జూబ్లీహిల్స్ రోడ్నంబర్-45 లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
జూబ్లీహిల్స్ లో ఉద్రిక్తత
Oct 15 2016 11:18 AM | Updated on Sep 4 2017 5:19 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్నంబర్-45 లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సర్కారు స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నారంటూ పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం దాదాపు 50 గుడిసెలను నేలమట్టం చేశారు. దీంతో బాధితులంతా కలిసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే నిరసన తెలుపుతున్నారు. దీంతో అధికారులు వారికి నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.
Advertisement
Advertisement