సాక్షి, రాంగోపాల్పేట్: సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్కు జీహెచ్ఎంసీ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. బిర్యానీకి జాతీయ స్థాయిలో పేరున్న ఈ హోటల్లో అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయిన కూరగాయలు కనిపించడంతో అధికారులు ఈ జరిమానా విదించారు. గురువారం హోటల్కు వచ్చిన ఓ వినియోగదారులు బిర్యానీలో వెంట్రుకలు కనిపించడంతో సిబ్బందిని నిలదీశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయన జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ సుదర్శన్రెడ్డి, ఏఎంహెచ్వో రవీందర్గౌడ్, వెటర్నరీ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డిలు హోటల్కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. హోటల్లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీబాగులు కనిపించాయి. అలాగే కుళ్లిపోయిన కూరగాయలు వినియోగిస్తుండటం కిచన్లో అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. దీంతో అధికారులు హోటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు జారీ చేసి లక్ష రూపాయల జరిమానా విధించారు. మరోమారు ఇలాగే ఉంటే హోటల్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ప్యారడైజ్ హోటల్లో తనిఖీలు చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
జమ్జమ్ బేకరీకిరూ.15వేల జరిమానా
ప్యారడైజ్ సర్కిల్లో ఉండే జంజం బేకరీకి రూ.15వేల జరిమానా విదించారు. ఈ బేకరిలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతుండటం, కిచన్లో అపరిశుభ్రత కనిపించడంతో నోటీసులు జారీ చేసి జరిమానా విధించారు.
జమ్జమ్ బేకరికి జరిమానా విధిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
ప్యారడైజ్ హోటల్కు లక్ష జరిమానా
Published Fri, Oct 18 2019 10:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement