హామీలు అమలు చేయాలని వినతి | - | Sakshi
Sakshi News home page

హామీలు అమలు చేయాలని వినతి

Feb 17 2026 8:55 AM | Updated on Feb 17 2026 8:55 AM

హామీలు అమలు చేయాలని వినతి

హామీలు అమలు చేయాలని వినతి

తిరుపతి మంగళం : ఏపీఐఐసీ కోసం భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పాలచ్చూరు గ్రామస్తులు కోరారు. తిరుపతి ఎంపీ కార్యాలయంలో సోమవారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పెళ్లకూరు మండలం పాలచ్చురు సమీపంలో ఉన్న తమ భూములను 2007 సంవత్సరంలో ఏపీఐఐసీకి అప్పగించామని, ఆ సమయంలో అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ తమకు 0.25 సెంట్ల ఇంటి స్థలం, ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారని గ్రామస్తులు ఎంపీకి వివరించారు. అయితే ఆ హామీలు అమలు కాలేదని, తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు ఎంపీకి మొరపెట్టుకున్నారు. గ్రామస్తుల సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement