బంగారు తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం | Telangana Developed Only With TRC Govt MLA Gadari Kishore Kumar | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

May 3 2018 7:54 AM | Updated on Oct 1 2018 2:44 PM

Telangana Developed Only With TRC Govt MLA Gadari Kishore Kumar - Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరిన వారితో ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌

అర్వపల్లి (తుంగతుర్తి) : బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. బుధవారం మండలంలోని కొత్తగూడెంలో వివిధ పార్టీల నాయకులు లింగంపల్లి రమణ, పెద్ది శంకర్, పాక గోవర్ధన్, పెద్ది నాగయ్య, రావుల రఘు, ఎల్‌. సుమన్, మేడి నరేష్, సత్యనారాయణ, ఎం. చంటి, కె. రాజు, ఎం. రాంమ్మూర్తి, ఎం. నర్సయ్య, నవీన్‌లతో పాటు కొంత మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి  కండువాలు కప్పి పార్టీలోకి  చేర్చుకుని మాట్లాడారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్‌ రైతులకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పంట పెట్టుబడి కింద సీజన్‌కు ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రభుత్వం సాయమందిస్తుందని  చెప్పారు. ఈపథకాన్ని రైతులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని టీఆర్‌ఎస్‌కు తప్ప మరో పార్టీకి స్థానం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు దావుల వీరప్రసాద్, మొరిశెట్టి ఉపేందర్, మండల అధ్యక్షుడు కుంట్ల సురేందర్‌రెడ్డి, దేవస్థాన ఛైర్మన్‌ బొడ్డు రామలింగయ్య, కందుల తిరుమల్‌రావు, కళెట్లపల్లి శోభన్‌బాబు, సర్పంచ్‌లు మన్నె లక్ష్మినర్సయ్య, జీడి వీరస్వామి, వల్లపు గంగయ్య, పద్మ, ఎంపీటీసీ రేఖల రాణి, సోమిరెడ్డి, పొట్టెపాక సైదులు, రేఖల సైదులు, దండ  వీరారెడ్డి, మేడిపల్లి వేణు, లింగంపల్లి రాములు, వి. సుధాకర్, చిర్రబోయిన వెంకన్న, రాంబాబు, వి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement