మరో వైపు.. :
సర్వే నంబర్ 410లో వరహాలగెడ్డకు చెందిన సుమారు ఎనిమిది సెంట్లకు పైగా స్థలం కబ్జాకు గురైంది. గెడ్డ స్థలాన్ని దర్జాగా కబ్జాచేసి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా గుర్తించారు. అక్కడ సర్వే చేసిన అధికారులు.. ఆక్రమణలను నిర్ధారించి హెచ్చరిక బోర్డులు కూడా పాతారు. వారు ఎన్నిసార్లు బోర్డులు పెడుతుంటే.. అన్నిసార్లు వాటిని గుర్తుతెలియని వ్యక్తులు తొలగిస్తున్నారు. ఇప్పటికీ అక్కడకు ఎవరు వెళ్లినా.. కళ్ల ముందే గెడ్డ స్థలంలో ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏకంగా ‘ఉక్కు పాదం’ మోపుతున్న స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకూ అక్కడ కనిపించకపోవడం గమనార్హం.


