చంద్రబాబు పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. ఫీజు రీయింబర్స్మెంట్, మధ్యాహ్న భోజనం, నాడు–నేడు వంటి పథకాలను నీరుగార్చారు. పేదలకు విద్యను దూరం చేశారు. విద్యారంగ సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం. – సకల రాజ, ఏఐవైఎఫ్ నాయకులు
నిరుద్యోగులను మోసం చేశారు
మోసం చంద్రబాబు నైజం. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. మెగా డీఎస్సీ పేరుతో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించకుండా దగా చేశారు. స్పోర్ట్ సర్టిఫికెట్ల పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టి అనర్హులకు అన్యాయం చేశారు. – పురుషోత్తం రాయల్,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ విద్యార్థి విభాగం


