ఇద్దరు బిడ్డలు సహా తల్లి ఆత్మహత్య
తిరుపతిలో విషాదం
నవమాసాలు మోశావు.. ఇద్దరి బిడ్డలకు ప్రాణం పోశావు.
కుటుంబ కలహాలతో ఆ బిడ్డల్నే ఉరితాడుకు వేలాడదీశావు..
పిల్లలతో పాటూ నీవూ దూరమై అయినవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చావు..
ఎంతపనిచేశావు తల్లీ..!
ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో..!
జీవితంపై విరక్తి చెందింది. ఈ లోకం నుంచి వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. తానొక్కటే చనిపోతే పేగుతెంచుకుని పుట్టిన బిడ్డల బతుకు ఏమవుతుందోనని ఆలోచనలో పడింది. తనతోపాటు పిల్లలిద్దర్నీ తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. మనసు చంపుకుని ముక్కుపచ్చలారని మగబిడ్డల్ని ఉరితాడుకు వేలాడదీసింది. తనూ తనువు చాలించి కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటన మంగళవారం తిరుపతిలో విషాదాన్ని నింపింది.
తిరుపతి క్రైం : నగరంలోని పల్లెవీధికి చెందిన శశికుమార్, పద్మజ(25)కు 2009లో వివాహమైంది. శశికుమార్ తల్లి సరస్వతి కూడా వీరితోనే ఉండేది. వీరికి జ్యోతికిరణ్ (6), లక్ష్మీప్రసాద్(5) పిల్లలు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య స్వల్ప మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. గతంలో పోలీసులను ఆశ్రయించగా ఇరువురికీ వెస్ట్ పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పద్మజ మంగళవారం మరోసారి మనస్తాపానికి గురైంది. మధ్యాహ్నం స్కూల్ నుంచి పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చి, ఆపై వారితోనే ఇంట్లో ఉండిపోయింది. సాయంత్రం 6 గంటలవుతున్నా ఇంట్లో లైటు వేయలేదు. గమనించిన అత్త లైటు వేసేందుకు ఇంటికి వచ్చి, తలుపుతట్టింది. తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూసింది. పద్మజ, ఇద్దరు పిల్లలతో ఉరేసుకుని ఉండడంతో కుమారుడు శశికుమార్కు తెలిపింది. అతను వెస్ట్ పోలీసులకు సమాచారం అందించాడు. డీఎస్పీ కనకరాజు, వెస్ట్ సీఐ అంజూయాదవ్, యూనివర్సిటీ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ జయశ్యామ్ చేరుకున్నారు. తలుపులు తీసి మృతదేహాలను కిందికి దించి పోస్ట్మార్టం నిమిత్తం రుయాకు తరలించారు. అత్త సరస్వతి, భర్త శశికుమార్ మాట్లాడుతూ పద్మజను తాము ఎప్పుడూ ఏమీ అనలేదని, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అయ్యో..
ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడం..అందులో ఇద్దరు పిల్లలు.. తల్లి ఉండడంతో వారిని చూసేం దుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. చిన్నారుల మృతదేహాలను తరలిస్తుండగా పల్లెవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విగతజీవులుగా ఉన్న చిన్నారులను చూసి స్థానికు లు కంటతడి పెట్టుకున్నారు.
ఎంతపని చేశావు తల్లీ!
Published Wed, Mar 16 2016 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement