పాయకరావుపేటలో ‘వై నాట్’ షోరూం ప్రారంభం
పాయకరావుపేట : ప్రముఖ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ స్టోర్ ‘వై నాట్’ 40వ బ్రాంచిని పాయకరావుపేటలో లాయిడ్ ఇండియా 2 హెడ్ ఎ.కె.ఆర్.ప్రసాద్, హైర్ ఆర్ఎం బి.ప్రవీణ్కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత జుజ్జవరపు వెంకటరాయుడు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో 39 షోరూంలు ప్రారంభించామని, పాయకరావుపేటలో 40వ షూరూం ఏర్పాటు చేశామన్నారు. 4 ఏళ్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా వారిచే బెస్ట్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ సోర్గా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. షోరూంలో పులవర్తి వెంకటజగన్నాథ్ గుప్తా మొదటి సారి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏవీ బీఎం నాగవాసు, సాంసంగ్ బీఎం సుమన్, లాయడ్ ఆర్ఎం హేమసుందర్, లాయడ్ బీఎం జీవన్, హైర్ బీఎం మహేష్, ఐఎఫ్బీ బీఎం సుధీర్, క్యారియర్ బీఎం రామకృష్ణ, ప్రీతి బీఎం కృష్ణ, డబ్ల్యూవీపీ బీఎం గోపి, బ్లూస్టార్ బీఎం ప్రకాష్, అన్ని బ్రాంచ్ల ఏఎస్ఎంలు పాల్గొన్నారు. అద్భుత ఆఫర్లతో కస్టమర్లు భారీగా తరలివచ్చారు.


