బహిర్భూమి రహిత జిల్లాగా సిరిసిల్ల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బహిర్భూమి రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల రికార్డు సృష్టించింది. జిల్లాలోని ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించి వందశాతం బహిర్భూమి రహితంగా మార్చేందుకు కలెక్టర్ కృష్ణ భాస్కర్, అధికారులు చేసిన కృషిని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. లక్ష్యాన్ని సాధించినందుకు గర్వంగా ఉందంటూ జపాన్ పర్యటనలో ఉన్న ఆయన ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు.