సూర్యవంశీ విధ్వంసంపై స్పందించిన క్రిస్ గేల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎలిమినేటర్ మ్యాచ్లో సంచలనాత్మక ఇన్నింగ్స్తో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్గేల్ ప్రశంసలు కురిపించాడు. సూర్యవంశీని సరికొత్త సిక్సర్ల యంత్రంగా వర్ణించాడు. అతడి ఆట అద్భుతం అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. 29 బంతుల్లో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినందుకు సూర్యవంశీని ఓదార్చాడు. ఏదో ఒకరోజు ఈ యువ బ్యాటర్ తన రికార్డును బ్రేక్ చేస్తాడన్న విశ్వాసాన్ని వ్యక్త పరిచాడు.న్యూ చండీగఢ్ వేదికగా బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్తో పలు రికార్డు తిరగరాశాడు. 3 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. 29 బంతుల్లో ఐదు ఫోర్లు, 12 సిక్సర్లతో 334కు పైగా స్ట్రైక్ రేట్తో 97 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. 30 బంతుల్లో సెంచరీ చేసిన క్రిస్గేల్ రికార్డును బ్రేక్ అవకాశాన్ని కొంచెంలో మిస్సయ్యాడు. 2012లో గేల్ చేసిన 59 సిక్సర్లను రికార్డును మాత్రం సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు (65) కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ రికార్డుల స్క్రీన్షాట్ను ఇన్స్టా స్టోరీలో క్రిస్గేల్ షేర్ చేశాడు. అవుట్ స్టాండింగ్ అంటూ మెచ్చుకున్నాడు. ఏ న్యూ సిక్స్ మెషీన్ అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. సూర్యవంశీ ఇన్నింగ్స్ను మారణకాండతో పోల్చాడు. సెంచరీ మిస్ అయినందుకు దురదృష్టవంతుడు అంటూ కామెంట్ పెట్టాడు. తన రికార్డును ఎప్పటికైనా బ్రేక్ చేస్తాడని పేర్కొన్నాడు.
'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్లాస్ట్ జోన్'. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది. అర్జున్ సినిమా కావడంతో టాలీవుడ్లోనూ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 28) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రాజారామన్ (అర్జున్ సర్జా) కరాటే మాస్టర్. ఆయన సతీమణి నీలవేణి(అభిరామి), కూతురు నీల(ప్రీతి ముకుందన్)తో పాటు కుటుంబ సభ్యులంతా మార్షన్ ఆర్ట్స్లో నిపుణులు. ఒకపక్క కరాటే శిక్షణ ఇస్తూనే మరోపక్క మెడికల్ షాపు రన్ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తుంటారు. తనతో దురుసుగా ప్రవర్తించే మగాళ్లను చితకబాదుతూ.. తల్లితో తింట్లు తింటుంది నీల. కూతురుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నీలవేణి ప్లాన్ చేస్తుండగా.. అనుకోకుండా ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్తో శత్రుత్వం ఏర్పడుతుంది. వారి వెనుక బడా వ్యాపారవేత్త వరుణ్ దయాల(జాన్ కొక్కెన్) ఉంటాడు. ఓ ఇల్లీగల్ బిజినెస్ డీల్ కోసం అతను మంత్రికి లంచంగా ఇవ్వాల్సిన రూ. 1000 కోట్లు చేరాల్సిన చోటుకి చేరకుండా పరోక్షంగా రాజారామన్ ఫ్యామిలీ అడ్డుకుంటుంది. దీంతో వరుణ్ దయాల మనుషులు కూడా రాజా రామన్ ఫ్యామిలీని చంపేందుకు ప్లాన్ చేస్తారు. ఈ ప్రమాదం నుంచి రాజారామన్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? రూ. 1000 కోట్ల లంచం వెనుక ఉన్న రూ. 7000 కోట్ల ఇల్లీగల్ బిజినెస్ ఏంటి? ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న మార్షన్ ఆర్ట్స్ శిక్షణతో అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని రాజా రామన్ ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..ఆడపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, సమాజంలో అన్యాయాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అనే సందేశం ఇచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి లేదు కానీ కథనం మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా చూస్తున్నంత పెద్దగా బోర్ కొట్టదు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం లాజిక్లెస్గా అనిపిస్తాయి. అలాగే కథనం చాలా వరకు ఊహకందేలా సాగుతుంది. అయితే కొన్ని కథల విషయంలో తర్వాత ఏం జరుగుతుందనేది ముందే తెలిసినా.. దాన్ని తెరపై ఎలా ప్రజెంట్ చేస్తాడనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకుడిలో కలుగుతుంది. తాను ఊహించినట్లుగానే ఆయా సన్నివేశాలు సాగితే.. కథతో మరింత కనెక్ట్ అవుతాడు. ఈ సినిమా విషయంలో అదే జరుగుతుంది. ఊహించినట్లుగానే కథనం సాగినా.. ఆసక్తి మాత్రం తగ్గదు. బోర్ కొడుతుందని ప్రేక్షకుడు ఫీలయ్యేలోపు ఓ భారీ యాక్షన్ సీన్తో పాటు ప్రతి పాత్రకు ఎలివేషన్ ఇచ్చి కథతో లీనమయ్యేలా చేశాడు దర్శకుడు. స్క్రీన్ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు.సినిమా ప్రారంభంలో రాజారామన్ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకవైపు రాజారామన్ ఫ్యామిలీ స్టోరీని, మరోవైపు రౌడీ వ్యాపారవేత్త వరుణ్ దయాల్ రూ. 7000 కోట్ల బిజినెస్ డీల్ని చూపిస్తూ కథనం నడిపించి ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీని పెంచేశాడు. ఈ రెండు కథలకు మధ్య సంబంధం ఉంటుందని ప్రేక్షకుడు ఊహించినా.. ఎలా ముడిపెడతాడనే ఆసక్తి మాత్రం ఫస్టాఫ్ అంతా కొనసాగుతుంది. ఫ్యామిలీ సీన్లు రొటీన్గానే ఉన్నా.. ప్రతీ ముకుందన్ చేసే యాక్షన్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక ఇంటర్వెల్కి ముందు ఇంట్లో అర్జున్, ప్రీతి ముకుందన్, అభిరామి చేసే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ బ్లాస్ట్ బాగుంటుంది. ఇక ద్వితియార్థంలో అర్జున్ ఫ్యామిలీ.. రౌడీలను ఎలా ఎదుర్కొన్నాడనేదే ఉంటుంది. కథనం ఊహకందేలా సాగినా.. యాక్షన్ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. ముగింపు రొటీన్గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. చాలా రోజుల తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా చేసిన యాక్షన్ సినిమా ఇది. రాజారామన్ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. కొన్ని చోట్ల వింటేజ్ అర్జున్ని చూస్తారు. ఇక ఇన్నాళ్లు కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం అయిన ప్రీతి ముకుందన్, అభిరామి.. ఇందులో యాక్షన్ సీన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. ఇద్దరూ మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకుని చేసిన హై-ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్సులు సినిమాకు కొత్తదనం తెచ్చాయని చెప్పొచ్చు. వరుణ్ దయాల్గా జాన్ కొక్కేన్, అబ్రహాంగా అర్జున్ చిదంబరం, కిరుబకరన్గా పవన్ కృష్ణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
యోగి ఆదిత్యనాథ్కు అఖిలేశ్ కౌంటర్
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అధికార బీజేపీ, విపక్ష సమాజ్వాదీ పార్టీల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. ఎన్కౌంటర్లపై ఇరు పార్టీలు వాదులాడుకుంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన “యమరాజ్” వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఎన్కౌంటర్లు చేయింస్తోందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించడంతో ఈ వివాదం ముదిరింది. అఖిలేశ్ ఆరోపణలకు ఎన్డీఏ మిత్రపక్షం సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్భర్ కౌంటర్ ఇవ్వడంతో వాగ్యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది.ఉత్తరప్రదేశ్లో కులం, రాజకీయ ప్రయోజనాల ఆధారంగా బీజేపీ ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేయిస్తోందని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. వీటిలో కొన్ని నకిలీ ఎన్కౌంటర్లు కూడా ఉన్నాయని ధ్వజమెత్తారు. యోగి ఆదిత్యనాథ్ సర్కారు కొన్ని వర్గాలను ప్రత్యేకంగా టార్గెట్ చేసిందన్నారు. అఖిలేశ్ ఆరోపణలకు మద్దతుగా సమాజ్వాదీ పార్టీ యువజన విభాగ నేత పంకజ్ రాజ్భర్.. లక్నోలోని పార్టీ కార్యాలయం బయట ఓ భారీ పోస్టర్ను ఏర్పాటు చేశారు. 2024 నుంచి 2026 మధ్య కాలంలో హత్యకు గురైన రాజ్భర్ కులానికి చెందిన వారి ఫొటోలు ఇందులో ముద్రించారు. వారణాసి, ఘాజీపూర్, జౌన్పూర్, బరాబంకీ, కుషీనగర్, సంత్ కబీర్ నగర్, మౌ, బల్లియా జిల్లాల్లో హత్యకు గురైన వారి వివరాలు ఇందులో పేర్కొన్నారు.ఈ పోస్టర్ రాజకీయంగా యూపీలో తీవ్ర దుమారం రేపింది. రాజకీయ ప్రయోజనాల కోసమే సమాజ్వాదీ పార్టీ తన కార్యాలయం ఎదుట ఈ పోస్టర్ పెట్టిందని ఓం ప్రకాశ్ రాజ్భర్ విమర్శించారు. ప్రభుత్వ ఎన్కౌంటర్లను ఆయన సమర్థించారు. పోస్టర్లో పేర్కొన్న పలువురిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేర కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి నేరస్థులపై పోలీసులు తీసుకునే చర్యలకు రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు. గతంలో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఎంతో మంది నేరస్థులను కాపాడిందని ఆయన ఆరోపించారు.ఎన్నికల అంశంగా ఎన్కౌంటర్లు2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజ్భర్ వర్గం మద్దతు పొందడానికి సమాజ్వాదీ పార్టీ చేసిన ప్రయత్నంగా ఈ వ్యవహారాన్ని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎన్కౌంటర్ల అంశం కీలకంగా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై మున్ముందు అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని భావిస్తున్నారు. చదవండి: కేంద్రం నిర్ణయంపై అన్నామలై అభ్యంతరంటికెట్ చిరిగిపోవడం ఖాయంమహిళలు, అమ్మాయిల జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరిస్తూ యమరాజు పదాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్కువగా ఉచ్చరిస్తున్నారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని, వెంటనే వారి టికెట్ కత్తిరించడానికి యమరాజు సిద్ధంగా ఉంటాడని సీఎం యోగి వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, ఆయన 9 ఏళ్ల పాలనలో 17,043 ఎన్కౌంటర్లు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
‘మా ఇళ్లే అడ్డొచ్చాయా..? మమ్మల్ని ఒకసారే చంపేయండి’
విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో పేదల ఇళ్లు కూల్చివేతలకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. రొయ్యల చెరువులకు తమ ఇళ్లు అడ్డువస్తున్నాయని చెప్పి కూల్చివేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఇలా అర్థంలేని కారణంతో గంటలో కూల్చివేయడం తాము పేదలం కాబట్టే చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇల్లు కూల్చివేతకు నిరసనగా విజయవాడలో గురువారం(మే 28వ తేదీ) రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం కెవిపిఎస్ వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీని కోసం విజయవాడకు వచ్చిన బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఇళ్లు కూల్చివేత మానుకోవాలని, కూల్చిన ప్రతి ఇంటికి లెక్కగట్టి పరిహారం ఇవ్వాలని అంటున్నారు బాధితులు. సర్వం కోల్పోయిన తమకు న్యాయం చేయడమే కాకుండా రఘరామ కృష్ణంరాజు పై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. ఉందూరు మండలానికి చెందిన పద్మ అనే బాధితురాలు మాట్లాడుతూ.. ‘ 72 ఇల్లు కూల్చేశారు. 70 ఏళ్ళ నుండి అక్కడే ఉంటున్నాం. రొయ్యల చెరువులు పిటిషన్ పెట్టారని కూల్చారు. అందరికి పిటిషన్ పెట్టాం..కనీసం కనికరం చూపించలేదు. నడిరోడ్డు మీద ఇప్పుడు నిలబడ్డం. ఇల్లు కట్టుకొని సంవత్సరం అయ్యింది. రఘురామ కృష్ణం రాజు భార్య గారిని అడిగాం. ఆవిడా కూడా దారుణంగా మాట్లాడారు. అక్వా రైతులకు అడ్డం గా ఉన్నామని కూల్చేశారు. కలెక్టర్, లోకేష్, చంద్రబాబు ఇంటికి వెళ్ళాం. చంపేస్తే ఒకసారే చంపేయండి. కూలీపనులు చేసుకొని ఒకసారే ఇల్లు కట్టుకోగలం..అలాంటి ఇళ్లను కూర్చేశారు. పెద్దల గెస్ట్ హౌస్లు అడ్డం రాలేదు.. మా ఇల్లులు అడ్డం వొచ్చాయా?’ అని నిలదీశారు.
భారీ అగ్నిప్రమాదం.. 16 మంది అమ్మాయిలు సజీవ దహనం
‘అందుకే.. టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామా’
'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్
భారత్ సహా ఆ 3 దేశాల పిలుపుపై ఉ.కొరియా ఘాటు వ్యాఖ్యలు
భారతీయ ఇండీ సినిమాకు కేరాఫ్ అడ్రస్గా రానా
ధరల పతనం షురూ.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు!
ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు
శాంసంగ్ నుంచి 72 టీవీ మోడల్స్
తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్
పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం
విజయ్ సర్కార్ ఎఫెక్ట్.. 162 మంది న్యాయవాదుల రాజీనామా
ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
అక్కగా సీఎం విజయ్ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్
వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ నగదు పట్టివేత
కవలలకు జన్మనిచ్చిన సీరియల్ హీరోయిన్
నీటి ఎద్దడి నివారణలో విఫలమైన బాబు సర్కార్
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం
అన్నాడీఎంకే సంక్షోభంలో కీలక మలుపు
దేవతల రాజధాని అంటే మన ఆలయాల భూములు కూడా ఆక్రమించి అమ్మేసి కట్టేది అని ఇప్పుడే అర్థమైంది స్వామి!!
ఎప్స్టెయిన్ సెక్స్స్కాండల్.. స్టాన్ఫోర్డ్ హిస్టరీ! ఇక్కడ డీఎస్సీ స్కాండల్ మిస్టరీ! ఔను సార్ అదే మీ బ్యాచ్!
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు.. నూతన ఉద్యోగలాభం
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
కోర్టు చెబితే ఇచ్చేయాలా?
కర్ణాటక కాబోయే సీఎం.. కుటుంబం గురించి తెలుసా?
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్
గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు!
భారీ అగ్నిప్రమాదం.. 16 మంది అమ్మాయిలు సజీవ దహనం
‘అందుకే.. టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామా’
'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్
భారత్ సహా ఆ 3 దేశాల పిలుపుపై ఉ.కొరియా ఘాటు వ్యాఖ్యలు
భారతీయ ఇండీ సినిమాకు కేరాఫ్ అడ్రస్గా రానా
ధరల పతనం షురూ.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు!
ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు
శాంసంగ్ నుంచి 72 టీవీ మోడల్స్
తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్
పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం
విజయ్ సర్కార్ ఎఫెక్ట్.. 162 మంది న్యాయవాదుల రాజీనామా
ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
అక్కగా సీఎం విజయ్ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్
వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ నగదు పట్టివేత
కవలలకు జన్మనిచ్చిన సీరియల్ హీరోయిన్
నీటి ఎద్దడి నివారణలో విఫలమైన బాబు సర్కార్
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం
అన్నాడీఎంకే సంక్షోభంలో కీలక మలుపు
దేవతల రాజధాని అంటే మన ఆలయాల భూములు కూడా ఆక్రమించి అమ్మేసి కట్టేది అని ఇప్పుడే అర్థమైంది స్వామి!!
ఎప్స్టెయిన్ సెక్స్స్కాండల్.. స్టాన్ఫోర్డ్ హిస్టరీ! ఇక్కడ డీఎస్సీ స్కాండల్ మిస్టరీ! ఔను సార్ అదే మీ బ్యాచ్!
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు.. నూతన ఉద్యోగలాభం
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
కోర్టు చెబితే ఇచ్చేయాలా?
కర్ణాటక కాబోయే సీఎం.. కుటుంబం గురించి తెలుసా?
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్
గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు!
ఫొటోలు
సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)
తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు)
కమెడియన్ ఇంట్లో సీమంతం వేడుక (ఫొటోలు)
తిరుపతి: స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు (ఫోటోలు)
తాతకు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ (ఫోటోలు)
మోదీతో విజయ్.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్లో ప్రెట్టీ లుక్లో ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)
‘ఆపద్బాంధవుడు’ మూవీ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఇప్పుడు ఇలా...(ఫొటోలు)
వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫొటోలు)
సినిమా
దృశ్యం 3లో నర్స్.. నిజ జీవితంలో డాక్టర్
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం! ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ట్రెండు మారింది. ఓపక్క యాక్టింగ్ చేస్తూనే మరోపక్క మెడిసిన్ పూర్తి చేస్తున్నారు తారలు. కొందరైతే డాక్టరయ్యాక కూడా యాక్టర్ అవొచ్చని నిరూపిస్తున్నారు. అలాంటివారి జాబితాలోకే వస్తుంది నటి శ్రద్ధా గోకుల్. ఈమె మలయాళ దృశ్యం 3 మూవీలో నర్సుగా కనిపించింది. కానీ నిజ జీవితంలో ఈమె మాత్రం నర్సు కాదు, ఏకంగా వైద్యురాలు.. తనగురించే ఈ ప్రత్యేక కథనం..చైల్డ్ ఆర్టిస్ట్గా..మలయాళ నటి శ్రద్ధా గోకుల్కు సినిమాలు కొత్తేం కావు. చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చింది. 'హలో కుట్టిచేతన్' అనే మలయాళ సీరియల్లో వర్ష పాత్రలో కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్గా అప్పట్లోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇది కేవలం పిల్లల కోసమే డిజైన్ చేసిన సీరియల్. ఈ సీరియల్ కంటే ముందు సూపర్ డ్యాన్సర్ జూనియర్ అనే డ్యాన్స్ షోలో పాల్గొంది శ్రద్ధా.చదువు నిర్లక్ష్యం చేయొద్దని..సీరియల్స్లో క్లిక్ అవడంతో దుల్కర్ సల్మాన్ 'పట్టం పోలే' మలయాళ మూవీలో నటించే ఛాన్స్ చేజిక్కించుకుంది. తర్వాత సినిమా అవకాశాలు రాలేదని కాదు కానీ చదువును నిర్లక్ష్యం చేయొద్దనుకుంది. నటనకు బ్రేక్ ఇచ్చేసి చదువుపైనే దృష్టి సారించింది. ఫిలిప్పీన్స్లో మెడిసిన్ పూర్తి చేసింది. అనంతరం కేరళ తిరువనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంటర్న్షిప్ పూర్తి చేసింది.రీఎంట్రీతను సినిమాల్లోకి వస్తుందని మళ్లీ ఊహించలేదు. కానీ అనుకోకుండా కొచ్చిలో ఓ ఆడిషన్కు వెళ్లింది. అక్కడ సెలక్ట్ అవడంతో జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన 'వళతు వశతె కల్లాన్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో చిన్న పాత్రే అయినా బాగా క్లిక్ అయింది. దాంతో జీతూ జోసెఫ్ ఆమెకు దృశ్యం 3లో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో డాక్టర్ శ్రద్ధా గోకుల్ నర్సుగా కనిపించింది.యాక్టింగ్, మెడిసిన్.. రెండింటినీ వదిలేయాలని లేదు. డెర్మటాలజీ విభాగంలో పీజీ చేయాలనుంది. దానికోసం ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాను. అలాగే నాకు డ్యాన్సింగ్, యాక్టింగ్ రెండూ చాలా ఇష్టం. మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను.- శ్రద్ధా గోకుల్ View this post on Instagram A post shared by Shraddha Gokul (@shraddhagokul) చదవండి: కుటుంబమంతా చనిపోవాలనుకున్నాం.. ఒంటిపై కిరోసిన్ పోశా..: శివకుమార్
'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్లాస్ట్ జోన్'. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది. అర్జున్ సినిమా కావడంతో టాలీవుడ్లోనూ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 28) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రాజారామన్ (అర్జున్ సర్జా) కరాటే మాస్టర్. ఆయన సతీమణి నీలవేణి(అభిరామి), కూతురు నీల(ప్రీతి ముకుందన్)తో పాటు కుటుంబ సభ్యులంతా మార్షన్ ఆర్ట్స్లో నిపుణులు. ఒకపక్క కరాటే శిక్షణ ఇస్తూనే మరోపక్క మెడికల్ షాపు రన్ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తుంటారు. తనతో దురుసుగా ప్రవర్తించే మగాళ్లను చితకబాదుతూ.. తల్లితో తింట్లు తింటుంది నీల. కూతురుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నీలవేణి ప్లాన్ చేస్తుండగా.. అనుకోకుండా ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్తో శత్రుత్వం ఏర్పడుతుంది. వారి వెనుక బడా వ్యాపారవేత్త వరుణ్ దయాల(జాన్ కొక్కెన్) ఉంటాడు. ఓ ఇల్లీగల్ బిజినెస్ డీల్ కోసం అతను మంత్రికి లంచంగా ఇవ్వాల్సిన రూ. 1000 కోట్లు చేరాల్సిన చోటుకి చేరకుండా పరోక్షంగా రాజారామన్ ఫ్యామిలీ అడ్డుకుంటుంది. దీంతో వరుణ్ దయాల మనుషులు కూడా రాజా రామన్ ఫ్యామిలీని చంపేందుకు ప్లాన్ చేస్తారు. ఈ ప్రమాదం నుంచి రాజారామన్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? రూ. 1000 కోట్ల లంచం వెనుక ఉన్న రూ. 7000 కోట్ల ఇల్లీగల్ బిజినెస్ ఏంటి? ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న మార్షన్ ఆర్ట్స్ శిక్షణతో అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని రాజా రామన్ ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..ఆడపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, సమాజంలో అన్యాయాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అనే సందేశం ఇచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి లేదు కానీ కథనం మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా చూస్తున్నంత పెద్దగా బోర్ కొట్టదు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం లాజిక్లెస్గా అనిపిస్తాయి. అలాగే కథనం చాలా వరకు ఊహకందేలా సాగుతుంది. అయితే కొన్ని కథల విషయంలో తర్వాత ఏం జరుగుతుందనేది ముందే తెలిసినా.. దాన్ని తెరపై ఎలా ప్రజెంట్ చేస్తాడనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకుడిలో కలుగుతుంది. తాను ఊహించినట్లుగానే ఆయా సన్నివేశాలు సాగితే.. కథతో మరింత కనెక్ట్ అవుతాడు. ఈ సినిమా విషయంలో అదే జరుగుతుంది. ఊహించినట్లుగానే కథనం సాగినా.. ఆసక్తి మాత్రం తగ్గదు. బోర్ కొడుతుందని ప్రేక్షకుడు ఫీలయ్యేలోపు ఓ భారీ యాక్షన్ సీన్తో పాటు ప్రతి పాత్రకు ఎలివేషన్ ఇచ్చి కథతో లీనమయ్యేలా చేశాడు దర్శకుడు. స్క్రీన్ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు.సినిమా ప్రారంభంలో రాజారామన్ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకవైపు రాజారామన్ ఫ్యామిలీ స్టోరీని, మరోవైపు రౌడీ వ్యాపారవేత్త వరుణ్ దయాల్ రూ. 7000 కోట్ల బిజినెస్ డీల్ని చూపిస్తూ కథనం నడిపించి ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీని పెంచేశాడు. ఈ రెండు కథలకు మధ్య సంబంధం ఉంటుందని ప్రేక్షకుడు ఊహించినా.. ఎలా ముడిపెడతాడనే ఆసక్తి మాత్రం ఫస్టాఫ్ అంతా కొనసాగుతుంది. ఫ్యామిలీ సీన్లు రొటీన్గానే ఉన్నా.. ప్రతీ ముకుందన్ చేసే యాక్షన్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక ఇంటర్వెల్కి ముందు ఇంట్లో అర్జున్, ప్రీతి ముకుందన్, అభిరామి చేసే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ బ్లాస్ట్ బాగుంటుంది. ఇక ద్వితియార్థంలో అర్జున్ ఫ్యామిలీ.. రౌడీలను ఎలా ఎదుర్కొన్నాడనేదే ఉంటుంది. కథనం ఊహకందేలా సాగినా.. యాక్షన్ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. ముగింపు రొటీన్గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. చాలా రోజుల తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా చేసిన యాక్షన్ సినిమా ఇది. రాజారామన్ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. కొన్ని చోట్ల వింటేజ్ అర్జున్ని చూస్తారు. ఇక ఇన్నాళ్లు కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం అయిన ప్రీతి ముకుందన్, అభిరామి.. ఇందులో యాక్షన్ సీన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. ఇద్దరూ మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకుని చేసిన హై-ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్సులు సినిమాకు కొత్తదనం తెచ్చాయని చెప్పొచ్చు. వరుణ్ దయాల్గా జాన్ కొక్కేన్, అబ్రహాంగా అర్జున్ చిదంబరం, కిరుబకరన్గా పవన్ కృష్ణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
చాన్నాళ్లకు హిట్.. ఇప్పుడు మరొకటి రెడీ
తమిళ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి ఏళ్లు గడిచిపోయింది. అయితే ఈ నెల రెండో వారం వచ్చిన 'కరుప్పు'(తెలుగు 'వీరభద్రుడు') ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఇది థియేటర్లలో ఆడుతోంది. ఇంతలోనే మరో మూవీ రిలీజ్ డేట్ ని సూర్య ప్రకటించేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)సర్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆకట్టుకున్న తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి.. సూర్యతో తీసిన మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమిత బైజు హీరోయిన్. సాఫ్ట్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. 40 ఏళ్లు దాటేసిన ఓ వ్యక్తి.. 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడితే అనేది కాన్సెప్ట్. లెక్క ప్రకారం జూలైలోనే తీసుకురావొచ్చని అనుకున్నారు. కానీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ తో ప్రకటించారు.'కరుప్పు'తో సక్సెస్ అందుకున్న సూర్య.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడనేది చూడాలి. ఇందులో రాధిక, రవీనా టండన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీత దర్శకుడు.(ఇదీ చదవండి: ఈ గుండెని తాకిపో తాతా: తారక్ ఎమోషనల్ పోస్ట్)
రూ.20 కోసం గొడవ.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్నా: నటుడు ఎమోషనల్
శివకుమార్.. ఈ బుల్లితెర నటుడు మౌనరాగం సీరియల్తో ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం తెలుగులో ఓ ధారావాహికలో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే సీరియల్స్ కన్నా సోషల్ మీడియాలోనే ఈయన ఎక్కువ పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా అతడి ప్రేమ వ్యవహారం ఆన్లైన్లో ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది.కలిసుంటున్న జోడీ'మౌనరాగం', 'జానకి కలగనలేదు' సీరియల్స్ నటి ప్రియాంక జైన్తో రియల్ లైఫ్లోనూ ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు, ప్రస్తుతం కలిసే ఉంటున్నారు. ప్రియాంక ఆల్రెడీ తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో రాబోయే బిగ్బాస్ సీజన్లలో ఆమె ప్రియుడు శివకుమార్ ఉండటం ఖాయమని అభిమానులు ఫీలవుతున్నారు.ప్రియాంకజైన్తో శివకుమార్తండ్రి కర్కశత్వంపైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే శివకుమార్ బాల్యంలో మాత్రం తండ్రి ప్రేమకు నోచుకోలేదు. ప్రేమను పంచాల్సిన తండ్రి బాధ పెడుతుంటే తట్టుకోలేకపోయాడు. ఆ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. శివకుమార్ మాట్లాడుతూ.. మా అమ్మ స్కూల్ టీచర్. సాయంత్రం 5 తర్వాత అరగంట ఆలస్యంగా వస్తే చాలు అమ్మపై నాన్న కోప్పడేవాడు. ఎవడితో తిరుగుతున్నావ్? అని నీచంగా మాట్లాడేవాడు. అమ్మను కొట్టేవాడు. రూ.20 కోసం పెద్ద గొడవప్రతిరోజు ఇదంతా చూసి అలిసిపోయాను. ఆయన ప్రవర్తనకు విసిగిపోయాను. ఆయన మందు తాగుతాడు, గుట్కా నములుతాడు, ఎన్నో ఎఫైర్స్ ఉన్నాయి. మా నాన్నను చూశాక మా చెల్లికి అబ్బాయిలంటేనే విరక్తి వచ్చేసింది. ఒకరోజు ఏమైందంటే.. మా నాన్న జేబులో రూ.20 కనిపించలేదు. ఆయనే ఎక్కడో తాగినచోట ఖర్చు చేసుంటాడు. నేనే తీశానని నాపై నింద వేశాడు. ఆయన చేసిన గొడవకు ఊరంతా మా ఇంటి ముందుకొచ్చింది. కుటుంబమంతా చనిపోదామని..కేవలం రూ.20 కోసం అంత పెద్ద గొడవ! ఈ జీవితమే వద్దు అని చచ్చిపోవాలనుకున్నా.. నాతోపాటు అమ్మ, చెల్లిపై కిరోసిన్ గుమ్మరించాను. అగ్గిపుల్ల వెలిగించేలోపు అమ్మ స్టూడెంట్ ఒకరు మమ్మల్ని బయటకు తీసుకెళ్లి కాపాడారు. ఆరోజు గనక తను ఆపకపోయుంటే ఈరోజు శివకుమార్ మీ ముందుండేవాడు కాదు. ఎవరినైనా మంచి తండ్రిని చూసినప్పుడు నాకెందుకు ఇలాంటి నాన్న లేడని బాధపడేవాడిని. నాన్న ప్రేమను పొందలేకపోయాను. ఇలాంటి వ్యక్తితో ఇంకా ఎందుకు కలిసుండటం? విడాకులు ఇచ్చేయమని అమ్మతో అనేవాడిని. ఇన్నాళ్లకు వాళ్లిద్దరికీ విడాకులు ఇప్పిస్తున్నాను అని శివకుమార్ ఎమోషనలయ్యాడు.NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comచదవండి: పాతిక వేల సాయం.. దాని విలువ ఇప్పుడు రూ.5 కోట్లు
క్రీడలు
వైభవ్ను సూర్యవంశీని వెతికి తీసుకొచ్చింది ఇతడే
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఐపీఎల్-2026లో ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు వైభవ్.ఐపీఎల్ మొదలై 19 సీజన్లు అవుతున్నప్పటికి ప్లే ఆఫ్స్లో ఇలాంటి ఇన్నింగ్స్ను ఇప్పటివరకు చూడలేదు. ఈ నాకౌట్ మ్యాచ్లో సన్రైజర్స్ బౌలర్లుకు సూర్యవంశీ చుక్కలు చూపించాడు. ఆఖరికి ప్లాన్-బి, ప్లాన్-సి అని చెప్పిన సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ను సైతం ఈ వండర్ కిడ్ వదల్లేదు. 15 ఏళ్ల వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్ల బాదిన ప్లేయర్గా క్రిస్ గేల్ ఆల్టైమ్ రికార్డును సూర్యవంశీ(62) బ్రేక్ చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్కు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు సైతం ఫిదా అయిపోయారు. అయితే వైభవ్ సూర్యవంశీ వంటి చిచ్చర పిడుగును ఐపీఎల్కు పరిచయం చేసింది ఎవరో తెలుసా? అతడి ఐపీఎల్ ఎంట్రీ వెనక చాలా కథ దాగి ఉంది.థాంక్యూ సమర్..వైభవ్ సూర్యవంశీలోని టాలెంట్ను తొలుత గుర్తించింది బిహార్ మాజీ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ టాలెంట్ స్కౌటింగ్ టీమ్లో సభ్యుడైన సమర్ ఖాద్రీ. సమర్ ఖాద్రీ దేశవాళీ మ్యాచ్లలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ను మొదటిసారి చూశాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ ఆడుతున్న అద్భుతమైన షాట్లు, అతడిలోని టాలెంట్ చూసి ఖాద్రీ ఆశ్చర్యపరిచాడు.వెంటనే వైభవ్ గురుంచి రాజస్తాన్ హై పర్ఫార్మెన్స్ అండ్ స్కౌటింగ్ హెడ్ జుబిన్ భరుచాకు సమాచారం అందించాడు. దీంతో జూబిన్.. వైభవ్ కోసం ప్రత్యేకంగా ట్రయల్స్ ఏర్పాటు చేశారు. అయితే ట్రయల్స్లో వైభవ్ తను ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్గా మలిచాడు. ఇది చూసిన జుబిన్ సైతం బిత్తరపోయాడు. ఎందుకంటే రాజస్తాన్ రాయల్స్ ట్రయల్స్లో అప్పటివరకు సంజూ శాంసన్, జైశ్వాల్ మాత్రమే తాము ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్ బాదాడు. ఆ జాబితాలో వైభవ్ కూడా చేరాడు. ట్రయల్స్ ముగిసిన వెంటనే ఆర్ఆర్ మేనేజ్మెంట్కు జుబిన్ ఒక సందేశం పంపాడు. రాబోయే ఐపీఎల్ వేలంలో ఈ అబ్బాయి కోసం రూ.10 కోట్లు సిద్ధంగా ఉంచుకోండి.ఎందుకంటే మనం ఒక అరుదైన, అసాధారణమైన టాలెంట్ను చూశాను అంటూ రాజస్తాన్ యాజమాన్యానికి తెలియజేశాడు. దీంతో ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లతో వైభవ్ను పట్టుబట్టి మరి రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. అప్పటిలో ఒక యువ ఆటగాడిపై అంత మొత్తాన్ని వెచ్చించడాన్ని చాలా మంది తప్పుపట్టారు. కానీ ఇప్పుడు అతడి విలువ వందల కోట్లతో సమానం.చదవండి: ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. వైభవ్ బ్యాటింగ్కు సచిన్ ఫిదా
ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. వైభవ్ బ్యాటింగ్కు సచిన్ ఫిదా
ఐపీఎల్-2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్లో రాజస్తాన్ రాయల్స్ యంగ్ కిడ్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. వరుసగా ఎనిమిది ఓవర్ల పాటు తన మెరుపు బ్యాటింగ్తో కోట్లాది మంది అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు.15 ఏళ్ల వైభవ్.. పాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వదల్లేదు. తొలి ఓవర్ నుంచే సన్రైజర్స్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 29 బంతుల్లోనే ఐదు ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని ఈ చిచ్చరపిడుగు కోల్పోయాడు. ఇక వైభవ్ సంచలన ఇన్నింగ్స్కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఫిదా అయిపోయాడు. వైభవ్పై మాస్టర్ బ్లాస్టర్ ప్రశంసల వర్షం కురిపించాడు."వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్వింగ్ అద్భుతంగా ఉంది. అతడి కాళ్ల వైపు వచ్చే బంతులను ఫ్రంట్ఫుట్ క్లియర్ చేసి పక్కకు జరుగుతూ ఆడే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ స్వేచ్ఛే అతన్ని తనదైన శైలిలో ఆడేలా చేస్తోంది. అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్ నిజంగా అత్యుద్భుతం" అని సచిన్ ఎక్స్లో రాసుకొచ్చాడు.కాగా ఈ మ్యాచ్లో సన్రైజర్స్పై 47 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. దీంతో ఎస్ఆర్హెచ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. రాయల్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.చదవండి: అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్
ఆ ఒక్క పొరపాటే కొంపముంచింది: వైభవ్ సూర్యవంశీ
మ్యాచ్ మారినా, వేదిక మారినా సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ జోరు మాత్రం తగ్గడం లేదు. మరోసారి అసాధారణ ఆట కనబర్చిన అతను ఈ క్రమంలో వరుసగా రికార్డులు కొల్లగొడుతూ పోయాడు. ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 15 ఏళ్ల వైభవ్ విధ్వంసం సృష్టించాడు.ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన తొలి ఓవర్లో సిక్స్తో దూకుడు మొదలు పెట్టిన అతను మలింగ వేసిన తర్వాతి ఓవర్లో మరో సిక్స్ కొట్టాడు. ఆపై కమిన్స్ మరుసటి ఓవర్లో ఒక ఫోర్, ఆపై వరుసగా మూడు సిక్సర్లు బాది వైభవ్ తానేంటో చూపించాడు. సాకిబ్ వేసిన తర్వాత ఓవర్లో అతను కొత్త రికార్డు సృష్టించాడు. తొలి సిక్స్తో గేల్ను సమం చేసిన వైభవ్, తర్వాతి సిక్స్తో గేల్ను అధిగమించాడు. మూడో సిక్స్తో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తయింది.ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లో అతను ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో సురేశ్ రైనా (2014) రికార్డు సమం చేశాడు. ఐపీఎల్ మ్యాచ్ పవర్ప్లేలో అత్యధిక సిక్స్లు (8) కొట్టిన ఘనత కూడా వైభవ్దే అయింది. ఆ తర్వాత కూడా అతను తగ్గలేదు. అర్ధ సెంచరీ తర్వాత ఆడిన 12 బంతుల్లో అతను 4 ఫోర్లు, 4 సిక్స్లతో మరో 43 పరుగులు రాబట్టాడు. సాకిబ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన తర్వాత హింగే ఓవర్లో మరింత చెలరేగిపోయాడు.వరుసగా 4, 4, 6, 6 బాది అతను 97కు చేరుకున్నాడు. తర్వాతి బంతికి 3 పరుగులు రాబడితే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (30 బంతుల్లో గేల్ పేరిట) రికార్డును బద్దలు కొట్టేవాడు. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నంచి క్యాచ్ ఇవ్వడంతో 29వ బంతికి అతని అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. సూర్యవంశీ ఔటయ్యాక మైదానాన్ని వీడడానికి ఇష్టపడలేదు. అనవసర షాట్ ఆడి ఔటైనన్న బాధతో అతడు కాసేపు మైదానంలోనే ఉండిపోయాడు. ఇక ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ అవ్వడంపై వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు."నిజానికి ఆ షాట్ ఆడే సమయంలో నా సెంచరీ గురుంచి అసలు ఆలోచించలేదు. కానీ ఫీల్డర్ను చూసిన తర్వాత నా మైండ్ మార్చుకున్నాను. అందుకే నా టైమింగ్ తప్పింది. ఒకవేళ నేను ముందు అనుకున్నట్టుగా 'థర్డ్ మ్యాన్' దిశగా ఆ షాట్ ఆడి ఉంటే, బంతి ఈజీగా బౌండరీ లైన్ దాటిపోయేది. కానీ నేను బంతిని స్ట్రైయిట్గా కొట్టడానికి ప్రయత్నించాను. అదే నేను చేసిన తప్పు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో ఔట్ అవ్వాల్సి వచ్చింది" అని ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో వైభవ్ పేర్కొన్నాడు. అదేవిధంగా సన్రైజర్స్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్కు ముందు ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దని రాజస్తాన్ కోచ్లు అందరూ తనకు చెప్పారని సూర్యవంశీ వెల్లడించాడు. కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ను గాను ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్
అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్
ఐపీఎల్-2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. బుధవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 47 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఎస్ఆర్హెచ్.. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. తొలుత బౌలింగ్లో విఫలమైన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత బ్యాటింగ్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక హైదరాబాద్ జట్టు చతికలపడింది.19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి(38), సైల్ ఆరోరా(35), ఇషాన్ కిషన్(33) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.పవర్ప్లేలోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి సన్రైజర్స్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అంతకుముందు రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి తృటిలో రికార్డు సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు.ఇక ఈ హార్ట్బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారీ లక్ష్య ఛేదనలో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకోవడం వల్లే తమకు ఓటమి ఎదురైందని కమ్మిన్స్ తెలిపాడు. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీపై కూడా ఈ ఆసీస్ కెప్టెన్ ప్రశంసల వర్షం కురిపించాడు.మా ఓటమికి కారణమదే..వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయంలో మా బౌలర్లకు పెద్దగా ఆప్షన్స్ లేకుండా చేశాడు. అతడిని ఆపేందుకు ఏమి చేయాలో కూడా నాకు ఆర్ధం కాలేదు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. కానీ మ్యాచ్ ఫలితంలో వారికి మాకు మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదేమైనా వైభవ్ ఆటకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. యార్కర్ కొంచెం మిస్ అయినా వైభవ్ వాటిని వదలకుండా సిక్సర్లగా మలిచాడు. ఇక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై నాకేమీ పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే వికెట్ చివరి వరకు కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ఈ సీజన్ ద్వారా మేము యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీశాము.మేము టోర్నీని ఓటమితో ముగించినప్పటికి ఒక పరిపూర్ణమైన జట్టుగా మాత్రం నిలిచాం. ప్రఫుల్, సాకిబ్ ల రూపంలో ఇద్దరు నాణ్యమైన ఇండియన్ పేసర్లు వెలుగులోకి వచ్చారు. టోర్నీ అంతటా వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్కు చేరుకున్న యంగెస్ట్ టీమ్స్లో ఒకటిగా సన్రైజర్స్ నిలిచింది. మా జట్టులో చాలా వరకు యువ ఆటగాళ్లు ఉన్నారు. యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీయడంలో మా కోచింగ్ స్టాప్ది కీలక పాత్ర. వారి వల్లే ఆరెంజ్ ఆర్మీ ఒక పటిష్టమైన టీమ్గా మారింది. కాబట్టి ఒక కెప్టెన్గా వారు అలా రాణించడం చాలా సంతోషంగా ఉంది. 240 పరుగుల పైగా లక్ష్యాన్ని చేధించడం అంత సులువు కాదు. అయితే ఈ లక్ష్యాన్ని చేధించేందుకు అనువైన పిచ్ ఏదైనా ఉందంటే? అది ముల్లాన్ పూర్ మాత్రమే అని కచ్చితంగా చెబుతాను. ఎందుకంటే ఈ పిచ్ బ్యాటింగ్కు అద్భుతంగా ఉంటుంది. ఛేజింగ్ చాలా వరకు మేము గట్టి పోటీ ఇచ్చాము. సరైన రన్రేట్ మెయింటేన్ చేస్తూ ముందుకు వెళ్లాము. కానీ దురదృష్టవశాత్తూ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం మా గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. గత మూడు సీజన్లలో మేము రెండు సార్లు ప్లే ఆఫ్స్కు చేరాం. ఈసారి టాప్-2లో నిలిచేందుకు చాలా దగ్గరగా వచ్చాం. ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. ఈ సీజన్ అంతటా మా బాయ్స్ అద్భుతంగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల నేను ఎంతో గర్వపడుతున్నాను కమిన్స్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు.చదవండి: వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు
న్యూస్ పాడ్కాస్ట్
చంద్రబాబు రాక్షస పాలనపై పోరుబాట... వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పునకు సంకేతాలు.. సిద్ధరామయ్య రేపు రాజీనామా చేసే అవకాశం
మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా?... చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ సీఎం వైఎస్ జగన్
యుద్ధమా? ఒప్పందమా?... ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో పగిలిన అక్రమాల పుట్ట... ఎస్సీఆర్టీ నుంచే కుంభకోణం..
అమరావతిలో చంద్రబాబు లూటీ... అవినీతి, దోపిడీతో ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు.
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో దోపిడీ విజన్, స్కామ్కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
బిజినెస్
యూపీఐ ద్వారా PF విత్డ్రా.. కొత్త రూల్స్ ఇవే!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఈపీఎఫ్ఓ 3.0 ప్రారభించడానికి సిద్ధమవుతోంది. కాబట్టి చందాదారులు త్వరలోనే తమ పీఎఫ్ డబ్బును మరింత వేగంగా, సులభంగా పొందగలుగుతారు. ఈ కొత్త విధానం ద్వారా.. సభ్యులు యూపీఐ ద్వారా తమ పీఎఫ్ డబ్బును నేరుగా తమ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చని, తద్వారా పేపర్ వర్క్, ప్రాసెసింగ్ సమయం వంటివి గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే.. చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే.. ఖాతా నుంచి ఎంత డబ్బు విత్డ్రా చేయవచ్చు?, మొత్తం బ్యాలెన్స్ను తక్షణమే పొందవచ్చా?. దీనికి గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.EPFO 3.0 గురించిఈపీఎఫ్ఓ 3.0 అనేది ప్రావిడెంట్ ఫండ్ లావాదేవీలను సులభతరం చేయడానికి.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకొస్తున్న డిజిటల్ ప్రక్రియ. ఇదివరకు పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే ఫారమ్లు, క్లెయిమ్ ప్రాసెసింగ్, ధృవీకరణ వంటి ప్రక్రియలకు ఎక్కువ సమయం పట్టేది. కానీ కొత్త విధానం ద్వారా.. ఈ ప్రక్రియ సులభతరం కానుంది. చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలో అర్హత కలిగిన మొత్తాన్ని యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా పేపర్లెస్ విధానం. కాబట్టి ఉద్యోగులకు సమయం, శ్రమ రెండూ తగ్గుతాయి.ఎంత విత్డ్రా చేసుకోవచ్చు?ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం.. సభ్యులు తమ ఖాతాలోని మొత్తంలో 50% నుంచి 75% వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే.. మొత్తం డబ్బును ఒక్కసారిగా తీసుకునే అవకాశం లేదు. దీనికి ప్రధాన కారణం.. ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రత. భవిష్యత్తు కోసం కొంత మొత్తం ఖాతాలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం నియమాలు రూపొందిస్తోంది.ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి?కొత్త నియమాల ప్రకారం.. పీఎఫ్ ఖాతాలో కనీసం 25శాతం ఉండాలి. దీనిని ఉద్యోగులు తమ రిటైర్మెంట్ సమయంలో ఉపయోగించుకోవచ్చు.అయితే.. ఆటో సెటిల్మెంట్ పరిమితిని పెంచారు. ఇప్పటివరకు ఆటో సెటిల్మెంట్ ద్వారా రూ.1 లక్ష వరకు మాత్రమే క్లెయిమ్లు త్వరగా ప్రాసెస్ అయ్యేవి. ఇప్పుడు ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. దీని వల్ల సభ్యులు తక్షణ అవసరాల కోసం పెద్ద మొత్తాన్ని త్వరగా పొందగలుగుతారు.యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రాఈపీఎఫ్ఓ 3.0 విధానంలో.. చందాదారుడు ముందుగా తాను ఎంత మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు అనేది చూడవచ్చు. తరువాత తన బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన యూపీఐ ఐడీ ద్వారా ఆ మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో సేఫ్టీ కోసం యూపీఐ పిన్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. డబ్బు ఖాతాలో జమ అయిన తర్వాత సభ్యుడు ఆ మొత్తాన్ని డిజిటల్ చెల్లింపులు, బ్యాంకుకు బదిలీ చేయడం లేదా ఏట్ఎం ద్వారా నగదు రూపంలో విత్డ్రా చేసుకోవచ్చు.EPFO 3.0 ఎప్పుడు ప్రారంభమవుతుంది?కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకారం.. యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రాకు సంబంధించిన అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. కాబట్టి ఇది త్వరలోనే ఈ సదుపాయం ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. అయితే.. తేదీని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట!
డెల్కు ట్రంప్ భారీ డీల్.. బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్
డెల్ సంస్థకు పెంటగాన్ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కింది. డొనాల్డ్ ట్రంప్కు అనుబంధంగా ఉన్న ఖాతాలకు భారీ విరాళం ప్రకటించిన కొన్ని నెలలకే, అమెరికా రక్షణ శాఖ నుంచి డెల్ టెక్నాలజీస్కు బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందం రావడం అమెరికా వ్యాపార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్, ఆయన భార్య సుసాన్ డెల్ గతేడాది పిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన “ట్రంప్ అకౌంట్స్” కార్యక్రమానికి 6.5 బిలియన్ డాలర్ల నిధిని ప్రకటించారు. ఇప్పుడు అదే డెల్ సంస్థకు పెంటగాన్ నుంచి 9.7 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్ట్ దక్కడం గమనార్హం.అమెరికా మీడియా సంస్థ సీఎన్బీసీ కథనం ప్రకారం, “డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అగ్రిమెంట్-II” కింద ఐదేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా డెల్ ఫెడరల్ సిస్టమ్స్ అమెరికా రక్షణ శాఖకు మైక్రోసాఫ్ట్ 365 సేవలు, క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు, ఆన్-ప్రెమైజ్ లైసెన్సింగ్ సొల్యూషన్లు అందించనుంది.ఈ ఒప్పందం పూర్తిగా పోటీ ప్రక్రియ ద్వారానే కుదిరిందని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రక్షణ శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిర్స్టన్ డేవిస్, యాక్టింగ్ నేవీ సీఐఓ బారీ టానర్ మాట్లాడుతూ, ధరలు, సేవల సామర్థ్యం, మొత్తం వ్యాల్యూ చెయిన్ వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డెల్ను ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ ఒప్పందం ద్వారా పెంటగాన్, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ, అమెరికా కోస్ట్ గార్డ్ వంటి విభాగాల్లో సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ను ఏకీకృతం చేయనున్నట్లు సమాచారం. దీని వల్ల అమెరికా ప్రభుత్వానికి ప్రతి ఏడాది సుమారు 422 మిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2027 ఆర్థిక సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సమయంలో ఐటీ ఖర్చులను క్రమబద్ధీకరించడంలో ఈ ఒప్పందం కీలకమని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో మైఖేల్ డెల్ దంపతుల విరాళం కూడా మరోసారి వార్తల్లోకి వచ్చింది. “ఒక చిన్న ఆర్థిక ప్రోత్సాహం పిల్లల జీవితాన్ని ఎంతగా మార్చగలదో మేము చూశాం. వారి అవకాశాల ప్రపంచం విస్తరిస్తుంది” అని విరాళం ప్రకటించినప్పుడు మైఖేల్ డెల్ వ్యాఖ్యానించారు. ఇదే తమ జీవితంలో అతిపెద్ద దాతృత్వ కార్యక్రమమని కూడా ఆయన పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల ఓ కార్యక్రమంలో మైఖేల్ డెల్ను ప్రశంసిస్తూ డెల్ ఉత్పత్తులు కొనాలంటూ ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఆయనకు అభినందనలు తెలిపిన మైఖేల్ డెల్.. సైన్స్ అండ్ టెక్నాలజీ సలహా మండలిలో చేరినట్లు సమాచారం.దాతృత్వ కార్యక్రమాల్లో కూడా డెల్ కుటుంబం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే టెక్సాస్ విశ్వవిద్యాలయం, ఆస్టిన్కు మైఖేల్ డెల్ 750 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ నిధులతో కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య పరిశోధన కేంద్రం, ఆధునిక వైద్య ప్రాంగణం నిర్మించనున్నారు.
వైద్య రంగంలోకి బజాజ్ గ్రూప్
బజాజ్ గ్రూప్ ఆరోగ్య సంరక్షణ సేవల్లోకి అడుగు పెడుతోంది. రూ.2,000–2,500 కోట్లతో వచ్చే మూడేళ్ల కాలంలో పుణెలో హాస్పిటల్ను ఏర్పాటు చేయనున్నట్టు బజాజ్ ఇంటెగ్రేటెడ్ హెల్త్ సిస్టమ్ ఎండీ నీరవ్ బజాజ్ ప్రకటించారు. వచ్చే దశాబ్ద కాలంలో 12 పట్టణాల్లోకి సేవలను విస్తరిస్తామని తెలిపారు. క్లినిక్లు, అంబులేటరీ సేవలు, హోమ్కేర్ (ఇంటివద్దే వైద్య సేవలు), హాస్పిటల్తో కూడిన ఆరోగ్య సంరక్షణ నమూనాను రూపొందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు.వ్యాధుల నివారణ నుంచి తక్షణ చికిత్స వరకు ఆస్పత్రికి దూరంగా సేవలను అందించాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమ ఆరోగ్య సంరక్షణ నమూనా చాలా భిన్నమైందంటూ దీన్ని సొంతంగానే నిర్మింకుంటామని చెప్పారు. పడకల సంఖ్య, ఒక్కో పడకవారీ ఆదాయం తదితర సంప్రదాయ కొలమానాలను తాము అనుసరించబోమన్నారు. ప్రస్తుతమున్న హాస్పిటల్స్ను కొనుగోలు చేసే ఉద్దేశ్యం లేదన్నారు.
2026 టియాగో ఈవీ లాంచ్: ధర రూ.4.70 లక్షలు!
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. తమ ప్రసిద్ధ ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్ అయిన 'టియాగో ఈవీ'ను కొత్త హంగులతో ఫేస్లిఫ్ట్ (టాటా టియాగో ఈవీ ఫేస్లిఫ్ట్) రూపంలో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే దీనిని బాస్ (BaaS) స్కీమ్ కింద రూ.4.69 లక్షల ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.2026 టాటా టియాగో కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, మెరుగైన ఇంటీరియర్తో మధ్యతరగతి కుటుంబాలు, యువతను ఆకర్షించేలా తయారైంది.డిజైన్ విషయానికి వస్తే.. ఇది సాధారణ మోడల్ కంటే కూడా మరింత స్టైలిష్గా కనిపిస్తుంది. కొత్త ఫ్రంట్, రియర్ బంపర్లు కారుకు స్పోర్టీ లుక్ ఇస్తాయి. ముందుభాగంలో బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్ ఉండటం వల్ల ఇది ఈవీ అని స్పష్టంగా అర్థమవుతోంది. బ్లాక్ కలర్ ఓఆర్వీఎంలు, విండో లైన్, కొత్త వీల్ డిజైన్ కూడా ఇందులో చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ల్యాంప్స్ వల్ల రాత్రివేళల్లో మంచి విజిబిలిటీ లభిస్తుంది. టెయిల్గేట్పై టియాగో ఈవీ అని ఉండటం కూడా గమనించవచ్చు.ఈ కారు లోపల 10.25 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఉంటుంది. ఫ్రీ-స్టాండింగ్ కలర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కార్కు ప్రీమియం ఫీల్ అందిస్తాయి. వెనుక సీట్లలో ఉండే ప్రయాణికుల కోసం రియర్ ఏసీ వెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.పవర్ట్రైన్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి కొత్త టియాగో ఈవీ కూడా.. స్టాండర్డ్ మోడల్లో మాదిరిగానే రెండు బ్యాటరీ ప్యాక్ (19.2 కిలోవాట్, 24 కిలోవాట్) ఎంపికలను పొందుతుంది. పనితీరు, రేంజ్ (పరిధి) అన్నీ కూడా పాత మోడల్ మాదిరిగానే ఉంటాయి.బాస్ (BaaS) స్కీమ్ గురించిబాస్ (Battery as a Service) అనేది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును మరింత చవకగా, సులభంగా చేయడానికి తీసుకొచ్చిన ప్రత్యేక పద్ధతి. ఈ స్కీమ్లో కారు, బ్యాటరీని వేర్వేరుగా పరిగణిస్తారు. సాధారణంగా ఎలక్ట్రిక్ కారులో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ కావడంతో.. దాని ధర మొత్తం కార్ ధరను పెంచుతుంది. కానీ బాస్ విధానంలో వినియోగదారు కారును తక్కువ ప్రారంభ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ కోసం ప్రత్యేకంగా నెలవారీ లేదా వినియోగానికి అనుగుణంగా చెల్లింపులు చేస్తారు.ఉదాహరణకు, టాటా టియాగో ఈవీ బాస్ స్కీమ్ కింద రూ. 4.69 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండటం వల్ల, సాధారణ కొనుగోలుతో పోలిస్తే.. మొదట్లో తక్కువ మొత్తంతోనే కారును సొంతం చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల ఎలక్ట్రిక్ కార్లను కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుంది. అదనంగా.. బ్యాటరీ పనితీరు లేదా మార్పిడి వంటి విషయాల్లో కంపెనీ సపోర్ట్ లభించే అవకాశం ఉంటుంది. అందువల్ల, BaaS స్కీమ్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ పనిచేయడం లేదా?: NHAI సూచనలివే..
ఫ్యామిలీ
టెన్త్ డ్రాపౌట్..ఆయుధాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీ..!
ఒక వ్యక్తి ఒకానొక టైంలో చదువుని మధ్యలోనే ఆపేసినా..పరిస్థితులు, కష్టాలు, అసామాన్య ప్రతిభను వెలికితీస్తాయి అనేందుకు ఈ కథే ఉదాహరణ. ఆర్థిక కష్టాలు పదోతరగతికి మించి ఉన్నత చదువుని అందుకునే పరిస్థితి కల్పించికపోతేనేం..అచంచలమైన దృఢ సంకల్పంతో ఒక్కోమెట్టు ఎక్కుతూ.. వ్యవస్థాపకుడిగా మారాడు. అక్కడ నుంచి దేశమే గర్వించేలా రక్షణవ్యవస్థ సామర్ధ్యాన్ని బలోపతేం చేసే పేలుడు పదార్థాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీని రన్ చేసే స్థాయికి చేరుకున్నాడు.అతడే రాజస్థాన్కి చెందిన సత్యనారాయణ్ నువాల్. రాజస్థాన్లోని భిల్వారా గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. తండ్రి పదవీ విరమణతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పదితోనే చదువు ఆపేయాల్సిన వచ్చింది. దాంతో 1970వ దశకంలో నువాల్ జీవనోపాధి కోసం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న బల్హర్షాకు వెళ్లారు. కనీస వసతి లేక ఆయన రాత్రుళ్లు రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అనేక చిన్న చిన్న వ్యాపారాలు ప్రయత్నించారు. 18 ఏళ్ల వయసులో ప్రారంభించిన ఫౌంటెన్-పెన్ ఇంక్ తయారీలో నష్టం రావడం వంటి పలు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గక.. గెలుపు పిలుపు వినిపించ్చేదాక ఏదో ఒక చిన్న వ్యాపార ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. ఆ క్రమంలోనే పేలుడు పదార్థాల వ్యాపారి అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ని కలిశారు. అదే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. వెయ్యితో మొదలై..కోట్లకు విస్తరించేలా..ఆ వ్యాపారితో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఆయన వద్ద నుంచి లైసెన్సు, నిల్వ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి నెలకు రూ. 1,000 చెల్లిస్తూ వ్యాపారం మెదలుపెట్టాడు. ఆయన రూ. 250లకు పేలుడు పదార్థాలు కొని వాటిని రూ. 800లకు అమ్మే వ్యాపార చతురత నువాల్లని ఎంతగానో ఆకర్షించింది. అలా ఆయన బ్రిటిష్ సంస్థ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ICI)లో పంపిణీదారుడిగా నియామకం పొంది కీలకమైన పరిశ్రమ అనుభవాన్ని సంపాదించుకుని ఆర్థిక స్థిరత్వాన్ని పొందాడు. ఆ విధంగా 1995లో రూ. 60 లక్షల రుణంతో నువాల్ నాగ్పూర్లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ను స్థాపించారు. ఈ సంస్థ 1996లో ప్యాకేజ్డ్ పేలుడు పదార్థాలు, బల్క్ పేలుడు పదార్థాలు, డిటోనేటర్ల తయారీతో కార్యకలాపాలను ప్రారంభించింది. మొదట చిన్న తరహా సంస్థగా ప్రారంభమైన..కొద్ది కాలంలోనే విస్తరించి భారతదేశంలోనే అతి పెద్ద పేలుడు పదార్థాల ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఈ సంస్థ ఎదిగింది. రక్షణ వ్యవస్థ కోసం పనిచేయడం..నాగస్త్రకు అనుబంధంగా భార్గవస్త్ర అనే ఒక అధునాతన కౌంటర్-డ్రోన్ (C-UAS) వ్యవస్థ ఉంది. ఈ మైక్రో-క్షిపణి ఒకేసారి 60 లక్ష్యాల వరకు ఛేదించగలదు. ఈ సామర్థ్యం ఇతర దేశాలు మోహరించిన వ్యవస్థలను మించిపోయింది. మాములుగా ఇవి సాధారణంగా ఒకేసారి నాలుగు ప్రయోగాలను మాత్రమే నిర్వహించగలుగుతాయి. దీంతో 2010 నాటికి సోలార్ ఇండస్ట్రీస్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. అలా రక్షణ దళాల కోసం పేలుడు పదార్థాలను తయారు చేయడానికి భారత ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన తొలి ప్రైవేట్ భారతీయ సంస్థగా ఇది నిలిచింది. ఆ లైసెన్స్ కాస్తా పేలుడు పదార్థాల నుంచి అత్యాధునిక సాంకేతిక రక్షణ వ్యవస్థల వైపు మళ్లడానికి నాంది పలికింది. ఆ విధంగా నువాల్ నాయకత్వంలో సంస్థ అనూహ్యంగా వృద్ధి చెంది ఇప్పుడు భారతదేశం అంతటా 27 తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. అంతేగాదు ఎనిమిది దేశాల్లో ఉత్పత్తి యూనిట్లను కలిగి ఉండటమే గాక సుమారు 75 నుంచి 90 దేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా. 2023 నాటికి, సోలార్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ. 8వే కోట్లు ఆదాయంతో ప్రపంచంలోనే ఐదు అగ్ర పేలుడు పదార్థాల తయారీలో ఒకటిగా నిలిచింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1 లక్ష కోట్లను దాటి, దాదాపు రూ. 1.54 లక్షల కోట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇందులో నువాల్ సుమారు 70 శాతం ఈక్విటీని కలిగి ఉన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సదుపాయాలను సందర్శించి, కంపెనీ సాంకేతిక పురోగతిని ప్రశంసించారు. అలా నువాల్ కంపెనీ రక్షణ వ్యవస్థ కోసం పనిచేయడం ప్రారంభించింది. అంతేగాదు ఆపరేషన్ సింధూర్లో సైతం నాగాస్త్రంతో ఒక నిర్ణయాత్మక పోషించారు. అందుకుగాను భారత ప్రభుత్వం జనవరి 26, 2026న పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి గౌరవించింది. ఒకప్పుడు చదువు మధ్యలో ఆపేసిన వ్యక్తి భారతదేశ రక్షణ ఉత్పాదక విప్లవంలో అగ్రగామిగా ఉన కంపెనీకి సారథ్యం వహించే స్థాయికి చేరడం నిజంగా స్ఫూర్తిదాయకం కదూ..!.(చదవండి: మురికి వాడ నుంచి ఏఐ ఎక్స్పర్ట్ రేంజ్కి..! పేదింటి అమ్మాయి విజయగాథ)
మ్యాథ్స్ చెప్పే ముచ్చట్లు...!
త్రికోణం... ఈ షేప్లో లైన్స్ నిటారుగా మూడు మూలలు (కోణాల) సమానంగా కలిసి ఉంటాయి. ఈ కోణాలను చూపుతూ – కుటుంబం, స్నేహితులు, టీచర్లు.. అనే మూడింటి ద్వారా జీవితాలు ఎలా నిలబడతాయో చెప్పవచ్చు. అలాగే లక్ష్యం, కష్టం, సహనం.. ఉంటే విజయానికి ఎలా చేరుతామో నేర్పచ్చు.త్రిభుజాల షేప్స్లలో భిన్నమైనవి కూడా ఉంటాయి. రెండు లైన్స్ చిన్నగా, మూడవ లైన్ పొడవుగా కూడా ఉండవచ్చు. పొడవుగా ఉండే లైన్ మీరే’ అని చెప్పవచ్చు. ఆ పొడవైన లైన్ ద్వారా అందరికన్నా ఎంత క్రియేటివ్గా, ఎంత గొప్పగా, ‘నేను నా ఇండివిడ్యువాలిటీని చూపించాలి’ అనే ఆలోచన చూపవచ్చు.. అని వివరించవచ్చు.దీర్ఘచతురస్రం...ఈ షేప్లో నాలుగు స్ట్రెయిట్ లైన్స్ ఉంటాయి. అవి.. పుస్తకాలు, క్లాస్రూమ్ బోర్డు, టైమ్ మేనేజ్మెంట్, డిసిప్లిన్.. అవసరమని చెప్పవచ్చు.చతురస్రం: సమానత్వం...నాలుగు సైడ్లు సమానం కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. ప్రశ్నించే స్వభావం, విలువలు నేర్పచ్చు.సర్కిల్...ఐక్యంగా కలిసిమెలిసి ఉండటం ఎలాగో చెప్పవచ్చు. సర్కిల్ అంటే మొదలు చివర లేకుండా కలిసి ఉండే షేప్. ఇందులో కుటుంబం, స్నేహం, టీమ్వర్క్ ఎప్పటికీ కొనసాగాలని చెప్పవచ్చు.లైన్...పొడవుగా ఉన్నా, చిన్నగా ఉన్న ఒక గీతను పేపర్పైన గీయండి. ఆ గీతను చూపుతూ ఒక గమ్యానికి నేరుగా వెళ్లే మార్గంలా, జీవితంలో లక్ష్యంపై దృష్టి పెట్టేలా నేర్పవచ్చు.నిలువు గీతలు...దగ్గర దగ్గరగా ఉండేలా కొన్ని నిలువు లైన్స్ని స్కేల్ సాయంతో గీయమని చె΄్పాలి. ఇవి ఒకదానిని ఒకటి అంటుకోవు. అంటే ఇతరుల స్పేస్కి గౌరవం ఇవ్వాలి అని వివరించవచ్చు.సెమీసర్కిల్...అర్ధచంద్రాకృతి. అర సగం షేప్ను చూపుతూ అసంపూర్ణత కూడా సహజమే అనే విషయాన్ని చె΄్పాలి. ప్రతి పని మొదట్లోనే పూర్తి కావాలని ఏమీ లేదు. క్రమంగా పూర్తి అవుతుందనే నిజాన్ని వివరిస్తూనే ధైర్యంగా ఉండటం ఎలాగో చెప్పవచ్చు.ఈ షేప్స్ వల్ల పిల్లల్లో పరిశీలనాసక్తి, సమస్యను పరిష్కరించడం, టీమ్ వర్క్, సహనం, ఆత్మవిశ్వాసం వంటి జీవన నైపుణ్యాలు పెరుగుతాయి. వేసవి యాక్టివిటీలో భాగంగా జామెట్రీ షేప్స్ను తెల్లని పేపర్ మీద గీయమని చెబుతూ ఎన్నో విషయాలను చెప్పవచ్చు. వారినీ చెప్పమనవచ్చు. దీని వల్ల ఆలోచనాశక్తి, సృజనాత్మకత అలవడతాయి. - నిర్వహణ: నిర్మలారెడ్డి
డైనోసార్ అంతెత్తు..! కరములు కించిత్తు..!!
టైరానసారస్ రెక్స్ అలియాస్ టీ రెక్స్. సింపుల్గా చెప్పాలంటే.. రాకాసి బల్లుల రాజ్యానికి రారాజు టైపు. డైనోసార్లలో సూపర్స్టార్ అన్నమాట. జురాసిక్ పార్కు సినిమాలన్నిటిలో దీనిదే కీలక పాత్ర. 45 అడుగుల పొడవు.. భీకరాకారం.. భయపెట్టే కళ్లు.. కరకరా నమిలేసే పళ్లు.. అయితే, అన్నీ ఎలివేషన్లే అయితే.. దీనికి బాగా పొగరు పెరిగిపోదూ.. ఈ డౌట్తోనేనేమో దీన్ని సృష్టించే సమయంలో దేవుడు దీనికి ‘హ్యాండ్’ ఇచ్చాడు. 45 అడుగుల టీ రెక్స్కు కేవలం మూడడుగుల పొడవుండే చేతులు మాత్రమే ఇచ్చాడు.అంటే.. ఆరడుగుల మనిషికి ఐదు అంగుళాల చేతులు ఉన్నట్లన్నమాట. నిజంగా దేవుడు అలా చేశాడా లేదా అన్నది పక్కనపెడితే.. అత్యంత భయంకరమైన మాంసాహారిగా పేరొందిన టీ రెక్స్ చేతులు ఎందుకు అంత చిన్నగా ఉన్నాయి అన్న అంశంపై ఏళ్లుగా శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. వాళ్ల బుర్రలకు భరోసా కల్పిస్తూ యూనివర్సిటీ కాలేజీ లండన్ పరిశోధకులు తామీ రహస్యాన్ని ఛేదించామని తాజాగా ప్రకటించారు.ఇప్పటివరకూ దాని భారీ శరీర పరిణామం వల్లే చేతులు చిన్నవిగా ఉన్నాయని భావించారు. అయితే.. వేటలో చేతుల ప్రాధాన్యం తగ్గిపోవడంతో.. పరిణామ క్రమంలో అవి చిన్నవి అయ్యాయని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ పరిశోధకులు తేల్చారు. ఇందుకోసం థెరోపాడ్ జాతి డైనోసార్లను పరిశీలించారు. టీ రెక్స్తోపాటు ఈ జాతిలోని మరికొన్నిటి చేతులు చిన్నవిగా ఉన్నాయని గుర్తించారు. ‘‘చేతులు చిన్నగా ఉండటానికి కారణం.. వాటి బలమైన తల, దవడలే. పెద్ద జంతువులను వేటాడేటప్పుడు గోర్లతో కంటే.. దవడలతో దాడి చేయడం సమర్థవంతంగా మారింది. 100 అడుగుల పొడవుంటే భారీ సౌరోపాడ్ రాకాసి బల్లిని చేతులతో పట్టుకోవడం సాధ్యం కాదు. వాటిని తలను ఉపయోగించి.. దవడలతో దాడి చేయడం టీ రెక్స్కు ఈజీగా ఉండేది. దీంతో ఎప్పుడైతే.. ఉపయోగం తగ్గిందో.. అప్పటినుంచీ వాటి చేతుల సైజూ తగ్గిపోవడం మొదలైంది’’అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన చార్లీ రోజర్ చెప్పారు. - సాక్షి సెంట్రల్ డెస్క్
రోడ్డు పక్కన మైలురాళ్లు..ఇన్ని విషయాలను వివరిస్తాయా!?
ప్రయాణం అంటేనే కొత్త అనుభూతి. కొండలు, కోనలు, పచ్చని చెట్ల మధ్య సాగే ప్రయాణంలో మనకు తరచూ రోడ్డు పక్కన మైలురాళ్లు కనిపిస్తుంటాయి. 'ఫలానా ఊరు ఇంకెన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది?' అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ రాళ్లను చూస్తుంటాం. కానీ, మైలురాళ్లపై ఉండే రంగులు మనం ఏ తరహా రహదారిపై ప్రయాణిస్తున్నామో, దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో ఇట్టే చెప్పేస్తాయి. మరి ఆ రంగుల వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందామా..!పసుపు రంగు: జాతీయ రహదారి (National Highway)మీరు వెళ్లే మార్గంలో మైలురాయి పైభాగం పసుపు రంగులో ఉండి, కింద తెలుపు రంగు ఉంటే.. మీరు జాతీయ రహదారి (National Highway - NH) పై ప్రయాణిస్తున్నారని అర్థం.ఈ రహదారులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) నిర్మించి, నిర్వహిస్తుంది. ఇవి ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో, అలాగే దేశంలోని ప్రధాన నగరాలు, నౌకాశ్రయాలను అనుసంధానిస్తాయి.ఆకుపచ్చ రంగు..రాష్ట్ర రహదారి (State Highway)..ఒకవేళ మైలురాయి పైభాగం ఆకుపచ్చ రంగులో ఉంటే.. మీరు రాష్ట్ర రహదారి (State Highway - SH) పై ఉన్నట్లు లెక్క. ఈ రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి. ఇవి రాష్ట్రంలోని వివిధ జిల్లాలను, ప్రధాన నగరాలను రాష్ట్ర రాజధానితో లేదా జాతీయ రహదారులతో కలుపుతాయి.నలుపు లేదా నీలం రంగు: జిల్లా రహదారి (District Road)..మైలురాయి పైభాగంలో నలుపు, ముదురు నీలం (డార్క్ బ్లూ) లేదా పూర్తిగా తెలుపు రంగు ఉండి, దానిపై నగరాల పేర్లు రాసి ఉంటే.. అది జిల్లా రహదారి అని అర్థం. వీటి నిర్వహణను జిల్లా పరిపాలనా యంత్రాంగం లేదా కార్పొరేషన్, మున్సిపాలిటీలు చూసుకుంటాయి.మీరు ఒక పెద్ద నగరానికి లేదా జిల్లా కేంద్రానికి సమీపిస్తున్నారని ఈ రంగు సూచిస్తుంది.నారింజ రంగు: గ్రామీణ రహదారి (Rural Road)..మైలురాయి పైభాగం నారింజ (ఆరెంజ్) రంగులో కనిపిస్తే.. మీరు ఏదైనా గ్రామీణ ప్రాంతానికి వెళ్తున్నారని అర్థం. ఈ రహదారులను 'ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన' (PMGSY) కింద నిర్మిస్తారు. కుగ్రామాలను సైతం ప్రధాన రహదారులతో అనుసంధానించేందుకు ఈ రోడ్లు ఉపయోగపడతాయి.మైలురాళ్లపై ఏ రంగు ఉన్నా, వాటి కింది భాగం మాత్రం ఎప్పుడూ తెలుపు రంగులోనే ఉంటుంది. రాత్రి వేళల్లో వాహనాల లైట్ల వెలుతురు పడినప్పుడు ఈ తెలుపు రంగు స్పష్టంగా కనిపించి, డ్రైవర్లకు మైలురాయిని దూరం నుంచే గుర్తుపట్టేలా చేస్తుంది. ఇకపై మీరు ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు, కేవలం కిలోమీటర్లనే కాకుండా మైలురాయి రంగును కూడా గమనించండి. మీ ప్రయాణం ఎంత సురక్షితమైన మార్గంలో సాగుతుందో మీకే అర్థమైపోతుంది. - పసుపులేటి. వెంకటేశ్వరరావు
అంతర్జాతీయం
హర్ముజ్ ఒప్పందం ఖరారు..? కొట్టిపడేసిన వైట్హౌస్
టెహ్రాన్: ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం అంశంలో చర్చలు జరుగుతున్నాయి. అణు ఒప్పందంపై ఇరాన్ వెనక్కి తగ్గిందని దాదాపు చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై జరిగిన జరిగిన ఒప్పందంలోని అంశాలను ఇరాన్ మీడియా కథనాలు బహిర్గతం చేశాయి.ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ సమాచారం ప్రకారం... నెలరోజుల్లో హర్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాను యుద్ధానికి ముందున్న సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపింది. అయితే దానికి ఇరాన్పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి, ఆ ప్రాంతం నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి అమెరికా అంగీకరించిందని పేర్కొంది.అయితే ఈ జలసంధిని గుండా వెళ్లే ఓడలను తనిఖీ చేసే హక్కు, షిప్పింగ్ లేన్లను నిర్వహించే హక్కు, సర్వీస్ ఫీజులను వసూలు చేసే హక్కు ఇరాన్ దగ్గరే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ఏ దేశానికి చెందిన సైనిక నౌకలకు ఈ ప్రత్యేక నిబంధనలు వర్తించవని పేర్కొంది. ఈ ప్రాథమిక ఒప్పందం కుదిరిన అనంతరం ఇరు దేశాలు 60 రోజుల పాటు తదుపరి చర్చలు జరుపుతాయని ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తుది తీర్మాణాన్ని ఆమెదింప జేస్తారని పేర్కొంది.అయితే ఇరాన్ మీడియా చేసిన ఈ ప్రకటనలను అమెరికా పూర్తిగా కొట్టిపారేసింది. ఈ మేరకు వైట్హౌస్ తన అధికారిక వైట్హౌస్ ఎక్స్ ఖాతాలో "ఇరాన్ నియంత్రణలోని మీడియా విడుదల చేసిన ఈ నివేదికలో ఎలాంటి నిజం లేదు. ఆ అవగాహనా ఒప్పందం పూర్తిగా కల్పితం. ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్తున్న విషయాలను ఎవరూ నమ్మకండి. వాస్తవాలు ముఖ్యం అని పేర్కొందిదిగొచ్చిన ధరలుహర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందనే వార్తలు రాగానే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 90 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్ పునఃప్రారంభంపై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి.
భారత్, అమెరికా ‘ఖనిజ’ బంధం
న్యూఢిల్లీ: అరుదైన, కీలకమైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారమే లక్ష్యంగా భారత్, అమెరికాలు చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అరుదైన భూ ఖనిజాలు, వ్యూహాత్మక లోహాల సరఫరా, ఎగుమతులపై చైనా విధిస్తున్న నియంత్రణల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. 🇮🇳🇺🇸 India & the U.S. just signed a landmark deal to secure supply chains for critical minerals & rare earths- cutting dependence on China & boosting strategic self-reliance. pic.twitter.com/bl3NJeLY4x— The Alternate Media (@AlternateMediaX) May 26, 2026 కీలక ఖనిజాల తవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో స్థిరత్వం సాధించాలని, ఇరుదేశాలు లాభపడేలా కలసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చాయి. ఢిల్లీలో ‘క్వాడ్’ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇది చాలా సమయోచితమైన, కీలకమైన నిర్ణయమని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, సంబంధిత పెట్టుబడులతో సహా అరుదైన ఖనిజాలు, లోహాల సరఫరాలో సహకారాన్ని మరింతగా పెంపొందించడమే ఈ ఫ్రేమ్వర్క్ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: బైజూస్ ఫౌండర్కి ఆర్నెల్ల జైలు, రవీంద్రన్ స్పందన ఇదీ!పటిష్టమైన, వైవిధ్యభరితమైన సప్లైచైన్లను ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. మైనింగ్, ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం లభిస్తుందని, ఖనిజాలు, లోహాల సమర్థవంతమైన నిర్వహణను దోహద పడుతుందని వివరించారు. ఎన్నో సవాళ్లు, అదే సమయంలో ఎన్నో అవకాశాలు ఉన్న ఈ ప్రపంచంలో భారత్, అమెరికాల మధ్య సహకారం ఎంత సన్నిహితంగా ఉందో చెప్పడానికి ఈ ఒప్పందం ఒక ప్రతీక అని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గుర్తుచేశారు. రెండు దేశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలకు తాజా ఒప్పందమే ఒక ఉదాహరణ అని వెల్లడించారు. మన ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థకు(ఇన్నోవేషన్ ఎకానమీ) ఖనిజాలు, సప్లై చైన్లు చాలా ముఖ్యమని తెలిపారు. ఇదీ చదవండి: 11 రోజుల్లోనే ... హమాస్ కీలక నేత హతం
11 రోజుల్లోనే ... హమాస్ కీలక నేత హతం
గాజాలో యుద్ధ ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ (సీజ్ఫైర్) ఒప్పందాలను ఇరుపక్షాలూ తుంగలో తొక్కడంతో యుద్ధం మరింత భీకరంగా మారింది. కేవలం పదకొండు రోజుల క్రితమే హమాస్ సైనిక చీఫ్గా నియమితుడైన మొహమ్మద్ ఒదేహ్ తాజా ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యాడు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. హమాస్ ఇంకా దీనిపై స్పందించలేదు.అక్టోబర్ 7 మారణకాండ సూత్రధారులలో ఒకడు, హమాస్ సైనిక విభాగం నాయకుడు,మహమ్మద్ ఒడెహ్ను గాజాలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు,ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఒక సంయుక్త ప్రకటనలో బుధవారం తెలిపారు. అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించినందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలకు (IDF) షిన్ బెట్కు కాట్జ్ అభినందనలు తెలిపారు. ఇస్లాం ముఖ్యమైన పండుగలలో ఒకటైన ఈద్ అల్-అధాకు ముందు మంగళవారం రాత్రి గాజా నగరంలో ఇజ్రాయెల్ రెండు వైమానిక దాడులు జరిపింది, ఈ దాడుల్లో కనీసం ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడ్డారు.ఇజ్రాయెల్ ఇప్పటికే ఇంతకుముందున్న కమాండర్ ఎజ్జెడిన్ అల్-హద్దాద్ని ఖతం చేసింది. ఇతని స్థానంలో కొత్త చీఫ్గా మొహమ్మద్ ఒదేహ్ ఎన్నికైరెండు వారాలు కూడా గడవకముందే ఐడీఎఫ్ (IDF) జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. గాజా ఉగ్రవాద నెట్వర్క్ గుండెకాయపై దెబ్బకొట్టి, అగ్రస్థానంలో ఉన్న వ్యక్తిని ఇజ్రాయెల్ మరోసారి మట్టుబెట్టింది. 11 రోజుల్లో ఇలా జరగడం ఇది రెండోసారి. ఏ సురక్షిత స్థావరమూ అతడిని రక్షించలేకపోయింది. సంస్థాగతంగా చేసిన మార్పులేవీ అతడిని కాపాడలేకపోయాయి. అంతర్జాతీయ సమాజం నుండి వస్తున్న కాల్పుల విరమణ ఒత్తిడి ఇజ్రాయెల్ను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోతోంది.ఇజ్రాయెల్ భద్రతా అధికారుల ప్రకారం... హోలోకాస్ట్ (యూదుల మారణహోమం) తర్వాత యూదులపై జరిగిన అత్యంత ఘోరమైన అనాగరికం, అక్టోబర్ 7, 2023 నాటి ఊచకోత సమయంలో మొహమ్మద్ ఒదేహ్ హమాస్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశాడు. 1,200 మంది ఇజ్రాయెలీలను పొట్టనబెట్టుకుని, వారి ఇళ్లలోనే కుటుంబాలను ముక్కలు ముక్కలుగా నరికి, బందీలను గాజా భూగర్భ సొరంగాల్లోకి లాక్కెళ్లిన ఉగ్రవాద ఆపరేషన్ మాస్టర్మైండ్స్లో ఇతను కూడా ఒకడు. ఆ దాడిని ప్లాన్ చేసిన లేదా అమలు చేసిన ప్రతి సీనియర్ కమాండర్ను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ చేపట్టిన ప్రచారంలో భాగంగా, గత వారం అతడిని హమాస్ మొత్తం సైనిక విభాగానికి నాయకుడిగా నియమించింది. ఒక మంగళవారం నాడు నియమితుడైన అతను, తదుపరి నెల రాకముందే శవమయ్యాడు.మహ్మద్ ఒదెహ్ ఎవరు?మహమ్మద్ ఒదే 1974లో ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలో జన్మించాడు. హమాస్ ఉగ్రవాద సంస్థలో ఒక సీనియర్ నాయకుడు. తన సన్నిహితుడు మాజీ కమాండర్ హద్దాద్ హత్య తర్వాత, 2026 మే నెలలో అతను అల్-ఖస్సాం బ్రిగేడ్స్ అధిపతిగా , గాజాలో హమాస్ నాయకుడిగా బాధ్యతలు చేపట్టాడు.రెండవ ఇంతిఫాదా సమయంలో 2000లో ఖస్సాం బ్రిగేడ్స్లో చేరాడు. యహ్యా సిన్వార్ మరియు మహమ్మద్ డీఫ్ సహా హమాస్ సీనియర్ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలపై నిఘా సమాచారం సేకరించడంలో, బలహీనతలను గుర్తించడంలో ఒడెహ్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఉత్తర గాజాలోని యూనిట్లకు నాయకత్వం వహించి, ఉత్తర బ్రిగేడ్ కమాండర్గా (2017–2019) పనిచేశాడు. కీలక నాయకులు హతమయ్యాక గాజాలో హమాస్ నాయకుడిగా ఎదిగాడు..
గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ.. ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఇకపై సురక్షితంగా ఉండవు. ఇజ్రాయెల్ను ఖచ్చితంగా కూకటివేళ్లతో పెకిలించాలి.. అది జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, వాషింగ్టన్ రోజురోజుకూ తన పూర్వ వైభవానికి దూరమవుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తాజాగా తన టెలిగ్రామ్ ఛానెల్లో సందేశం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఖమేనీ..‘పశ్చిమాసియా ప్రాంతంలో తన దుశ్చర్యలకు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇకపై అమెరికాకు సురక్షితమైన ఆశ్రయం ఉండదు. కాలం వెనక్కి తిరగదు. ఈ ప్రాంతంలోని దేశాలు, భూములు ఇకపై అమెరికా స్థావరాలకు రక్షణ కవచాలుగా పనిచేయవు. అమెరికా తన పూర్వ వైభవానికి దూరమవుతోంది.ఇదే సమయంలో అమెరికా దళాలు దక్షిణ ఇరాన్లో దాడులు జరిపాయి. దక్షిణ ఇరాన్లో అమెరికా తాజాగా జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలేనని టెహ్రాన్ పేర్కొంది. అమెరికా ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టిస్తోందని ఇరాన్ ఆరోపించింది. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతర్ వంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ప్రతీకారానికి గురయ్యే అవకాశం ఉందని ఇరాన్ సంకేతం ఇచ్చింది. కాగా, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, యూఏఈ, ఖతార్ లాంటి దేశాలతో కలిపి ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన చిన్న, పెద్ద మిలటరీ క్యాంపులు 19 వరకు ఉన్నాయి.మరోవైపు, ఖమేనీ.. హజ్ యాత్రకు వచ్చిన వారంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు. పాలస్తీనా, అల్-అక్సా మసీదుకు విముక్తి కలగాలని, ముస్లింల కష్టాలు తీరాలని, ప్రపంచాన్ని శాసిస్తున్న శక్తులపై విజయం సాధించాలని అందరూ ప్రార్థన చేయండి అని వ్యాఖ్యానించారు. ఈ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని ముస్లిం దేశాలన్నింటికీ ఒకే రకమైన బలం, ప్రయోజనాలు ఉన్నాయని, అవే భవిష్యత్తులో ప్రపంచంలో ఒక కొత్త మార్పును తెస్తాయని తెలిపారు.ఇరాన్ సైనిక సామర్థ్యాలుబాలిస్టిక్ క్షిపణులు: ఇరాన్ వద్ద 2,000 కి.మీ. వరకు దాడి చేయగల క్షిపణులు ఉన్నాయి. ఇవి గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను చేరగలవు.డ్రోన్లు: ఇరాన్ డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా అభివృద్ధి చేసింది. ఇవి గల్ఫ్లోని ఆయిల్ ఫీల్డ్స్, నౌకలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు.నౌకాదళం: స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లో ఇరాన్ చిన్న నౌకలు, మైన్స్, టార్పెడోలు ఉపయోగించి అమెరికా నౌకాదళాన్ని ఇబ్బంది పెట్టగలదు.ప్రాక్సీ గ్రూపులు: హిజ్బుల్లా, హౌతీలు వంటి మిత్ర గ్రూపుల ద్వారా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో పరోక్ష దాడులు చేయగలదు.గల్ఫ్లో అమెరికా స్థావరాలుఖతార్: అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్ – అమెరికా యొక్క అతిపెద్ద ఎయిర్ బేస్, 10,000 పైగా సైనికులు.బహ్రెయిన్: నేవల్ సపోర్ట్ యాక్టివిటీ – అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కేంద్రం.సౌదీ అరేబియా: ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ – మధ్యప్రాచ్యంలో కీలకమైన ఎయిర్ ఆపరేషన్ల కేంద్రం.యుఏఈ: అల్ ధాఫ్రా ఎయిర్ బేస్ – అమెరికా F-35, డ్రోన్ ఆపరేషన్లకు ప్రధాన కేంద్రం.ఇరాన్ హెచ్చరికల ప్రభావం..ప్రాంతీయ స్థిరత్వం: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా జరిగే చమురు రవాణా తీవ్రంగా దెబ్బతింటుంది.అమెరికా వ్యూహం: అమెరికా తన స్థావరాల భద్రతను పునఃపరిశీలించాల్సి వస్తుంది.గల్ఫ్ దేశాలు: అమెరికా రక్షణపై ఆధారపడుతున్న ఈ దేశాలు, ఇరాన్ దాడుల భయంతో కొత్త దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.ప్రపంచ మార్కెట్లు: భారత్, యూరప్, ఆసియా దేశాలు గల్ఫ్ చమురుపై ఆధారపడుతున్నందున, ఏవైనా అంతరాయాలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.
జాతీయం
భార్యను రూ. 50 వేలకు అమ్మేశాడు.. 10 రోజులు నరకం
గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నూరేళ్లు తోడు ఉంటానని ప్రమాణం చేసిన కట్టుకున్న భర్తే 12 ఏళ్ల వివాహ బంధానికి తూట్లు పొడిచాడు. భార్యను స్నేహితులకు రూ. 50,000కు అమ్మేశాడు. పైగా ఏమీ తెలియనట్టు తన భార్య మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో పోలీసులే నివ్వెరపోయే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. సాధారణంగా మిస్సింగ్ ఫిర్యాదుగా మొదలై, ఉత్తర గుజరాత్లోని పాలన్పూర్ పోలీసులను నివ్వెరపర్చే మానవ అక్రమ రవాణా కేసును వెలికితీసేలా చేసింది. పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల ప్రారంభంలో భర్తే స్వయంగా పాలన్పూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ దర్యాప్తులో ఈ దిగ్భ్రాంతి కర విషయం వెలుగు చూసింది. డీఎస్పీ జిగ్నేష్ గమిత్ ప్రకారం, నిందితుడు నిఖేష్ తన భార్య పాలన్పూర్ నగరం నుండి అదృశ్యమైందని పేర్కొంటూ భర్త మే 11న ఫిర్యాదు చేశాడు. అయితే, ఫిర్యాదు చేసిన రెండు రోజులకే అతను కూడా అదృశ్యమయ్యాడు. అతను కనబడకపోవడంతో, అతని తండ్రి పాలన్పూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో మరో అదృశ్య ఫిర్యాదును నమోదు చేశారు. ఈ వరుస ఫిర్యాదులు మరిన్ని అనుమానాలను రేకెత్తించడంతో దర్యాప్తును ముమ్మరం చేశామని తెలిపారు.ఆ తర్వాత భర్త ఆచూకీ గుర్తించి ఆరా తీశారు. అతను నేరాన్ని అంగీకరించాడు. అతడి సమాచారం ఆధారంగా భార్యను గుర్తించాయి.నిందితుడు భర్త . తన భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే స్నేహితులైన సంజయ్ ఠాకూర్, అశోక్ ఠాకూర్, సచిన్ దర్బార్ల సహాయంతో అమ్మేసినట్లు ఒప్పుకున్నాడు.చివరకు నిందితుల చెర నుంచి బాధితురాలిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. తనను అమ్మేసిన తర్వాత ఒకచోట బంధించి, నిరంతరం లైంగిక దాడి చేశారని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. అంతేకాకుండా, తన బంగారు ఆభరణాలను లాక్కొని అమ్మేశారని తెలిపింది. అలాగే, థరాడ్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన మరో ముగ్గిరికి ఆమెను రూ. 1.5 లక్షలకు అమ్మేందుకు ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు ఉన్నాయి.ప్రధాన నిందితుడు నిఖేష్ పటేల్కు ఇదివరకే పెళ్లయిందని, ఇతర మహిళలను లోబరుచుకోవడం, కిడ్నాప్ చేయడం వంటి నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో మహిళను ఇంటికి తీసుకురావాలని చూస్తూ తనను హింసించేవాడని కూడా బాధితురాలు ఆరోపించింది. కేవలం ఈ కారణంతోనే, అతను తన స్నేహితులతో కలిసి కుట్ర పన్నాడని పోలీసుల ముందు వాపోయింది. ఇదీ చదవండి: అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపు
సూపర్ కాంబో: మోదీ, సురేష్ గోపీలతో విజయ్ స్కెచ్!
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ అయ్యారు. తరువాత కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు సురేష్ గోపీకి ఫోన్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంభాషణ కేవలం మర్యాదపూర్వకం మాత్రమే కాదని, దేశాభివృద్ధి లక్ష్యంగా సాగిందని సురేష్ గోపీ స్వయంగా వెల్లడించారు.రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిప్రధాని మోదీతో 20 నిమిషాల భేటీ ముగిసిన తర్వాతే తన ప్రియ మిత్రుడు, తమిళనాడు సీఎం విజయ్ ఫోన్ చేశారని సురేష్ గోపీ సోషల్ మీడియాలో తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి, తద్వారా దేశ పురోగతికి కలిసి పనిచేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు ఆయన తెలియజేశారు.ఢిల్లీ పర్యటనలో విజయ్ కీలక అజెండాసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ చేపట్టిన తొలి అధికారిక ఢిల్లీ పర్యటన కీలక అంశాలతో ముగిసింది. మెకేదాటు ప్రాజెక్ట్ వివాదం, తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులు, వందేమాతరం వివాదం వంటి సున్నితమైన సమస్యలను ఆయన ప్రధాని ముందుంచారు. ఈ అంశాలపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజయ్ విజ్ఞప్తి చేశారు.చరిత్రక వారసత్వానికి ప్రాధాన్యతప్రాంతీయ సమస్యలతో పాటు, దేశ గౌరవానికి సంబంధించిన అంశాలపై కూడా విజయ్ దృష్టి సారించారు. నెదర్లాండ్స్ నుండి తిరిగి తీసుకువచ్చిన చోళుల కాలం నాటి రాగి శాసనాలను విజయవంతంగా స్వదేశానికి రప్పించినందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన పదవీకాలంలో ప్రజా సంక్షేమంతో పాటు, చరిత్రక వారసత్వాన్ని కాపాడటంలో కూడా కీలకంగా వ్యవహరిస్తానని విజయ్ పరోక్షంగా సంకేతాలిచ్చారు.
లేడీస్ హాస్టల్లో రహస్య ఫొటోలు.. ప్రియుడికి పంపిన మహిళ!
స్నేహితురాళ్ల అశ్లీల ఫొటోలు తీసి ప్రియుడికి పంపిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి టౌన్ ప్రాంతానికి చెందిన మకరజ్యోతి (39) అనే మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయిన ఆమె, పాలయంకోట్టైలోని ఒక ప్రైవేట్ మహిళా హాస్టల్లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ సమయంలో కోయంబత్తూరుకు చెందిన ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో హాస్టల్లో తనతో పాటు ఉంటున్న ఇతర మహిళల రోజూవారి కార్యకలాపాలను వారికి తెలియకుండానే మకరజ్యోతి సెల్ఫోన్లో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా తీసిన అశ్లీల చిత్రాలను ఆమె కోయంబత్తూరులో ఉన్న తన ప్రియుడికి పంపుతున్నట్టు తెలిసింది. హాస్టల్ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహిళా పోలీసులు విచారణ చేశారు. విచారణలో తోటి మహిళలను అశ్లీలంగా ఫొటోలు తీసినట్లు నిర్ధారణ కావడంతో, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. -చెన్నై
సౌదీ జైలు నుండి స్వదేశానికి.. భావోద్వేగంలో ‘రహీమ్’
తిరువనంతపురం: అతని రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. సౌదీ అరేబియా జైలులో 20 ఏళ్ల పాటు మగ్గిన కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్, ఎట్టకేలకు గురువారం ఉదయం తన మాతృభూమికి చేరుకున్నారు. కరిపూర్ విమానాశ్రయంలో దిగిన రహీమ్ను చూడగానే కుటుంబ సభ్యులు, స్నేహితులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన రాకతో విమానాశ్రయం ప్రాంగణం ఉద్వేగపూరిత వాతావరణంతో నిండిపోయింది.న్యాయపోరాటంలో గెలిచిన మానవత్వం2006లో సౌదీ అరేబియాలో ఒక బాలుడి మరణానికి సంబంధించిన కేసులో అబ్దుల్ రహీమ్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుండి ఆయన జైలులోనే గడిపారు. అయితే జూలై 2024లో మృతుడి కుటుంబం ‘దియా’ (బ్లడ్ మనీ) స్వీకరించడానికి అంగీకరించడంతో ఆయనకు మరణశిక్ష రద్దయ్యింది. ఈ ప్రక్రియ కోసం మలయాళీలు ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన భారీ విరాళాల సేకరణ కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 34 కోట్లు సమకూర్చారు.ప్రయాణంలో చివరి నిమిషం వరకు ఉత్కంఠరహీమ్ జైలు శిక్ష అధికారికంగా మే 19నే ముగిసినప్పటికీ, సౌదీ జైలు అధికారులు హజ్ విధుల్లో బిజీగా ఉండటంతో విడుదల ఆలస్యమైంది. అయితే, ఈ కేసులోని తీవ్రతను, అత్యవసర పరిస్థితిని గుర్తించిన సౌదీ అధికారులు, ప్రత్యేక ప్రోటోకాల్లను అమలు చేసి విడుదల ప్రక్రియను వేగవంతం చేశారు. బుధవారం అర్ధరాత్రి అన్ని లాంఛనాలను పూర్తి చేసి, రహీమ్ను విమానాశ్రయానికి తరలించారు.కన్నీటి వీడ్కోలు.. కృతజ్ఞతరియాద్ నుండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఉదయం 8 గంటలకు కరిపూర్ విమానాశ్రయానికి చేరుకున్న రహీమ్, బయటకు రాగానే కన్నీరు పెట్టుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, తన విడుదల కోసం కృషి చేసిన వారికి ఆయన చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, ఆయన నేరుగా తన స్వగృహానికి బయలుదేరారు. కన్నతల్లిని కలవాలన్న తపన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.ఇది కూడా చదవండి: పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు
ఎన్ఆర్ఐ
ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి, భారత సంతతికి చెందినకమలా ప్రసాద్-బిస్సెసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని తన పూర్వీకుల మూలాల పట్ల ప్రగాఢమైన గర్వాన్ని వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన ఆమె, తన మూలాలను గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు అవమానకరంగా భావించిన పదాన్ని ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎలా మార్చుకున్నారో వివరించారు.భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్రినిడాడ్లో (మే 8-9 తేదీలలో) పర్యటన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కమలా మాట్లాడుతూ, తన భారతీయ గుర్తింపు కారణంగా ఇప్పటికీ తనను అవమానించాలని ప్రయత్నిస్తున్న వారికి కమలా ప్రసాద్ తగిన విధంగా సమాధానమిచ్చారు.ట్రినిడాడ్లో నేటికీ అనేక చోట్ల భారతీయులను 'కూలీలు' అని పిలుస్తారని, ఇది ఒక అవమానకరమైన పదంగా పరిగణించబడుతుందని కమలా ప్రసాద్ అన్నారు. "కానీ నేను ఈ విషయంలో ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఆ 'కూలీల' కష్టం, రక్తం, చెమట వల్లే ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఒక కూలీ కూతురు ట్రినిడాడ్ ప్రధానమంత్రి అయినందుకు గర్వపడుతున్నాను" అని ఆమె ఎంతో గర్వంగా చెప్పారు. ఆమె ప్రకారం, తన భారతీయ గుర్తింపు పట్ల ఆమెకు ఎలాంటి కలత గానీ, సిగ్గు గానీ లేదు.ట్రినిడాడ్లోని జనాభాలో సుమారు 45 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారని ప్రధానమంత్రి కమలా ప్రసాద్ అన్నారు. బ్రిటిష్ వారు భారతీయ కార్మికులను బానిసలుగా ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు, వారు తమతో పాటు రామాయణం, గీత, ఖురాన్ను కూడా తీసుకొచ్చారని చెప్పారు. వారికి ఆంగ్లం తెలియకపోయినా, ఎన్నో అఘాయిత్యాలను ఎదుర్కొన్నప్పటికీ, వారు తమ ప్రాచీన భారతీయ నాగరికత, భాష, సంస్కృతిని పరిరక్షించుకున్నారని ఆమె వెల్లడించారు.అంతేకాదు చారిత్రాత్మక పర్యటన సందర్భంగా కమలా ప్రసాద్ ఒక సంచలన ప్రకటన చేశారు. భారతీయుల గౌరవార్థం నెల్సన్ ఐలాండ్ పేరును మార్చనున్నట్లు తెలిపారు. 1866 నుండి 1917 వరకు, ఈ ద్వీపాన్ని భారతీయ ఒప్పంద కార్మికుల కోసం ఒక ల్యాండింగ్ స్టేషన్గా, క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించారు. భారతీయ పూర్వీకులను గౌరవిస్తూనే, ప్రజలను సంప్రదించి, కొత్త పేరును సూచించమని కోరతామని ఆమె అన్నారు. ప్రధానమంత్రి కమలా ప్రసాద్తో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా నెల్సన్ ఐలాండ్ను సందర్శించారు. భారత్-ట్రినిడాడ్ మధ్య 150 ఏళ్ల సంబంధాలకు ఇది కొత్త బలాన్ని చేకూరుస్తున్నందున, ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కేంద్ర మంత్రి జై శంకర్ పర్యటన చారిత్రాత్మకమైన నెల్సన్ ద్వీపంలో ఉండటం నిజంగా చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి జై శంకర్సంతోషం వ్యక్తం చేశారు. సరిగ్గా 180 సంవత్సరాల క్రితం, భారతదేశం మరియు ట్రినిడాడ్-టొబాగోల చరిత్రలో తొలి అడుగు ఇక్కడే పడిందని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు, ధైర్యవంతులైన భారతీయులు తమ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొని, కొత్త జీవితాలను ఎలా నిర్మించుకున్నారో ఆలోచించడం సహజమనీ అంటూ వారి ధైర్యసాహసాలకు, వారి సంకల్పానికి , వారి దృఢ నిశ్చయానికి నమస్సులు అందజేశారు.వారు జీవన విధానాన్ని, సంప్రదాయాలను , విశ్వాసాన్ని తమతో పాటు తీసుకువచ్చారు. నిజానికి, తమతో పాటు ఒక సంపూర్ణ నాగరికతను తీసుకువచ్చారు. వీటిని ఒక వారసత్వ ప్రదేశంగా భవిష్యత్ తరాల కోసం నమోదు చేయడం ఎంతైనా సముచితమని తెలిపారు. భారతదేశ గ్రాంట్ సహాయంతో నెల్సన్ ద్వీపంలోని సాంస్కృతిక వారసత్వాన్ని ఉన్నతీకరించడానికి ఉద్దేశించిన ఒక క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలోకార్యక్రమంలో జై శంకర్ పాల్గొన్నారు. కమలా ప్రసాద్ ఘనతభారత సంతతికి చెందిన కమలా ప్రసాద్-బిస్సేసర్ 2010లో ట్రినిడాడ్ మరియు టొబాగోకు మొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. 2010లో మొదటిసారి, ఆ తరువాత 2026లో కూడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఆమె వ్యక్తి. బ్రిటీష్ పాలనలో భారతదేశం నుండి చెరకు తోటలలో పనిచేయడానికి 'గిర్మిటియా' కార్మికులుగా వెళ్లిన వారి వారసురాలు ఆమె. 19వ శతాబ్దంలో బ్రిటీష్ వారు భారతదేశం నుండి ఒప్పంద కార్మికులను (Indentured Labourers) కరేబియన్ దేశాలకు తరలించారు. వారిని తక్కువ చూపు చూస్తూ "కూలీ" అని పిలిచేవారు. ఇది ఒక జాతి వివక్షతో కూడిన పదంగా (Racial Slur) ఉండేది. View this post on Instagram A post shared by Ministry of Health T&T (@minhealthtt)
కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!
మనం జీవితంలో ఏదో ఒక దశలో ఎత్తుపల్లాలు చూస్తుంటాం. కానీ ఆ క్రిటికల్ టైంలో కూడా ధైర్యంగా నిలబడిన వాడే మనిషి. అదే చెబుతోంది ఈ భారత సంతతి మహిళ కథ. ఒక్కోసారి మన రేంజ్ ఆకాశమంత ఉంటే..అకస్మాత్తుగా విధి అథఃపాతాళానికి పడేస్తుంటుంది. మళ్లీ లేచి నిలబడలేనంతగా విపత్కర పరిస్థితి ఎదురవ్వతుంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా మనకు దొరికిన చిన్న చిన్న అవకాశాల నుంచి మళ్లీ మొదలు పెడుతూ నిలబడ్డ వ్యక్తి సత్తా ఉన్న హీరో. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె.భారత సంతతి మహిళ శ్వేతా దేశాయ్ ఒకప్పుడు లండన్లోని ఒక ప్రముఖ వాణిజ్య వ్యాపార వెబ్సైట్లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్గా పనిచేశారు. ఏకంగా కోటి రూపాయల వేతనం అందుకుంటూ మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేసేవారామె. అలాంటి 37 ఏళ్ల శ్వేతకు 2023 చివరలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మెల్బోర్న్కు వెళ్లడంతో ఆమె పరిస్థితి తలకిందులైపోయింది. అక్కడ తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టమైపోయింది. మెల్బోర్న్ ఉద్యోగ మార్కెట్ అత్యంత చిన్నాభిన్నంగా ఉండటంతో జాబ్ వేట చుక్కలు చూపించిందామెకు. అప్పటి వరకు అంత పెద్ద హోదాలో ఉన్న శ్వేతకు తన గుర్తింపును కోల్పోతున్న వేదన ఎక్కువైంది. తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరక్క చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. దాంతో తనకు వస్తున్న ఉద్యోగాల ఆఫర్లలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. అదెలాంటి ఉద్యోగం అంటే..కార్పొరేట్ ఉద్యోగ జీవితం నుంచి అపార్ట్మెంట్లు శుభ్రం చేసే స్థాయికి చేరిపోవాల్సి వచ్చింది. ఆమెకు వచ్చిన తొలి జాబ్ ఆఫర్ Airbnb అపార్ట్మెంట్ల నిర్వహణనే నిర్వర్తించేందుకు రెడీ అయినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆమె అపార్ట్మెంట్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం , అతిథుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తదితరాలు ఉంటాయి. ఇక ముంబైలో పుట్టి పెరిగిన శ్వేత ఉన్నత చదువుల కోసం 2008లో లండన్కు వెళ్లింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు బ్రిటిస్ రాజధానిలో ఒక ఇంటిని, జీవితాన్ని నిర్మించడంలో గడిపింది. 2023 నాటికి లండన్ బోటిక్ వెడ్డింగ్ రిజిస్ట్రీలో వార్షిక ఆదాయం దాదాపు రూ. కోట్లు ఆదాయం ఆర్చించేది. భర్త ఉద్యోగ రీత్యా మెల్బోర్న్కి వెళ్లడంతో పరిస్థితి అత్యంత విభిన్నంగా మారిపోయింది. ఈ మార్పు సహజంగానే ఆమె జీవనశైలిని తగ్గించుకునేలా చేసింది. లండన్లో, శ్వేతకు డిజైనర్ బ్యాగులు, ఫ్యాన్సీ మేకప్, ఆర్థిక స్వేచ్ఛ ఉండేవి. కానీ మెల్బోర్న్లో ఆమెకు అదే విలాసవంతమైన జీవితం దొరకలేదు. ఈ అనూహ్యమైన మార్పు తనను చాలా దారుణంగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది. పైగా ఎవ్వరైన స్నేహితులు, బంధువుల ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడూ ఏ చెప్పాలో తెలిసేది కాదు. ఒక్కోసారి హౌస్ వైఫ్ అని ముసుగు కప్పుకుని తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలో తనకు దొరికిన మొదటి ఉద్యోగ ఆఫర్లో వెంటనే చేరిపోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఈ ఉద్యోగం కారణంగా మళ్లీ ఇదవరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉండగలిగానంటోంది. తాను అపార్ట్మెంట్లు నిర్వహించడం తోపాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధించడం, సొంతంగా వ్యాపారాన్ని, కోచింగ్ ప్రాక్టీస్ వంటి వాటిని నిర్వహిస్తున్నారామె. ఏ ఉద్యోగం దొరకలేదని ఆగిపోకుండా..దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందులో జాయిన్ అయిపోవడమే మేలని అంటోంది. చాలామంది డబ్బుకు అంత విలువలేదని ఏవేవో చెబుతుంటారు కానీ వాస్తవికంగా అది కరెక్ట్ కాదని అంటోందామె. అంతేగాదు ఆర్థిక స్వతంత్రను కలిగి ఉండటం అంటే తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపే స్వేచ్ఛను కలిగి ఉండటం. డబ్బు అంటే ఎన్నో అవకాశాలు, స్వేచ్ఛ, కొన్నిసార్లు సంతోషం కూడా అని చెప్పుకొచ్చిందామె. ఒకప్పుడు అంత పెద్ద ఉద్యోగ హోదాతో చాలా బాగా బతికాను, పైగా తెలియకుండా ఆ లెవెల్ అహం నాలో చాలా పెరిగిపోయిందని తెలసుకున్నా అంటోందామె. ఇలా ఈ రేంజ్కి వచ్చేసినా..ప్రస్తుతం మూడు వేర్వరే పనులు చేస్తున్నట్లు తెలిపింది. ఇలా తనలా వేరేప్రాంతానికి మారడంతో ఉద్యోగం కోల్పోయి, ఐడెంటిటీని కోల్పోయి నరకం చూస్తున్న మహిళలకు కోసం “ది రీబిల్డ్ రూమ్” అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించానని, పైగా అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shweta (@shweta_lifecoach) (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..)
స్నేహితురాలి పెళ్లికి వెళ్లి..
హైదరాబాద్: అమెరికాలో స్విమ్మింగ్పూల్లో పడి నగర యువతి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడ డివిజన్ న్యూ శివపురి కాలనీకి చెందిన ముద్దసాని దేవేందర్ రెడ్డి, సునీత దంపతుల కూతురు శ్రీవీణ (28)కు 2023లో ప్రశాంత్ రెడ్డితో వివాహమైంది. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవీణ స్నేహితురాలి వివాహం సందర్భంగా రెండు రోజుల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. అక్కడ శ్రీవీణ స్విమ్మింగ్పూల్లో విగతజీవిగా కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఒక్కగానొక్క కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో నగరంలోని దేవేందర్ రెడ్డి, సునీత దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీవీణ తల్లిదండ్రులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, మాజీ కార్పొరేటర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్రెడ్డి పరామర్శించారు. ఆమె భౌతిక కాయాన్ని అమెరికా నుంచి భారత్కు వీలైనంత తొందరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కాన్వొకేషన్ ముగిసిన మరుక్షణమే కానరాని లోకాలకు..
లక్కిరెడ్డిపల్లె(అన్నమయ్య జిల్లా): కన్న కొడుకు విదేశాల్లో గొప్ప చదువులు చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు విధి తీరని అన్యాయం చేసింది. ఎంఎస్ పూర్తి చేసి పట్టా అందుకున్న సంబరం నిండకముందే, అదే రాత్రి మృత్యువు గుండెపోటు రూపంలో వచ్చి ఆ యువకుడిని బలితీసుకుంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన షేక్ తాజ్ కుమారుడు మహమ్మద్ కుమేల్ షేక్ (28) అమెరికాలో గురువారం రాత్రి హఠాన్మరణం చెందాడు. కుమేల్ షేక్ ఇంజినీరింగ్ విద్యను చెన్నైలోని సత్యభామ వర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకున్న ఆయన, గురువారం జరిగిన కాన్వొకేషన్ వేడుకలో పట్టా అందుకున్నారు. ఆ ఆనందంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి, స్నేహితులతో కలిసి ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వెళ్లారు. నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. మృతుడి తండ్రి స్టాంప్ రైటర్గా పనిచేస్తున్నారు.
క్రైమ్
లేడీస్ హాస్టల్లో రహస్య ఫొటోలు.. ప్రియుడికి పంపిన మహిళ!
స్నేహితురాళ్ల అశ్లీల ఫొటోలు తీసి ప్రియుడికి పంపిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి టౌన్ ప్రాంతానికి చెందిన మకరజ్యోతి (39) అనే మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయిన ఆమె, పాలయంకోట్టైలోని ఒక ప్రైవేట్ మహిళా హాస్టల్లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ సమయంలో కోయంబత్తూరుకు చెందిన ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో హాస్టల్లో తనతో పాటు ఉంటున్న ఇతర మహిళల రోజూవారి కార్యకలాపాలను వారికి తెలియకుండానే మకరజ్యోతి సెల్ఫోన్లో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా తీసిన అశ్లీల చిత్రాలను ఆమె కోయంబత్తూరులో ఉన్న తన ప్రియుడికి పంపుతున్నట్టు తెలిసింది. హాస్టల్ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహిళా పోలీసులు విచారణ చేశారు. విచారణలో తోటి మహిళలను అశ్లీలంగా ఫొటోలు తీసినట్లు నిర్ధారణ కావడంతో, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. -చెన్నై
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ నగదు పట్టివేత
సికింద్రాబాద్: ముంబై నుండి సికింద్రాబాద్కు హవాలా సొమ్ము తరలిస్తున్న ఒక వ్యక్తిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.22 కోట్ల డబ్బును స్వా«దీనం చేసుకున్నారు. రైలు ప్రయాణంలో పట్టుబడిన హవాలా డబ్బు వివరాలను బుధవారం జీఆర్పీ డీఎస్పీ ఎస్ఎన్ జావెద్ వెల్లడించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయీశ్వర్గౌడ్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు నరసింహారావు, సంజీవరావుల నేతృత్వంలో బొల్లారం–మల్కాజిగిరి స్టేషన్ల మధ్య తనిఖీలు నిర్వహిస్తుండగా దేవగిరి ఎక్స్ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా లగేజ్ బ్యాగ్తో ఉన్న వ్యక్తి పట్టుబడ్డాడు. మహారాష్ట్ర అమరావతి జిల్లాకు చెందిన విజయ్ అంబదాస్ గుప్తా (40) గా గుర్తించిన అతని నుంచి పెద్దమొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని కాంతా జ్యువెలరీ యజమాని సంతోష్ సేథ్ నుంచి రూ.1.22 కోట్ల డబ్బు తీసుకొని సికింద్రాబాద్కు వస్తున్నట్టు అంబదాస్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. మోండా మార్కెట్లోని బంటీ అనే వ్యాపారికి ఈ డబ్బు బ్యాగును అప్పగించేందుకు వస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇందుకు ప్రతిఫలంగా తనకు రూ. 5,000 కమీషన్ ఇచ్చినట్టు చెప్పాడు. పట్టుబడిన డబ్బు హవాలాకు చెందినదిగా గుర్తించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఇన్కంటాక్స్ అధికారులకు బదిలీ చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచ్ మృతి
సుల్తానాబాద్రూరల్/పెద్దపల్లి/ఓదెల: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టగా ఉప సర్పంచ్ కోట నిరంజన్రెడ్డి((39) మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కోట నిరంజన్రెడ్డి, నాంసానిపల్లెకు చెందిన పోతగంటి రాజు కలిసి ద్విచక్ర వాహనంపై కరీంనగర్కు పనినిమిత్తం వెళ్తున్నాడు. ఈక్రమంలో కాట్నపల్లి శివారులో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ముందు టైర్ ఎక్కగా నిరంజన్రెడ్డి మృతి చెందాడు. రాజుకు తీవ్ర గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతుడి కుటుంబసభ్యులను విప్ విజయరమణరావు పరామర్శించారు. ఉప సర్పంచ్ మృతితో ఆయన స్వగ్రామం మడకలో విషాదం అలముకుంది.
తండ్రి మరణాన్ని తట్టుకోలేక..
రంగారెడ్డి జిల్లా: బంధాలు, అనుబంధాలే కరువైపోతున్న ఈ రోజుల్లో తండ్రి మీద ఆ కుమా రు డు పెంచుకున్న మమకారం ఏకంగా ప్రాణాలనే తీసుకునేలా చేసింది. కుమారుడిని అలా చూసిన తల్లి కూడా తనువు చాలించింది. ఈ విషాద ఘట న రంగారెడ్డి జిల్లా లష్కర్గూడ పంచాయతీ కనకదుర్గానగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన పసుల కళాధర్, కళావతి దంపతులు తమ కుమారుడు శివకుమార్తో కలిసి మేడ్చల్లో ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ టైలరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తు న్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన కళాధర్ ఆరు నెలల క్రితం మృతిచెందారు. దీంతో శివకుమార్ను తీసుకుని కళావతి లష్కర్గూడలో ఉంటున్న తన సోదరుడి వద్దకు వచ్చారు. ఇక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటూ కాలం గడుపుతున్నారు. అ యితే, తండ్రి మరణం శివకుమార్(20)కు మాన సికంగా కుంగదీసింది.తండ్రితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నిత్యం తల్లడిల్లేవాడు. ఈ క్ర మంలో తీవ్ర మనోవేదనతో బుధవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. కొద్దిసేపటి తర్వాత తల్లి కళావతి(45) కొడుకు చనిపోయి ఉండటాన్ని గమనించారు. ఆరునెలల క్రితం భర్త చనిపోవడం, ఇప్పుడు కొడుకు ఆత్మహ త్య చేసుకోవడం చూసి తట్టుకోలేకపోయారు. వా రిద్దరూ లేని జీవితం ఎందుకు అనుకున్నారేమో.. ఆమె కూడా చీరతో ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు.
వీడియోలు
ఆయన శాఖను గాలికి వదిలేశాడు.. లోకేష్ పై పేర్ని నాని పంచులు
రిలేషన్ లో ఉంటే గీ పనులు అసలు చేయకుండ్రి..!
నా ఫ్యామిలీ జోలికి రావద్దు..! వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
చర్చలకు రాకపోతే.. ఇరాన్ అంతమే!
చెప్పులపార్టీ... నువ్వా నీతులు చెప్పేది
అందుకే రాజీనామా చేశా..
సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా
కులాల కోసం మాట్లాడింది నువ్వు... దమ్ముంటే అరెస్ట్ చేయండి ప్రో. కే నాగేశ్వర రావు ఛాలెంజ్
చంపేస్తే ఒకేసారి చంపేయండి కనీళ్ళు పెట్టుకున్న మహిళ బాధితులు
ఇదేం పద్ధతి పవన్..? వేరే వాళ్ళు చేస్తే ఏమో చెడు..!


