హైదరాబాద్ లో భారత్-విండీస్ టెస్టు | India to play five ODIs, three Tests with Windies | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో భారత్-విండీస్ టెస్టు

Aug 14 2014 6:49 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ లో భారత్-విండీస్ టెస్టు - Sakshi

హైదరాబాద్ లో భారత్-విండీస్ టెస్టు

భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ తో వన్డే, టెస్టు సిరీస్లు ఆడనుంది.

ముంబై: భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ తో వన్డే, టెస్టు సిరీస్లు ఆడనుంది. అక్టోబర్-నవంబర్ మధ్యలో భారత్, వెస్టిండీస్ మ్యాచ్లుంటాయని బీసీసీఐ గురువారం తెలిపింది. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్లు ఆడతాయని ప్రకటించింది.

మొదటి వన్డే కొచ్చిలో అక్టోబర్ 8న జరుగుతుంది. రెండో వన్డే విశాఖపట్నం(అక్టోబర్ 11), మూడో వన్డే కటక్(అక్టోబర్ 20), నాలుగో వన్డే(అక్టోబర్ 17), ఐదో వన్డే ధర్మశాల(అక్టోబర్ 20)లో జరుగుతాయి.

టి20 మ్యాచ్ అక్టోబర్ 22న ఢిల్లీలో జరుగుతుంది. టెస్టు సిరీస్ అక్టోబర్ 30న హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది. రెండో టెస్టు బెంగళూరు(నవంబర్7-11), మూడో టెస్టు అహ్మదాబాద్(నవంబర్ 15-19)లలో జరుగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement