Breadcrumb
Live Updates
హైదరాబాద్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ముగిసిన రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. దీంతో బేగంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి బయలుదేరి వెళ్లారు. కాగా ముచ్చింతల్ చిన్న జీయర్ ఆశ్రమంలో సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా రామానుజాచార్యుల స్వర్ణ మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.
భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారు: రాష్ట్రపతి
రామనుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ మేరకు 120 కిలలోల స్వర్ణ రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. రామానుజ విగ్రహం ఏర్పాటు చేసి చిన జీయర్ స్వామి చరిత్ర సృష్టించారని తెలిపారు. రామానుజ సహస్రాబ్ది సమరొహం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పీడిత వర్గాల కోసం రామానుజ చార్యులు వైష్ణవ ద్వారాలు తెరిచారని, మహాత్మ గాంధీపై రామనుజాచార్యుల ప్రభావం ఉందని ప్రస్తావించారు.
రామానుజాచార్యుల శిష్యులల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారేనని, రామానుజాచార్యుల సమానత్వ ఆలోచనలు మన రాజ్యాంగములో కనిపిస్తాయని రాష్ట్రపతి తెలిపారు. సమతా మూర్తి విగ్రహ స్పూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారని పేర్కొన్నారు. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు నిర్ధేశించారని తెలిపారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన లైవ్
రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలోని ఆలయాలు, బృహన్ మూర్తి విగ్రహాన్ని సందర్శించారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువుదీరిన రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామానుజుల విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు. భగవద్రామానుజుల 120 సంవత్సరాల పరిపూర్ణ జీవనానికి ప్రతీకగా 120 కిలోల బంగారంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.
ముచ్చింతలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ చేరుకున్నారు. సమతా మూర్తి కేంద్రానికి చేరుకున్న రామ్నాథ్ కోవింద్ దంపతులకు చినజీయర్ స్వామి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంత్రి తలసాని స్వాగతం పలికారు.
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
Statue of Equality: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆహ్వనం పలికారు. రామ్నాథ్ కోవింద్తో పాటుగా ఆయన సతీమణి సవితా కోవింద్ కూడా హైదరాబాద్ వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి కోవింద్ దంపతులు హెలికాఫ్టర్లో ముచ్చింతల్లోని చిన్నజీయర్ ఆశ్రమానికి బయలుదేరారు.
మచ్చింతల్లోని శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో రాష్ట్రపతి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీంతోపాటు భద్రవేదిక దిగువ భాగంలో కొలువుదీరిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
Related News By Category
Related News By Tags
-
ప్రమాణ స్వీకారానికి ముందే అభివృద్ధి బాట..
నల్గొండ జిల్లా: రెండేళ్లుగా గుంతలమయంగా మారిన రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ఎర్రబెల్లి గ్రామ నూతన సర్పంచ్ అయితగోని మధు, ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజల...
-
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ భవన్లో నేడు(ఆదివారం, డిసెంబర్ 21) ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ ...
-
సిరిసిల్ల: పాడె పైనుంచి పోస్ట్మార్టం హాల్కి..
సిరిసిల్ల: గల్ఫ్ నుంచి నెల రోజుల క్రితం ఇంటికొచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు త...
-
నాగులమ్మ పాటల నర్తకి.. నేడు బోటు మీద పల్లె సర్పంచ్
వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీచేసి గెలుపొందారు. గ్రామా...
-
ఇల్లు.. ఇక కొందామా.. తొలగిన డైలమా!
కొందామా.. మరికొన్నాళ్లు వేచి చూద్దామా..? కొనగానే ధరలు పడిపోతే..? పోనీ, ధైర్యం చేసి కొన్నా అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోతే? ..ఏడాది కాలంగా హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ఇలాంటి ఎన్నో సందేహాలు. ఏ న...


