావాలని పాక్ మంత్రి ఆసిఫ్ సూచించారు. అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చారు జమ్మూకశ్మీర్లో అధికారంలో ఉన్న పీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చిందని ఆ రాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ మండిపడ్డారు. శ్రీనగర్లో సోమవారం ఒక ర్యాలీనుద్దేశించి ప్రసంగిస్తూ.. పాకిస్తాన్లో జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ యూనియన్ సదస్సులో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్కు పాక్ ఎందుకు ఆహ్వానం నిరాకరించిందో సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ‘కశ్మీర్ అంశంపై అసెంబ్లీలో చర్చించనంతవరకు ఒక్క పాకిస్తానే కాదు.. ఎవరూ కూడా ఈ అసెంబ్లీని సీరియస్గా తీసుకోరు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వమే కాదు, ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలూ అసెంబ్లీ పరువును దిగజార్చాయన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని, అఫ్జల్గురు ఉరిపై తీర్మానాన్ని తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. -
కాల్పుల విరమణపై మళ్లీ తూటా
సరిహద్దులో కాల్పులకు తెగబడిన పాక్ సైన్యం ఇద్దరు జవాన్లు, ఓ మహిళ మృతి శ్రీనగర్/జమ్మూ: పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. కాల్పుల విరమణకు మళ్లీ తూట్లు పొడిచి తెంపరితనాన్ని ప్రదర్శించింది. సరిహద్దుల వెంట కాల్పులు జరిపి ఇద్దరు జవాన్లు సహా ఓ మహిళను పొట్టనబెట్టుకుంది. జమ్మూకశ్మీర్లోని కతువా, సాంబా జిల్లాల్లో పాక్ సైన్యం ఈ ఘాతుకానికి తెగబడింది. ఈ కాల్పుల్లో 11 మంది పౌరులు కూడా గాయపడ్డారు. కాల్పుల మోత, మోర్టార్ల దాడితో సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడిపాయి. 1,400 మందికి పైగా ప్రజలు ఊళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. శుక్రవారం రాత్రి నుంచే పాక్ సైన్యం ఈ కాల్పులకు దిగిందని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాకేశ్ శర్మ తెలిపారు. భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టడంతో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కాసేపు కాల్పులు ఆపినా.. ఉదయం 7 గంటల సమయంలో మళ్లీ జనావాసాలపై మోర్టార్లతో దాడి చేసిందని వివరించారు. కతువా, సాంబా జిల్లాల్లోని 15 సరిహద్దు ఔట్పోస్టులు లక్ష్యంగా పాక్ ఈ కాల్పులు సాగించినట్లు తెలిపారు. ఈ ఘటనలో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని, కొన్నిచోట్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయని సాంబా ఎస్పీ అనిల్ మగోత్రా పేర్కొన్నారు. పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని, కొందరు బంకర్లలో తలదాచుకున్నారని కతువా డిప్యూటీ కమిషనర్ షాహిద్ ఇక్బాల్ చెప్పారు. ప్రస్తుతానికి నాలుగు గ్రామాలవారిని తరలించామన్నారు. పహార్పూర్, కతావ్, చరు, లొండి, పట్టి, కరోల్ గ్రామాలు, సాంబా సెక్టార్లో ఖ్వారా, రెగల్, చిల్యారి, మాంగుచాక్, చచ్యాల్, రామ్గఢ్, మలూచాక్, సుచేత్గఢ్ కులియన్, మావాలపై పాక్ కాల్పులు జరిపిందన్నారు. చనిపోయిన మహిళను మాంగుచాక్కు చెందిన టారి దేవిగా గుర్తించినట్లు తెలిపారు. చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఎనిమిది మంది ఉగ్రవాదులు భారత సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు యత్నిం చారు.భారత బలగాలు సకాలంలో గుర్తించి కాల్పులు జరపడంతో వారు వెనక్కి తగ్గారు. ఇది జరిగిన కాసేపటికే పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. స్నేహహస్తం చాచినా ఇలాగేనా?: తాము స్నేహహస్తం చాచినా పాక్ కాల్పులకు తెగబడుతూ కవ్విస్తోందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఆ దేశం పద్ధతిని మార్చుకోవాలన్నారు. ‘రేంజర్ల’పై అబద్ధాలేల?: సుష్మా న్యూఢిల్లీ: పాక్ రేంజర్లను కాల్చి చంపారంటూ ఆ దేశం చేస్తున్న ఆరోపణలను భారత్ ఖండించింది. సరిహద్దు వద్ద శాంతియుత వాతావరణానికి భంగం కలగకుండా వ్యవహరించాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్కు లేఖ రాశారు. డిసెంబర్ 31న భేటీకి పిలిచి భారత్ ఇద్దరు పాక్ రేంజర్లను కాల్చి చంపిందని అజీజ్ ఆరోపించారు. అయితే భారీ ఆయుధాలతో జనావాసాలపై కాల్పులు జరుపుతుండగా తమ బలగాలు ప్రతిఘటించాయని, ఈ సందర్భంగానే పాక్ రేంజర్లు మరణించారని సుష్మా స్పష్ట్టం చేశారు. 2014లో 550 ఉల్లంఘనలు.. 2014లో భారత సరిహద్దుల వెంట పాక్ ఏకంగా 550 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 2003లో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పట్నుంచీ ఒక ఏడాదిలో ఇన్నిసార్లు ఉల్లంఘించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గత ఆగస్టు, అక్టోబర్లో కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు సహా 13 మంది పౌరులు మరణించారు. 32 వేల మంది వలస వెళ్లారు. మొత్తమ్మీద కిందటేడాది పాక్ కాల్పుల్లో 19 మంది పౌరులు, ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా 150 మంది గాయాలపాలయ్యారు. -
మరోసారి తెగబడిన పాక్, తిప్పికొట్టిన జవాన్లు
జమ్మూ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సాంబ సెక్టార్లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. అంతకు ముందు కతువా, రాంఘర్, హిరనగర్, సాంబ సెక్టార్లలో పాక్, భారత్ సైన్యాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే పాక్ సైన్యం కాల్పులను జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. నిన్న రాత్రి నుంచి ప్రారంభమైన కాల్పులు...శనివారం తెల్లవారుజాము వరకూ కొనసాగాయి. కాల్పుల ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారి మాట్లాడుతూ పాక్ సైన్యం భారత భూభాగంలోని బీఎస్ఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. అయితే భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని ఆయన పేర్కొన్నారు. -
ఉగ్రవాదులపై పాక్ సైన్యం పంజా
వైమానిక దాడులు, కాల్పుల్లో 60 మంది హతం ఇస్లామాబాద్: వాయవ్య పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం దాడుల్లో దాదాపు 60మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ సైన్యం వైమానిక దాడులు జరపడంతోపాటు, ఆర్మీ చెక్పోస్టులపై జరిగిన దాడులను ప్రతిఘటించడం ద్వారా మిలిటెంట్లను మట్టుబెట్టినట్టు అధికారులు తెలిపారు. పాక్-అఫ్ఘానిస్థాన్ సరిహద్దు సమీపంలోని ఒరాక్జాయ్ ఏజెన్సీ పరిధిలో షిందారా, ఖజానా కందావో ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ చెక్పోస్టులపై శనివారం ఉదయం మిలిటెంట్లు దాడులకు పాల్పడినపుడు పాక్ సైన్యం దీటుగా ప్రతిఘటించింది. సైన్యం జరిపిన కాల్పల్లో 20మంది మిలిటెంట్లు హతంకాగా, మరో 20మంది గాయపడ్డారు. కాల్పుల ఘర్షణలో కనీసం నలుగురు సైనికులు గాయపడ్డారు. దత్తాఖెల్ ప్రాంతంలో పాకిస్తాన్ యుద్ధవిమానాలు శుక్రవారం జరిపిన దాడుల్లో ఇద్దరు ఉగ్రవాద కమాండర్లు సహా 39 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ సందర్భంగా భూగర్భంలోని అమ్మోనియం డిపోను, స్వాధీనం చేసుకున్నట్టు పాకిస్తాన్ మిలిటరీ ప్రతినిధి అసిమ్ బాజ్వా ట్వీటర్లో తెలిపారు. కాగా, ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వందలాదిమందిని పాకిస్తాన్లో పలుచోట్లనుంచి అరెస్ట్ చేశారు. వాయవ్య పాకిస్తాన్లోని ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్లో ప్రభుత్వ నమోదుచేయని మతపరమైన పాఠశాలలపై సైన్యం దాడిచేసి వాటి కి సీల్ వే సింది. మిలిటెంట్లపై విచారణకు ముసాయిదా ఉగ్రవాదులపై పోరుకు సంబంధించిన కార్యాచరణను పాకిస్తాన్ ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. కరుడుగట్టిన ఉగ్రవాదులు, శత్రు పోరాటయోధులపై విచారణకు వీలుగా రాజ్యాంగ, న్యాయపరమైన సవరణలతో రూపొందించిన తొలి ముసాయిదాను న్యాయనిపుణుల బృందం శనివారం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు సమర్పించింది. ఉగ్రవాద వ్యతిరేక సంస్థను తిరిగి క్రియాశీలకంగా మార్చాలని షరీఫ్ ఆదేశించారు. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఏర్పడిన పర్యవేక్షణ కమిటీ సమావేశానికి షరీఫ్ శనివారం అధ్యక్షత వహించారు. -
మాటలకందని విషాదం
ఉగ్రవాదం మామూలు ఉన్మాదం కాదు. దానికి విచక్షణాజ్ఞానం ఉండదు. అది ఎక్కడ తలెత్తుతుందో, ఎప్పుడు కాటేస్తుందో అంచనా వేయడం కూడా అసాధ్యం. అయినా నిరంతర అప్రమత్తత, పటిష్టమైన నిఘా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే తీరు దాన్ని కాస్తయినా నియంత్రించడానికి ఉపకరిస్తాయి. ఇలాంటివన్నీ లోపిం చిన కారణంగానే మంగళవారం పాకిస్థాన్లోని పెషావర్లో ఉన్న పాఠశాల నెత్తుటి మడుగైంది. ఆటోమేటిక్ రైఫిళ్లు, గ్రెనేడ్లు ధరించి వచ్చిన ఆరుగురు ముష్కరుల కిరాతకానికి 140మంది బలైపోయారు. వీరిలో దాదాపు 130మంది పదహారేళ్లు దాటని పసిమొగ్గలు. ఏడు గంటలపాటు పాఠశాల మొత్తాన్ని స్వాధీనంలో ఉంచు కుని ఉగ్రవాదులు సాగించిన నరమేథం మాటలకందనిది. వారు ప్రతి తరగతి గదికీ వెళ్లి పిల్లలను గురిచూసి పొట్టనబెట్టుకున్న వైనం ప్రపంచ పౌరులందరినీ విస్మయపరిచింది. అత్యంత హృదయవిదారకమైన ఈ ఉదంతంలో టీచర్లతోసహా మరో 245మంది పిల్లలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల పాలయ్యారు. సైన్యం దాదాపు వేయిమంది విద్యార్థులను కాపాడగలిగింది. పొద్దుటే హడావుడిగా నిద్ర లేచి త్వరత్వరగా తయారై వెళ్లిన పిల్లలు ఇలా బళ్లోనే నెత్తుటి ముద్దలై బతుకు చాలిస్తారని వారి తల్లిదండ్రులు ఊహించి ఉండరు. ఉగ్రవాదం అంటే ఏమిటో, అది జడలు విప్పి తాండవించడానికి కారణాలే మిటో బడి ఈడు పిల్లలకు తెలియదు. వారి లోకం వేరు. వారి సమస్యలు వేరు. బయటి ప్రపంచపు కల్మషాలను దరిదాపులకైనా రానీయని ఆ పసి పిల్లలపై ఉగ్రవాదం పంజా విసరగలదని ఎవరూ ఊహించలేరు. కానీ, చుట్టూ కాటేసే కాల నాగులున్నప్పుడు అడుగడుగునా జాగ్రత్త అవసరం. ప్రభుత్వమైనా, పౌరులైనా ప్రతి క్షణమూ ఆ ఎరుకతో ఉండటం ముఖ్యం. పెషావర్ ఉదంతంలో ముష్కరులు ఆర్మీ యూనిఫాం ధరించి సులభంగా పాఠశాలలోకి చొరబడగలిగారు. వారు హఠాత్తుగా ఆకాశంనుంచి ఊడిపడినవారేమీ కాదు. ఎంతో దూరం ప్రయాణించి, ఎన్నో నిఘా నేత్రాలను తప్పించుకుని...అనేకమైన తనిఖీలను దాటుకుని అక్కడికొచ్చి ఉంటారు. ఇన్నిటిని అధిగమించి సెంట్రల్ పెషావర్లో పాకిస్థాన్ సైన్యం కోసం కేటాయించిన హై సెక్యూరిటీ జోన్లో ఉన్న పాఠశాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోగలిగారంటే ఎవరి వైఫల్యం ఎంతనో ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉన్నది. పెషావర్కు ఉగ్రవాద దాడులు కొత్తేమీ కాదు. అక్కడ గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు పంజా విసురుతూనే ఉన్నారు. ఇప్పుడు పెషావర్ ఘోరకలికి బాధ్యులమని ప్రకటించుకున్న తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) ఉగ్రవాదులు గతంలో కూడా పెషావర్లో పలు దాడులు జరిపి వేలాదిమంది పౌరుల ఉసురుతీశారు. ఉగ్రవాద ముఠాల విషయంలో పాకిస్థాన్ సైన్యమూ, ప్రభుత్వమూ అనుస రిస్తున్న వైఖరి కూడా ఉగ్రవాదం పెరగడానికి దోహదపడుతున్నది. బిన్ లాడెన్ను అమెరికా సైన్యం హతమార్చాక అల్ కాయిదా దాదాపు కోరలు తీసిన పామైంది. దాని ప్రాపకంలో ఖ్వాదత్ అల్ జిహాద్ అనే సంస్థ ఇటీవల పురుడుపోసుకుంది. ఇక ఎప్పటినుంచో మన దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్ వంటి సంస్థలున్నాయి. ఈ సంస్థలన్నిటికీ చాటుమాటు సాయం చేయడంలో, భారత్పై దాడులకు పురిగొల్పడంలో ఖ్యాతిగడించిన పాక్ గూఢచార సంస్థ ఐఎస్ ఐ, అక్కడి సైన్యం ఉత్తర వజీరిస్థాన్లో ఉన్న టీటీపీపై మాత్రం ఒంటికాలిమీద లేస్తున్నాయి. పాకిస్థాన్- అఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలను ఆసరా చేసుకుని, 11 ఉగ్రవాద బృందాల కలయికగా ఏర్పడిన టీటీపీని అంతం చేయడం కోసం పాకిస్థాన్ సైన్యం నాటో సేనల అండతో తరచుగా దాడులు చేస్తున్నది. జర్బ్-ఎ-అజ్బ్ పేరిట పాక్ సైన్యం మొన్నటి జూన్లో ప్రారంభించిన ఆపరేషన్లో ఇంతవరకూ దాదాపు 1,300మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈమధ్యకాలం లో ఖైబర్ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో కూడా టీటీపీకి చెందిన 179మందిని హతమార్చింది. ఈ దాడులకు ప్రతీకారంగానే తాము పాక్ సైనికుల పిల్లలు చదు వుకుంటున్న పాఠశాలను లక్ష్యంగా ఎంచుకున్నామని టీటీపీ ప్రకటించింది. 2008 సెప్టెంబర్లో ముంబైలో దాడుల్లో 170మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు పాక్ గడ్డపైనుంచే వచ్చారు. ఉగ్రవాద ముఠాల విషయంలో పాటించే ద్వంద్వ ప్రమాణాలవల్ల అంతిమంగా దాని పెరుగుదలకే దోహదపడుతున్నామని ఇప్పటికైనా పాకిస్థాన్ గుర్తించాలి. ఈ ఉదంతం జాతీయ విషాదమని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. ఉగ్రవాదంపై చర్య తీసుకునే విషయంలో ఏకాభిప్రాయ సాధనకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఇదొక సానుకూల పరిణామం. పాక్లో ఉగ్రవాదం విషయంలో పార్టీలన్నిటిదీ తలోదారి. అసలు ప్రభుత్వానికీ, సైన్యానికీ మధ్యే భిన్న దృక్పథాలున్నప్పుడు ఇదేమంత వింత కాదు. ప్రస్తుత ఘటన చోటుచేసుకున్న ఖైబర్ ఫక్తూన్ఖ్వా రాష్ట్రంలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సా ఫ్ పార్టీ(పీటీఐ) అధికారంలో ఉంది. టీటీపీ ఉగ్రవాదులకు ఆ పార్టీ సహాయ సహకారాలున్నాయన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇలాంటివన్నీ పరిష్క రించుకుని దృఢ సంకల్పంతో ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప ఉగ్రవాదం అంతం కావడం అసాధ్యం. ఉగ్రవాదం ఏమి చెప్పుకున్నా, ఏ మతం పేరు పెట్టుకున్నా దానికి జాతి, మత, ప్రాంతాలనేవి ఉండవు. విచక్షణాజ్ఞానం అసలే ఉండదు. మాన వీయ విలువలనూ, నాగరిక సమాజ పునాదులనూ కూకటివేళ్లతో పెకిలిద్దామని చూస్తున్న ఉగ్రవాదాన్ని ఏరిపారేయకపోతే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉండగలవో చెప్పడానికి పెషావర్ ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం. దీన్నుంచి గుణపాఠం గ్రహించి అన్ని దేశాలూ సమష్టిగా పోరాడటం ఒక్కటే ఆ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు అర్పించగల నిజమైన నివాళి అవుతుంది. -
అధీనరేఖ మళ్లీ రక్తసిక్తం
రివాజు తప్పనీయరాదని పాకిస్థాన్ సైన్యం కంకణం కట్టుకున్నట్టుంది. సార్క్ సమావేశాల సందర్భంగా నేపాల్ రాజధాని కఠ్మాండూలో ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్లు కరచాలనం చేసుకున్న కొన్ని గంటలకే జమ్మూలోని అర్నియా సెక్టార్ వద్ద నెత్తురు చిందింది. అధీన రేఖ ఆవలివైపునుంచి వచ్చిన ఉగ్రవాదులు ముగ్గురు జవాన్లు, అయిదుగురు పౌరులను పొట్టనబెట్టుకున్నారు. జవాన్ల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. గురువారం ఉదయం మొదలైన ఈ ఎన్కౌంటర్ శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తయింది. అదే సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని బీఎస్ఎఫ్ ప్రతినిధి చెబుతున్నారు. సార్క్ శిఖరాగ్ర సదస్సులో తొలి రోజు ఎడమొహం, పెడమొహంగా ఉన్న ప్రధానులు మరుసటిరోజుకల్లా చిరునవ్వులు చిందించుకోవడంతోపాటు కరచాలనం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. అంతేకాదు... తమ దేశంలో నిర్బంధంలో ఉన్న 40మంది భారత జాలర్లను సుహృద్భావ సూచకంగా విడుదలచేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. మరోపక్క శుక్రవారం జమ్మూలోని పూంచ్లో ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొనబోతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే పాక్ సైన్యం సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందని సులభంగానే అర్థమవుతుంది. అధీన రేఖ వద్ద ఈ పరిస్థితి మన జవాన్లకు కొత్తేమీ కాదు. 1998తో మొదలుపెట్టి 2003 వరకూ పాక్ సైన్యం ఈ ప్రాంతంలో కాల్పులకు పాల్పడుతూనే ఉన్నది. భారత్లోకి చొరబాటుదార్లను ప్రవేశపెట్టడమే ఈ కాల్పుల వెనకున్న ఉద్దేశం. ఆ అయిదేళ్లూ పూంచ్, యూరి, కార్గిల్ సెక్టార్లలో ఇరు దేశాల సైనికుల కాల్పులతో రెండు పక్కలా ఉన్న గ్రామాల్లోని పౌరులు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అధీనరేఖ వద్ద 1998లో 4,117 ఘర్షణలు చోటు చేసుకుంటే అందులో 78మంది జవాన్లు, 78మంది పౌరులు చనిపోయారు. 2002నాటికి ఘర్షణలు 5,767కు చేరుకుంటే మరణించిన జవాన్ల సంఖ్య 81కి పెరిగింది. సరిగ్గా ఆ సమయంలో కశ్మీర్ లోయలో వివిధ ప్రాంతాల్లో మన జవాన్లపై ఉగ్రవాదులు దాడులు కూడా పెరిగాయి. అలాంటి దాడులు 1997లో 1,115 సార్లు జరిగితే 2002కల్లా వాటి సంఖ్య 1,211కు చేరుకుంది. ఆ ఏడాది చివరిలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక సరిహద్దులు దాదాపు ప్రశాంతంగా ఉండటమే కాదు...కశ్మీర్ లోయలో ఉగ్రవాద దాడుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులకు ఇస్తున్న అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ గణాంకాలే చెబుతాయి. 2003లో ఇరు దేశాలమధ్యా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక అధీన రేఖ వద్ద కాల్పులు ఏనాడూ ఆగిపోలేదుగానీ వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే, ఏళ్లు గడుస్తున్నకొద్దీ మళ్లీ క్రమేణా ఆ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. 2012లో 114సార్లు ఉల్లంఘనలు చోటుచేసుకుంటే గత ఏడాది అవి 347కు చేరుకున్నాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే 400 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయంటే వీటి వెనకున్న ఉద్దేశమేమిటో సులభంగానే అంచనావేసుకోవచ్చు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్ రావడంతో మొదలుపెట్టి ఇరు దేశాలమధ్యా సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాకే ఇవి ఒక్కసారిగా పెరిగాయి. జమ్మూ-కశ్మీర్లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత సమయంలో మిలిటెంట్లను ప్రవేశపెట్టి విధ్వంసం సృష్టించడానికి పాక్ సైన్యం పథకం పన్నింది. తొలి దశ ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అర్నియా సెక్టార్లో మిలిటెంట్లను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. ఇలాంటి పోకడలను గమనించినా నోరెత్తలేని అశక్తత వల్ల కావొచ్చు...నవాజ్ షరీఫ్ తమ దేశ పరువు ప్రతిష్టలనూ, ఆత్మగౌరవాన్నీ పణంగా పెట్టి భారత్తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్వదేశం చేరుకున్నాక ప్రకటించారు. పాకిస్థాన్ భౌగోళికంగా ఒక ప్రాంతమే అయినా...దానికొక రాజ్యవ్యవస్థ ఉన్నా దానిలోని విభాగాల మధ్య పొంతన లేదు. పౌర ప్రభుత్వం అధీనంలో ఉండి పనిచేయడానికీ, దాని విధానాలకు అనుగుణంగా వ్యవహరించడానికీ అక్కడి సైన్యానికి నామోషీ! పాక్ ఆవిర్భావంనుంచీ దాని తీరు ఇదే. గత ఆరేళ్లుగా ఈ విషయంలో కాస్త తగ్గినట్టు కనబడుతున్నా తన ధోరణిని విడనాడలేదని తరచుగా సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న ఘర్షణలే చెబుతున్నాయి. భారత్ లక్ష్యంగా సాగుతున్న ఉగ్రవాద దాడులకు తమ భూభాగం వేదిక కానీయబోమని నవాజ్ షరీఫ్ నిరుడు అధికారంలోకి రాగానే ప్రకటించివున్నారు. ఇప్పుడు అర్నియా సెక్టార్లో చొరబాటుకు ప్రయత్నించిన మిలిటెంట్లు పాక్ గడ్డవైపు నుంచి వచ్చినవారే. వారికి భారత జవాన్లనుంచి ఎలాంటి ఆటంకమూ లేకుండా చూడటం కోసం కాల్పులకు తెగబడింది పాక్ సైన్యమే. ఇలాంటి ఉదంతాలు దేశ పరువుప్రతిష్టలనూ, ఆత్మగౌరవాన్నీ మంటగలుపుతాయి తప్ప చర్చలు కాదని షరీఫ్ గుర్తించవలసి ఉన్నది. భారత సైన్యం ఆధిక్యతను దెబ్బతీయడానికి ఉగ్రవాదుల ద్వారా పాకిస్థాన్ పరోక్ష యుద్ధానికి దిగుతున్నదని ఇటీవలే అమెరికా రక్షణ శాఖ నివేదిక స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం పోకడలనూ, దాన్నేమీ అనలేని అక్కడి ప్రభుత్వ నిస్సహాయస్థితినీ మన దేశం అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చి పాక్పై మరింతగా ఒత్తిడి పెంచాలి. ఇలా చేయడంద్వారానే 2003లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి దిగివచ్చింది. మరోసారి అదే తరహాలో ప్రయత్నించి, పాక్ పన్నాగాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు మాత్రమే అక్కడి సైన్యం ఆగడాలను అడ్డుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. -
భారతీయ బాలుడిపై పాక్ సైన్యం ఔదార్యం
ఇస్లామాబాద్: తమ భూభాగంలోకి ప్రవేశించిన భారతీయ టీనేజీ బాలుడిని పాక్ సైన్యం తిరిగి భారత సైన్యానికి అప్పగించింది. కాశ్మీర్లోని ఝానగర్కు చెందిన మంజర్ హుస్సేన్ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. అతడు నవంబర్ 14వ తేదీన అనుకోకుండా భారత్, పాక్ సరిహద్దుల్లోని అసల్ కాస్ నుల్లా వద్ద నియంత్రణ రేఖను దాటి పొరుగు దేశ భూభాగంలోకి ప్రవేశించాడు. దాంతో హుస్సేన్ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని ఉన్నతాధికారులకు అప్పగించారు. దాంతో హుస్సేన్ను ఉన్నతాధికారులు విచారించి ... మంగళవారం చకొటి -యూరి కేంద్రం వద్ద భారత్ సైన్యానికి హుస్సేన్ను అప్పగించినట్లు పాక్ సైన్యం తెలిపింది. -
హమీర్పూర్ వద్ద పాక్ సైన్యం కాల్పులు
జమ్మూ: పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూకాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని హమీర్పూర్ సెక్టార్ సమీపంలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత శిబిరాలే లక్ష్యంగా పాక్ జరిపిన కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టిందని రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని తెలిపారు. గత మూడు రోజులుగా హమీర్పూర్ ప్రాంతంలో వరుసగా కాల్పులకు పాక్ సైన్యం తెగబడుతుందని చెప్పారు. అక్టోబర్ 6వ తేదీన భారత్ సరిహద్దు వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించగా, 62 మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
పాక్ కాల్పుల్లో 20మందికి గాయాలు
జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బీఎస్ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా సరిహద్దు వెంబడి జరిపిన కాల్పుల్లో ఇరవై మంది గాయపడ్డారు. గాయపడినవారిలో బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు 15మంది సామాన్య పౌరులు ఉన్నారు. సాంబ, కొత్వా జిల్లాలతో పాటు కానాచాక్, ఆర్నియా, పర్గావల్ ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. కొన్నిచోట్ల కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ జవాన్లు తిప్పికొడుతున్నారు. కాగా 20 గ్రామాల్లోని సుమారు 20వేల కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి.మరోవైపు ప్రతిష్టంభన తొలగించడానికి ఇరు దేశాల సైనిక అధికారులు హాట్లైన్లో మాట్లాడుకున్నా ఫలితం లేకపోయింది. -
వారికి బంకర్లే రక్షణ..!
జమ్మూకాశ్మీర్ పల్లె ప్రజల దుస్థితి.. పాక్ కాల్పుల మోతతో భయంభయంగా గడుపుతున్న కాశ్మీరీలు.. న్యూఢిల్లీ: ఇరుకు బంకర్లలో పిల్లలను హత్తుకుని బిక్కుబిక్కుమంటున్న తల్లులు.. ఎప్పుడేం జరుగుతుందోనని భయంభయంగా ఊరివైపు చూస్తున్న తండ్రులు.. కాస్త దూరంలో చెవులు చిల్లులు పడేలా బాంబు పేలుళ్లు.. కాల్పుల మోతలు..! కూలిన ఇళ్లు, క్షతగాత్రుల హాహాకారాలు.. ! ఇదంతా ఏ గాజాలోనో, అఫ్ఘానిస్థాన్లోనో, ఇరాక్లోనో కనిపించే దృశ్యమనుకుంటే పొరపడినట్లే! ఇది.. సాక్షాత్తూ భారతావని శిరస్సులాంటి జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తున్న అనుదిన వ్యథాభరిత చిత్రం..!! కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దులో రెండు వారాలుగా పాక్ బలగాలు జరుపుతున్న కాల్పులు అక్కడి గ్రామాల ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. కాల్పుల్లో శనివారం వరకు ముగ్గురు కాశ్మీరీలు మృతిచెందగా, పదిమందికిపైగా గాయపడ్డారు. పాక్ కాల్పులకు భయపడి వందలాది ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఆర్ఎస్ పురా సెక్టార్ త్రేవా గ్రామ ప్రజలను దగ్గర్లోని బంకరే ఆదుకుంటోంది. దాదాపు పదిమంది మాత్రమే పట్టే ఈ ఇరుకు బంకర్లో మహిళలు, పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. భోజనం చేయగానే అక్కడికి వెళ్తున్నారు. సరిహద్దులోని పలు గ్రామాల ప్రజలు పదేళ్ల కిందట వాడి వదిలేసిన బంకర్లను శుభ్రం చేసి వాడుకుంటున్నారు. పొదలు, గుట్టల మధ్యలో ఉన్న వీటి ప్రవేశమార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఒకరి వెనుక ఒకరు లోనికి వెళ్లాల్సిన పరిస్థితి! పాక్ వైపు నుంచి ఎప్పుడే ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని కరోతోంటా ఖుర్ద్ గ్రామవాసి ఓమ్ ప్రకాశ్ చెప్పారు. 2003లో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తుండడంతో దానికి కాలం చెల్లిపోయినట్లేనని స్థానికులు అంటున్నారు. సరిహద్దు ఘర్షణలు ఇరు దేశాల మధ్య సాగుతున్న శాంతి చర్చలపై ప్రభావం చూపుతున్నాయి. -
భారత స్థావరాలపై పాక్ కాల్పులు
జమ్మూ: పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ జిల్లాలోని సరిహద్దు వద్ద పాక్ సైనికులు భారత స్థావరాలపై కాల్పులు జరిపారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కాల్పులు జరిపినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. పాక్ సైన్యం భారత భూభాగంలోని బీఎస్ఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. 'మంగళవారం అర్ధ రాత్రి 12 నుంచి 1 గంటలకు పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు మళ్లీ కాల్పులకు దిగారు. భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయి' అని పోలీస్ అధికారి చెప్పారు. -
తాలిబన్లపై విరుచుకుపడిన పాక్ సైన్యం
ఇస్లామాబాద్: తాలిబన్లపై పాకిస్థాన్ సైన్యం మరోసారి విరుచుకుపడింది. ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో రెండు రోజులుగా జరిపిన దాడుల్లో 177 మంది మిలిటెంట్లు మరణించారు. వీరిలో చాలా మంది విదేశీయులూ ఉన్నారు. అయితే ఓ బాంబు పేలుడులో ఆరుగురు సైనికులు కూడా చనిపోయారు. ఇక్కడి షవాల్ ప్రాంతంలోని ఆరు ఉగ్రవాద స్థావరాలపై పాక్ మిలటరీ జెట్లు సోమవారం బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో 27 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు సైనికాధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ మరో పది మందిని హతమార్చినట్లు చెప్పారు. ఇక దేగాన్ బోయా ప్రాంతంలో ఆదివారం జరిపిన దాడుల్లో 140 మంది టైస్టులు హతమైనట్లు పాక్ సైన్యం పేర్కొంది. -
తూటాకు తూటా: బిక్రంసింగ్
న్యూఢిల్లీ: సైన్యాధిపతి జనరల్ బిక్రంసింగ్ పాకిస్థాన్కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని.. అదే రీతిలో స్పందిస్తామన్నారు. సైనిక దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో బిక్రంసింగ్ మాట్లాడారు. భారత జవాను తలనరికిన పాక్ సైనికులపై ఆర్మీ ప్రతీకారం తీర్చుకోలేదన్న వాదనను బిక్రంసింగ్ ఖండించారు. ‘‘చర్య తీసుకున్నాం.. డిసెంబర్ 23నాటి జియో టీవీ కథనాన్ని చూడండి. పాక్ ఆర్మీ అధికారి, తొమ్మిది మంది జవాన్లు మరణించారని.. 12-13 మంది గాయాలపాలయ్యారని తెలుస్తుంది. ఇది భారత జవాన్లు సాధిం చిందే’’ అని బిక్రంసింగ్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో సైన్యం ఉండాల్సిందేనన్నారు. ఆర్మీ బలగాల మోహరింపు విషయంలో పరిస్థితులు మెరుగుపడే వరకూ వేచి ఉండాలని చెప్పారు. సమీప భవిష్యత్తులో పోరాట ప్రాంతా ల్లో మహిళా సైనికాధికారులను నియమించే అవకాశం లేదన్నారు. -
ఫిరోజ్ఖాన్కు అశ్రునివాళి
అధికార లాంఛనాల నడుమ ముగిసిన అంత్యక్రియలు హైదరాబాద్, న్యూస్లైన్: జమ్మూకాశ్మీర్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన మహ్మద్ ఫిరోజ్ఖాన్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం పాతబస్తీ ఫలక్నుమాలోని సంజయ్గాంధీ నగర్లో మధ్యాహ్నం పోలీసు లాంఛనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. మొదట ఫిరోజ్ భౌతికకాయాన్ని స్థానిక మసీదుకు తరలించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఆర్మీ సిబ్బంది ఫిరోజ్ఖాన్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లెఫ్టినెంట్ జనరల్ సీఏ పితాలా ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్లు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ లాంఛనాలు ముగిసిన వెంటనే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమయాత్రలో రాజకీయ నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొని, పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ నివాళి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఫిరోజ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫిరోజ్ఖాన్ సహోద్యోగి అయిన ఎన్.వి.రావుతో సరిహద్దుల వద్ద జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫిరోజ్ఖాన్ కుటుంబీకులను పరామర్శించారు. జవాను తల్లి, భార్య, పిల్లలను అప్యాయంగా పలకరించారు. ధైర్యంగా ఉండాలని, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. తరలివచ్చిన ప్రముఖులు ఫిరోజ్ఖాన్కు నివాళులర్పించేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. నివాళులు అర్పించిన ప్రముఖుల్లో వైఎస్సార్సీపీ నేతలు మేకపాటి రాజమోహన్రెడ్డి, రెహ్మాన్, మజ్లిస్ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మోజంఖాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, పార్టీ నేత బండారు దత్తాత్రేయ, మంత్రి దానం నాగేందర్, వైఎస్సార్సీపీ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ఆదం విజయ్కుమార్, యువజన విభాగం గ్రేటర్ అధ్యక్షులు లింగాల హరిగౌడ్, హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా తదితరులున్నారు. -
బరితెగిస్తున్న పాకిస్థాన్ సైన్యం
పూంచ్: సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ఆ దేశ బలగాలు సోమవారం కూడా కాల్పులు విరమణ ఒప్పందానికి గండికొట్టాయి. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జమ్మూకాశ్మీర్లోని హమీర్పూర్ బెటాలియన్పైన , మంథార్లో కాల్పులకు తెగబడింది. ఈ దాడులను భారత బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయి. ఇరువైపుల ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం. మెంధార్ సబ్సెక్టార్లో పాక్ సైన్యం మధ్యాహ్నం నుంచే దాడులు మొదలెట్టింది. చిన్నపాటి, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపింది. పాక్ దాడులను భారత జవాన్లు గట్టిగా తిప్పికొట్టారు. ఇరుపక్షాల మధ్య రాత్రి పొద్దుపోయేంతవరకు కాల్పులు జరిగాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. కాగా, పాక్ బలగాలు ఆదివారం రాత్రి పూంచ్ జిల్లా మాన్కోట్, మెంధార్లలో జనావాస ప్రాంతాల్లో భారీస్థాయిలో కాల్పులకు తెగబడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మన్మోహన్తో ఆర్మీ చీఫ్ భేటీ న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ బిక్రమ్ సింగ్ సోమవారమిక్కడ ప్రధాని మన్మోహన్ సింగ్తో ఆయన నివాసంలో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. పాక్ కాల్పులు, మన జవాన్ల ప్రతిదాడుల గురించి వివరించారు. బిక్రమ్సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతోనూ సమావేశమై పాక్ ఆర్మీకి ఎలా గట్టి జవాబివ్వాలో చర్చలు జరుపుతున్నారు. -
సరిహద్దులో హోరాహోరీ కాల్పులు
పూంచ్: జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం ఆదివారం కూడా కాల్పుల విరమణను ఉల్లంఘించింది. మెంధార్ సబ్ సెక్టార్లో మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఆటోమేటిక్, మధ్యరకం మోర్టార్ బాంబులను ప్రయోగించింది. భారత బలగాలు వీటిని గట్టిగా తిప్పికొట్టాయి. ఇరు పక్షాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ప్రాణనష్టం జరిగినట్లు వార్తలేవీ రాలేదని రక్షణ శాఖ ప్రతినిధి ఎస్ఎన్ ఆచార్య తెలిపారు. పాక్ బలగాలు శనివారం అర్ధరాత్రి కూడా పూంచ్లోని కృష్ణఘాటీ, బాల్కోట్, హరీర్పూర్ లలో భారత పోస్టులపై కాల్పులు జరిపాయని, తమ బలగాలు దీటుగా స్పందించి తిప్పికొట్టాయన్నారు. మరోపక్క.. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద ఆదివారం వేకువజామున భారీ ఆయుధాలతో భారత్లోకి చొరబడేందుకు మిలిటెంట్లు చేసిన యత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఇరు పక్షాల మధ్య మూడు గంటలకు పైగా కాల్పులు జరిగాయి. భారత సైన్యాన్ని ఎదుర్కోలేక మిలిటెంట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి పారిపోయారు. -
పాక్ సైన్యానివి తీవ్ర తప్పిదాలు
రాజౌరీ(జమ్మూకాశ్మీర్): సరిహద్దులో కాల్పుల విరమణను రోజూ ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ సైన్యం తీవ్ర తప్పిదాలు చేస్తోందని, సరైన సమయంలో దిమ్మతిరిగే సమాధానం ఇస్తామని భారత సైన్యం హెచ్చరించింది. నియంత్రణ రేఖ వద్ద పాక్ ఆగడాలు తమ ధైర్యాన్ని నీరుగార్చలేవని 25వ పదాతిదళ జన రల్ ఆఫీసర్ కమాండింగ్(జీఓసీ) మేజర్ జనరల్ వీపీ సింగ్ అన్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై పొరుగు దేశానికి ఏం చెప్పాలనుకుంటున్నారని ఆదివారమిక్కడ విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు. ‘ఇది సైనిక వ్యవహారం. సమయం చూసుకుని తగినచోట, తగిన జవాబిస్తాం’ అని అన్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘన, చొరబాట్లను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ తనకు ఆదేశాలిచ్చారన్నారు. కాగా, నియంత్రణ రేఖ వద్ద తమ పోస్టులపై మరిన్ని దాడులకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తున్నట్లు, 300 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని పూంచ్ సెక్టార్లోని ఆర్మీ అధికారి ఎ.సేన్గుప్తా చెప్పారు. ఉగ్రవాదులు చొరబండేందుకు వీలుగా పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయన్నారు. తమ ఎదురు కాల్పుల్లో పాక్కు చెందిన ఐదు ఆర్మీ పోస్టులు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. -
కార్గిల్లో మళ్లీ పాక్ కాల్పులు
1999 నాటి యుద్ధం తర్వాత తొలిసారి.. న్యూఢిల్లీ: పద్నాలుగేళ్ల కిందట కార్గిల్లోకి చొరబడి భారత జవాన్ల చేతిలో మట్టికరచిన పాక్ సైన్యం తాజాగా మళ్లీ అక్కడ కవ్వింపునకు దిగింది. జమ్మూ కాశ్మీర్లోని ఎత్తయిన ప్రాంత మైన కార్గిల్ సెక్టార్లో నాలుగు రోజుల్లో రెండుసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాక్ 14 ఏళ్లలో కార్గిల్లో కాల్పులకు పాల్పడడం ఇదే తొలిసారి. సోమవారం రాత్రి ద్రాస్, కార్గిల్ల మధ్యలోని కక్సార్లో ఉన్న చెనిగుండ్ పోస్టుపై పాక్ బలగాలు తొలుత చిన్నపాటి ఆయుధాలతో, తర్వాత ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపాయి. గురువారం రాత్రి లడఖ్లోని ద్రాస్ సెక్టార్లో సాందో పోస్టుపై ఇదే దుశ్చర్యకు ఒడిగట్టాయి. పాక్ కాల్పులకు భారత జవాన్లు దీటైన ఎదురుకాల్పులతో గట్టి జవాబిచ్చారు. 1999లో పాక్ సైనికులు కార్గిల్లోకి చొరబడడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కార్గిల్ జోలికి రావడానికి భయపడిన పాక్ బలగాలు ప్రస్తుతం సరిహద్దులో కాల్పుల విరమణను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ మళ్లీ కార్గిల్లో కాల్పులు జరిపాయి.1999 నాటి యుద్ధంలో భారత యువ లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా, ఆయన సహచరులు చెనిగుండ్ పోస్టు వద్దే కనిపించకుండా పోయారు. తర్వాత చిత్రహింసలతో ఛిద్రమైన వారి మృతదేహాలను పాక్ భారత్కు అప్పగించింది. కాగా, సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో భారత హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి జమ్మూలో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. -
ఒకేరోజు మూడుసార్లు ఉల్లంఘన
జమ్మూ: సరిహద్దులో పాకిస్థాన్ ఆర్మీ బరితెగిస్తోంది. కాల్పుల విరమణ ఉల్లంఘనలో శ్రుతిమించిపోతోంది. సోమవారం ఒక్కరోజే పాక్ ఆర్మీ జమ్మూకాశ్మీర్లోని పూంచ్, సాంబా జిల్లాల్లో భారత ఆర్మీ ఔట్పోస్టులపై మూడు పర్యాయాలు కాల్పులకు తెగబడింది. మోర్టార్లు, రాకె ట్లను భారీగా ప్రయోగించింది. భారత సైనికులు వీటిని అంతే దీటుగా తిప్పికొట్టారు. ఇరు పక్షాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. పాక్ గత మూడు రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది ఏడోసారి. ఆ దేశ బలగాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల మధ్య పూంచ్ సరిహద్దు, దిగావర్, మాన్కోటే, దుర్గా బెటాలియన్ ప్రాంతాల్లోని 11 పోస్టులపై భారీ కాల్పులు జరిపాయి. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో సాంబాలోని కోతాయ్ ఔట్ పోస్టుపై, రాత్రి 9.20 ప్రాంతంలో పూంచ్లోని మెంధార్ సబ్ సెక్టార్ పోస్టుపై కాల్పులకు పాల్పడ్డాయి. బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ సైనికులకు గట్టి సమాధానమిచ్చారు. తమ వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. మరోపక్క.. భారత ఆర్మీ తమ అధీనంలోని కాశ్మీర్(పీఓకే)లో కాల్పులు జరపడంతో ఒక పౌరుడు చనిపోయాడని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇస్లామాబాద్లోని భారత డిప్యూటీ హై కమిషనర్ గోపాల్ బాగ్లేను పిలిపించుకుని నిరసన తెలిపింది. -
గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు సర్కారే చేపట్టాలి
హైదరాబాద్, న్యూస్లైన్: ఈ ఏడాది హైదరాబాద్లో 34వ గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ మహాయజ్ఞంలో ప్రతి హిందువు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 9 నుంచి18 వరకు హైదరాబాద్లో జరిగే గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసం ఇక్కడి సిద్దిఅంబర్బజార్లోని బెహతీభవన్లో ఏర్పాటు చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. తొలుత దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో, కేథార్నాథ్, ఉత్తరాఖండ్ వరదల్లో, పాక్ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయినవారికి, గతేడాది చనిపోయిన ఉత్సవ సమితి కార్యకర్తలకు నివాళులు అర్పించారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ.. గణేష్ మండపాల నిర్వాహకులతో సెప్టెంబర్ 1న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సభకు వీహెచ్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్సింఘాల్, యూపీకి చెందిన చిన్మయానంద స్వామిజీతోపాటు రాష్ట్రంలోని ప్రధాన సాధు సంతులు హాజరవుతారన్నా రు. సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్రావు మాట్లాడుతూ.. నగరంలో గణేష్ మండపాల నిర్వాహకులను పోలీసులు వేధిస్తున్నారని, హిందూ ఉత్సవాలపై పనిగట్టుకుని ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. గణేష్ మండపాలకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని, ఉత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కల గకుండా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. బీజేపీ నేత బద్దం బాల్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు వైకుంఠం, ఆలె జితేందర్, టీడీపీ నేత జి.ఎస్.బుగ్గారావు, బీజేపీ నేత వై.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దౌత్య విషాదం!
సంపాదకీయం: కీలకమైన ఈ వానాకాలపు పార్లమెంటు సమావేశాల కోసం ముందస్తుగా ఎన్నో కసరత్తులు చేసి మరీ బరిలోకి దిగిన యూపీఏ ప్రభుత్వం హఠాత్తుగా పాకిస్థాన్ నుంచి తలెత్తిన పూంచ్ సమస్యకు బెంబేలెత్తి, సెల్ఫ్గోల్ చేసుకున్నంత పనిచేసింది. జమ్మూకాశ్మీర్ పూంచ్ సెక్టార్లో పాకిస్థాన్ సైన్యం సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖను అతిక్రమించి ఐదుగురు భారత సైనికులను కాల్చి చంపిన ఘటనపై ప్రభుత్వం రెండు రోజుల్లోనే రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయాల్సి వచ్చింది. పాక్ సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులతో కలిసి వచ్చిన కొందరు ఉగ్రవాదులు మన సైనికులను కాల్చి చంపారని రక్షణ మంత్రి ఆంటోనీ లోక్సభలో మంగళవారం ప్రకటించారు. అది తొలి సమాచారంపై ఆధారపడి చేసిన ప్రకటన అని గురువారం ఆయన వివరణ ఇచ్చారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్సింగ్ ఘటనా స్థలాన్ని సందర్శించిన తదుపరి అందిన తాజా సమాచారమంటూ తొలి ప్రకటనకు విరుద్ధమైన మరో ప్రకటన చేశారు. ప్రత్యేక శిక్షణ పొందిన పాక్ సైనికులే ఈ దురాగతానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఆకుకు అందని పోకకు పొందని ఆంటోనీ తొలి ప్రకటన పార్లమెంటులో పెద్ద దుమారాన్నే లేపింది. ఎన్నికలకు ముందు ఈ సున్నితమైన సమస్యపై భేషజాలకు పోరాదని కాంగ్రెస్ అధిష్టానం ఆలస్యంగానైనా గ్రహించింది. ప్రజాగ్రహాన్ని ప్రతిఫలించేలా రక్షణ మంత్రి ప్రకటనను సవరింపజేసింది. సవరించిన ప్రకటనకు ప్రధాన ప్రతిపక్ష నేత్రి సుష్మాస్వరాజ్ సంతృప్తి చెందడంతో పార్లమెంటు సమావేశాల నిర్వహణకు అడ్డు తొలగింది. సమసిపోయినట్టుగా కనిపిస్తున్న ఈ వివాదం నిజానికి మన విదేశాంగ నీతికి సంబంధించి పలు మౌలిక సమస్యలను లేవనెత్తింది. 2003 నాటి వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం నేటికీ అమల్లో ఉన్నందున సరిహద్దుకు ఎటువైపు నుంచి అతిక్రమణ జరిగితే ఆ దేశమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎలా జరిగినా ఇది పాక్ సరిహద్దుల నుంచి జరిగిన ఉల్లంఘన. కాబట్టి పాక్ ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాలి. అలాంటి బాధ్యతను కనబరిచే ప్రకటన ఏదీ అటు నుంచి వెలువడక ముందే పాక్ సైన్యం ప్రమేయం లేదని మన ప్రభుత్వం తీర్పు చెప్పాల్సిన అగత్యం ఏమిటి? వచ్చే నెలలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్లో మన ప్రధాని మన్మో హన్సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఆ చర్చలకు విఘాతం కలుగుతుందన్న భయమే వాస్తవాలను మరుగున పరిచిన మంగళవారం ప్రకటనకు కారణమైంది. ఈ హత్యాకాండ ప్రత్యేక శిక్షణను పొందిన వృత్తి నైపుణ్యంగల సైనికులు చేసిందే తప్ప, ప్రభుత్వేతరశక్తుల చర్య కాదని సైన్యం మొదటే ధృవీకరించిందని ఉన్నత సైనికాధికారుల కథనం. ఆ నివేదికను సవివరంగా చర్చించిన తర్వాతే ప్రభుత్వం ‘జాగ్రత్త’గా తొలి ప్రకటనను తయారు చేసిందనేది స్పష్టమే. శాంతి చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్న చిత్తశుద్ధి ఇరుపక్షాలకూ ఉండటం అవసరం. ఏ పక్షం నుంచి చర్చల వాతావరణాన్ని దెబ్బతీసే పరిస్థితులు తలెత్తితే అదే దిద్దుబాటు చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. చర్చలపట్ల ఆ దేశపు చిత్తశుద్ధికి నిదర్శనం అదే. ఆ ప్రాథమిక దౌత్యనీతి సూత్రాన్ని సైతం విస్మరించి, అకారణంగా ఐదుగురు జవాన్లను కోల్పోయిన దేశమే చర్చల కోసం అంగలార్చడం ఏమిటి? సహేతుకమైన ఈ ప్రశ్న నేడు జాతీయస్థాయి చర్చగా మారింది. బీజేపీ నేతల నుంచే కాదు, మీడియాలో సైతం ఈ సమయంలో పాక్తో చర్చలు సరికాదనే ఆభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. పూంచ్ సెక్టార్ దాడికి పాల్పడ్డ పాక్ సైనికులు లేదా ఉగ్రవాదులు లేదా ఇద్దరూ ఏ లక్ష్యంతో ఈ హత్యాకాండకు పూనుకున్నారో అది నెరవే రే పరిస్థితిని సృష్టించింది ఎవరు? మన్మోహన్ ప్రభుత్వం కాదా? పాక్ సైన్యం మద్దతు లేకుండా అటు వేపు నుంచి ఏదీ జరగదన్న అందరికీ తెలిసిన వాస్తవానికి ఆంటోనీ తాజా ప్రకటన తీవ్ర హెచ్చరికను జోడించింది. ఆ హెచ్చరిక కూడా చర్చలపై అనుమానాలను రేకెత్తించింది. సుదీర్ఘకాలంగా నలుగుతున్న పాక్ సమస్యపై మన విదేశాంగ విధానం ఇలా ఒక కొస నుంచి మరో కొసకు కొట్టుకుపోయే దుస్థితికి ఎవరిని నిందించాలి? ఎంతటి తీవ్ర సమస్యలైనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే నాగరిక దేశాలు అనుసరించాల్సిన సూత్రం అనడంలో సందేహం లేదు. సైనిక నేతల దశాబ్దాల ఏలుబడిలో బలహీనమైపోయిన పాక్ ప్రజాస్వామ్య వ్యవస్థకు చేయూతనిచ్చే సానుకూల వైఖరిని అవలంబించడం మంచిదే. అలా అని సైన్యం, ఐఎస్ఐలకూ, సీమాంతర ఉగ్రవాద ముఠాలకూ మధ్య ఉన్న పీటముళ్లు యథాతథంగా ఉండగానే శాంతి సాధ్యమనుకోగలమా? పాక్తో ద్వైపాక్షిక శాంతిచర్చల పునరుద్ధరణ కోసం భారత్పై అమెరికా తెస్తున్న ఒత్తిడి అందరికీ తెలిసిందే. 2008 ముంబై ఉగ్రవాద దాడుల అసలు సూత్రధారి జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్ను అది ఉగ్రవాదిగా ప్రకటించి అతని తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. శుక్రవారం కరాచీలో జరిగిన బ్రహ్మాండమైన ఈద్గా ప్రార్థనా సమావేశానికి సయీద్ నేతృత్వం వహించడమే కాదు, భారత వ్యతిరేక ఉన్మాదాన్ని ప్రేరేపించే విషాన్ని వెలిగక్కాడు. భారత్-పాక్ సత్సంబంధాలకు అమెరికా అంత ప్రాధాన్యం ఇచ్చేట్టయితే సయీద్ పాక్లో స్వేచ్ఛగా తిరగడమేగాక, పట్టుకోగలిగితే పట్టుకోమని సవాలు విసురుతుంటే అది చేతులు ముడుచుకు కూచుంటుందా? భారత్-పాక్ స్నేహసంబంధాల ఎదుగుదలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న సైనిక, ఉగ్రవాద శక్తులపై కనీస అదుపును సంపాదించడానికి నిన్నటి ఆసిఫ్ ఆలీ జర్దారీ ప్రభుత్వం ప్రయత్నించింది లేదు. నేటి నవాజ్ ప్రభుత్వం సైతం వెన్నెముకలేని అదే విధానాన్ని అనుసరిస్తూ, భారత్కు స్నేహహస్తాన్ని చాస్తున్నది. పాక్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కేవలం భారత్ బాధ్యత మాత్రమే కాదు. ఆ విషయం నవాజ్తోపాటూ, అమెరికా కూడా గుర్తించడం అవసరం. -
వీరుడా.. నీకు వందనం!
సాక్షి, ముంబై: పాకిస్థాన్ సైనికుల తూటాలకు బలైన అమరవీరుడు జవాన్ కుండలిక్ మానే (36)కు గురువారం కొల్హాపూర్ జిల్లా కాగల్ తాలూకాలోని పింపల్గావ్ బద్రుక్ గ్రామంలో వేలాదిమంది కన్నీటి వీడ్కోలు పలికారు. సైనిక, ప్రభుత్వ లాంఛనలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఓవైపు తీరని విషాదం మనసును తొలచి వేస్తున్నా.. మరోవైపు దేశం కోసం ప్రాణాలర్పించి అమరుడయ్యాడన్న అభిమానం అందరి కళ్లలోనూ కనిపించింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మైదానంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పింపల్గావ్ బద్రుక్ గ్రామ ప్రజలతోపాటు చుట్టుపక్కల ఊళ్ల ప్రజలు, రాజకీయ నాయకులు, ఆర్మీ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ‘భారత్ మాతా కీ జై’, ‘అమర్ రహే.. అమర్ రహే..కుండలిక్ మానే అమర్ రహే’, ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ నినాదాలతో గ్రామ పరిసరాలు మార్మోగాయి. మానే కుటుంబీకులతోపాటు గ్రామప్రజల రోదనలు అక్కడి వారందరినీ కలచివేశాయి. ఆ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్లు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. మానే మృతికి సంతాప సూచకంగా స్థానిక దుకాణాలన్నీ మూతబడ్డాయి. కేబుల్ ప్రసారాలను కూడా నిలిపి వేసి ఆయనకు నివాళులు అర్పించామని పింపల్గావ్ వాసి ఒకరు తెలిపారు. అంత్యక్రియల ప్రదేశానికి వేలాది మంది రావడంతో పాఠశాల ఆవరణ జనసంద్రంగా మారింది. మానే త్యాగాన్ని వృథాగా పోనివ్వకూడదని, పాకిస్థాన్పై భారత్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని పింపల్గావ్ వాసులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ‘ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు సహా గ్రామస్తులకు బుధవారం రాత్రి వరకు తెలియనివ్వలేదు. కేవలం గాయపడ్డాడని మాత్రమే చెప్పారు’ అని ఆయన వివరించారు. మానే అంత్యక్రియలకు రాష్ట్రమంత్రులు ఆర్.ఆర్.పాటిల్, హర్షవర్ధన్ పాటిల్, హసన్ ముష్రిఫ్.. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు గోపీనాథ్ ముండే వంటి ప్రముఖులు హాజరయ్యారు. జమ్మూ-కాశ్మీర్ సరిహద్దులోని పూంచ్ సెక్టార్లో పాకిస్థాన్ సైన్యం చేసిన దాడిలో మరాఠా రెజిమెంట్కు చెందిన కుండలిక్ మానేతోపాటు బీహార్కు చెందిన మరో నలుగురు మరణించిన విషయం విదితమే. మరణాంతరం ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి పుణేకి బుధవారం రాత్రి ఎయిర్ఫోర్స్ విమానంలో తరలించారు. అనంతరం అక్కడి నుంచి వాహనం ద్వారా గురువారం ఉదయం కొల్హాపూర్, అనంతరం అక్కడి నుంచి పింపల్గావ్కు చేరుకుంది. 50 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు మూడు గంటలు... మృతదేహం కొల్హాపూర్కు చేరాక అక్కడే కొంతసేపు ఉంచారు. మానేకు నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున జనం రావడంతో పింపల్గావ్కు చేరడానికి ఆలస్యమయింది. కొల్హాపూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పింపల్గావ్ వెళ్లడానికి మూడుగంటలకుపైగా సమయం పట్టింది. రోడ్డుపైనే పలువురు ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీంతో బద్రుక్ గ్రామానికి చేరుకునే సరికి చాలా సమయం పట్టింది. కోరిక తీరకుండానే... పాకిస్థాన్ సైన్యం దాడిలో మరణించిన కుండలిక్ మానే గ్రామంలోని పిల్లల కోసం బస్సును ప్రారంభించాలనుకున్నాడు. ఇందుకు అవసరమైతే తన రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బును కూడా ఖర్చు చేస్తానని చెప్పేవాడు. బస్సును ప్రారంభించముందే ఆయన శత్రుదేశ తూటాలకు బలయ్యాడు. సుమారు రెండున్నర వేల జనాభ ఉండే పింపల్గావ్ నుంచి పది మందికిపైగా సైనికులు ఉన్నారు. వీరిలో ఒకరైన కుండలిక్ 18వ ఏటనే.. అంటే 1988లో మరాఠా రెజిమెంట్లో చేరాడు. ఆయనకు తల్లిదండ్రులతోపాటు భార్య రాజశ్రీ, పదేళ్ల కుమార్తె ఆర్తి, ఐదేళ్ల కుమారుడు అమోల్ ఉన్నారు. మానే 20 రోజుల క్రితం స్వగ్రామం నుంచి పూంచ్కు వెళ్లారు. గత నెలే పింపల్గావ్కు వచ్చి అందరితో గడిపారు. అదే తన చివరి పర్యటన అని ఆయన గ్రహించి ఉండకపోవచ్చు.