అవగాహనతోనే ఆరోగ్య రక్షణ
భూపాలపల్లి అర్బన్: ప్రతీఒక్కరు ఆరోగ్య రక్షణపై అవగాహన కలిగి ఉండాలని, కేన్సర్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్ సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ కేన్సర్ దినోత్సవాన్ని మున్సిపల్ పరిధిలోని జంగేడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రోజూ తగినంత నీరు సేవించడం, వ్యాయామం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవని తెలిపారు.


