కంటతడి పెట్టిన స్వామి
కోల్సిటీ(రామగుండం): మేయర్గా మహంకాళి స్వామి ప్రమాణ స్వీకారం చేశాక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ను ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లో నయ్యారు. పదవి చేపట్టిన ఆనందంలో కంటతడి పెట్టారు. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ నేతత్వంలో నగరా న్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నారు. 20 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ, ఎమ్మెల్యే, ఆయన సతీమణి మనాలీ రాజ్ఠాకూ ర్ తనను కుటుంబ సభ్యుడి గా భావించి ఆశీర్వదించడంతోపాటు, మంత్రి శ్రీధర్బాబు సహకారంతో రాజకీయంగా ఎదిగి మేయర్ పద వి చేపట్టగలిగానని వివరించారు. నగరాన్ని ప్రగతి ప థంలో నడిపిస్తామని డిప్యూ టీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య అన్నారు.


