కళలు, సంస్కృతి వారసత్వ ప్రతీకలు | - | Sakshi
Sakshi News home page

కళలు, సంస్కృతి వారసత్వ ప్రతీకలు

Feb 17 2026 8:49 AM | Updated on Feb 17 2026 8:49 AM

కళలు, సంస్కృతి వారసత్వ ప్రతీకలు

కళలు, సంస్కృతి వారసత్వ ప్రతీకలు

భువనేశ్వర్‌: ఒడిశా కళలు, సంస్కృతి వారసత్వం ప్రతీకలని, రాష్ట్రేతర జాతీయ, అంతర్జాతీయ వ్యాప్తంగా మన పూర్వీకుల ఉనికిని ప్రతిబింబిస్తాయని హైటెక్‌ గ్రూప్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. ఇవి మన నిజమైన గుర్తింపు అని అన్నారు. మహాప్రభు లింగరాజ్‌ ఆలయ ప్రాంగణంలో మహా శివరాత్రి పురస్కరించుకుని మధురమైన భజన గీతాలాపన చేసిన ముంబైకి చెందిన ప్రఖ్యాత సంగీతకారుడు నితీష్‌ ముఖేష్‌ సత్కార సభలో గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి ముఖ్య అతిథిగా పాల్గొని నితీష్‌ ముఖేష్‌ను సత్కరించారు. పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా ఏకమ్రా సాంస్కృతిక మండలి ఒక గొప్ప సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక్కడ ముంబైకి చెందిన ప్రఖ్యాత సంగీతకారుడు నితీష్‌ ముఖేష్‌ను తన అసమానమైన కళా నైపుణ్యానికి సత్కరించారు. గౌరవనీయ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నితీష్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమం భక్తి, సంగీతం అపూర్వ సమ్మేళనంగా భక్తులు, సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేసిందని ముఖ్యమంత్రి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement