దేశం నలుమూలల నుంచి 350 మంది ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నటి సంచిరాయ్, ప్రాచి ఠాకూర్ హైలైఫ్ ఎగ్జిబిషన్ శుక్రవారం ప్రారంభించారు.
యువతను ఆకట్టుకునే ప్రత్యేక డిజైన్లు అందుబాటులో ఉన్నాయని, డిజైనర్ వేర్, బ్రెడ్రల్ వేర్, జ్యువెలరీ, శారీస్, వెడ్డింగ్ వేర్, లగ్జరీ, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శించినట్లు నిర్వాహకుడు డొమినిక్ తెలిపారు.
ఈ ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు కొనసాగనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పలువురు డిజైనర్లు, మోడల్స్ పాల్గొన్నారు.


