షాపూర్‌ జీ–పల్లోంజీ ప్రతినిధులతో సీఎం సమావేశం | CM meeting with the representatives of Shahpur Ji-Palonji | Sakshi
Sakshi News home page

షాపూర్‌ జీ–పల్లోంజీ ప్రతినిధులతో సీఎం సమావేశం

Aug 29 2017 2:05 AM | Updated on Aug 14 2018 11:26 AM

ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి కట్టడాలపై సమగ్రంగా అధ్యయనం జరిపి వాటికి దీటుగా అమరావతి ఐకానిక్‌ టవర్స్‌ నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.

సాక్షి, అమరావతి: ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి కట్టడాలపై సమగ్రంగా అధ్యయనం జరిపి వాటికి దీటుగా అమరావతి ఐకానిక్‌ టవర్స్‌ నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అధికారులు, ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ ప్రతినిధులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు.

తాము రూపొందించిన అమరావతి ఐకానిక్‌ ట్విన్‌ టవర్‌ ఆకృతులు, నిర్మాణ వ్యూహంపై షాపూర్‌ జీ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఈ జంట కట్టడాల్లో కార్యాలయ స్థలం 55 నుంచి 57 శాతం వరకు ఉంటుంది. షాపింగ్‌ ఏరియా కోసం 12 నుంచి 13 శాతం వరకు కేటాయిస్తారు. సర్వీస్‌ అపార్టుమెంట్స్‌ కోసం 8 శాతం ప్రదేశాన్ని వినియోగించనున్నట్టు వారు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement