సాక్షి మహబూబాబాద్ : తొర్రూరులో మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆఫీసును పోలీసులు దిగ్భందించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్రను అరెస్టు చేసారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం క్యాంప్ లో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లతో వరంగల్ జిల్లా పార్వతగిరి మండల కేంద్రం నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బస్సులో బయిలుదేరారు. అయితే తొర్రూరులో 144 సెక్షన్ అమలులో ఉండడంతో వారికి అనుమతి లేదంటూ పోలీసులు కాన్వాయిని అడ్డుకున్నారు. అనంతరం కౌన్సిలర్లతో సహా బస్సును వెనక్కిపంపించి వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


