ఎయిమ్స్‌ ఆశలు గల్లంతు : మంత్రి లక్ష్మారెడ్డి | empty hands for telangana: lakshmareddy | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌ ఆశలు గల్లంతు : మంత్రి లక్ష్మారెడ్డి

Feb 2 2017 3:13 AM | Updated on Aug 16 2018 4:04 PM

ఎయిమ్స్‌ ఆశలు గల్లంతు : మంత్రి లక్ష్మారెడ్డి - Sakshi

ఎయిమ్స్‌ ఆశలు గల్లంతు : మంత్రి లక్ష్మారెడ్డి

ఎయిమ్స్‌ను కేటాయించకపోవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)ను కేటాయించ కపోవడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. వరుసగా మూడు బడ్జెట్లలోనూ కేంద్రం ఈ విధంగా మొండిచేయి చూపడంపై విమర్శలు వస్తున్నాయి. కేంద్ర నిర్ణయం తమను నిరాశపరిచిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రాంత రాష్ట్రాలకే ఎయిమ్స్‌ను కేటాయిం చారని.. మన రాష్ట్రంపై కరుణ చూపలేదని ఆయన ‘సాక్షి’తో అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement