● యూరియా స్టాకును తనిఖీ చేసిన గార వ్యవసాయాధికారి పద్మావ
గార: వమరవల్లి సచివాలయం వద్దకు వచ్చిన యూరియా పక్కదోవ పట్టినట్టు స్పష్టమైంది. ఆదివారం, మహాశివరాత్రి రోజున స్థానిక టీడీపీ నాయకుడి ఆదేశాలతో వమరవల్లి సచివాలయంలోని యూరియాను తూలుగు పీఏసీఎస్ సిబ్బంది టీడీపీ నాయకులకు ఇష్టానుసారం పంపిణీ చేయడం, దీనిపై స్థానిక రైతులు నిలదీసిన ఘటన అందరికీ తెలిసిందే. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం ఉదయం గార మండల వ్యవసాయాధికారి దుంపల పద్మావతి వమరవల్లి సచివాలయంలోని గోడౌన్ను తనిఖీ చేశారు. యూరియా బస్తాలను లెక్కించగా 181 బస్తాలు మాత్రమే ఉండటాన్ని గుర్తించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ–క్రాప్ నమోదు ప్రక్రియలో ఉండటం, వమరవల్లి తదితర ప్రాంతంలో వరి, మొక్కజొన్న, మిరప వంటి పంటలు ఉండటంతో తూలుగు పీఏసీఎస్కు 25 టన్నులు ( 556 బస్తాలు) కేటాయించారు. స్థానిక టీడీపీ నాయకుని ఆదేశాలతో ఆదివారం సాయంత్రం వేళ రైతులు, వ్యాపారులు ఇలా ఇష్టానుసారంగా 375 బస్తాలను ఇచ్చేశారు. స్థానిక సర్పంచ్ రఘునాథ రెడ్డి, స్థానిక రైతుల సమక్షంలో పీఏసీఎస్ సిబ్బంది రాసిన రికార్డు కూడా తప్పుల తడకగా ఉండటం, చనిపోయిన రైతుల పేర్లు కూడా నమో దు కావడంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన కుర్మాన రాజశేఖర్, సోమేష్ తదితర రైతుల నుంచి సమాచారం సేకరించారు. తూలుగు పీఏసీఎస్కు యూ రియా పంపిణీపై షోకాజ్ నోటీసులు ఇస్తున్నామని, సర్పంచ్ వినతి మేరకు మరో 10 టన్ను ల యూరియా ఉన్నతాధికారులు మంజూరు చేశారని ఏఓ పద్మావతి తెలిపారు.
● యూరియా స్టాకును తనిఖీ చేసిన గార వ్యవసాయాధికారి పద్మావ
● యూరియా స్టాకును తనిఖీ చేసిన గార వ్యవసాయాధికారి పద్మావ


