'కాంతార' రిషభ్ శెట్టి మరో తెలుగు సినిమా | Rishab Shetty Telugu Movie With Sithara Entertainments | Sakshi
Sakshi News home page

Rishab Shetty: సితార సంస్థలో రిషభ్ కొత్త మూవీ

Jul 30 2025 12:38 PM | Updated on Jul 30 2025 1:04 PM

Rishab Shetty Telugu Movie With Sithara Entertainments

'కాంతార' మూవీతో సంచలనం సృష్టించిన కన్నడ హీరో రిషబ్ శెట్టి మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ చేస్తున్న ఇతడు.. తర్వాత ప్రశాంత్ వర్మ తీసే 'జై హనుమాన్' చేస్తాడు. దీని తర్వాత ఓ హిందీ మూవీ లైన్‌లో ఉంది. ఇప్పుడు వీటితో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తీసే సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం)

18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఓ తిరుగుబాటుదారుడి కథతో ఈ సినిమాని తీయబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడలోనూ దీన్ని ఒకేసారి తీస్తారు. అనంతరం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తారు.

(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement