మద్నూర్‌లో వృద్ధురాలు.. | - | Sakshi
Sakshi News home page

మద్నూర్‌లో వృద్ధురాలు..

Feb 18 2026 7:02 AM | Updated on Feb 18 2026 7:02 AM

మద్నూర్‌లో వృద్ధురాలు..

మద్నూర్‌లో వృద్ధురాలు..

మద్నూర్‌(జుక్కల్‌): ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన మద్నూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రేకుల్‌వార్‌ సాయవ్వ(76) అనే వృద్ధురాలు సోమవారం గ్రామ శివారులోని సోమలింగాల శివాలయానికి నడుచుకుంటు వెళ్తుండగా దారిలో ఉన్న మైసమ్మ చెరువులో కాలు కడుక్కునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి నీట మునిగింది. ఉదయం మృతదేహం బయటకు తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కోడలు సంతోషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement