Breadcrumb
Live Updates
హైదరాబాద్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ముగిసిన రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. దీంతో బేగంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి బయలుదేరి వెళ్లారు. కాగా ముచ్చింతల్ చిన్న జీయర్ ఆశ్రమంలో సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా రామానుజాచార్యుల స్వర్ణ మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.
భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారు: రాష్ట్రపతి
రామనుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ మేరకు 120 కిలలోల స్వర్ణ రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. రామానుజ విగ్రహం ఏర్పాటు చేసి చిన జీయర్ స్వామి చరిత్ర సృష్టించారని తెలిపారు. రామానుజ సహస్రాబ్ది సమరొహం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పీడిత వర్గాల కోసం రామానుజ చార్యులు వైష్ణవ ద్వారాలు తెరిచారని, మహాత్మ గాంధీపై రామనుజాచార్యుల ప్రభావం ఉందని ప్రస్తావించారు.
రామానుజాచార్యుల శిష్యులల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారేనని, రామానుజాచార్యుల సమానత్వ ఆలోచనలు మన రాజ్యాంగములో కనిపిస్తాయని రాష్ట్రపతి తెలిపారు. సమతా మూర్తి విగ్రహ స్పూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారని పేర్కొన్నారు. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు నిర్ధేశించారని తెలిపారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన లైవ్
రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలోని ఆలయాలు, బృహన్ మూర్తి విగ్రహాన్ని సందర్శించారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువుదీరిన రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామానుజుల విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు. భగవద్రామానుజుల 120 సంవత్సరాల పరిపూర్ణ జీవనానికి ప్రతీకగా 120 కిలోల బంగారంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.
ముచ్చింతలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ చేరుకున్నారు. సమతా మూర్తి కేంద్రానికి చేరుకున్న రామ్నాథ్ కోవింద్ దంపతులకు చినజీయర్ స్వామి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంత్రి తలసాని స్వాగతం పలికారు.
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
Statue of Equality: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆహ్వనం పలికారు. రామ్నాథ్ కోవింద్తో పాటుగా ఆయన సతీమణి సవితా కోవింద్ కూడా హైదరాబాద్ వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి కోవింద్ దంపతులు హెలికాఫ్టర్లో ముచ్చింతల్లోని చిన్నజీయర్ ఆశ్రమానికి బయలుదేరారు.
మచ్చింతల్లోని శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో రాష్ట్రపతి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీంతోపాటు భద్రవేదిక దిగువ భాగంలో కొలువుదీరిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
Related News By Category
Related News By Tags
-
కసాయి తండ్రి.. ఐదేళ్ల కవల కూతుళ్ల ప్రాణం తీశాడు..
సాక్షి, కరీంనగర్ : రూరల్ మండలం జూబ్లీనగర్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి ఇద్దరు కుమార్తెలను హత్య చేసి బావిలో పడేశాడు.పోలీసుల వివరాల ప్రకారం, శుక్రవారం శ్రీశైలం తన భార్యతో గొడ...
-
ట్రాన్స్జెండర్లకు గుడ్ న్యూస్ : డ్రోన్ పైలట్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 'దివ్యాంగులు, వృద్ధులు ,ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ' (EPwD), ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం నైపుణ్య శిక్షణా కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని ని...
-
సర్పంచ్ ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రమాదం
సాక్షి,నిర్మల్: విధి ఆడిన వింత నాటకంలో సర్పంచ్ లహరిక మృతి చెందారు. నిర్మల్ జిల్లా మాసాయిపేట సర్పంచ్ లహరిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసు...
-
ఆ రెండింటి కలయిక నేను: సానియా మీర్జా భావోద్వేగం
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హైదరాబాదీ స్టార్ ఎన్నో సవాళ్లు అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ స్టార్గా గుర్తింపు పొందింది. తన 20 ఏళ్ల కెరీర్లో సా...
-
ఇది చూసి నవ్వుకునేరు.. బాబోరు మళ్లీ వేసేశారు..!
సాక్షి,అమరావతి: చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి పర్యాయ పదం. అయితే, ఆయన ధోరణి రెండు నాల్కుల తీరు అనేది మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఇప్పుడు తాన...


