'విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి' | government vengeance On the YSR electrical workers union | Sakshi
Sakshi News home page

'విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

Oct 3 2016 1:23 PM | Updated on May 28 2018 1:35 PM

వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్పై ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, యూనియన్ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ సమావేశానికి 13 జిల్లాల యూనియన్ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చలేదని అన్నారు. అలాగే వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్పై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తూ.. యూనియన్లోని ఉద్యోగులను ఇప్పటికీ రెగ్యులరైజ్ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement