రాష్ట్రంలో సాగుతున్న రెడ్బుక్ పాలనతో ప్రజలకు భావప్రకటనా స్వేచ్ఛ కూడా కరువైంది. నూతన పథకాలు పక్కనపెడితే..కనీసం ఉన్న పథకాలు కూడా అమలు చేయడం లేదు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది పింఛన్లు తొలగించారు. మేనిఫెస్టోపై ఎవరూ ప్రశ్నించ కూడదని ఆన్లైన్లో దాన్ని తొలగించారు. సచివాలయ ఉద్యోగులను వేర్వేరు శాఖలకు పంపి సచివాలయ వ్యవస్థ లక్ష్యాన్ని ఖూనీ చేశారు. చివరకు ఉపాధి పథకం డబ్బును కార్యకర్తలకు పంచిపెడుతున్నారు. చంద్రబాబు వైఫల్యాలలను ప్రజల్లోకి తీసుకెళ్లి రెడ్బుక్ పాలనకు చరమ గీతం పాడదాం.
– గౌని ఉపేంద్రరెడ్డి,
పార్టీ నియోజకవర్గ పరిశీలకులు


