పోలీసుల అదుపులో ఏటీఎం కేసు అనుమానితుడు | Bangalore ATM attack suspect caught by police in karnataka | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఏటీఎం కేసు అనుమానితుడు

Nov 22 2013 5:59 PM | Updated on Nov 6 2018 8:50 PM

పోలీసుల అదుపులో ఏటీఎం కేసు అనుమానితుడు - Sakshi

పోలీసుల అదుపులో ఏటీఎం కేసు అనుమానితుడు

బెంగళూరులో జ్యోతి ఉదయ్ అనే మహిళపై ఇటీవల జరిగిన ఏటీఎం దాడి కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరులో జ్యోతి ఉదయ్ అనే మహిళపై ఇటీవల జరిగిన ఏటీఎం దాడి కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ ఇంజనీర్గా పనిచేస్తున్న 33 ఏళ్ల వయసున్న సతీష్ అనే వ్యక్తిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

కర్ణాటకలోని తుముకూరు జిల్లా తిపటూరు వద్ద అనుమానితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే, కేసులో అసలు నిందితుడు ఇతడో కాదో అన్న విషయం మాత్రం ప్రస్తుతానికి ఇంకా నిర్ధారణ కాలేదు. మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement