ఇస్మార్ట్‌ శంకర్‌

Ram and Puri's iSmart Shankar launched - Sakshi

రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నటి, నిర్మాత చార్మీ కౌర్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మీ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం అవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. సత్యదేవ్, మిలింద్‌ గునాజి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రాజ్‌ తోట ఛాయగ్రాహకుడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top