సాక్షి, మంచిర్యాల : క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్బంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడికి వచ్చిన మంత్రి వివేక్ని బీఆర్ఎసన్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయిపై రాళ్లురువ్వడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రాళ్ల దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలకు స్వల్పగాయాలయినట్లు తెలుస్తోంది.
ఎన్నికల కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు పెద్దఎత్తున గూమిగూడారు. అనంతరం పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కోరం సరిగ్గా లేకపోవడంతో వాయిదాపడిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికలను అధికారులు నేడు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పలు చోట్ల 144 సెక్షన్ విధించారు.

సంగారెడ్డి జిల్లా
- ఇంద్రేశ్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
- ఛైర్పర్సన్గా ప్రమీల,వైస్ఛైర్మన్గా హరీశ్ రెడ్డి
- స్వతంత్ర్య అభ్యర్థి మద్దతుతో బీఆర్ఎస్ గెలుపు
- పటాన్చెరు మున్సిపాలిటీల్లో ఐదు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వశం
- ఐదింట ఐదు గెలిచి క్లీన్స్వీప్ చైసిన బీఆర్ఎస్


