ఐరాసలో భారతీయుడికి కీలక పదవి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) న్యూయార్క్ కార్యాలయం అధిపతి, అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా భారత్కు చెందిన సీనియర్ ఆర్థికవేత్త సత్య త్రిపాఠి ఎంపికయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ ఆయన్ని ఈ పదవిలో నియమించారు.
ట్రినిడాడ్–టుబాగోకు చెందిన ఎలియట్ హ్యారిస్ స్థానంలో త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు. త్రిపాఠి 2017 నుంచి యూఎన్ఈపీ సుస్థిరాభివృద్ధి కార్యాచరణకు సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఒడిశాలోని బరంపుర విశ్వవిద్యాలయం నుంచి త్రిపాఠి న్యాయశాస్త్రంలో డిగ్రీ, పీజీ పట్టాలు పొందారు.