అభ్యర్థి వెల్లడిపై భిన్నాభిప్రాయాలు!
రాహులే మా ‘సహజ ఎంపిక’: షిండే
ముందుగా ప్రకటించడమెందుకు: దిగ్విజయ్
న్యూఢిల్లీ: ప్రధాని అభ్యర్థి అంశం కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలకు, అభిప్రాయ భేదాలకు వేదికగా మారుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని వీలైనంత త్వరగా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేయాలని పార్టీలో మెజారిటీ వర్గం కొంతకాలంగా పదేపదే డిమాండ్ చేస్తున్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్ శుక్రవారం మీడియాముఖంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకోవైపు ప్రధాని అభ్యర్థిగా రాహులే తమ సహజ ఎంపిక అని కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే అభిప్రాయపడ్డారు! శుక్రవారం హోం శాఖ నెలవారీ మీడియా భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 17న జరిగే ఏఐసీసీ సదస్సులో రాహుల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశముందా అని ప్రశ్నించగా, తమ పార్టీకే గాక దేశానికి కూడా ఆయన అవసరమన్నారు.
నేతల మధ్య పోటీ కాదు
ప్రధాని అభ్యర్థి ఎంపికపై జాగరూకత అవసరమని దిగ్విజయ్ అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికల్లో గెలిచిన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధు లు మాత్రమే తమ నాయకుడిని ఎన్నుకుంటారని గుర్తు చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానితో పాటు షాడో ప్రధాని, అంటే విపక్ష నేత కూడా ఉంటారని దిగ్విజయ్ అన్నారు. ప్రధానిగా మోడీ, రాహుల్, కేజ్రీవాల్లపై జరుగుతున్న చర్చను వార్తా చానళ్ల టీఆర్పీ ప్రయాసగా కొట్టిపారేశారు. భారత్ వంటి దేశంలో పోటీ ఎప్పుడూ పార్టీల సిద్ధాంతాలు, విధానాల మధ్యే ఉంటుంది తప్ప కీలక నేతల మధ్య కాదన్నారు. రాహుల్ను ప్రధానిగా చూడాలనుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఇటీవల పలు సర్వేలు వెల్లడిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే, తమ పార్టీ గనుక ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలనుకుంటే అందులో తప్పేమీ లేదంటూ ఆయన ముక్తాయించారు.
కాంగ్రెస్లో ‘ప్రధాని’ కలకలం
Published Sat, Jan 11 2014 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement