వరంగల్‌ జిల్లాలో విషాదం | Three children died after Swimming in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌ జిల్లాలో విషాదం

Sep 27 2017 1:59 PM | Updated on Sep 27 2017 3:21 PM

Three children died after Swimming in Warangal

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

చెన్నారావుపేట: వరంగల్‌ రూరల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు బాలురు కాగా ఓ బాలిక ఉంది. జిల్లాలోని చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన గుంజేల అజయ్‌(10), సాయి(9), అఖిల(9) అనే ముగ్గురు చిన్నారులు ఉర చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు.

ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో చనిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement