నేడే అప్పన్న చందనోత్సవం
సింహాచలం(విశాఖ): వైశాఖ శుద్ద తదియను పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం (నిజరూప దర్శనం) సోమవారం జరగనుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉచిత దర్శనాలు ప్రారంభిస్తారు.
స్వామిని నిజరూపంలో దర్శించుకోవడానికి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. రాత్రి 8 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహించి అనంతరం స్వామికి తొలి విడతగా మూడు మణుగుల చందనం (సుమారు 125కిలోలు) సమర్పిస్తారు.


