హత్యలు చేసి తాపీగా బిర్యానీ తినివెళ్లారు... | three shot dead case:commited murder, tasted biryani | Sakshi
Sakshi News home page

హత్యలు చేసి తాపీగా బిర్యానీ తినివెళ్లారు...

Sep 25 2014 2:20 PM | Updated on Nov 6 2018 8:51 PM

హత్యలు చేసి తాపీగా బిర్యానీ తినివెళ్లారు... - Sakshi

హత్యలు చేసి తాపీగా బిర్యానీ తినివెళ్లారు...

విజయవాడ-ఏలూరు హైవేపై కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులకు క్లూ లభించింది.

విజయవాడ : విజయవాడ-ఏలూరు హైవేపై కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులకు క్లూ లభించింది. హంతకులు వాడిన కారును పోలీసులు గుర్తించారు.  వాళ్లు బస వేసిన రాయల్ హంపీ హోటల్ వెనుక భాగంలోనే .. కారును వదిలి వెళ్లారు. కారులోని  రెండు కత్తులు,తుపాకీతో పాటు రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యలు చేసిన తర్వాత వీరంతా తాపీగా హోటల్కు చేరుకున్న  ..బిర్యానీ తిని వెళ్లినట్లు తెలుస్తోంది.

ఆ తరువాత మరో రెండు కార్లలో రాజమండ్రి వైపు వెళ్లినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరో వైపు ట్రావెల్స్ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నేరగాళ్ల కోసం రెండు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. హంతకుల్లో అయిదుగురు బీహార్కు చెందినవారు కాగా, ఒకరిని స్థానికుడిగా గుర్తించినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement