ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మహాశివరాత్రి సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రామప్పలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రాత్రి 9 గంటలకు నవ్యజ బృందంచే చేసిన పేరిణి నృత్యం, 10 గంటలకు చైతన్య బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యం, 11 గంటలకు మోతె రమేశ్ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా ప్రోగ్రాం నిర్వహించారు. 12గంటలకు మోతె శంకర్ ఆధ్వర్యంలో చెక్కబొమ్మలాట, అర్ధరాత్రి ఒంటిగంటకు మనుల స్వప్న బృందంచే భక్తి గీతాలు భక్తులను అలరించాయి. జాగరణ చేపట్టిన భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు


