Breadcrumb
Live Updates
హైదరాబాద్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ముగిసిన రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. దీంతో బేగంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి బయలుదేరి వెళ్లారు. కాగా ముచ్చింతల్ చిన్న జీయర్ ఆశ్రమంలో సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా రామానుజాచార్యుల స్వర్ణ మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.
భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారు: రాష్ట్రపతి
రామనుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ మేరకు 120 కిలలోల స్వర్ణ రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. రామానుజ విగ్రహం ఏర్పాటు చేసి చిన జీయర్ స్వామి చరిత్ర సృష్టించారని తెలిపారు. రామానుజ సహస్రాబ్ది సమరొహం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పీడిత వర్గాల కోసం రామానుజ చార్యులు వైష్ణవ ద్వారాలు తెరిచారని, మహాత్మ గాంధీపై రామనుజాచార్యుల ప్రభావం ఉందని ప్రస్తావించారు.
రామానుజాచార్యుల శిష్యులల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారేనని, రామానుజాచార్యుల సమానత్వ ఆలోచనలు మన రాజ్యాంగములో కనిపిస్తాయని రాష్ట్రపతి తెలిపారు. సమతా మూర్తి విగ్రహ స్పూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారని పేర్కొన్నారు. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు నిర్ధేశించారని తెలిపారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన లైవ్
రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలోని ఆలయాలు, బృహన్ మూర్తి విగ్రహాన్ని సందర్శించారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువుదీరిన రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామానుజుల విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు. భగవద్రామానుజుల 120 సంవత్సరాల పరిపూర్ణ జీవనానికి ప్రతీకగా 120 కిలోల బంగారంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.
ముచ్చింతలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ చేరుకున్నారు. సమతా మూర్తి కేంద్రానికి చేరుకున్న రామ్నాథ్ కోవింద్ దంపతులకు చినజీయర్ స్వామి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంత్రి తలసాని స్వాగతం పలికారు.
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
Statue of Equality: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆహ్వనం పలికారు. రామ్నాథ్ కోవింద్తో పాటుగా ఆయన సతీమణి సవితా కోవింద్ కూడా హైదరాబాద్ వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి కోవింద్ దంపతులు హెలికాఫ్టర్లో ముచ్చింతల్లోని చిన్నజీయర్ ఆశ్రమానికి బయలుదేరారు.
మచ్చింతల్లోని శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో రాష్ట్రపతి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీంతోపాటు భద్రవేదిక దిగువ భాగంలో కొలువుదీరిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
Related News By Category
Related News By Tags
-
ఇబ్రహీం పట్నం మన్సిపాలిటీ ఛైర్మన్.. వీరికే
సాక్షి రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన ఇబ్రహీం పట్నం మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి ఉద్రిక...
-
రణరంగమైన ఛైర్మన్ ఎన్నిక.. వివేక్ కారుపై రాళ్లదాడి
సాక్షి, మంచిర్యాల : క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్బంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడికి వచ్చిన మంత్రి వివేక్ని బీఆర్ఎసన్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన క...
-
పొద్దన టీ తాగినోడు నైట్ ఎలా చనిపోతాడు..
చైతన్యపురి: ఓ భవనం సెల్లార్లో హైడ్రాలిక్ పార్కింగ్ రాడ్కు వాచ్మన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. చైత్యపురి బస్ స్టాప్ వెనకవైపు నీరటి రాజు, అ...
-
11 మున్సిపాలిటీ ఛైర్మన్లకు నేడు ఎన్నిక
సాక్షి హైదరాబాద్ : రాష్ట్రంలో పలు కారణాలతో వాయిదాపడ్డ 11 మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నిక నేడు అధికారులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు....
-
కేసీఆర్కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి,తాడేపల్లి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartiest birthday gr...


