మెరుగైన విద్యుత్ కోసం సామర్థ్యం పెంపు
● ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి
జనగామ: పట్టణంలో వేసవి సీజన్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సామర్థ్యం పెంచుతున్నట్లు ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. వేసవి కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం పట్టణంలోని మినీ స్టేడియం ఏరియాలో నాణ్యమైన విద్యుత్ కోసం అదనంగా 100 కేవీఏ సామర్థ్యం కలిగిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్)ను ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించారు. అదనపు డీటీఆర్ ఏర్పాటు చేయడంతో జనగామ టౌన్–2 సెక్షన్ పరిధిలో తక్కువ ఓల్టేజ్ సమస్యలు గణనీయంగా తగ్గి, వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఏడీఈ వేణుగోపాల్, టౌన్–1 ఏఈ సౌమ్య, టౌన్–2 ఏఈ పులి చంద్రమోహన్, ఎస్ఎల్ఐ నరేందర్, లైన్మెన్లు భిక్షపతి, మహేందర్, ఏఎల్ఎం అశోక్ ఉన్నారు.


