Breadcrumb
Live Updates
హైదరాబాద్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ముగిసిన రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. దీంతో బేగంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి బయలుదేరి వెళ్లారు. కాగా ముచ్చింతల్ చిన్న జీయర్ ఆశ్రమంలో సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా రామానుజాచార్యుల స్వర్ణ మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.
భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారు: రాష్ట్రపతి
రామనుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ మేరకు 120 కిలలోల స్వర్ణ రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. రామానుజ విగ్రహం ఏర్పాటు చేసి చిన జీయర్ స్వామి చరిత్ర సృష్టించారని తెలిపారు. రామానుజ సహస్రాబ్ది సమరొహం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పీడిత వర్గాల కోసం రామానుజ చార్యులు వైష్ణవ ద్వారాలు తెరిచారని, మహాత్మ గాంధీపై రామనుజాచార్యుల ప్రభావం ఉందని ప్రస్తావించారు.
రామానుజాచార్యుల శిష్యులల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారేనని, రామానుజాచార్యుల సమానత్వ ఆలోచనలు మన రాజ్యాంగములో కనిపిస్తాయని రాష్ట్రపతి తెలిపారు. సమతా మూర్తి విగ్రహ స్పూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారని పేర్కొన్నారు. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు నిర్ధేశించారని తెలిపారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన లైవ్
రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలోని ఆలయాలు, బృహన్ మూర్తి విగ్రహాన్ని సందర్శించారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువుదీరిన రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామానుజుల విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు. భగవద్రామానుజుల 120 సంవత్సరాల పరిపూర్ణ జీవనానికి ప్రతీకగా 120 కిలోల బంగారంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.
ముచ్చింతలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ చేరుకున్నారు. సమతా మూర్తి కేంద్రానికి చేరుకున్న రామ్నాథ్ కోవింద్ దంపతులకు చినజీయర్ స్వామి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంత్రి తలసాని స్వాగతం పలికారు.
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
Statue of Equality: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆహ్వనం పలికారు. రామ్నాథ్ కోవింద్తో పాటుగా ఆయన సతీమణి సవితా కోవింద్ కూడా హైదరాబాద్ వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి కోవింద్ దంపతులు హెలికాఫ్టర్లో ముచ్చింతల్లోని చిన్నజీయర్ ఆశ్రమానికి బయలుదేరారు.
మచ్చింతల్లోని శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో రాష్ట్రపతి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీంతోపాటు భద్రవేదిక దిగువ భాగంలో కొలువుదీరిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
Related News By Category
Related News By Tags
-
తండ్రి భయంతో బాల్కనీ దాటే ప్రయత్నం..
రామచంద్రాపురం (పటాన్చెరు): ఇంట్లో స్నేహితుడితో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తండ్రి రావడం చూసి భయపడిన కూతురు.. తమ బాల్కనీ నుంచి మరో బాల్కనీకి వెళ్లే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందింద...
-
ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ మృతి
చర్ల/సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్ర...
-
2030-35 నాటికి విస్తృతంగా పొలాల్లో రోబోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2030-35 నాటికి రైతుల పొలాల్లో రోబోలు, డ్రోన్లు, మానవరహిత ట్రాక్టర్లు, సెన్సర్ల వినియోగం విస్తృతం కానుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప...
-
ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయం కావాలి
కవాడిగూడ: సమాజంలో మార్పు తీసుకురావడానికి పుస్తక పఠనం ఒక శక్తి వంతమైన ఆయుధమని, ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయంగా మారాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. శుక్రవారం హైదర...
-
నా డబ్బులు నాకు ఇచ్చేయండి
ఆసిఫాబాద్ రూరల్/జూలూరుపాడు: ఉప సర్పంచ్ పదవి దక్కని ఓ మాజీ సర్పంచ్ ఓట ర్ల నుంచి తిరిగి డబ్బులు వసూలు చేసిన ఘటన కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చిలాటిగూడ పంచాయతీలో ఎకోన్ కార్ మహేశ్...


