సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
కామారెడ్డి టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల ని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను పకడ్బందీగా అ మలు చేయాలని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూ సుఫ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా ప్రభు త్వ ఆస్పత్రిలో నిర్వహించిన జిల్లా జనరల్ బాడీ స మావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటోందని విమర్శించా రు. ఏప్రిల్ నుంచి అమలు చేయాలనుకుంటున్న 12 గంటల పని విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్.దశరథ్, జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాస్, సహాయ కా ర్యదర్శి సురేఖ, కోశాధికారి ఎండీ రఫీక్, రైతు సంఘం కన్వీనర్ ఎం. దేవయ్య, సూపర్వైజర్ ఇర్ఫాన్ పాల్గొన్నారు.


