బొబ్బిలి టీడీపీ సీటు బీసీలకు ఇచ్చే దమ్ముందా! | - | Sakshi
Sakshi News home page

బొబ్బిలి టీడీపీ సీటు బీసీలకు ఇచ్చే దమ్ముందా!

Oct 28 2023 12:44 AM | Updated on Feb 3 2024 6:36 PM

- - Sakshi

టీడీపీ అధినేత చంద్రబాబుకు బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే సీటు బీసీలకు ఇచ్చే దుమ్మందా అని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సవాల్‌ విసిరారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో బీసీలకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. వారి పాలనలో ప్రజల సొమ్మును తెలుగుదేశం నాయకులు దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు. అభివృద్ధి అంటే టీడీపీ నాయకులకు తెలియదని ఎద్దేవా చేసారు. భూకబ్జా చేసానని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు వాటిని నిరూపించే దమ్ముందా అని చాలెంజ్‌ విసిరారు. 2001లో రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి అవినీతి లేని పాలన అందిస్తున్నానని తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న దివంగత నేత వైఎస్సార్‌ చెప్పిన మాట ప్రకారం ఒదిగా ఉన్నానని తెలిపారు.

– బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్యే

Advertisement
 
Advertisement
Advertisement