►అసెంబ్లీలో మంత్రి వెల్లడి
►కొత్తగా ఐదు వృత్తి శిక్షణ కేంద్రాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చేందుకు మోనోరైలు సేవలను సైతం ప్రవేశపెడుతున్నట్లు మంత్రి రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. మోనో రైలు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జయలలిత త్వరలో శంకుస్థాపన చేయనున్నారని బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు.నగరంలో ఇప్పటికే జరుగుతున్న మెట్రోరైలు పనులు పూర్తిదశకు వచ్చాయి. ఈ ఏడాది చివరిలో తొలిదశ, వచ్చే ఏడాది పూర్తిగా సేవలు అందుబాటులోకి రావచ్చని అంచనా. మరోవైపు మోనో రైలును కూడా చెన్నై నగర ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్లు ఆయన తెలిపారు.
డీఎండీకే సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ, మోనో రైలుపై ప్రభుత్వం గతంలో ఒక ప్రకటన చేసింది, ఆ విషయం గుర్తుందా అంటూ ప్రశ్నించారు. ఇందుకు మంత్రి బదులిస్తూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో సీఎంకు సాటిలేరని అన్నారు. మోనో రైలు పథకం అమలుకు ప్రాథమిక పరిశీలనలు సాగుతున్నాయని, నిర్మాణ పనుల ఒప్పందాలు తుదిదశకు చేరకున్నాయని తెలిపారు. ఇవి పూర్తికాగానే 43.48 కిలోమీటర్ల దూరం ప్రయాణ సేవలు అందించేలా ఈ పథకానికి త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని చెప్పారు.
పథకం 1 కింద పూందమల్లి-కత్తిపార, పోరూరు- వడపళని మార్గాల్లో 20.68 కిలోమీటర్లు, పథకం 2 కింద వండలూరు- వేలాచ్చేరికి 22.20 కిలోమీటర్లు మధ్యన మార్గం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఐదు వృత్తి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జయ తెలిపారు. మానవ వనరులను మరింతగా వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి పథంలో నడుస్తున్నామని చెప్పారు. అలాగే నిరుద్యోగ నిర్మూలనపై మరింత దృష్టి సారిస్తూ రూ.8.25 కోట్లతో కాంచీపురం, విళుపురం, తిరువారూరు, తిరువళ్లూరు, ధర్మపురిలలో ఉపాధి కల్పనా కార్యాలయాలను నిర్మించనున్నట్లు జయ ప్రకటించారు. 15 వేల ఉపాధ్యాయ ఖాళ్లీను మూడువారాల్లోగా భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖా మంత్రి వీరమణి ప్రకటించారు. శివంగై జిల్లాకు కొత్త సిప్కాట్ను మంజూరు చేసినట్లు మంత్రి తంగమణి తెలిపారు.
త్వరలో మోనో రైలు
Published Thu, Jul 24 2014 12:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement