శ్రీమిస్‌ క్వీన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఇండియా–2023 'రన్నరప్‌' గా నిర్మల్‌ యువతి | - | Sakshi
Sakshi News home page

శ్రీమిస్‌ క్వీన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఇండియా–2023 'రన్నరప్‌' గా నిర్మల్‌ యువతి

Oct 21 2023 1:58 AM | Updated on Oct 21 2023 8:14 AM

- - Sakshi

నిషిత తిరునగరి

సాక్షి, ఆదిలాబాద్‌: ఫ్యాషన్‌రంగంపై మక్కువతో అందులో ఎదుగుతున్న నిర్మల్‌ యువతి అరుదైన స్థానంలో నిలిచింది. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన శ్రీమిస్‌ క్వీన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఇండియా–2023శ్రీ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన నిషిత తిరునగరి ఒక్క మార్కు తేడాలో రన్నరప్‌గా నిలిచింది. స్థానిక ఈద్‌గాంకు చెందిన సరళ, మనోహర్‌స్వామి దంపతుల కూతురు నిషిత బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివింది. భవిష్యత్తుపై తనకున్న నమ్మకం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఫ్యాషన్‌రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె 18రాష్ట్రాల మహిళలు, యువతులకు ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌డిఫెన్స్‌ కోర్సును నేర్పిస్తుండడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన పోటీల్లో నిషిత రన్నరప్‌గా నిలువడంపై కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

చదవండి: అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement