ఆలయ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఆలయ అభివృద్ధికి కృషి

Feb 14 2026 9:09 AM | Updated on Feb 14 2026 9:09 AM

ఆలయ అభివృద్ధికి కృషి

ఆలయ అభివృద్ధికి కృషి

గోవిందరావుపేట: ముయ్యాలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని పస్రా నాగారం (పాతూరు)లో జరుగుతున్న ముయ్యాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని, భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ముయ్యాలమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కల్యాణి, నాయకులు గొంది కిరణ్‌, పులుగుజ్జు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement