అమ్మకాల ఊతంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నవభారత్ వెంచర్స్ నికర లాభం రెట్టింపై రూ. 24 కోట్ల నుంచి రూ. 58 కోట్లకు (స్టాండెలోన్) ఎగిసింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్మకాల ఊతంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నవభారత్ వెంచర్స్ నికర లాభం రెట్టింపై రూ. 24 కోట్ల నుంచి రూ. 58 కోట్లకు (స్టాండెలోన్) ఎగిసింది. ఆదాయం రూ. 280 కోట్ల నుంచి రూ. 302 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2 ముఖవిలువ గల షేరుపై రూ. 3 డివిడెండు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
లైకోస్: పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 2,255 కోట్ల కన్సాలిడేట్ ఆదాయంపై రూ. 405 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1,957 కోట్లు కాగా లాభం రూ.342కోట్లు.