క్యాంపునకు తరలిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
కోదాడ : కోదాడ మున్సిపాలిటికి చెందిన 26 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు శుక్రవారం క్యాంపునకు తరలి వెళ్లారు. విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులను శుక్రవారం మధ్యాహ్నమే సూర్యాపేట కౌంటింగ్ కేంద్రం నుంచే నేరుగా హైదరాబాద్లోని ఓ రిసార్టుకు తరలించారు. మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు ఈ క్యాంపు రాజకీయం నడుస్తున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులకు గాను ఏకగ్రీవాలతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలను గెలుచుకుంది. సీపీఐ అభ్యర్థి ఒకరు, కాంగ్రెస్ రెబల్స్ నలుగురు, బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, ఒక స్వతంత్ర అభ్యర్థితో 9మంది కోదాడలోనే ఉన్నారు.


