అబద్ధాలు, మోసాలే
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రవేశపెట్టిన మూడవ బడ్జెట్లోను ప్రజలను మోసం చేసేలా అంకెల గారడీ చేశారు. సూపర్సిక్స్ పథకాలకు మరోసారి మొండిచేయి చూపారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి పథకాలకు పైసా కేటాయించలేదు. మిగిలిన పథకాలకు అరకొరగానే నిధులు కేటాయించారు. బడ్జెట్లో చూపించిన ఆదాయాలు వస్తున్నాయా లేదా అనేది కూడా బడ్జెట్ లెక్కల్లో చూపలేదు. 2025–26 ఏడాదికి ప్రతిపాదించిన బడ్జెట్ రూ.3,22,359 కోట్లు అయితే సవరించిన తరువాత రూ.3,00,535 కోట్లకు తగ్గించారు. చివరి ఆ నిధులైనా ఖర్చు చేశారా లేదా అంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇలా అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను మోసం చేయడం తప్పా బడ్జెట్లో ప్రజలకు మేలు చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయలేదు.
– తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీ


