అమ్మలా ఆదుకుంది! | Nagari Family Stranded In Puri After Losing bags RK Roja Extends Financial Help | Sakshi
Sakshi News home page

అమ్మలా ఆదుకుంది!

Feb 18 2026 10:51 AM | Updated on Feb 18 2026 10:51 AM

Nagari Family Stranded In Puri After Losing bags RK Roja Extends Financial Help

పూరి యాత్రలో బ్యాగులు పోగొట్టుకున్న నగరి కుటుంబం 

మాజీ మంత్రి ఆర్‌కే రోజా సాయంతో తిరుగు ప్రయాణం  

చిత్తూరు జిల్లా: నగరి పట్టణానికి చెందిన ఓ కుటుంబం పూరియాత్రలో భాగంగా జగన్నాథ దేవాలయం దర్శనానికి వెళ్లిన సమయంలో తమ బ్యాగులు పొగొట్టుకున్నారు. ఫోన్లు, డబ్బు లు అన్నీ బ్యాగులోనే ఉండడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. తీవ్ర ఆవేదనకు గురై కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఆ సమయంలో అక్కడికి వచ్చిన తెలుగు తెలిసిన ఓ మీడియా మిత్రుడు వారిని గుర్తించి మాట్లాడారు., తమ దుర్దశను వివరించారు. నగరి ప్రాంతానికి చెందిన వారని తెలియడంతో తమ ప్రతినిధుల ద్వారా ఈ విషయాన్ని మాజీ మంత్రి ఆర్‌కే రోజా దృష్టికి తీసుకెళ్లారు. 

విషయాన్ని తెలుసుకున్న ఆమె వెంటనే స్పందించి, పూరిలో చిక్కుకున్న ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబాన్ని సురక్షితంగా నగరికి చేరుకునేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులను సమకూర్చారు. అంతేకాకుండా, వారు తిరిగి స్వగ్రామానికి చేరుకునే వరకు భోజన ఖర్చులకు కూడా అదనపు డబ్బు లు అందించి ఆదుకున్నారు. 

అనుకోని ఇబ్బంది లో చిక్కుకున్న తమకు అండగా నిలిచిన రోజాకు ఆ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కతజ్ఞతలు తెలిపారు. ‘అమ్మలా ఆదుకుంది.. మేము పూర్తిగా నిస్సహాయులమయ్యాం. ఆమె సాయం లేకపోతే ఏమయ్యేదో తెలియదు’ అంటూ భావోద్వేగ్యాన్ని వ్యక్తం చేశారు. కష్టకాలంలో నగరికి చెందిన వారికి ఆమె చేసిన సాయం పట్ల ప్రజలు అభినందనలు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement