భరోసానిచ్చేలా.. ఫ్లాగ్మార్చ్
పట్టణంలోని బొక్కలగూడ, అబ్దుల్లా చౌక్, ఖానాపూర్, అంబేడ్కర్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడారు. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లా పోలీస్శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. డబ్బు, మద్యం, బహుమతులు వంటి ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు బి.సునీల్ కుమార్, ఎం.ప్రసాద్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. –ఆదిలాబాద్టౌన్


