ఏపీలో ఐదు రోజులు వానలే.. ఈ జిల్లాలకు అతి భారీ వర్షసూచన | Five Days Rain Forecast To AP Districts | Sakshi
Sakshi News home page

ఏపీలో ఐదు రోజులు వానలే.. ఈ జిల్లాలకు అతి భారీ వర్షసూచన

Jun 12 2025 11:03 AM | Updated on Jun 12 2025 11:18 AM

Five Days Rain Forecast To AP Districts

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

ఈశాన్య రాజస్థాన్‌ నుంచి మధ్య­ప్రదేశ్, ఛత్తీ­స్‌గఢ్‌ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఏలూరు జిల్లాల్లో 15 సెంమీ వర్షపాతం నమోదు అయ్యింది.

నేడు, రేపు.. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు అతిభారీ వర్షాలు.. బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉంది. పార్వతీ­పురం మన్యం, అల్లూరి సీతారామ­రాజు, కర్నూలు, నంద్యా­ల, శ్రీసత్యసాయి, అన్న­మయ్య, చిత్తూరు, తిరు­పతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలిక­పాటి నుంచి మో­స్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడ­క్కడ తేలిక­పాటి వర్షాలు కురు­స్తాయని తెలిపింది. శుక్ర­వారం పార్వతీ­పురం మన్యం, అల్లూరి సీతా­రా­మ­రాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ­కాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

మరోవైపు.. బుధవారం కృష్ణా జిల్లా మచిలీ­పట్నంలో 10, గుడి­వాడలో 9.4, చల్లపల్లి మండలం పురిటి­గడ్డలో 9.3, బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. పా­ర్వ­­తీపురం మన్యం జిల్లా రస్తాకుంటు బాయి­లో 7.2 సెం.మీ. వర్షం పడింది. తూర్పు­­గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 6.5, అంబేడ్కర్‌ కోన­సీమ జిల్లా తాత­పూడిలో 4.7, ప్రకాశం జిల్లా కొలుకు­లలో 4.4, ఆత్రేయపురంలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement